Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label రాయలసీమ. Show all posts
Showing posts with label రాయలసీమ. Show all posts

Wednesday, November 2, 2022

1165 ౨౦౧౪లో చేయాల్సిన పని How did Rayalaseema crowds suddenly wake up for a separate Rayalaseema demand?

How did Rayalaseema crowds suddenly wake up for a separate Rayalaseema demand? ఆధార వార్త ఈనాడుకి, కృతజ్ఞతలతో - https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/122207120

కర్నూలులో రాష్ట్రావతరణ దినాన్ని రాయలసీమ విద్రోహ దినంగా మార్చి ఒక పెద్ద ప్రదర్శనను నిర్వహించటాన్ని పై ఈనాడు వార్తలో చూడవచ్చు.

కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలి
శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని రాయలసీమ విద్యార్థి ఐకాస నాయకులు సునీల్‌రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, ప్రశాంత్‌ పేర్కొన్నారు.


శ్రీబాగ్ ఒప్పందాన్ని ఈ ఉద్యమ నాయకులు బాగానే గుర్తుపెట్టుకున్నారు. ౧౯౩౭లో ఈ ఒప్పందం జరిగింది. ఆనాటి రాయలసీమ కోస్తాంధ్ర నాయకులు తమ మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రయత్నించారు. కుల, మత, ప్రాంత , ఇతర సదభిమానాలు, దురభిమానాలు ఆనాటి వారు మొహమాటం లేకుండా చర్చించుకొని ఉంటారు. ఆనాటి నాయకుల అంతరంగాలు మనకు తెలియవు కాబట్టి వాటిని చర్చించటం వల్ల నేటి ౨౦౨౨ తెలుగువారికి అంత ప్రయోజనం ఉంటంంది నేను అనుకోను. ముఖ్యాంశము వీకీపీడియా కోట్ ఈక్రింద ఇస్తాను-- https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AC%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D_%E0%B0%92%E0%B0%A1%E0%B0%82%E0%B0%AC%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95

--విశ్వవిద్యాలయము: రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కొరకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి.
--సాగునీటిపారుదల అభివృద్ధి: వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
--శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేసారు. రాజధాని, హైకోర్టులు చెరో ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి. ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి.

ybrao-a-donkey's personal views with no malice, and not intended to be imposed on others :



విద్యాభివృధ్ధి అంశము --౨౦౨౨ ప్రస్తుతము రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వానినీ, ప్రైవేటువీ భారీగానే ఉన్నాయి.

నీటిపారుదల అంశం -- ౨౦౨౨ పరిస్థితి --కర్నాటక ఆల్ మట్టీ , నారాయణపూర్ డాములను నిర్మించాక, అక్కడ ప్రాజెక్టులు నిండాకే మిగిలే వరదనీరే మనకి వస్తుంది. ఏట్రిబ్యునళ్ళు , ఏకోర్టులు , ఏమి చెప్పినా, ఆచరణలోకి వచ్చే సరికి కర్ర ఉన్నవాడిది బర్రె అవుతుంది. కర్నాటక , తెలంగాణలు, కోర్టు తీర్పులను కానీ, కేంద్ర ప్రభుత్వ లేఖలను గానీ, లెక్క చేయవు. ఈవిషయంలో మనం ఎంత గొంతు చించుకున్నా అతి వరదలు వస్తే తప్ప మనకు సెప్టెంబరుదాకా నీళ్ళు రావు. కనుక రాయలసీమకైనా, కృష్ణా పెన్నా డెల్టాలకైనా, గోదావరీ జలాలను మళ్ళించుకోటమే దిక్కు. ఈసందర్భంగా, ఉత్తరాంధ్రను కూడ కలుపుకొని వెళ్ళాలి. అంటే గోదావరినీరు ఉత్తరాన ఇచ్ఛాపురం వరకు పారాలి. దక్షిణరాయలసీమకు చివరిదాకా వెళ్ళాలి. దక్షిణ కోస్తాలో తడవరకూ వెళ్ళాలి. ము అదృష్టం ఏమిటంటే, ౨౦౨౨ పరిస్థితి ప్రకారం, మనకు గోదావరిలో శబరీ నదిద్వారా, వరదనీరు పుష్కలంగా లభిస్తుంది. ఇది ఉత్తరాంధ్రకు, కృష్ణ పెన్నా డెల్టాలకు, రాయలసీమకు ప్రాణం పోస్తుంది. మనము రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర రాష్ట్రాలుగా విడిపోయినా లేక కలిసి ఉన్నా, నీటిపారుదల విషయంలో తన్నుకుంటే అందరికీ నష్టమే. ఎందుకంటే, తెలంగాణ, కర్నాటకలకు చులకన అవుతాము. అంతే కాక శబరి మొ. నదులపై, ఒరిస్సా ఎగువలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలను త్రోసి పుచ్చలేము.

రాజధాని / హైకోర్టు అంశం-- మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధానిగా, గుంటూరు హైకోర్టుగా ఉండేది. రాజధాని గుడారాన్ని, హైకోర్టు గుడారాన్నీ హైదరాబాదుకు తరలించకుకుపోటంలో నాటి నాయకుల కులమతప్రాంతీయ సమస్త కుమ్ములాటలూ తమ పాత్ర ఫోషించాయి అనేది నా నమ్మకం. ౨౦౧౪లో శేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినపుడు, పాత చరిత్రను గుర్తుకు తెచ్చుకుని కర్నూలులో రాజధానినీ , గుంటూరులో హైకోర్టునూ ఏర్పరచుకుంటే మనం మన శ్రీబాగ్ ౧౯౩౭ నాయకులను గౌరవించినట్టు అయ్యేది. కొంత ఆలస్యం అయినా, అందరూ ఏదో విధంగా సర్దుకు పోయే వాళ్ళేమో. గౌ. శ్రీ చంద్రబాబుకు, ఆయన మనసులో ఏముందో ఏమో కానీ, ఆయన శ్రీబాగ్ ఒడంబడికను పట్టించుకోలేదు. ౨౦౧౪ రాయలసీమ నాయకులు, విద్యార్ధులు, అందరూ ఈరోజు చేసిన ఉద్యమాన్ని పట్టుదలగా ఆనాడే చేసి ఉండాల్సింది. ఆలస్యం అమృతం విషం అంటే అదే.

