English: Recollect the film Maya Bazar 1957, in which NTR acted as Sri Krishna, ANR as Abhimanyu, and SVR as Ghatotkacha. In the same way recollect the Telugu film Pandava Vanavasam, in which NTR acted as Bhima, Savitri as Draupadi, Kanta Rao as Krishna, and Satyanarayana as Ghatotkacha. In both the films, the common theme is Pandavas' exile to Forest. Another key climax scene is 'Wedding of Sasirekha (d/o Balarama and his wife Rohini)'. This wedding of Sasirekha is not in Vyasa's Sanskrit Mahabharata, or its Telugu version Errapraggada's Andhra Mahabharata. It may be in some other Telugu books. It may also be intellectual creativity of Film Script Writers, Producers and Directors. I do not wish to find fault with them. Because, they have conflicting objectives of 'Informing', 'Entertaining', and 'Profit making'.
Introduction పరిచయం
ఎన్ టీ ఆర్ కృష్ణుడుగా, ఎ ఎన్ ఆర్ అభిమన్యుడుగా, ఎస్ వీ ఆర్ ఘటోత్కచుడుగా, సావిత్రి శశిరేఖగా వచ్చిన మాయా బజార్ సినిమాను గుర్తుకు తెచ్చుకోండి. ఎన్ టీ ఆర్ భీముడిగా, సావిత్రి ద్రౌపదిగా, కాంతారావు కృష్ణుడిగా, సత్యనారాయణ ఘటోత్కచుడిగా నటించిన పాండవ వనవాసం సినిమాను గుర్తుకు తెచ్చుకోండి.
ఈరెండు సినిమాల నేపథ్యం పాండవులు అడవిలో నివసించటం. రెండు సినిమాలలో కీలక క్లైమాక్స్ ఘట్టం శశిరేఖా పరిణయం. ఇది వ్యాసుడు వ్రాసిన సంస్కృత మహాభారతంలో కానీ, కవిత్రయం వ్రాసిన తెలుగు మహాభారతంలో కానీ లేదు. ఇతర పుస్తకాలలో ఉండచ్చు. కొంత సినీ రచయితల, దర్శకుల మేథస్సు కావచ్చు. వారిని నేను తప్పు పట్టను. సినిమాల లక్ష్యం వ్యాపారం, వినోదం- తద్వారా ప్రేక్షకాదరణ. కళయొక్క స్థానం నంబర్ 3.
మాయాబజార్ లో భీముడికి, ధర్మరాజుకి, బహుశా అర్జునుడికి ప్రాముఖ్యత లేదు. పాండవవనవాసంలో కథ అంతా భీముడి చుట్టు తిరుగుతుంది.
మాయాబజార్ సినిమాలో ఈ యక్షప్రశ్నలు ఘట్టాన్ని చూపలేదు. పాండవ వనవాసం సినిమాలో స్వల్పంగా చూపినట్లున్నారు.
నర్తనశాల సినిమాలో (ఇది వనవాసం కాదు, అజ్ఞాత వాసానికి చెందినది), ముక్కామల విరాటరాజు, గుమ్మడి ధర్మరాజు కంకుభట్టు మథ్య జరిగిన సంభాషణల్లో హాస్యం కోసం ఒకటి రెండు యక్షప్రశ్నలను చొప్పించారు. అది దర్శకుడియొక్క మేథస్సుకు నిదర్శనం.
యక్షప్రశ్నల ప్రాముఖ్యత
తెలివైన మానవుడికి సదసద్విచారం (ఏది మంచి ఏది చెడు తేడా తెలుసుకునే శక్తి), నిత్యానిత్యవిచారం (ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తేడా తెలుసుకునే శక్తి), మిథ్యామిథ్యవిచారం (ఏది మాయ, ఏది నిజం తేడా తెలుసుకునే శక్తి) అవసరం.
ప్రాచీన మానవుడి కన్నా ఆధునిక మానవుడికి ఇవి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ప్రాచీన మానవుడి ముందు ఉండే ఆకర్షణలు (pulls and temptations) బలహీనమైనవి. ఆధునిక మానవుడి ముందు ఉండే ఆకర్షణలు బలమైనవి. మహమ్మద్ అలీలాగ , మైక్ టైసన్ లాగా అవి బాక్సింగ్ గుద్దులను మానవుడిమీద గుద్దుతూ ఉంటాయి.
నిత్యానిత్యవిచారం, సదసద్విచారం లేక పోతే, లక్షకోట్లు సంపాదించి వైయస్ రాజశేఖర రెడ్డిగారు వాటిని సరిగా అనుభవించకముందే, స్వర్గస్థులైనట్లుగా ఉంటుంది. మనిషి బందీ అయిపోతాడు.
యక్ష ప్రశ్నలలో కొన్ని స్టాక్ ప్రశ్నలు ఉన్నా ఆలోచనలు రేకెత్తించేవే. సదస్విచారాన్ని ప్రేరేపించేవే. మచ్చుకి ఒక ప్రశ్న, తెలుగు మామూలు భాషలో:
ప్రశ్న: బ్రతికి ఉండి కూడ చచ్చిన వాడితో సమానం ఎవరు? జవాబు: దేవుడు, అతిథి, తండ్రి తాతలు, సేవకులు వీళ్ళకి అన్నం పెట్టకుండా తాను తినేవాడు.వైబీరావు గాడిద వ్యాఖ్య
అప్పుడూ, ఇప్పుడూ ఇది 100% సత్యమే. దేవుడు ఒక ఊహ. దేవుడికి నైవేద్యం పెట్టటం అంటే ఏపటానికో విగ్రహానికో పెట్టటం అనే అర్థంలో నేడు రూఢి అయ్యింది. దేవుడు తింటాడా? పటం, విగ్రహాలు తింటాయా? నిరక్షరాస్యుడు నమ్మటంలో అర్థం ఉంటుంది. వేదవేదాంగవిదులైన పండితులు నమ్మకూడదు. తింటాడనే నమ్మకం భారత ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీగారికి కూడ ఉంది. అందుకే ఆయన వినాయకుడి విగ్రహం పాలు తాగుతుందంటే పాలక్యారేజీ తీసుకొని ఢిల్లీలో వినాయకుడి గుళ్ళకి వెళ్ళాడు.
మరణించిన పితృదేవతలు మనం పెట్టే తిండి ని తింటారనుకోటం కూడ ఋజువుల్లేని ఊహే. అర్ధం, బ్రతికున్న తండ్రి తాతలకు పెట్టమనే. తాతలనాటి బొచ్చె తరతరాలు చేయవద్దని.
అతిథులకు పెట్టటం మనకి అలవాటు తప్పింది. మనమే హోటళ్ళకి వెళ్ళి టిఫిన్ ప్యాకెట్లు కొనుక్కోవలసిన కర్మ పట్టింది. ఇంట్లో చేసుకున్నా గ్యాస్, నిత్యావసరవస్తువులు ధరలు పెరిగిపోయి అతిథులకి పెట్టే స్థాయినుండి కిందికి దిగజారి పోయాం. బిజేపి వాళ్ళు ప్రచారంచేసే, కానీ ఆచరణలో పట్టించుకోని సిసలైన హిందూత్వ ప్రకారం, ప్రతిరోజు మనం అన్నం తినబోయే ముందు ఒక కొత్తవాడిని వెతికి పట్టుకుని వెతికి తెచ్చుకొని, వాడిని గౌరవించి వాడి పక్కన కూర్చోని వాడితో కబుర్లుచెప్తూ భుజించాలి. బిచ్చగాళ్ళకి వేయటం కాదు.
