218 సీమాంధ్రులు ఆరంభ శూరులే కాదు, ఆత్మగౌరవశూన్యులు కూడాను.
చర్చనీయాంశాలు: సీమాంధ్ర, నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, హిందూపురం, తిరుపతి,బిజెపి, కాంగ్రెస్
స్కామాంధ్ర కావద్దని సీమాంధ్ర ప్రజలను తిరుపతిలో శ్రీమోడీ గారు కోరారు.
సీమాంధ్రులు స్కామాంధ్రులు మాత్రమే కాదు, ఆరంభశూరులు మాత్రమే కాదు, ఆత్మాభిమాన శూన్యులు కూడాను. ఋజువు: ఆంధ్రప్రదేశ్ శాసనసభను జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బిజెపిలు రెండూ అవమానించాయి. చీకటిలో గొంతు నులిమి చావగొట్టి చెవులు మూసిన విధంగా, ఈమధ్య ముంబాయి శ్రీశక్తిమిల్స్ కేసులో సామూహిక మానభంగం చేసినట్లుగా లోక్ సభలో,రాజ్యసభలో, కాంగ్రెస్, బిజెపిలు కుమ్మక్కయ్యి , లోక్ సభ టీవీ ప్రసారాలను బంద్ చేసి, సీమాంధ్ర ఎంపీలను అవమానిస్తు తెలంగాణ బిల్లును పాస్ చేసుకున్నాయి. తామేదో ఘనకార్యం చేసేమని చెప్పుకుంటున్న సోనియా , రాహుల్ గాంధీలు, ఆనాడు సభకే డుమ్మా కొట్టారు.
మహాత్మా గాంధీగారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో passive resistance అనే సూత్రాన్ని అమలు చేసేవారు.
సీమాంధ్రులు ఆసూత్రాన్ని చక్కగా అమలు చేసే అవకాశం హిందూపూర్ రాహుల్ గాంధీ సభలో, తిరుపతి మోడీ సభలో కలిగింది. నిజంగా సీమాంధ్రులకి ఆత్మగౌరవం అనేది ఉండి ఉంటే, వారు పైసా ఖర్చులేకుండా, హింస, ఆస్తి విధ్వంసం, రక్తపాతాలు లేకుండా, తమ అసంతృప్తిని చాల తేలికగా చూప గలిగి ఉండే వాళ్ళు.
అదెలాగు? మోడీ సభలకు, రాహుల్ సభలకు, ఒక్క పురుగుకూడ హాజరు కాకుండా, సీమాంధ్రులు తమతమ వృత్తులను చేసుకోటమో, లేక ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోటమో చేసి ఉంటే, సందేశం నిశ్శబ్ద విప్లవం లాగా జరిగి ఉండేది.
కొద్దినెలల క్రితం మమతా బెనర్జీగారు, అన్నాహజారే గారు ఢిల్లీలో ఒక సభ జరపాలని తలపెట్టారు. వారి మధ్యలో ఏమి జరిగిందో గానీ ఒక్క పురుగు కూడ హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. ఖాళీ కుర్చీలు దర్శనమీయ బోతున్నాయని తెలిసిన హజారేగారు మైదానానికి హాజరు కాకుండా ముంబాయి తిరిగి వెళ్ళిపోయారు.
సభలకు హాజరు కాకపోటం వల్ల అవతల వాడు చెప్పేది మనం వినాలి (audi alterim partem) అనే న్యాయ శాస్త్ర సూత్రానికి భంగం కలిగిస్తున్నాం అని మనం కంగారు పడనక్కరలేదు. ఎందుకంటే శ్రీరాహుల్ గాంధీ, శ్రీనరేంద్రమోడీలు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని సుదీర్ఘంగానే పత్రికలకు స్పెషల్ ఇంటర్వ్యూల ద్వారా చెప్పారు. ఈ ఇంటర్వ్యూలను ఆంధ్రప్రదేశ్ నం. 1 దిన పత్రిక పత్రిక పతాక శీర్షికలలో అక్షరానికి అక్షరం ప్రచురించింది. చదివే ఓపిక ఉన్నవారు వాటిని చదివితే సభకు హాజరు అయిన దానికన్నా ఎక్కువ ఎవేర్ నెస్ కలుగుతుంది. హాజరు అయిన అందరికీ బీరు సీసాలు, బిరియానీ పొట్లాలూ ఇవ్వరు కాబట్టి ఎండలో ఆయాస పడవలసిన అవసరం కూడ ఉండదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.