కర్నూలులో కాకపోయినా , కనీసం ఒంగోలు, కావలి ప్రాంతాలలో రాజధానిని పెట్టుకున్నా, అందరికీ అందుబాటులో ఉండేది. గుంటూరు కర్నూలు రైలు, రోడ్డు మార్గాలలో కొంత ఘాటు రోడ్డు, సొరంగాలూ ఉన్నాయి. అందువల్ల విశాఖ వారికి కర్నూలు వెళ్ళటం కొంత ఇబ్బంది. అదే, కావలి, ఒంగోలు, మార్కాపురం, దొనకొండ, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలు కూడ ఈసమస్యకు పరిష్కారాలే.

గుంటూరులో హైకోర్టు ఉన్నంత మాత్రాన కర్నూలు లో హైకోర్టు బెంచి, విశాఖలో హైకోర్టు బెంచిలను సుప్రీం కోర్టు అనుమతితో తేలికగానే ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఉద్యమాలు అవసరం లేదు.

ఇపుడు జరిగిన ఘోరమైన తప్పిదము ఏమిటంటే, అమరావతి ప్రజలకు ఆశలు కల్పించి ౨౫౦౦౦ రైతులనుండి వారి సారవంతమైన భూములను గుంజుకున్నాము. అక్కడ రోడ్లు వేసి, హైకోర్టును, సచివాలయాన్ని (తాత్కాలిక) నిర్మించటం వల్ల వాటిని తీసేసి వ్యవసాయభూములుగా అక్కడ ప్రజలకు ౩౪౦౦౦ ఎకరాలు తిరిగి ఇవ్వటం అసాధ్యం. అలాచేయాలంటే స్వర్గీయ కెఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వాళ్ళు కావాలి. ఆ ప్రజంలందరికి, సుప్రీం కోర్టు, మరియు హైకోర్టులు నిర్ణయించిన పరిహారం, కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. శ్రీ జగన్, శ్రీ చంద్రబాబులు తమ ఆస్తులను అమ్మి ప్రజలకు పరిహారం చెల్లించరు కదా. కనుక ఎవరికి ఇష్టం ఉన్నా , లేకపోయిన రాజధానిని అమరావతిలో కొనసాగిస్తూ స్వల్పపెట్టుబడులతో అయినా రాజధానిని కనీస సౌకర్యాలతో నిర్వహిస్తూ, ఒక ౨౦ ఏళ్ళు కృషిచేస్తే అమరావతి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ తరువాత, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాలలో ఏర్పరుచుకోవచ్చు. ఈలోగా, అక్కడ కూడ, కొంత ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను ఏర్పాటు చేసుకుని ౨౦౫౦ నాటికి మూడు రాష్ట్రాలుగా మారచ్చు.

అక్టోబరు ౩౦ ౨౦౧౩, అంటే సరిగా తొమ్మిది ఏళ్ళ క్రితం నేను ఇక్కడే నూడు రాజధానుల గురించి వ్రాసాను. ఆనాడు ఏమి వ్రాసానో చదవాలనుకునేవారికి లింకు https://problemsoftelugus.blogspot.com/search/label/033

ఇంకా కొనసాగించాలి.

Friday, May 1, 2015

493 Part 2 of A.P. High Court location भाग २: ऎपी है कोर्ट संस्थापना భాగం 2: ఎపీ హైకోర్టు సంస్థాపన



Link for those who want to see the background, forming Part 1 of this post: भाग १ देखना कांक्षी विज्ञ पाठक के लिये लिंक మొదటి భాగాన్ని చూడాలనుకునే వారికి లింకు:
Click to go to http://problemsoftelugus.blogspot.com/search/label/456

Context: 01.05.2015. Decision of Andhra Pradesh High Court that Telangana and Andhra Pradesh would have a common high court until a high court is constituted for Andhra Pradesh.

संदर्भ: ०१.०५.२०१५. सूचना के अनुसार, आंध्र प्रदेश राज्य में प्रत्येक हाइकोर्ट स्थापित होने तक, तॆलंगाण और आंध्र प्रदेश के कामन हाइकोर्ट रहेगा।

సందర్భం: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టు నెలకొల్ప బడేదాకా, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ ల ఉమ్మడి హై కోర్టు కొనసాగుతుంది, అని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిర్ణయించిన వేళ.

ybrao-a-donkey's humble perceptions वैबीराव गधे के विनम्र अनुशीलनाएँ और भावनाएँ వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు

Telangana State Govt., Telangana leaders, encourage Telangana lawyers to hate the lawyers of Residual Andhra Pradesh. At any point of time, violent squirmishes are possible between the two sides, a la the lathi battle which took place between Telangana POlice and the Residual A.P. Police at Nagarjuna Sagar Dam.

तॆलंगाणा राज्य सरकार, तॆलंगाणा नेता लोग, तॆलंगाणा लायर्स को शेषीभूत आंध्र प्रदेश के लायर्स को द्वेष करने में प्रोत्साह देना बहुत दिनों से चालू है। इसको रोकना किस का काम है ? आंध्र प्रदेश हैकोर्ट के नाय्य मूर्ती महाजन निस्सहाय दिख रहे हैं, क्योंकि उनके निर्णयों को तॆलंगाणा सरकार कहाँ तक अमल करेगा, यह प्रश्नार्धक विषय है। केंद्र सरकार के होम शाखा मंत्रि वर्य और अधिकार गण, हमारे तिरुमल यात्रा गवर्नर् साहॆब इसको रोकना है, लेकिन उनको अपने धर्म और कर्तव्य के बारे में श्रध्धा कम दिख रहा है।