సేవకులకు అన్నం పెట్టటం నా దృష్టిలో అతిథికి అన్నం పెట్టటం కన్నా ముఖ్యమైనది. అలాపెట్టకపోతే మనం శ్రమదోపిడీ చేసిన వాళ్లమవుతాం. దీనిలో మళ్ళీ పెట్టుబడిదారీ ఎకనామిక్స్ వస్తుంది. జీతం ఇస్తున్నాంగా, ఇంక మనతో సమానంగా భోజనం పెట్టాలా, లెక్కలెయ్యి, అని పెట్టుబడిదారీ విధానం చెప్తుంది.
ఇది నేడెందుకు కుదరదు అంటే, పెట్టుబడిదారీ విధాన మహిమ. అందు వల్ల పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం మనమందరం జీవన్మృతులమే.
పాండవులు వనవాసం చేసినపుడు ఈయక్షప్రశ్నల ఘట్టం ఎప్పుడు వస్తుంది?
ఇంచు మించుగా చివర. ధర్మరాజుకి దాహం వేస్తుంది. తమ్ముళ్ళు చెట్టెక్కి చూస్తారు. కొంతదూరంలో ఒక సరస్సు (చెరువు) కనిపిస్తుంది. నకులుడు నీళ్ళు తేవటానికి వెళ్తాడు. సరస్సుకి కాపలా కాస్తున్న యక్షుడు నకులుడికి అడ్డు పడి నాప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీళ్ళను ముట్టుకోవద్దంటాడు. నకులుడు పట్టించుకోకుండా చెరువులోకి దిగుతాడు. యక్షుడి మాయవల్ల మూర్ఛపోతాడు.
తరువాత సహదేవుడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.
తరువాత అర్జునుడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.
తరువాత భీముడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.
వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోటంతో ఆందోళనతో ధర్మరాజు స్వయంగా వెళ్తాడు. సరస్సు ఒడ్డున మూర్ఛపోయిన తమ్ముళ్ళు, యక్షుడు కనిపించారు. ధర్మరాజుకి జూద వ్యసనం ఉంది కానీ, కొన్నిసార్లు తెలివిగా ప్రవర్తిస్తాడు. యక్షుడిని మెప్పించేలా జవాబులు చెప్పి, ప్రవర్తించి, తమ్ముళ్ళందరినీ విడిపించుకుంటాడు. క్లుప్తంగా, ఇదీ కథ.
నేనేదో అరటి పండు వలిచి పెట్టినట్లుగా మీనోట్లో పెట్టి, మీక స్పూన్ ఫీడింగ్ చేస్తాను అని ఆశించకండి. శ్లోకాలను, పద్యాలను అర్ధం చేసుకోటానికి ప్రయత్నించండి. వాటిని సమకాలీన పరిస్థితులతో పోల్చండి. శ్రధ్ధావాన్ లభతే విద్యా.
ఇవన్నీ మేమెందుకు చదవాలి, ఇది మాసిలబస్ లో లేదే
భారతంలోగాని, రామాయణంలో ఉన్నవి గానీ, గురువులు చెప్పినవి కానీ నూటికి నూరు పాళ్ళు ఆచరించాలని లేదు. సత్యాసత్య విచారం, చేసుకున్న తరువాత, మంచివి, ఆచరణీయం అనుకున్నవాటినే ఆచరించుకోవాలి. సంస్కారం వల్ల మానవుడు మెరుగైన మానవుడుగా తయారుఅయ్యి తాను సుఖపడి చుట్టూ ఉన్న వారిని సుఖపెట్ట కలుగుతాడు.
సత్యాసత్య విచార, నిత్యానిత్య విచార విద్యకి సిలబస్ లు ఉండవు. ఈవిచారాన్ని సరిగా చేసుకోనివాడు స్వామీ వివేకానందలాగా అయిపోయి మేకను బలిఇవ్వగానే దుర్గామాతకు ఆనందం కలుగుతుందనుకుంటాడు. తాబేళ్ళను తినటానికి డాక్టర్లు అనుమతించలేదే అని బాధ పడతాడు.
వ్యాసుడు
వ్యాస భారతం, అరణ్యపర్వం లో 314వ ఆధ్యాయంలో మనం ఈ యక్ష ప్రశ్నలను చూడవచ్చు. We can see these questions of yaksha, in Chapter 314 of vyasa mahabharata.
స దదర్శ హతాన్భ్రాతృఁల్లోకపాలానివ చ్యుతాన్।
యుగాంతే సమనుప్రాప్తే శక్రవైశ్రవణోపమాన్ ॥ 1
వినికీర్ణధనుర్బాణం దృష్ట్వా నిహతమర్జునం।
భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టాన్గతాయుషః ॥ 2
సదీర్ఘముష్ణం నిఃశ్వస్య శోకబాష్పపరిప్లుతః।
తాందృష్ట్వా పతితాన్భ్రాతౄన్సర్వాంశ్చింతాసమన్వితః। 3
నను త్వయా మహాబాహో ప్రతిజ్ఞాతం వృకోదర।
సుయోధనస్య భేత్స్యామి గదయా సక్థినీ రణే ॥ 4
వ్యర్థం తదద్య మే సర్వం త్వయి వీరే నిపాతితే।
మహాత్మని మహాబాహో కురూణాం కీర్తివర్ధనే ॥ 5
మనుష్యసంభవా వాచో విధర్మిణ్యః ప్రతిశ్రుతాః।
భవతాందివ్యవాచస్తు తా భవంతు కథం మృపా ॥ 6
దేవాశ్చాపి యదాఽవోచన్మూతకే త్వాం ధనంజయ।
సహస్రాక్షాదనవరః కుంతి పుత్రస్తవేతి వై ॥ 7
ఉత్తరే పారియాత్రే చ జగుర్భూతాని సర్వశః।
విప్రనష్టాం శ్రియం చైషామాహర్తా పునరోజసా ॥ 8
నాస్య జేతా రణే కశ్చిదజేతా నైష కస్యచిత్।
సోయం మృత్యువశం యాతః కథం జిష్ణుర్మహాబలః ॥ 9
అయంమమాశాం సంహత్య శేతే భూమౌ ధనంజయః।
ఆశ్రిత్యయం వయం నాథం దుఃఖాన్యేతానిసేహిమ ॥ 10
రణే ప్రగల్భౌ వీరౌ చసదా శత్రునిబర్హణౌ।
కథం రిపువశం యాతౌ కుంతీపుత్రౌ మహాబలౌ।
యౌ సర్వాస్త్రాప్రతిహతౌ భీమసేనధనంజయౌ ॥ 11
అశ్మసారమయం నూనం హృదయం మమ దుర్హృదః।
యమౌ యదేతౌ దృష్ట్వాఽద్య పతితౌ నావదీర్యతే ॥ 12
శాస్త్రజ్ఞా దేశకాలజ్ఞాస్తపోయుక్తాః క్రియాన్వితాః।
