289 తెలుగు ప్రజల భవిష్యత్ తన్నుకోటమేనా? దానికి మనం ముగింపుపాడలేమా?
చర్చనీయాంశాలు: 289, తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమ, రాజధాని, హరీష్ రావు, కెటిఆర్, కెసిఆర్




సీమాంధ్ర ప్రజలపై శ్రీ కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ లు పగబట్టినట్లుగా కనిపిస్తున్నది. వాళ్ళు నోరు తెరిస్తే సీమాంధ్ర ప్రజలపై విషం కక్కుతున్నారు. వారి ప్రతిచర్య యొక్క గమ్యం, తెలంగాణ అభివృధ్ధి కన్నా, సీమాంధ్ర ప్రజలను వేధించటమే లక్ష్యం గా కనిపిస్తుంది. వారికి, శ్రీచంద్రబాబునాయుడికి మధ్య పాత పదవీ కుళ్ళు ఏదైనా ఉంటే ఉండవచ్చు. అలాంటివేమైనా ఉంటే వాళ్ళూ వాళ్ళూ చూసుకోవాలి. హైదరాబాదులో శ్రీ చంద్రబాబుకి బినామీ ఆస్తులు ఉన్నాయనీ, తాను ముఖ్యమంత్రి అయితే వాటన్నిటినీ బయట పెడతామనీ గతంలో కెసీఆర్ అన్నారు. ఇపుడా పని చేయవచ్చు కదా? జగన్ అక్రమాస్తులు ఏమైనా ఉంటే వాటిపై చర్య తీసుకోవచ్చు కదా? శ్రీచంద్రబాబు గారు కూడ కెసీఆర్ ధంధాలను బయట పెడతానన్నారు. ఆపని చేసి తెలంగాణ ప్రజలను రక్షించ వచ్చు కదా. చేయరెందుకు?
కెసీఆర్ కుటుంబం, ఒకే ప్రాంతం ప్రజలపై పగబట్టినట్లుగా వ్యవహరించటం సమంజసం కాదు. ఈవిషయంలో, కేంద్ర హోమ్ మంత్రి గారు ఇరు ప్రాంతాల వారిని తన్నుకోవద్దని సలహా ఇచ్చారే కానీ, పార్లమెంటులో తమ రాజకీయ స్వార్ధం కోసం, అతిఘోరమైన తడిగుడ్డతో గొంతును కోసే విభజన బిల్లును పాస్ చేయించి, సీమాంధ్ర ప్రజలను హైదరాబాదులో సరియైన కార్యాలయం లేని వాళ్ళుగా రోడ్డున పడేయటంలో, అఖిల భారత బిజేపి నేతలయైన తమకు, అఖిల భారత కాంగ్రెస్ నేతలకు పాత్ర ఉందని మర్చిపోయారు. ఈసందర్భంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తనను తెలంగాణకు చిన్నమ్మగా చెప్పుకోటాన్ని మర్చిపోరాదు.
ఇపుడు కెసీఆర్ భారత్ లో తెలంగాణను ఒక నిజాం రాజ్యంగా మార్చేశాడు. భారత దేశం ఒక దేశం, ఈ దేశంలో ప్రజలు ఎక్కడనుండి ఎక్కడకైనా పొట్టకోసం వలస వెళ్ళవచ్చు, పరిమితికి లోబడి చిన్న చిన్న ఆస్తులను సమకూర్చుకోటానికి రాజ్యాంగం అనుమతిస్తున్నది, అని ఆయన మర్చిపోయాడు. నియంత్రించ వలసిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాలు అనేవి స్వతంత్ర దేశాలు కావు. ఒక రాష్ట్రంలో ఉండే భూమి అంత ఆ ఒక్క రాష్ట్ర ప్రజలది కాదు. ఆభూమి మొత్తం భారత దేశానికి చెందినవి. ఒక నగరానికి వచ్చిన వివిధ ప్రాంతాలవారు, అక్కడ వివిధ రకాల పన్నులను చెల్లిస్తున్నప్పుడు, ఆ పన్నులతో చేపట్టే సంక్షేమ కార్యక్రమాల ఫలితాన్ని అందరూ అనుభవించాలి తప్ప, ఆప్రదేశంలో 1956 కు ముందు అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు. ఈ దేశంలో అందరూ ముల్కీలే. తెలంగాణా ముల్కీలనీ, సీమాంధ్రముల్కీలని, బీహార్ ముల్కీలని, ఉత్తరప్రదేశ్ ముల్కీలని ప్రత్యేకంగా ఉండరు.