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ నేతలు, తెలంగాణ న్యాయవాదులను శేషాంధ్ర ప్రదేశ్ న్యాయవాదులను ద్వేషించేలా ప్రోత్సహించటం చాల కాలం నుండి జరుగుతున్నది. ఏక్షణంలో నయినా ఇరు ప్రాంతాల న్యాయవాదుల మధ్య కొట్లాటలు చెలరేగే అవకాశం ఉంది. కొన్ని నెల్ల క్రితం తెలంగాణ పోలీసులకు, శేషాంధ్ర పోలీసులకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద లాఠీలతో కొట్లాట జరిగిన విషయాలు మనం మరువ రాదు. వీటిని ఆపాల్సిన పని ఎవరిది ? ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు నిస్సహాయులుగా ఉన్నట్లు కనపడుతున్నది. ఎందుకంటే, వారి ఆజ్ఞలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ న్యాయవాదులు, తె. పోలీసులు ఎంతవరకు మన్నిస్తారో అనుమానాస్పదం. కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రి, ఆయన అధికార గణం, మన తీర్ధ యాత్రిక గవర్నర్ గారు వీటిని ఆపాల్సి ఉంది, కాని వారికి తమ కర్తవ్య నిర్వహణపై అంత శ్రధ్ధ ఉన్నట్లు తోచదు.

ఒక పరిష్కారం. One solution. एक सुलझाव

शेष ऎपी है कोर्ट को तिरुपती में स्थापित करना। श्री वेंकटेश्वरा विश्व विद्यालय के ग्रंथालय को यूनिवर्सिटी को परिहार दे कर या लीज लेकर उपयोग कर सकते हैं।

శేషీభూత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును తిరుపతిలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ లైబ్రరీ భవనాన్ని కొని గానీ, లేక లీజుకి తీసుకుని గానీ ఎపీ హైకోర్టును నెలకొల్ప వచ్చు.

Benefits: Regional Justice to Rayalaseema; रायल सीमा को प्रांतीय न्याय। రాయలసీమకు ప్రాంతీయ న్యాయము.
Convenient for Supreme Judges to supervise the functioning of AP High Court. Convenient for every Supreme Court Judge to do their pilgrimages to Tirumala. They can combine their Court work and God work, for efficiency and effectiveness.

सुप्रीं कोर्ट न्याय मूर्ती महाजन अपने विश्वासों के अनुसार, हर साल तिरुमल संदर्शन करते रहते हैं। वे अपने कोर्ट कामों और दैव कार्यों को मिला कर समर्धता और कार्य साधकता के प्रभाव शीलता को द्विगुणीकृत कर सकते।

రాయలసీమకు, ఉత్తర ఆంధ్రకు నిజంగా న్యాయం జరగటమే కాకుండా, అన్యాయం జరుగుతున్నదన్న అభిప్రాయం కలగకుండా, దీనిని ప్రాంతీయ నేతలు రెచ్చగొట్టకుండా చూసుకోవాల్సిన విధి ఒకటున్నది.

Renigunta Airport is nearby. Chennai Airport is also nearby.

रेणीगुंटा हवाई अड्डा नजदीक है। चॆन्नै हवाई अड्डा भी नजदीक है।

Most people of Sesh Andhra Pradesh visit Tirupati Tirumala regularly. They can combine their Court work and God work, for efficiency and effectiveness.

शेषीभूत आंध्र प्रदेश के जनता हर साल तिरुमल संदर्शन करते रहते हैं। वे अपने कोर्ट कामों और दैव कार्यों को मिला कर समर्धता और कार्य साधकता के प्रभाव शीलता को द्विगुणीकृत कर सकते।

We can reduce congestion in the new Capital City Amaravati Tulluru Vijayavada Guntur Tenali.

शेष आंध्र प्रदेश राजधानी रीजियन या ने अमरावती तुळ्ळूरु विजयवाडा गुंटूर तॆनालि मॆं भीड-भाड को हम कर सकते हैं।

మనం శేషాంధ్ర ప్రదేశ్ క్రొత్త రాజధాని అమరావతి తుళ్ళూరు విజయవాడ గుంటూరు తెనాలి లో జన సమ్మర్ధాన్ని కొంతైనా అదుపులో పెట్టుకోవచ్చు.

Convenient for pilgrim Governors. यात्रिक राज्य पालों को तिरुमला दर्शन आसान हो जायॆगा।


(To continue & revise as may be necessary. सशेष. पुनः संस्करण करने का है। ఇంకా ఉంది. తిరగవ్రాయాలి కూడాను. సూచనలకు స్వాగతం.)

Sunday, September 28, 2014

358 విసుగెత్తించినా మరల మరల వ్రాయక తప్పటం లేదు, మనకు నాలుగు రాష్ట్రాలు అవసరమే

358 విసుగెత్తించినా మరల మరల వ్రాయక తప్పటం లేదు, మనకు నాలుగు రాష్ట్రాలు అవసరమే
చర్చనీయాంశాలు   358, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంద్ఱ, రాజధాని

ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడుగారు భూకబ్జా నేతలు, రియాల్టర్లు, బిల్డర్ల గుప్పిట్లో ఇరుక్కుని రాజధానిని నియంతృత్వ పధ్ధతులలో విజయవాడ పరిసరాలలో నెలకొల్పటానికి పూనుకోటం దురదృష్టకరం.

కృష్ణా నదికిరుప్రక్కలా ఉన్న భూములను ముఖ్యమంత్రిగారు బినామీగా కాకపోయినా, ఆయన చుట్టూ ఉన్నవారు చేజిక్కించుకొని తమ తమ వ్యాపారాలకొరకు బెల్లం చుట్టూ ఈగల్లాగా రాజధాని చుట్టూ చేరటం విచారకరం.

కృష్ణానదిలోకి ఇపుడు విడుదల అవుతున్న హైదరాబాదు డ్రెయినేజి (సరిగా ట్రీట్ చేయబడకుండా నురగలతో, మూసీనది ద్వారా వస్తుంది) తోనే ఇపుడు జనం రోగాలతో చస్తున్నారు.  ఇంక కొత్తరాజధాని డ్రెయినేజీలను కూడ కృష్ణానదిలోకి వదిలితే ఆహా సొగసు చూసి తీరవలసినదే.