అకృత్వా సదృశం కర్మ కిం శేధ్వం పురుషర్షభాః ॥ 13
అవిక్షతశరీరాశ్చాప్యప్రమృష్టశరాసనాః।
అసంజ్ఞా భువి సంగంయ కిం శేష్వమపరాజితాః ॥ 14
సానూనివాద్రేః సంసుప్తాందృష్ట్వా భ్రాతృన్మహామతిః।
సుఖం ప్రసుప్తాన్ప్రస్విన్నః ఖిన్నః కష్టాం దశాం గతః ॥ 15
ఏవమేవేదమిత్యుక్త్వా ధర్మాత్మా స నరేశ్వరః।
శోకసాగరమధ్యస్థో దధ్యౌ కారణమాకులః ॥ 16
ఇతికర్తవ్యతాం చేతి దేశకాలవిభాగవిత్।
నాభిపేదే మహాబాహుశ్చింతయానో మహామతిః ॥ 17
అథసంస్తభ్య ధర్మాత్మా తదాఽఽత్మానం తపఃసుతః।
ఏవంవిలప్య బహుధా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
బుద్ధ్యా విచింతయామాసవీరాః కేన నిపాతితాః ॥ 18
నైషాం శస్త్రప్రహారోస్తి పదం నేహాస్తి కస్యచిత్।
భూతం మహదేదం మన్యే భ్రాతరో యేన మే హతాః ॥ 19
ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేత్స్యామి వా జలం।
`భ్రాతౄణాం న్న్యసనం ఘోరం సమమేవ మహాత్మనాం' ॥ 20
స్యాత్తు దుర్యోధనేనేదముపాంశు పరికల్పితం।
గాంధారరాజరచితం సతతం జిహ్మవుద్ధినా ॥ 21
యస్ కార్యమకార్యం వా సమమేవ భవత్యుత।
కస్తస్య విశ్వసేద్వీరో దుష్కృతేరకృతాత్మనః ॥ 22
అథవా పురుషైర్గూఢైః ప్రయోగోఽయందురాత్మనః।
భవేదితి మహాబుద్ధిర్బహుధా సమచింతయత్ ॥ 23
ఆచార్యం కింను వక్ష్యామి కృపం భీష్మమహం ను కిం।
విదురం కింను వక్ష్యామి బృహస్పతిసమం నయే ॥ 24
అంబాం చ కింను వక్ష్యామి సర్వదా దుఃఖభాగినీం।
దృష్ట్వా మాం భ్రాతృభిర్హీనం పృచ్ఛంతీం పుత్రగృద్ధినీం ॥ 25
యదా త్వం భ్రాతృభిః సర్వైః శక్రతుల్యపరాక్రమైః।
సార్ధం వనం గతో వీరైః కథమేకస్త్వమాగతః' ॥ 26
కస్య కింను విషేణేదముదకం దూపితం యథా।
మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే।
ముఖవర్ణాః ప్రసన్నా మే భ్రాతౄణామిత్యచింతయత్ ॥ 27
ఏకైకశశ్చౌఘబలానిమాన్ పురుషసత్తమాన్।
కోఽన్యః ప్రతిసమాసేత కాలాంతకయమాదృతే ॥ 28
ఏతేన వ్యవసాయేన తత్తోయం వ్యవగాఢవాన్।
పాతుకామశ్చ తత్తోయమంతరిక్షాత్స శుశ్రువే ॥ 29
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-30
అహం బకః శైవలమత్స్యభక్షో
నీతా మయా ప్రేతవశం తవానుజాః।
త్వం పంచమో భవితా రాజపుత్ర
న చేత్ప్రశ్నాన్పృచ్ఛతో వ్యాకరోపి ॥ 30
మా తాత సాహసంకార్పీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 31
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 32
రుద్రాణాం వా వసూనాం వామరుతాం వా ప్రధానభాక్।
పృచ్ఛామి కో భవాందేవో నైతచ్ఛకునినా కృతం ॥ 32
హిమవాన్పారియాత్రశ్చ వింధ్యో భలయ ఏవ చ।
చత్వారః పర్వతాః కేన పాతితా భువి తేజసా ॥ 33
త్వయాఽతీవ మహత్కర్మ కృతం చ బలినాంవర।
వినిఘ్నతా మహేష్వాసాంశ్చతురోపి మమాత్మజాన్' ॥ 34
యాన్న దేవాన గంధర్వానాసురాశ్చ న రాక్షసాః।
విపహేరన్మహాయుద్ధే కృతం తే తన్మహాద్భుతం ॥ 35
న తే జానామి యత్కార్యం నాభిజానామి కాంక్షిత్తం।
కౌతూహలం మహజ్జాతం సాధ్వసం చాగతం మమ ॥ 36
యేనాస్స్యుద్విగ్నహృదయః సముత్పన్నశిరోజ్వరః।
పృచ్ఛామి భగవంస్తస్మాత్కో భవానిహ తిష్ఠతి ॥ 37
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-38
యక్షోఽహమస్మి భద్రం తే నాస్మి పక్షీ జలేచరః।
మయైతే నిహతా సర్వే భ్రాతరస్తే నివారితాః ॥ 38
వైశంపాయన ఉవాచ। 39
తతస్తామశివాం శ్రుత్వావాచం స పరుషాక్షరాం।
యక్షస్ బ్రువతో రాజన్నాకంపత తదాఽఽస్థితః ॥ 39
విరూపాక్షం మహాకాయం యక్షం తాలసముచ్ఛ్రయం।
జ్వలనార్కప్రతీకాశమధృష్యం పర్వతోపమం ॥ 40
సేతుమాశ్రిత్య తిష్ఠంతం దద్రశ భరతర్షభః।
మేఘగంభీరనాదేన తర్జయంతం మహాస్వనం ॥ 41
ఉవాచ యక్షః కౌంతేయం భ్రాతృశోకప్రపీడితం' ॥ 42
ఇమే తేభ్రాతరో రాజన్వార్యమాణఆ మయాఽసకృత్।
బలాత్తోయం జిహీర్షంతస్తతో వై మృదితా మయా।
న పేయముదకం రాజన్ప్రాణానిహ పరీప్సతా ॥ 43
పార్థ మా సాహసం కార్పీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతఃపిబ హరస్వ చ ॥ 44
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 45
న చాహం కామయే యక్ష తవ పూర్వపరిగ్రహం ॥ 45
కామం నైతత్ప్రసంసంతి సంతో హి పురుషాః సదా।
యదాత్మనా స్వమాత్మానం ప్రశంసేత్పురుషర్షభ।
యథాప్రజ్ఞం తు తే ప్రశ్నాన్ప్రతివక్ష్యామి పృచ్ఛ మాం ॥ 46
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-47 yaksha started questioning yudhishthira.