కెసీఆర్ -హరీష్ రావు-కెటీఆర్ ల ప్రవర్తన, రైల్లో టవలు పరుచుకొని సీటుని ఆక్రమించుకొని పండుకున్నవాళ్ళు, మిగతావాళ్ళను గెంటి వేయటానికి బోగీతలుపులు వేయటానికి ప్రయత్నించినట్లుగా ఉన్నది.
తెలంగాణలో బండిలాగే కూలి వాడి కొడుక్కి సీమాంధ్రనుండి వచ్చినా, బీహార్ నుండి వచ్చినా, ఝుంజున్ను నుండి వచ్చినా, వాళ్ళు 1956 ముందు వచ్చారా తరువాత వచ్చారా అనేదానితో సంబంధం లేకుండా సర్వసమాన ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వాల్సిందే. అందరూ ముల్కీలే. ఇక్కడ నిజాం రాజ్యంలేదు.
కేంద్ర ప్రభుత్వానికి ఈ మౌలిక సూత్రం మీద విశ్వాసం ఉంటే, వెంటనే కెసీఆర్ దుష్ట చర్యలను నలిఫై చేస్తూ , రాజ్యాంగ పరిస్థితిని స్పష్టం చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి. లేకపోతే , దేశంలో, ప్రతిరాష్ట్రంలోనూ కెసీఆర్ లాంటి నిజాములు తయారయి, స్వంత రాజ్యాలను నెలకొల్పుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా చూస్తూ ఊరుకుంటే, సోవియట్ యూనియన్ వలె , భారత్ కూడ విఛ్ఛిన్నం బాట పట్టే అవకాశం ఉంది.
తోటకూర దొంగిలించిన నాడే పిల్లవాడికి మంచి చెడు నేర్పితే, వాడు మంచి పౌరుడుగా రూపు దిద్దుకునే అవకాశం ఉంటుంది. బాగా చేసావురా అని మెచ్చుకుంటే, తాను చేస్తున్న పని సరియైనదే అనుకొని అతడు మరీ పేట్రేగి పోయే అవకాశం ఉంది.
కేంద్రానికి దేశప్రజలు ఎక్కడినుండి ఎక్కడకైనా స్వేఛ్ఛగా వలస పోవచ్చు, అక్కడి ప్రజలతో సమానంగా జీవీస్తూ, హక్కులను, బాధ్యతలను రెండిటినీ స్వీకరిస్తూ సంచరించే హక్కు ఉన్నది అనే మౌలిక సూత్రం పై నమ్మకం లేక పోతే ఆవిషయమే స్పష్టం చేస్తే బాగుంటుంది. సీమాంధ్ర ప్రజలు ఏనుయ్యో గొయ్యో చూసుకుంటారు.
దీనిని , ఎవరి మనోభావాలైనా దెబ్బతింటున్నాయో గమనించి తిరగ వ్రాయవలసి ఉన్నది.

స్కామాంధ్ర కావద్దని సీమాంధ్ర ప్రజలను తిరుపతిలో శ్రీమోడీ గారు కోరారు.
వైఎస్ ఆర్ పీ, తెదేపా లతో పొత్తుకు తమకేమీ అభ్యంతరాలేమీ లేవు. --- న్యూఢిల్లీలో సీపీఎం నేత శ్రీ తమ్మినేని వీరభద్రం.
సీపీఐ నారాయణ గారు సిపీఎమ్ ను కూడ బూర్జువా పార్టీలో జమ కట్టారు. తమ పార్టీ బూర్జువా పార్టీ అవునో కాదో శ్రీనారాయణ గారికి తెలియదనుకోవాలా?
శ్రీ బివి రాఘవులు గారు సీపీఎమ్ నేతగా సుప్రసిధ్దులు. వీరు ఇప్పుడు తేల్చి చెప్ప వలసింది ఒకటే. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డట్లుగా కోర్టు కేసుల నెదుర్కుంటున్న, కొన్నైనా ప్రాథిమిక ఆధారాలు బయట పడ్డ శ్రీజగన్ నేతృత్వంలోని వైయస్ ఆర్ పీ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు. పొత్తుపెట్టుకోము అని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ సీపీఎం నేతపై ఉంది.