చాలా మందికి తెలిసి కూడ పట్టించుకోని విషయాలు. విజయావాడలోని మూడు కాలువలోకి మునిసిపల్ డ్రైనేజీని వదలటం వల్ల అవి మురికి కూపాలుగా మారాయి.

ప్రజలు  యాభయి గజాల స్తలాలకి కూడ నోచుకోక, కొండకొమ్ములలో కూడ ఇళ్ళు కట్టుకున్నారు.  మొగల్రాజపురం, గుణదల, తాడేపల్లి, వన్ టౌన్  మాచవరం ప్రాంతాలలో ఎప్పుడు కొండచరియలు విరిగి పడతాయో ఎవరికీ తెలియదు.  వన్ టౌన్ లో డ్రెయినేజి అదుపుతప్పింది.

విజయవాడ గుంటూరులలో భూకబ్జా మాఫియాలు, ఇతర కిరాయి హంతక ముఠాలు, తమరాజ్యాలను ఇప్పటికే పాలిస్తున్న విషయం అందరికీ తెలుసు.  అవి రాజధాని ఇంకా పెద్దదయ్యే కొలదీ పేట్రేగక మానవు.  వాటిని ఎన్ని క్లోజ్ డ్ సర్క్యూట్ కెమెరాలను పెట్టినా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లను నెలకొల్పినా  ఎవరూ ఆపలేరు.

ఈస్థితిలో విజయవాడ గుంటూరులపై అదనపు భారాన్ని మోపటం ఏమాత్రం సమంజసం కాదు.

ఇప్పటికే విజయవాడ , గుంటూరు, అమరావతి, మంగళగిరి, తెనాలి మధ్య వ్యవసాయభూములను దున్నేసి ప్లాట్లు వేయటం గమనార్హం.

శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లుగా మార్టూరు, దొనకొండ, వినుకొండ ప్రాంతాలలో నే కాక, నేను చెప్పినట్లుగా నాగార్జునసాగర్  విజయపురి సౌత్, లేక దిగువమెట్ట, నందికొట్కూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరు వంటి ప్రాంతాలలో రాజధానిని నెలకొల్పుకుంటే రాయలసీమకి న్యాయం చేసినట్లుండేది.  అటవీ భూములు, వ్యవసాయయోగ్యంగాని వృధా భూములు ఉచితంగా లభిస్తాయి కాబట్టి, పెట్టుబడిదారీ వికారాలు, లంపటాలూ లేకుండా,  రాష్ట్రరాజధానిని షెడ్లలో నెలకొల్పుకున్నా  దొంగమాటల మోడీని, అరుణ్ జైట్లీని, వెంకయ్యనాయుడు లను బిచ్చమెత్తకుండా తక్కువ ఖర్చుతో మనకు రాజధాని అమరేది.  మనం ఇతర కొత్త చిన్న రాష్ట్రాలకు ఆదర్శాన్ని చూపగలిగే వాళ్లం.

లేక, కొంత మేరకైనా పక్వం చెందిన రాజకీయవేత్త శ్రీ పాలడుగు వెంకట్రావు (ఆయన తప్పుడు పార్టీలో ఉండ వచ్చు) చెప్పినట్లుగా నూజివీడు సమీప ప్రభుత్వ భూములలో రాజధానిని నెలకొల్పుకున్నా, రైతుల భూములను గుంజుకోకుండ జాతీయ రహదారికి మరియు కలకత్తా మద్రాసు రైలుమార్గానికి దగ్గరగా సెటిల్ అయ్యే వాళ్ళం.

ఎలాగైనా ఒకమాట తథ్యం.  మనకు మూడు రాష్ట్రాలు కావాలి.  మొదటిది రాయలసీమ. రెండవది ఉత్తరాంధ్ర. మూడవది దక్షిణాంధ్ర.  నెల్లూరులొని కొంత భాగాన్ని రాయలసీమలో కలిపే విషయాన్ని కూడ పరిశీలించు కోవచ్చు.

చంద్రబాబు, జగన్ ల నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నేడు కాకపోయినా అనతి కాలం లోనే ప్రత్యేక రాష్ట్రోద్యమాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  అది జరగక ముందే, కొత్తాంధ్రప్రదేశ్  రాష్ట్ర శాసనసభ సమావేశమయి కేంద్రాన్ని మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయవలసినదిగా తీర్మానంచేసి పంపాలి.  ఎంపీలు, ఎంఎల్ ఏలు సమావేశమయి, ఐక్యకార్యాచరణ జరపాలి.

ఈనాటి వీడియో, శివరంజని రాగంలో లిజనింగ్ ఎక్సర్సైజ్ (ఇయర్ ట్రెయినింగ్).






Wednesday, July 16, 2014

301 A Chief Minister resembling Jada Bharata.


301 జడ భరతుడిని పోలిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చర్చనీయాంశాలు: 301, చంద్రబాబు, రాజధాని, జడభరతుడు, రాయలసీమ, శ్రీబాగ్ఒప్పందం
తెలియని పాఠకుల కొరకు: మన భారత దేశంలో భరతుళ్ళు నలుగురు ఉన్నారు.
1. శకుంతలా దుష్యంతుల పుత్రుడు భరతుడు. ఈయన పేరుమీదనే హిందూస్థాన్ కి భారత దేశం అనే పేరు వచ్చింది అంటారు. ఈ భరతుడు గారు చిన్నతనంలో సింహాలతో ఆటలు ఆడేవాడు.
2. రాముడి తమ్ముడు భరతుడు. ఇతడు ధర్మనిరతుడు అని ప్రఖ్యాతి.
3. మూడవవాడు భరత ముని. ఈయన పేరు మీదే భరత నాట్యం వచ్చింది , అంటారు.

4. నాలుగవ వాడు జడ భరతుడు. ఈయన ఒక ముని. ఎంతో ప్రేమతో జింకను పెంచుకుంటూ, ఆజింకపై మోహం వీడలేక , సంగాన్ని వదిలించుకోలేక ప్రాణం వదిలాడు. మరు జన్మలో జింకగా పుట్టాడుట.