కింస్విదాదిత్యమున్నయతి కే చ తస్యాభితశ్చరాః।
కశ్చైనమస్తం నయతికస్మింశ్చ ప్రతితిష్ఠతి ॥ 47
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 48
బ్రహ్మాదిత్యమున్నయతి దేవాస్తస్యాభితశ్చరాః।
ధర్మశ్చాస్తం నయతి చ సత్యే చ ప్రతితిష్ఠతి ॥ 48
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-29
కేన స్విచ్ఛ్రోత్రియో భవతి కేన స్విద్విందతే మహత్।
కేన స్విద్ద్వితీయవాన్భవతిరాజన్కేన చ బుద్దిమాన్ ॥ 49
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 50
శ్రుతేన శ్రోత్రియో భతి రతపసా విందతే మహత్।
ధృత్యా ద్వితీయవాన్భవతి బుద్ధిమాన్వృద్ధసేవయా ॥ 50
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-51
కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 51
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 52
స్వాధ్యాయ ఏషాం దేవత్వం తప ఏషాం సతామివ।
మరణం మానుషో భావః పరివాదోఽసతామివ ॥ 52
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-53
కిం క్షత్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 53
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 54
ఇష్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ।
భయం వై మానుషో భావః పరిత్యాగోఽసతామివ ॥ 54
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-55
కిమేకం యజ్ఞియం సామ కిమేకం యజ్ఞియం యజుః।
కా చైషాం వృణుతే యజ్ఞం కాం యజ్ఞో నాతివర్తతే ॥ 55
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 56
ప్రాణో వై యజ్ఞియంసామ మనో వై యజ్ఞియం యజుః।
ఋగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతివర్తతే ॥ 56
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-57
కింస్విదావపతాం శ్రేష్ఠం రకింస్విన్నివపతాం వరం।
కింస్విత్ప్రతిష్ఠమానానాం కిస్విత్ప్రసవతాంవరం ॥ 57
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 58
వర్షమావపతాం శ్రేష్ఠం బీజం నివపతాం వరం।
గావః ప్రతిష్ఠమానానాం పుత్రః ప్రసవతాం వరః ॥ 58
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-59
ఇంద్రియార్థాననుభవన్బుద్ధిమాఁల్లోకపూజితః।
సంమతః సర్వభూతానాముచ్ఛ్వసన్కో న జీవతి ॥ 59
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 60
దేవతాతిథిభృత్యానాం పితౄణామాత్మనశ్చ యః।
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్న స జీవతి ॥ 60
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-61
కింస్విద్గురుతరం భూమేః కింస్విదుచ్చతరం చ స్వాత్।
కింస్విచ్ఛీఘ్రతరం వాయోః కింస్విద్బహుతరం తృణాత్ ॥ 61
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 62
మాతా గురుతరా భూమేః ఖాత్పితోచ్చతరస్తథా।
మనః శీఘ్రతరం వాతాచ్చింతా బహుతరీ తృణాత్ ॥ 62
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-63
కింస్విత్సుప్తం న నిమిషతి కింస్విజ్జాతం న చేంగతే।
కస్యస్విద్ధృదయం నాస్తికాస్విద్వేగేన వర్ధతే ॥ 63
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 64
మత్స్యః సుప్తో న నిమిషత్యండం జాతం న చేంగతే।
అశ్మనో హృదయంనాస్తి నదీ వేగేన వర్ధతే ॥ 64
యక్ష ఉవాచ। యక్షుడు అన్నాడు. yaksha said. 65
కింస్విత్ప్రవసతో మిత్రం కింస్విన్మిత్రం గృహే సతః।
ఆతురస్ చ కిం మిత్రం కింస్విన్మిత్రం మరిష్యతః ॥ 65
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 66
విద్యా ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః।
ఆతురస్య భిషఙ్భిత్రం దానం మిత్రం మరిష్యతః ॥ 66
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-67
కోఽతిథిః సర్వభూతానాం కిం స్విద్ధర్మం సనాతనం।
అమృతం కింస్విద్రాజేంద్రకింస్విత్సర్వమిదం జగత్ ॥ 67
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 68
అతిథిః సర్వభూతానామగ్నిః సోమో గవామృతం।
సనాతనోఽమృతో ధర్మో వాయుః సర్వమిదం జగత్ ॥ 68
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-69
కింస్విదేకో విచరతే జాతః కో జాయతే పునః।
కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహత్ ॥ 69
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 70
సూర్య ఏకో విచరతే యంద్రమా జాయతే పునః।
అగ్నిర్హమస్య భైషజ్యం భూమిరావపనం మహత్ ॥ 70
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-71
కింస్విదేకపదం ధర్మ్యం కింస్విదేకపదం యశః।
కింస్విదేకపదం స్వర్గ్యం కింస్విదేకపదం సుఖం ॥ 71
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 72
దాక్ష్యమేకపదం ధర్మ్యం దానమేకపదం యశః।
సత్యమేకపదం స్వర్గ్యం శీలమేకపదంసుఖం ॥ 72
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-73
కింస్విదాత్మా మనుష్యస్ కింస్విద్దైవకృతః సఖా।
ఉపజీవనం కిస్విదస్ కింస్విదస్య పరాయణం ॥ 73
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 74
పుత్ర ఆత్మా మనుష్యస్య భార్యా దైవకృతః సఖా।
ఉపజీవనం చ పర్జన్యో దానమస్ పరాయణం ॥ 74
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-75
ధన్యానాముత్తమం కింస్విద్ధనానాం స్యాత్కిముత్తమం।
లాభానాముత్తమం కింస్యాత్సుఖానాం స్యాత్కిముత్తమం ॥ 75
ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతం।
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా ॥ 76
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-77
కింస్విద్ధర్మపరంలకే కశ్చ ధర్మః సదాఫలః।
కిం నియంయ న శోచంతి కైశ్ సంధిర్న జీర్యతే ॥ 77
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 78
ఆనృశంస్యం పరం ధర్మాత్రేతాధర్మః సదాఫలః।
మనో యంయ న శోచంతి సంధిః సద్భిర్న జీర్యతే ॥ 78
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-79
కింను హిత్వాప్రియో భవతి కింను హిత్వా న శోచతి।
కింను హిత్వాఽర్థవాన్భవతి కింను హిత్వా సుఖీ భవేత్ ॥ 79
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 80
మానం హిత్వాప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి।
కామం హిత్వాఽర్థవాన్భవతి లోమం హిత్వా సుఖీ భవేత్ ॥ 80
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-81
కిమర్థం బ్రాహ్మణే దానం కిమర్థం నటనర్తకే।
కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు ॥ 81
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 82
ధర్మార్థం బ్రాహ్మణే దానం యశోర్థం నటనర్తకే।
భృత్యేషు సంగ్రహార్థం చ భయార్థం చైవ రాజసు ॥ 82
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-83
అజ్ఞానేనావృతోలోకస్తమసా న ప్రకాశతే।
లోభాత్త్యజతిమిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి ॥ 83
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 84
అజ్ఞానేనావృతోలోకస్తమసా న ప్రకాశతే।
లోభాత్త్యజతిమిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి ॥ 84
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-85
మృత కథం స్యాత్పురుషః కథం రాష్ట్రం మృతం భవత్।
శ్రాద్ధం మృతంకథం వా స్యాత్కథం యజ్ఞా మృతో భవేత్ ॥ 85
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 86
మృతో దరిద్రః పురుషో | మృతం రాష్ట్రమరాజకం।
మృతమశ్రోత్రియం శ్రాద్ధం | మృతో యజ్ఞస్త్వదక్షిణః ॥ 86
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-87
కా దిక్కిముదకంపార్థ | కిమన్నం కించ వై విషం।
శ్రాద్ధస్ కాలమాఖ్యాహి | తతః పిబ హరస్వ చ ॥ 87
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 88
సంతో దిగ్జలమాకాశం గౌరన్నం బ్రాహ్మణం విషం।
శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్ష మన్యసే ॥ 88
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-89
తపః కింలక్షణం ప్రోక్తం కో దమశ్చ ప్రకీర్తితః।