---->ఇతగాడు నాయకుడు కాదు, రక్షకుడు.

మొసలి కన్నీళ్ళకు కూడ తేడా తక్కువయే.
29 సంవత్సరాలు ఎంపీగా పని చేసిన శ్రీకావూరి సాంబశివరావు గారు రైతులకు ''నేనేం చేయాలో చెప్పండి'' అని బహిరంగలేఖ వ్రాశారు.
శ్రీ సుశీల్ కుమార్ షిండే గారు హోం మంత్రిగా ఇంక మీకు కన్పిస్తానో లేదో, ఇదే ఆఖరిసారేమో, అని పోలీసు ఉద్యోగులతో అన్నారుట.
''There is no purpose of staying back in Telangana State after division. It is in the best interests of Seemandhra people that the administration of the new State should be carried out from Andhra Pradesh and not Telangana. ... We cannot live here facing abuse and humiliation."
బిజెపి బండారం పూర్తిగా బయటపడింది.
టిఆర్ఎస్ తో చెలిమి చేసింది. బిజెపి అగ్ర నేతలందరు తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టమని కాంగ్రెస్ ను పొడిచిన సంగతి మనం మరువరాదు. కాంగ్రెస్, బిజెపి పోటీపడి తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం అనే పల్లవి రాజకీయ అవకాశవాదంలో భాగంగా ఒక నెల క్రింద మాత్రమే ఎత్తుకున్నది. బిజెపి అగ్రనేత కాంగ్రెస్ ఏదో విషబీజాలు నాటిందని ప్రసంగాలు చేస్తున్నారు గానీ విషబీజాలు నాటటంలో ఇరువురూ పోటీపడ్డారు.
నరేంద్ర మోడీ రికార్డును బట్టి చూస్తే ఆయన శ్రీరామచంద్ర మూర్తి లాగ అగ్ని సాక్షిగా వివాహమాడిన ధర్మపత్నిని, '' నేను ఆయన ధర్మపత్నినే '' అని కలవరించే లాగ చేస్తున్నాడు. ప్రచురించ బడిన పరిమితమైన రిపోర్టులను బట్టి, ఆయన భార్య పైనే నిఘా ఉన్నది.
ఇలా భారీ పరిహారాన్ని ఇవ్వటాన్ని నేను తప్పు పట్టటం లేదు. అటువంటి ఔదార్యాన్ని, గుజరాత్ ప్రభుత్వం తరువాత జరిగిన భూసేకరణల్లో ఎక్కడా చూపలేదు. జన్మకొక్క శివరాత్రి లాంటిదన్నమాట. ఈభాగ్యం రైతుకు కలగటం మహాశివరాత్రిలాంటిదని చెప్పనక్కరలేదు. శేషాంధ్ర ప్రజలపై అటువంటి ఔదార్యాన్ని శ్రీమోడీ చూపిస్తారని కోరటం, దురాశే అయినా, ఆశించే సాహసం చేస్తున్నాను.
కాబట్టి, అది కేంద్రంలో అధికారానికి వస్తే, ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ మూడురాష్ట్రాలను ఇవ్వమని అడగాలి. మూడురాష్ట్రాల రాజధానుల నిర్మాణానికీ ఆర్ధిక సాయం కేంద్ర బడ్జెట్ లోంచి చేయాలి. ఎవరో అడ్డమైన పారిశ్రామిక వేత్తలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించింది కదా. దాని బదులు మూడు చిన్న రాష్ట్రాలకు మూడు చిన్న ప్యాకేజీలనిచ్చి తన చిత్తశుధ్ధిని నిరూపించుకోవచ్చు.
రాజశ్రీ వ్రాశారు. బాలసుబ్రహ్మణ్యం గొంతు.








As desired by some telangANA leaders, the new TelangANA State should be named "Sonialand". This name will be convenient to enable SImAndhra people to curse their own misfortune. But, SimAndhra parents should not name their children as Sonia, Rahul, PriyAnka. Reason: If parents get angry with their children, such parents there is a danger of adding some additional blows. Teachers in Schools may also add some supplementary blows to children. If any SimAndhra parents have already named their children as Sonia, Rahul, PriyAnka, it will be in the interest of the children to change their names.