మన వెన్నుపోటు సార్వభౌమ, అవకాశవాద ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మొదటి ముగ్గురితో పోల్చటానికి కావలసిన ఉపమాలంకార శోభాయమాన సమాన ధర్మాలు లేవు. నాలుగవ వాడైన జడభరతుడితో పోల్చటానికి ఒక సమాన ధర్మం కనిపిస్తుంది. అయ్యదియే, వీడని మోహం, వదలని సంగం.

మోహం దేనిపైన


హైదరాబాదు నగరం పైన. ఉద్యోగులు అంతా ఆంధ్రప్రదేశ్ నుండే పనిచేయాలని కోరుకుంటున్నారని, శ్రీవారే చెప్పారు. తాను టెంట్లనుండికూడ పని చేయటానికి వెనుకాడనని తానే చెప్పుకున్నారు. షెడ్లైనా మేలేనని, గతంలో వివేకవాన్ సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ పాలడుగు వెంకటరావు గారు సలహా ఇచ్చి కూడ ఎన్నో నెలలు గడిచింది. అయినా, శ్రీచంద్రబాబు నాయుడు గారు హైదరాబాదునుండి కదలటానికి ముందుకు రావటంలేదు.

ఈమధ్య హైదరాబాదులో శ్రీ రామ దూత స్వామి అనే ఆయన చేసిన యజ్ఞానికి కూడ వెళ్ళి వచ్చారు. సికిందరాబాదు ఉజ్జయినీ మహాకాళీ దేవాలయానికి కూడ వెళ్ళి వచ్చారు.
శ్రీ చంద్రబాబు నాయుడుగారికి హైదరాబాదులో ఎన్ని వందలకోట్ల రూపాయల, ఎకరాల ఆస్తులు ఉన్నాయో కానీ, ఆయన హైదరాబాదుపై వ్యామోహం వదలలేకున్నాడు. కెసిఆర్, కెటీఆర్, హరీష్ రావుల బారినుండి, తన ఆస్తులను రక్షించుకోటానికి, ఆయన తపన పడుతున్నట్లు కనిపిస్తుంది. కెసిఆర్, కెటీఆర్, హరీష్ లు శ్రీచంద్రబాబుని గెస్టు గెస్టుగా ఉండాలని ఏడిపిస్తున్నారే తప్ప, తాము ఎన్నోరోజల నుండి బయట పెడ్తాం అంటున్న, బాబుగారి బినామీ ఆస్తుల వివరాలను బయట పెట్టటం లేదు. సాక్ష్యాలేమైనా ఉంటే బయట పెట్టి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాస్తే, కెసిఆర్ & కో వాళ్ళు తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు కదా.
లెజెండరీ జడ భరతుడిలాగా హైదరాబాదుపై వ్యామోహం వదలని శ్రీ చంద్రబాబు, వచ్చే జన్మలో పాతడేట్ ముల్కీగా పుడ్తారా లేదా అనే ప్రశ్న కన్నా, ఆయనను హైదరాబాదు నుండి కదిలించి, సీమాంధ్రకు తరలించి తెచ్చి రాష్ట్ర పాలనను సీమాంధ్రనుండి చేపట్టేలాగా చేయటం ముఖ్యం.






అవకాశ వాది యైన శ్రీచంద్రబాబు నాయుడు గారు, రాజధాని విషయంలో, 1937 శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా, రాయలసీమకు రాజధానిని ఇస్తామని కోస్తాంధ్రులు చేసిన వాగ్దానాన్నే మరచిపోయారు.

మానవ జీవితంలో అన్నింటికన్నా కష్టమైనది, చేసిన వాగ్దానాన్ని నిలుపుకోటం. కారణం ఏమైనప్పటికీ, 1937 నాటి కోస్తాంధ్ర నేతలు, రాయలసీమకు రాజధానిని ఇస్తామని వాగ్దానం చేసారు. అలా ఇచ్చినందు వల్ల కోస్తాంధ్రకు పెద్ద నష్టం కూడ ఏమీ లేదు. వాగ్దానం నిలుపకోటం వల్ల తెలుగు జాతి ప్రతిష్ఠ పెరుగుతుంది.

రాజధానిని రాయలసీమలో నెలకొల్పటం వల్ల వచ్చే ప్రధాన సమస్య, కోస్తానుండి కొత్తరాజధానికి జరగబోయే భూస్పెక్యులేటర్ల, వలసలు. ఇది కాక పొట్టకోసం లక్షలాది మంది అన్ స్కిల్ డ్, సెమీ స్కిల్ డ్, స్కిల్ డ్ వర్కర్లు, కోస్తానుండి రాయలసీమకు వలస వెళ్తారు. దీనిని ఎవరూ ఆపలేరు. ఇది వారి జన్మహక్కు. (వలస శ్రామికుల జన్మ హక్కు, మానవ హక్కు).

ఈ సమస్యకు ఏకైక పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ రాజధానిని పూర్తిగా పదేళ్ళకు పరిమితమైన తాత్కాలిక రాజధానిగా ప్రకటించి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేయటమే. ఇది చంద్రబాబుకు, కిరణ్ కుమారుడికి, జగన్మోహన్ రెడ్డి కీ ఇష్టం ఉండదు. కాని తెలుగు ప్రజల దీర్ఘకాలిక సంక్షేమానికి ఇది అనివార్యం.

Monday, July 7, 2014

291 Left leaders can never behave like Regional leaders


291 వామ పక్షనేతలు ప్రాంతీయనేతల వలె మాట్లాడటం వామపక్ష సిధ్ధాంతాలకు వ్యతిరేకం.
చర్చనీయాంశాలు: 291, వామపక్షాలు, రాయలసీమ, సిపిఎమ్, సిపిఐ, కోస్తా, రామ్ టెక్


ఆంధ్ర ప్రదేశ్ సీపీఎమ్ ప్రధానకార్యదర్శి, మరియు పోలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ బివిరాఘవులుగారు ''ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు '' అనే సభలో అన్నట్లుగా పత్రికలలో వచ్చిన వార్తను చూడండి.