క్షమా చ కా పరా ప్రోక్తా కా చ హ్రీః పరికీర్తితా ॥ 89
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 90
తపః స్వధర్మవర్తిత్వం మనసో దమనం దమః।
క్షమా ద్వంద్వసహిష్ణుత్వంహీరకార్యనివర్తనం ॥ 90
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-91
కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్కః శమశ్చ ప్రకీర్తితః।
దయా చ కా పరా ప్రోక్తా కిం చార్జవముదాహృతం ॥ 91
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 92
జ్ఞానం తత్త్వార్థసంబోధః శమశ్చిత్తప్రశాంతతా।
దయాసర్వసుఖైపిత్వమార్జవం సమచిత్తతా ॥ 92
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-93
కః శత్రుర్దుర్జయః పుంసాం కశ్చవ్యాధిరనంతకః।
కీదృశశ్చ స్మృతః సాధురసాధుః కీదృశః స్మృతః ॥ 93
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 94
క్రోధః సుదుర్జయః శత్రుర్లోభోవ్యాధిరనంతకః।
సర్వభూతహితః సాధురసాధుర్నిర్దయః స్మృతః ॥ 94
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-95
కో మోహః ప్రోచ్యతే రాజన్కశ్ మానః ప్రకీర్తితః।
కిమాలస్యం చ విజ్ఞేయం కశ్చశోకః ప్రకీర్తితః ॥ 95
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 96
మోహో హిధర్మమూఢ్తవంమానస్త్వాత్మాభిమానితా।
ధర్మనిష్క్రియతాఽఽలస్యం శోకస్త్వజ్ఞానముచ్యతే ॥ 96
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-97
కిం స్థైర్యమృషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతం।
స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే ॥ 97
యుధిష్ఠి ఉవాచ। 98
స్వధర్మే స్థిరతా స్థైర్యం ధైర్యమింద్రియనిగ్రహః।
స్నానం మనోమలత్యాగో దానం వై భూతరక్షణం ॥ 98
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-99
కః పండిః పుమాన్జ్ఞేయో | నాస్తికః కశ్చ ఉచ్యతే।
కో మూర్ఖః కశ్చకామః స్యాత్ | కో మత్సర ఇతి స్మృతః ॥ 99
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 100
ధర్మజ్ఞః పండితో జ్ఞేయో | నాస్తికో మూర్ఖ ఉచ్యతే।
కామః సంసారహేతుశ్చ | హృత్తాపో మత్సరః స్మృతః ॥ 100
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-101
కోఽహంకార యఇతిప్రోక్తః కశ్చ దంభః ప్రకీర్తితః।
కిం తద్దైవం పరం ప్రోక్తం కిం తత్పైశున్యముచ్యతే ॥ 101
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 102
మహాఽజ్ఞానమహంకారో దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయః।
దైవం రదానఫలం ప్రోక్తం పైశున్యం పరదూషణం ॥ 102
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-103
ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పరవిరోధినః।
ఏషాం నిత్యవిరుద్ధానాం కథమేకత్ర సంగమః ॥ 103
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 104
యదా ధర్మశ్భార్యా చ పరస్పరవశానుగౌ।
తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః ॥ 104
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-105
అక్షయోనరకః కేన ప్రాప్యతే భరతర్షభ।
ఏతన్మే పృచ్ఛతః ప్రశ్నం తచ్ఛీఘ్రం వక్తుమర్హసి ॥ 105
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 106
రబ్రాహ్మణం స్వయమాహూయ యాచమానమకించనం।
పశ్చాన్నాస్తీతి యోబ్రూయాత్సోక్షయంనరకం వ్రజేత్ ॥ 106
వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యా యో వై ద్విజాతిషు।
దేవేషు పితృధ్రమేషు సోఽక్షయంనరకం వ్రజేత్ ॥ 107
విద్యమానే ధనే లోభాద్దానభోగవివర్జితః।
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్సోక్షయం నరకం వ్రజేత్ ॥ 108
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-109
రాజన్కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా।
బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్సునిశ్చితం ॥ 109
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 110
శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో న చ శ్రుతం।
కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ న సంశయః ॥ 110
వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః।
అక్షీణవృత్తో న క్షీణో వృత్తతస్తు హతో హతః ॥ 111
పఠకాః పాఠకాశ్చైవ యే చాన్యే శాస్త్రచింతకాః।
సర్వే వ్యసనినో మూర్ఖా యః క్రియావాన్స పండితః ॥ 112
చతుర్వేదోఽపి దుర్వృత్తః స శూద్రాదతిరిచ్యతే।
యోఽగ్నిహోత్రపోర దాంతః స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ 113
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-114
ప్రియవచనవాదీ కిం లభతే
విమృశితకార్యకరః కిం లభతే।
బహుమిత్రకరః కిం లభతే
ధర్మే రతః కిం లభతే కథయ ॥ 114
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 115
ప్రియవచనవాదీ ప్రీయో భవతి
విమృశితకార్యకరోఽధికం జయతి।
బహుమిత్రకరః సుఖం వసత
యశ్చ ధర్మరతః స గతిం లభతే ॥ 115
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-116
కోమోదతేకిమాశ్చర్యం| కః పంథాః కా చ వార్తికా।
వద మే చతురః ప్రశ్నాన్ | మృతా జీవంతు బాంధవాః ॥ 116
యుధిష్ఠిర ఉవాచ 117
పంచమేఽహని షష్ఠే వా శాకం పచతి స్వే గృహే।
అనృణీ రచాప్రవాసీ చస వారిచర మోదతే ॥ 117
అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయం।
శేషాః స్థావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరం ॥ 118
తర్కోఽప్రతిష్ఠః శ్రుతయో విభిన్నా
నైకో మునిర్యస్య మతం ప్రమాణం।
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గతఃస పంథా ॥ 119
పృథ్వీ విభాండం గగనం పిఘానం
సూర్యాగ్నినా రాత్రిదివేంధనేన।
మాసర్తుదర్వీపరిఘట్టనేన
భూతాని కాలః పచతీతి వార్తా ॥ 120
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-121
వ్యాఖ్యాతా మే త్వయా | ప్రశ్నా యథాతత్వం పరంతప।
పురుషం త్విదానీంవ్యాఖ్యా| అహి యశ్చ సర్వధనీ నరః ॥ 121
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 122
దివం స్పృశతి భూమిం చ శబ్దః పుణ్యేన కర్మణా।
యావత్స శబ్దో భవతి తావత్పురుష ఉచ్యతే ॥ 122
తుల్యే ప్రియాప్రియే యస్ సుఖదుఃఖే తథైవ చ।
అతీతానాగతే చోభే సవై పురుష ఉచ్యేత ॥ 123
`సమత్వం యస్య సర్వేషు నిస్పృహః శాంతమానసః।
సుప్రసన్నః సదా యోగీ స వై సర్వధనీ నరః' ॥ 124
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-125
వ్యాఖ్యాతః పురుషో రాజన్యశ్చ సర్వధనీ నరః।
తస్మాత్త్వమేకం భ్రాతృణాం యమిచ్ఛసి స జీవతు ॥ 125
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 126
శ్యామో య ఏష రక్తాక్షో బృహత్సాల ఇవోత్థితః।
వ్యూఢోరస్కో మహాబాహుర్నకులో యక్ష జీవతు ॥ 126
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-127
ప్రియస్తే భీమసేనోఽయమర్జునో వః పరాయణం।
త్వం కస్మాన్నకులం రాజన్సాపత్నం జీవమిచ్ఛసి ॥ 127
యస్ నాగసహస్రేణ దశసంఖ్యేన వై బలం।
తుల్యంతం భీమముత్సృజ్య నకులం జీవమిచ్ఛసి ॥ 128
తథైనం మనుజాః ప్రాహుర్భీమసేనం ప్రియం తవ।
అథ కనానుభావేన సాపత్నం జీవమిచ్ఛసి ॥ 129
యస్య బాహుబలంసర్వేపాండవాః సముపాసతే।
అర్జునం తమపాహాయ నకులం జీవమిచ్ఛసి ॥ 130
యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 131
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః।
తస్మాద్ధఱ్మం న త్యజామి మా నో ధర్మో హతోఽవధీత్ ॥ 131
ఆనృశంస్యం పరో ధర్మః పరమార్థాచ్చమే మతం।
ఆనృశంస్యం చికీర్షామి నకులో యక్ష జీవతు ॥ 132
ధర్మశీలః సదా రాజాఇతిమాం మానవా విదుః।
స్వధర్మాన్న చలిష్యామి నకులో యక్ష జీవతు ॥ 133
కుంతీ చైవ తు మాద్రీ చ ద్వే భార్యే తు పితుర్మమ।
ఉభే సపుత్రే స్యాతాం వై ఇతిమే ధీయతే మతిః ॥ 134
యథా కుంతీ తథా మాద్రీ విశేషో నాస్తి మే తయోః।
మాతృభ్యాం సమమిచ్ఛామి నకులో యక్ష జీవతు ॥ 135
యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-
యస్ తేఽర్థాచ్చ కామచ్చ ఆనృశంస్యం పరం మతం।
తస్మాత్తే భ్రాతరః సర్వే జీవంతు భరతర్షభ ॥ 136.
315 వ ఆధ్యాయంలో యమ ధర్మరాజు తన పుత్రుడైన ధర్మరాజుకు తన నిజరూపాన్ని చూపించి వారి వనవాసం పూర్తి కావస్తున్నదని, అజ్ఞాత వాసంలో వారినెవరు గుర్తు పట్టరని దీవించాడు.
Great Poet YerrapragaDa మహాకవి ఎర్రాప్రగడ
ఎర్రాప్రగడ, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం, 423 వ పద్యం నుండి 459 వ పద్యం వరకు.
వ్యాసుడు: ముంబాయి వెర్షన్ లో 314 ఆధ్యాయం. కొన్ని ఇతరవెర్షన్లలో 297వ ఆధ్యాయం.
423. కందం. దినకరు నెయ్యది నడపును,
దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు రద్దే
వుని యస్తమించుటేమిట,
ననఘ తదాధారభూతమెద్ది యొకో,
424. తే.గీ. అనిన ధర్మజుడిట్లను నబ్జహితుని,
నడపు బ్రహ్మంబుసురకోటి నడచుఁ గొలిచి
ధర్మువున నస్తమితుఁ డగుఁ దపనుఁ డమ్మ
హాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు.
అనిన విని యక్షుండిట్లనియె.
కందం. ఏమిట శ్రోత్రియుఁడనఁజను,
నెమిటఁ గడు మహిమ వడయు నిమ్ముగఁ బురుషుం
డేమిట సహాయయుతుఁడగు, నేమిటనగు బుధ్ధిమంతుఁ డర్పడఁ జెపుమా.
అనిన నతండిట్లనియె.
కందం. శ్రుతము వలన శ్రోత్రియుఁడగు,
నతుల తపోయుక్తిఁ (లేక తపోవృత్తి) గడు మహత్వము వడయున్
ధృతిచే సహాయయుతుఁ డగు,
నతిశయముగ బుధ్ధిమంతుడగు బుధసేవన్.
వచనం. అని చెప్పిన అప్పార్ధివోత్తమున కప్పురుషుండు వెండియు నిట్లనియె.
తేటగీతి. ఏమి కతమున భూదేవుఁ డెసగు దేవ,
భావమున నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు నసాధుత్వ మెద్దానఁ జెందు
మానుషుండగు నాతడేదానఁ జెపుమ.
చంపకమాల. అనవుడు ధర్మజుండనియె నధ్యయనంబున దేవభావముం
గను నవనీసుపర్వుఁ డధిక వ్రతశీలత సాధుభావ మా
తనికి విశిష్ట వృత్తి దిగఁ ద్రావి యసాధు వనంగ నుండు శౌ
చనియతి లేక మృత్యుభయసంగతి నాతడు మానుషుండగున్.
కందం. నావుడు నతడాతనితో
జీవన్మృతుడెట్టివాడు సెప్పు మనుటయున్
దేవాతిథిపితృభృత్యజ
నావళులకు నిడక కుడుచు నతడని చెప్పెన్.
౪౩౩. విని మగుడంగ వాఁడు పృథివీపతిఁ జూచి ధరిత్రికంటె వ్రేఁ
కన జనుదాని నాకసము కంటె కడుం బొడవైనదాని గాడ్పునకును నెక్కుడై జనము పొంపిరి వోయెడుదానిఁ బూరి కం
టెను దరచైన దానని ఘటింపఁగ జెప్పుము నాకు నావుడున్.
౪౩౪.వ. అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కిట్లనియె.
౪౩౫. ఆ.వె. తల్లి వ్రేఁగు సువ్వె ధరణికంటేను నాక,
సంబు కంటె పొడవు జనకు డరయ
గాడ్పు కంటె మనసు గడు శీఘ్రగతి తృణో
త్కరము కంటె చింత గరము తరచు.
౪౩౬.వ. అనిన అంబర చరుండు మరియు నిట్లనియె.
౪౩౭. తే. మొనసి నిద్రించియును గన్ను మూయ దెద్ది
పుట్టియును చేతనత్వంబు పొరయ దెద్ది
యరయ రూపు గల్గియు హృదయంబు లేని
దెద్ది వేగంబు కతనమున నెద్ది వొదలు.
౪౩౮. అనినఁ గన్ను మూయదు సుప్తమయ్యు మీను
పుట్టియును గ్రుడ్డు చేతనఁ బొరయకుండు
హృదయరహితంబు రారూప మేఱు రయము
కతన వర్ధిల్లు నని చెప్పెఁ గౌరవుండు.
౪౩౯. చెప్పిన అయ్యక్షుం డతనితో తెరువు నడుచు వానికి రోగార్తునకు గృహస్తునకు మృతి పొందిన వానికి ఎవ్వరు సుట్టంబు లనిన అప్పుడమి ఱేఁడన్నలువురకుం గ్రమంబున సార్ధంబును, వైద్యుండును, సద్భార్యయును, కృతంబైన ధర్మంబును బరమ మిత్రులని నిర్దేశించుటయు , నయ్యక్షుండు పాండవేయున కిట్లనియె.
౪౪౦. కందం. ఎయ్యది దర్మువునకుఁ గుదు
రెయ్యది యాశ్రయము కీర్తి కిమ్మగు మార్గం
బెయ్యది సురలోకమునకు,
నెయ్యది సుఖమునకు నిక్క యేర్పడఁ జెపుమా.
౪౪౧. వ. అని యడుగుటయు.
౪౪౨. కందం. అమరగ దాక్షిణ్యము ధ
ర్మమునకు కుదురండ్రు కీర్తి మహిమ నెలవు దా
నము సత్యము సురపురి మా
ర్గము శీలము సంశ్రయము సుఖంబుల కెల్లన్.
౪౪౩. వచనం. అని యుధిష్ఠిరుం డెరింగించిన వెండియు.
౪౪౪. చంపకామాల. నరునకు నాత్మ యెవ్వఁడు ఘనంబుగ దైవికమైన చుట్టమె
వ్వరతనికిం దదీయ మగు వర్తన మేమిట నిర్వహించు భూ
వర యతడేమి వూని యనవద్యతఁ బొందు నెఱుంగఁ జెప్పు మీ
నరుదుగ నన్న నక్కురుకులాగ్రణి యాతనితోడ నిట్లనున్.
౪౪౫. తేటగీతి. ఆత్మజుఁడు సువ్వె పురుషున కాత్మ యయ్యె
నాతనికి భార్య దైవిక మైన చుట్ట
మతని జీవిక పర్జన్యు కతనఁ జెల్లు
నతఁడు దానము గొనియాడి యతిశయిల్లు.
౪౪౬. చంపకమాల. అనవుడు మేటి ధర్మమగు నట్టిది యెయ్యది యేది యెప్పుడున్
తనియఁగ బండి యుండు నెనకంబున నెయ్యది నిగ్రహించినం
దనరుఁ బ్రమోదసిధ్ధి నియతంబుగ నెవ్వరి తోడి సంధి యెం
దును వికలంబు గాదు పరితోష మెరల్ప నుపన్యసింపుమా.