''...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే అయినప్పటికీ, అక్కడి ప్రజలకు సమన్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ...''

English gist: "...Though Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, Opposition Leader Jaganmohan Reddy, both belong to Rayalaseema, there is no faith that justice will take place to those people. ..."







వైబీరావు గాడిద అభిప్రాయాలు



ఈ మాటలు ఒక ప్రాంతీయ పార్టీ నేత మాట్లాడవలసినవే కానీ, అఖిల భారత పార్టీకి చెందిన నేత మాట్లాడవలసినవి కాదు. ముఖ్యంగా వామ పక్షనేతలు మాట్లాడ వలసినవి కాదు.

అఖిలభారత పార్టీల నేతలు ప్రాంతీయ సమన్యాయం కొరకై కృషి చేయటంలో, వాదించటంలో తప్పు లేదు. కానీ, ముఖ్యమంత్రులు ఒక ప్రాంతానికి చెందిన వారు కాబట్టి వారు ఆప్రాంతానికి దోచిపెట్టటం, అభివృధ్ధి ప్రాజెక్టులను మళ్ళించటం సరియైన పధ్దతి కాదు. ఇలాంటి తమ నియోజక వర్గాలకు నిధులను , ప్రాజెక్టులను దోచిపెట్టే పధ్ధతిని అమలు చేసి, మనకి ఆదర్శంగా ఉండాల్సిన అగ్రనేతలైన సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు, తమతమ నియోజక వర్గాలలో తమ విజయాలను ఖాయం చేసుకున్నారు , కానీ తాము చేస్తున్న విద్రోహం తమను ప్రాంతీయ నేతల స్థాయికి దిగజారుస్తున్న సంగతి మర్చిపోయారు.
ఈ పధ్ధతులకు స్వర్గీయ పివి నరశింహారావు కొంత మినహాయింపు గా ఉండేవారు. అందుకే, ఆయన ఒకే నియోజక వర్గం నుండి రెండు సార్లు గెలవటం కష్టమైపోయి మహారాష్ట్ర రామ్ టెక్ నుండి పోటీ చేసినట్లు గుర్తు.






నిజంగా అఖిల భారత నేతగా జీవించటం వేరు, నటించటం వేరు


శ్రీ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండగా, కొందరు తెలంగాణ నేతలు ఆయనను కలిసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి అడుగగా, నేను భారత దేశానికి మంత్రిని కానీ, తెలంగాణకు మంత్రిని గాను అన్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత ఆమహనీయుడే, తనకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి బంగారు పళ్ళెంలో లభిస్తుందనే ఆశ కలిగే సరికి ప్రాంతీయనేతగా మారిపోయి ప్లేటు మార్చేశాడు.









వామ పక్షాలకు వామ పక్షాల సిధ్ధాంతాలు ప్రాధాన్యం కావాలి, ప్రాంతీయ రెచ్చ గొట్టుడులు కాదు



వామ పక్ష పార్టీల ప్రధాన సిధ్ధాంతం సామ్యవాదం. ఇందులో కీలకం ప్రైవేటు ఆస్తిని నిర్మూలించటం. ధనం యొక్క పాత్రను సమూలంగా పెరికి వేయటం. అసమానతలను కూకటి వేళ్ళతో పెకలించటం. ప్రాంతీయవాదం పై దృష్టి పెరిగిన కొద్దీ మూలసిధ్ధాంతం మూల పడుతుంది. దురదృష్టవశాత్తూ, కాంగ్రెస్ వలెనే, కమ్యూనిస్టులు కూడ మైనారిటీ వోట్లకోసం తహతహలాడుతూ కొంత మతాన్ని నెత్తిన రుద్దుకోటం జరుగుతున్నది. ఫలితంగా, హిందువులందరు, బిజెపి దిశగా వెళ్ళటం జరిగింది. కమ్యూనిజం ప్రకారం మతం అనేది పేదలు తమ బాధలను మర్చిపోవటానికి పెట్టుబడిదారులు వాడే మత్తు మందు. భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తులు, గుడులు, చర్చీలు, మశీదులు మొ|| ప్రార్ధనా మందిరాలు కట్టిస్తుంటే, పేదలు వాటిలోకి వెళ్ళి ఉన్నాడో లేడో నిర్ధారించబడని దేవుడిని ఎలుగెత్తి ప్రార్ధించుకుంటూ, తమ కష్టాలు ఏనాటికైనా తీరతాయిలే అనే ఆశతోనే చివర రోజులు గడపటం జరుగుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు మతాన్ని ఇంటిలోపల జరిగే ప్రార్ధనలకే పరిమితం చేయించే దిశలో ప్రజలకు నచ్చచెప్పాలి. దీని వల్ల సామూహిక స్థలాలలో మతవైషమ్యాలు పెరగవు.

ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేది కూడ భూస్వాములు, పెద్ద వర్తకులు, పారిశ్రామిక వేత్తలు, ఘరానా డాక్టర్ లాయర్ యాక్టర్ వంటి ప్రొఫెషనల్సే. వామపక్షాలు వీటికి దూరంగా ఉండాలి. ఉదాహరణకు, సిపిఐ శ్రీనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో అతిగా పాల్గొని చివరికి ఏమి సాధించారు? ఆంధ్రలో వామ పక్షాల స్థితి ఎలా ఉందో తెలంగాణలో కూడ అలానే ఉంది. శ్రీరాఘవులు గారు ఈ సత్యాన్ని గ్రహించక పోతే ఎండమావులలో నీళ్ళున్నాయనుకుని పరుగెత్తి సృహ కోల్పోయి నట్లవుతుంది. శక్తియుక్తులను ప్రాంతీయ, కుల, మత, స్థానిక సమస్యలపై వృధా చేసుకోకుండా, ఏకోన్ముఖంగా కృషి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్న: వామ పక్షాల ఐక్యత అవసరమా?