౪౪౭. వచనం. అని దివ్యుండు వలికిన నా దివ్యబోధనుం డిట్లనియె.
౪౪౮. ఆటవెలది. విను మహింస మేటి యనఁ జను ధర్మంబు
యాగకర్మ మెపుడు నమరఁ బండి
యుండు మనసు క్రొవ్వు ఖండింపఁగా మోద
మెసగు సుజన సంధి యెడల దెందు.
౪౪౯. తేటగీతి. అనిన నతఁడు లోకమునకు నెయ్యది దిక్కు
జలము నన్నంబు నెద్దాన సంభవించు
విషమనంగ నెయ్యది శ్రాధ్ధవిధికి నెద్ది
సమయ మనిన నిట్లని చెప్పె జన విభుండు.
౪౫౦. తేటగీతి. సజ్జనులు దిక్కు సూవె యీ సర్వమునకు
నభము ధరణియు జలము నన్నమ్ము నుద్భ
వించు నెలవులు విషమగు విప్రధనము
లనఘ శ్రాధ్ధకాలము బ్రాహ్మణాగమంబు.
౪౫౧. వచనం. అని తెలిపిన నయ్యక్షుండు ధర్మ నందనుతో మనుజుండెయ్యది పరిత్యజించి సర్వజన ప్రియుండును నిశ్శోకండును నర్ధవంతుండును సుఖియును నగు ననిన నమ్మహీపతి యిట్లనియె.
౪౫౨. తేటగీతి. సర్వ జన సమ్ముతుండగు గర్వ ముడిగి
క్రొధ మడఁచి శోకమునకుఁ గుదురు గాఁడు
వినవె యర్ధాఢ్యుఁ డగు లోభ మొనర విడిచి
తృష్ణ వర్జించి సౌఖ్యంబు తెరువుఁ గాంచు.
౪౫౩. వచనం. అనిన యనంతరంబ యద్దివ్యుండతనితోఁ బురుష శబ్ద వాచ్యుండెట్టి వాఁడు మఱి సర్వధని యగు వాఁ డెవ్వండు నిశ్చయింపు మనినఁ బాండవ జ్యేష్ఠుండిట్లనియె.
౪౫౪. కందం. దివి ముట్టి ధరణి యంతట
నివిడి మెఱయు చుండు నెవ్వని యశోరమ య
ట్టి విశిష్ట చరిత్రుఁడు య
క్షవరా పురుషుండు నాఁ బ్రకాశత నొందున్.
౪౫౫. ఆటవెలది. ప్రియము నప్రియంబుఁ బెల్లగు సౌఖ్యదుః
ఖములు భూత భావి కార్యములును
నెవ్వనికి సమంబు లివి సర్వధని యనఁ
బరగుఁ జువ్వె యట్టి భవ్యుఁ డనఘ.
౪౫౬. వచనం. అని వివరించిన విని యుధిష్ఠిరు దసఁ బ్రసాద మధురబైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు మహాత్మా మదీయంబు లైన ప్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి నీవలనం బ్రీతుండ నైతి నీతమ్ముల యందొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు మనిన నతడు.
౪౫౭. సీసం. శ్యామాంగు నారక్తజలరుహనేత్రు సాలప్రాంశు నున్నత లలితబాహు
నకులుని బ్రతికింపు నావుడు యక్షుండు భీమ ఫల్గును లతి భీమ బలులు
ప్రియులు నీకెంతయుఁ బృథివీశ వీరిలో నొకనిఁ గోరక యిట్లు నకులుఁ గోరి
తనుడు ధర్మాత్మజుం డనియెడు మాతండ్రి యగు పాండు విభునకు మగువ లిరువు
ఆటవెలది. రందు గొంతి కొడుకు లైన మువ్వురిలోన, నేను బ్రతికినాఁడ నింక మాద్రి
తనయు లిరువురందు నొక్కుండిప్డు,
బ్రతుక వలదె చెపుమ పాడి తెఱఁగు.
౪౫౮. ఆటవెలది. ధర్మనందనుండు ధర్మాత్ముఁడని యెప్డు
దగిలి జగము నన్నుఁ బొగడు చుండు
నట్ట యేను ధర్మహానికి నోర్వజు
మ్మెత వచ్చెనేని యింత నిజము.
౪౫౯. వచనం. అనిన నతండు నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి, నీ తమ్ములందఱు లబ్ధ జీవితులయ్యెద రనిన నక్షణంబ విగత క్షుత్ పిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్కనిన తెఱంగున సముత్థితు లైనం జూచి విస్మితుండై ధర్మపుత్రుండి ట్లనియె.
౪౬౦. చంపకమాల. నిను నొక యక్షమాత్రుఁడని నెమ్మి నమ్మఁగ నేర నయ్యెదన్
జననుత నీవు నిక్కముగ శక్రుడవో యలకాధిపుండవో
యనలుఁడవో సమీరుఁడవొ యట్లునుగాక జగన్నుతుండు మజ్జనకుఁడు నైన ధర్ముఁడవొ సత్కృపఁ జెప్పుము నాకు నావుఁడన్.
౪౬౧. వచనంబు. అమ్మహాత్ముండు మందస్మితననుండై.
౪౬౨. మత్తకోకిలము.
ఏను ధర్ముఁడఁజువ్వె రాజకులేంద్ర సత్యము శౌచమున్
దానముం దపమున్ శమంబును దాంతియున్ యశముం పరి
జ్డానయుక్తియు నాదు మూర్తులు సమ్మదంబున నిప్డు మ
త్సూను నుత్తమ ధార్మికున్ నినుఁ జూచు వేడుక వచ్చితిన్.
౪౬౩. వచనం. నన్నాశ్రయించిన జనంబులు దుర్గతిం బొరయరు గావున నభిమతంబులైన వరంబు లిచ్చెద నడుగు మనినఁ బాండవాగ్రజుండు సంభ్రమ భక్తి పరుండగుచు దండప్రణామంబు సేసి యద్దేవోత్తముం బ్రస్తుతించి దేవా మదీయాశ్రమ వాసుండైన భూసుర వరు నరణి యొక్క హరిణంబు చేత నపహృతంబయ్యె నతనికం గర్మలోపంబు గాకుండ నయ్యరణిం గరుణింపవే యనినఁ బ్రీతచిత్తుం డగుచు ధర్మదేవుండు.
౪౬౪. కందం. వినుమేను నీమనోగతి,
యనఘా యెఱుగంగవేఁడి యరణీ హరణం
బొనరించితి మృగ మెక్కడి
దని యమ్మహనీయ వస్తు వతనికి నిచ్చెన్.
౪౬౫. వచనం. ఇచ్చి మఱియు నిట్లనియే. పదమూఁడవ యేడు నరుదెంచె నింక మీరజ్ఞాత వాసంబు సలుప వలయు నందు మీరెవ్వ రెక్కడ నేరూపంబనం జరియింపం గోరిన నయ్యైరూపంబు లలవడియెడు నెట్లున్నను మిమ్మెవ్వరు నెఱుంగ కుండనట్లుగా వరంబిచ్చితి నింక నొండెయ్యది వలసిన నడుగు మనిన నమ్మనుజేశ్వరుండిట్లనియె.
౪౬౬. మత్తకోకిలము.
ఆదిదేవుండ వైన నీవు దయామతిం బొడసూపి న
న్నాదరించుటఁ జేసి ధన్యుఁడనైతి నింతకు నెక్కుడొం
డేది కలునె యైన నామది యెల్లవాఁడును గ్రోధమోహాదులం బెడఁబాసి ధర్మువు నంద నెక్కొనఁ జేయవే.