దేశంలో ఒకటే వామ పక్షం (లేక వామ పక్షాల ఫ్రంటు) ఉంటే ప్రజలు దానితో అసంతృప్తి చెందితే ఎవరికి పట్టం కట్టాలి? బెంగాల్ లో జరిగిందిదే. ప్రధాన ప్రతి పక్షం కూడ వామ పక్షమే అయితే, ఎవరు గెలిచినా కర్షక కార్మిక వర్గమే అధికారంలోకి వస్తుంది కాబట్టి, శ్రామిక వర్గ నియంతృత్వం (dictatorship of proletariat) సాక్షాత్కారమవుతుంది. అందుకని శ్రీ ప్రకాశ్ కారత్ గారు, శ్రీ సీతారాం ఏచూరి గారు, శ్రీరాఘవులు గారు, శ్రీ నారాయణ గారు, ఈ వామ పక్షాల ఐక్యత, ఒకే తాటి క్రిందికి రావాలి అనే అరిగిపోయిన రికార్డును వదిలేసి వామపక్షాలమధ్యే ప్రధానపోటీ అనే కొత్త సిధ్ధాంతానికి ఊపిరి పోయాలి. భూస్వామ్య పార్టీలను, పారిశ్రామికవేత్తల పార్టీలను, రంగంనుండి తప్పుకునేలాగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి.

కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లా లు రాయలసీమ కన్నా ఎక్కువ అభివృధ్ధి చెందాయా?



జవాబు: ఇది ఒక భ్రమ. ఈనాలుగు జిల్లాలలో జనాభా వత్తిడి అధికంగా ఉండటం వల్ల, గ్రామాలు దగ్గర దగ్గరగా ఉండటం, గ్రామాలు పట్టణాలుగా మారటం జరిగినందు వల్ల, వీధిలైట్లూ, ఇళ్ళల్లో లైట్లూ ఎక్కువగా వెలుగుతూ ఉండటం, జనాభాకు తగినట్లుగా అధిక సంఖ్యలో దుకాణాలు ఎక్కువగా ఉండటం, రహదారుల వెంట ధాబాలు, వైన్ షాపులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఏదో అభివృధ్ధి జరిగిందన్న భ్రమ కలుగుతుంది. ఇళ్ళు, జనం ఎక్కువగా ఉంటే అభివృధ్ధి జరిగింది, ఇంక ఈప్రాంతంలో పేదలు లేరు, లేక ఈపేదలకు ఏమీ చేయనక్కరలేదు అనుకుంటే, అది ఘోర తప్పిదమవుతుంది.

ఈమధ్య నేను, బాగా అభివృధ్ధి చెందిన జిల్లాలుగా ముద్రబడిన తూగోజీ, పగోజీ లలోని అమలాపురం, తణుకు పట్టణాలలో ఇళ్ళు , అపార్టుమెంట్ల నిర్మాణాలపై ఒక సర్వే చేశాను. దానిలో బయట పడిన విషయం విస్మయకరమైనది.

దేశంలో వ్యవసాయయోగ్యమైన భూమికి కరువుగా ఉన్నందున, అందులోను గోదావరి డెల్టా వంటి గ్యారంటీ సాగునీరు ఉన్న భూములకు డిమాండు విపరీతంగా ఉన్నందున భూముల ధరలకు, కౌళ్ళకు రెక్కలు వచ్చాయి. కొన్ని చోట్ల ఎకరం కోటి రూపాయల దాకా పోయింది. కాని వరిసాగు చేస్తే బురదలోకి తాము దిగాల్సిరావటం భూస్వాములకు, మధ్యస్థాయి రైతులకు రుచించలేదు. వారు తెలివిగా, తమ భూములలో ఒక ఎకరాని అధిక ధరకు అమ్ముకొని కొన్ని లక్షలరూపాయలు వస్తే, వాటిలో ఒక 20 లక్షలు దాకా ఖర్చు చేసి తణుకు, అమలాపురం, భీమవరం, రావులపాలెం, రాజమండ్రి వంటి పట్టణాలలో, ఫ్లాట్లు, ఇండిపెండెంట్లు ఇళ్ళు తీసుకొని పిల్లలను ఘరానా ప్రైవేటు స్కూళ్ళలో చేర్చి , ఇంట్లో ఏసీలు బిగించుకొని ఘరానా జీవనం మొదలు పెట్టారు. పొలం అమ్మిన డబ్బులను వడ్డికి తిప్పుతూ, లేక బ్యాంకుల్లోనో, చిట్ ఫండ్లలోనో వేసి నెలవారీ వడ్డీ తింటం, నెలకు 6 వేలు 7 వేలు వచ్చే ఇస్త్రీ గుడ్డలు నలగని ఉద్యోగాలు, వృత్తుల్లోకి దిగటం జరుగుతున్నది. గ్రామాలలో, మిగిలిన పొలాన్ని కౌలుకు తీసుకున్న కౌలురైతులు కౌలు చెల్లించలేక చస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఋణ మాఫీలు వంటివి ఇస్తే వాటిని కూడ పట్టణాల లోని యజమానులు స్వాహా చేస్తున్నారు.

కోస్తా జిల్లాలలోని (కొందరు) భూస్వాములకి, వ్యాపారులకి, పారిశ్రామిక వేత్తలకి మన చంద్రబాబు నాయుడిగారాలాగా, నరేంద్రమోడీగారి లాగా '' షో '' ఎక్కువ, కోతలు ఎక్కువ, పని చేయటం తక్కువ. సినిమా రంగంలోకి వాళ్ళు ప్రవేశించి, థియేటర్లను గుత్తగా కొని, లేక కిరాయికి తీసుకోటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం, ఏసీ నాన్ వెజ్ హోటళ్ళు, ఫిలిమ్ సిటీలు, హోయ్ హోయ్ ఎమ్యూజ్ మెంటు పార్కులు కట్టటం, రీయింబర్స్మెంటు కాలేజీలు కట్టటం, డొనేషన్లు కట్టి పిల్లలను డాక్టర్లు చేయించటం, మొ|| నానావిధ టక్కుటమార విద్యలలో వాళ్ళు రాటు తేలిపోయారు. అందు వల్లనే చంద్రబాబుగారు ఇలాగా 'రాజధాని విజయవాడ సమీపంలో ఉంటుంది' అనగానే భూములు నాలుగు రెట్లుపెరిగాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే లక్షణం ఎక్కువ.