౪౬౭. వచనం. అనిన నద్దేవుండతనికి నవ్వరంబొసంగి యంతర్హితుండయ్యెఁ గౌంతేయులు గ్రమ్మఱి నిజాశ్రమంబు కరిగి ధరణీదేవునకు నరణీ ప్రదానంబు సేసి తత్ ప్రయుక్తాశీర్వాదంబులు గైకొని పరమానందంబునం బొందిరని యిట్లు పాండు తనయుల వనవాస ప్రకారంబు సవిస్తర మధురంబుగా నుపన్యసించి.
౪౬౮. కందం. అనఘుఁడు గృష్ణద్వైపా
యన శిష్యుఁడు బోధనిధి సమంచిత మేధా
ఘనునకుఁ బారిక్షితునకు
ననవరానంద సుఖ సమగ్రత యొసఁగెన్.
ఇక్కడితో ఆరణ్య పర్వం అయిపోయింది. ఈసందర్భంగా ఎర్రన చెప్పిన పద్యాలు కూడ అవశ్య పఠనీయాలే. నాకు వదలి వేయ బుధ్ధి కావటంలేదు.
౪౬౯. సీసం. భవ్యచరిత్రుఁ డాపస్తంభసూత్రుండు శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
సంతత ధ్యాన సంసక్త చిత్తుఁడు సూరనార్యునకును బోతమాంబికకును
నందనుఁడిల బాకనాటిలో నీలకంఠేశ్వర స్థానమై యెసక మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు ధన్యుండు ధర్మైక తత్పరాత్ముఁ
తేటగీతి. డెఱ్ఱనార్యుండు సకల లోకైక విదితుఁ
డయన నన్నయ భట్ట మహాకవీంద్రు
సరస సారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ
జెందుటయు సాధుజన హర్ష సిధ్ధిఁ గోరి.
౪౭౦. కందం. ధీరవచారుఁడు తత్కవ
తారీతియుఁ గొంత దొప దద్రచనయకా
రణ్యపర్వ శేషమున్
బూరించెఁ గవీంద్ర కర్ణ పుట పేయముగాన్.
౪౭౧. కందం. వీరావతార విమలా
చార మహోదార శుభవిచార సుజనమం
దార నవకీర్తి మౌక్తిక
హార హర పదాబ్డ మధుకరాత్మ విహారా.
౪౭౨. తరలము.
అమిత వైభవ లోబ మోహ మదాది దుర్లభ మంజువి
భ్రమ విలాసిత కామినీ జన పంచ బాణ నిరంతరా
నమద శేష నృపాల మౌళి పినధ్ధ ముగ్ధమణి ప్రభా
క్రమ సమంచిత విస్ఫురత్ పదకాంతి నిర్జిత పంకజా.
గద్యం. ఇది సకల సుకవి జన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందారణ్య పర్వంబునందు సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణ యుధ్ధంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రీ చరిత్రంబును సూర్యుండు గర్ణునకు హితోపదేశంబు సేయుటయుఁ గర్ణు జన్మంబును, నింద్రుడు విప్రరూపంబునఁ గర్ణు కవచకుండలంబులు హరించుటయు నారణేయంబును యక్ష ప్రశ్నలును ధర్ముండు ధర్మజునకు వరంబు లొసంగుటయు, నన్నది సర్వంబును సప్తమాశ్వాసము.
శ్రీమదాంధ్ర మహా భారతమునందలి యారణ్య పర్వము సమాప్తము.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
వ్యాసుడు 89 శ్లోకాలు వాడుకున్నాడు (47 వశ్లోకం నుండి 136వ శ్లోకం వరకు). ఎర్రాప్రగడ మొత్తం 36 పద్యాలు (42౩ నుండి 459 వరకు) వాడుకున్నాడు. అంటే షుమారు రెండున్నర రెట్లు కుదించినట్లు.
ఇలా పద్యాల సంఖ్యను కుదించే క్రమంలో కొన్ని ప్రశ్నలు, జవాబులు కవర్ కాలేదు. అంతే కాక పద్యకవిత్వావసరమైన ఛందస్సును పాటించ వలసి రావటం వల్ల కొంత కుదింపు జరిగి ఉండ వచ్చు. మొత్తం మీద ఎర్రన అనువాదం శైలీభేదం ఉన్నప్పటికి నన్నయకి ఏమాత్రం తీసిపోదు.
కొంత స్వంత గోల
నిజమైన బ్లాగులు (వెబ్ లాగులు) అంటేనే కొంత స్వంత గోల ఉండాలి.
ఎర్రన శ్రీవత్స గోత్రీకుడు. మేము కూడ శ్రీవత్స గోత్రీకులమే.
సగోత్రీకులు బంధువులు కారని పరిశోథకులు చెప్పారు.
సరదాగా రెండు విషయాలు వ్రాస్తున్నాను.
1. పై పద్యాలలో, ఎర్రన శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ సంతత ధ్యాన సంసక్త చిత్తుఁడ నని చెప్పాడు. ఎర్రనయందు నాకింత భక్తి ఉన్నప్పటికి ఆయనకున్న శివభక్తి నాకు అంటలేదు. అదేమి చిత్రమో, నేను నాస్తికుడ నయ్యాను.
2. నేను పూర్వాశ్రమంలో (పూర్వ జన్మ అని కూడ అనచ్చు. నా దృష్టిలో ప్రతి వృత్తీ కూడ ఒక జన్మయే. పలు జన్మలు పొందిన అదృష్టం నాకు కూడ కలిగింది.) ఒక ప్రభుత్వరంగ బ్యాంకు అధికారిగా పనిచేసిన కాలంలో మా ఒక బాస్ కూడ శ్రీవత్స గోత్రీకుడే. ఆయన బ్యాంకులో ఏవైనా ప్రారంభించాల్సి వచ్చినపుడు హిందూ(త్వ) పధ్దతిలో పురోహితులచేత పూజలు చేయించే వాడు. పూజ చేసే పురోహితులు పూజకు కూర్చున్న ఆయనను గోత్రమడిగినపుడు శ్రీవత్స గోత్రమని చెప్పేవాడు. మన పూజా మంత్రాలలో ''ఇష్ట సంకల్పాది సిధ్ధ్యర్ధం, పుత్రపౌత్రాది వృధ్ధ్యర్ధం వంటి'' సబ్మిషన్స్ ఉంటాయి.
ఒకరోజు ఏదో సంభాషణ వచ్చినపుడు నేను హాస్యానికి ఆయనతో అన్నాను. ''మీ గోత్రం, మాగోత్రం ఒకటే. బ్యాంకు ఖర్చుతో మీ వంశం(పుత్ర పౌత్రాభివృధ్ధి)తో పాటు మా వంశం కూడ అభివృధ్ధి చెందుతుంది లేండి '' అన్నాను. ఆయన నవ్వి ఊరుకున్నాడు.
తిరగవ్రాయాల్సినది ఉంది. ఈయక్ష ప్రశ్నలపై వ్యాఖ్యలను, విమర్శలను, సందేహాలను ఆహ్వానిస్తున్నాను. నేను గొప్ప నిపుణుడనేమీ కాదు. నాశక్తి కొద్ది ప్రయత్నిస్తాను. ఇందులో ఏముంది అనుకోకండి. ఈయక్ష ప్రశ్నలపై 1000 పేజీల పుస్తకం వ్రాయ వచ్చు. నాకాభాగ్యం కలుగుతుందో లేదు. ౧౧-౧౪ శతాబ్దాలకి చెందిన ఎందుకంటే కవిత్రయానికి ఉన్న శ్రధ్ధ ౨౧ శతాబ్దానికి చెందిన మనకెలా వస్తుంది?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.