ఈ లక్షణాలన్నీ పేట్రేగి పోయినపుడు కోస్తా జిల్లాలలో అందరూ ధనవంతులే, అనే అభిప్రాయం కలగక మానదు. సత్యం తత్ విరుధ్ధం. రాయలసీమలో వలెనే, ఉత్తరాంధ్రలో వలెనే, తెలంగాణలో వలెనె, మధ్యాంధ్రలో, దక్షిణాంధ్రలో కూడ దరిద్రం తాండవిస్తున్నది. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అనే స్వభావం వల్ల, ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీలమోత బయట పడటం లేదు.

కాబట్టి వామ పక్షాలు తమ కమ్యూనిస్టు సిధ్ధాంతాల కనుగుణంగా ప్రైవేటు ఆస్తి నిర్మూలనకు, అన్ని వ్యాపారాలను, పరిశ్రమలను ప్రభుత్వరంగంలోనే నడిపి, ప్రతి పౌరుడికి తిండి, గుడ్డ, క్వార్టర్స్, ఫ్రీ ప్రయాణం, వృధ్ధాప్యంలో భద్రత, పని చేసే శక్తి ఉన్నవారందరికి పని గ్యారంటి, ఖాళీగా ఉండకుండా పనిచేయాల్సిన బాధ్యత (పెట్టుబడి దారీ విధానంలో డబ్బుంటే సోమరిగా తిరగచ్చు) వంటి సరియైన సిధ్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి.

ప్రభుత్వం ప్రతిదీ ఉచితంగా ఇస్తే, ధరల పెరుగదల అనే ప్రసక్తే ఉండదు. అసలు ధరలే ఉండవు. ఇంక ధరల పెరుగదలకి వ్యతిరేకంగా ఉద్యమాల అవసరం ఉండదు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కా?



ముందుగా కొంత చరిత్ర. తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలి అనే ఉద్యమం షుమారు 1913 ప్రాంతంలో బాపట్లలో ప్రారంభం అయినపుడు, రాయలసీమ వారికి చెన్నై దగ్గరగా ఉండేది కాబట్టి, వారు ఉద్యమంలో పాల్గొనటానికి ముందుకు రాలేదు. నాటి రాయలసీమ నేతలు రాయలసీమకు రాజధానిని డిమాండుచేయటం వల్ల, శ్రీబాగ్ ఒప్పందం జరిగి, రాయలసీమకు రాజధానిని వాగ్దానం చేయటం జరిగింది. దానిని నిలుపుకోటం కొరకు కర్నూలు లో రాజధానిని, గుంటూరులోహైకోర్టును నెలకొల్పుకోటం జరిగింది. నిన్ని మొన్న పేపర్లో వచ్చిందాన్ని బట్టి ఆకాలంలో కూడ భూస్పెక్యులేటర్లు రాజధాని ఉంటుందనుకున్న విజయవాడ, గుంటూరు, కర్నూలుల లో ధంధాలకు దిగి భూముల రేట్లను పెంచి వేయటం జరిగిందట.

ఆకాలంలో మీటర్ గేజీ గుంటూరు నుండి ధోన్ కి రైలు. అక్కడనుండి ధోన్ నుండి కర్నూలుకి రైలు. అన్నీ పొగబండ్లే. గుంటూరు కర్నూలు మధ్య రోడ్డు ప్రయాణం వాగులు, వంకలు, అడవులు, దొంగలతో భీబత్సంగా ఉండేవి. ప్రజలు, నేతలు, అధికారులు సీమ నుండి కోస్తాకి ప్రయాణాలలో నానా బాధలు పడి ఉంటారు.

మంత్రి పదవుల కొరకు, కీలక శాఖలపై పట్టుకొరకు భూకులాల మధ్య కుమ్ములాట జరిగి ఉండాలి. ఎందుకంటే, చిత్తూరు జిల్లాలోని భూకులానికీ, పగోజీ, కృష్ణా, గుంటూరు జిల్లాలోని భూకులానికి సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండాలి. అనంతపురం, కర్నూలు భూకులాల వారు, తెలంగాణ అగ్ర భూకులంతో సంబంధం కలిగి ఉండాలి. మొత్తానికి ఈ కులాల మధ్య ఇంబ్యాలెన్స్ లో ఏమిజరిగిందో గానీ, ఉమ్మడి రాష్ట్ర అగ్ర భూకులం వారు తమ పెత్తందారీ తనం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినట్లు కనిపిస్తుంది. ఆతరువాత తెలంగాణలోని రెండవ అగ్రభూకులానికీ, మొదటి అగ్రభూకులానికీ, చిత్తూరు & మధ్య కోస్తాలోని అగ్రభూకులానికి హైదరాబాదులోని భూముల కబ్జా కొరకు ,సెటిల్ మెంట్ల కొరకు కుమ్ములాటలు మొదలయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేకాంధ్ర ఉద్యమం, మరల రెండవ తెలంగాణ ఉద్యమం లేచాయి. దీనికి సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ ల, అరుణ్ జైట్లీల స్వార్ధం తోడయి సయామీస్ కవలలని వాళ్ళు చావుదెబ్బతినేలాగా విడతీసినట్లయింది.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు అనే నినాదం సరియైనది కాదు (శ్రీబాగ్ ఒప్పందమే సరియైనది కాదు). అప్పుడే రెండు రాష్ట్రాలను (ఆంధ్ర, రాయలసీమ) కోరుకొని, ఉద్యమాలు చేసుకొని, కర్నూలు, విజయవాడ రాజధానులుగా రెండు రాష్ట్రాలను ఏర్పరుచుకుని ఉంటే ఎవరికి వారు ఈనాటికి ఎంతో కొంత అభివృధ్ధి సాధించే వాళ్ళు. రెండు రాష్ట్రాల అవతరణలు కొంత ఆలస్యం జరిగినా మొత్తానకి పని అయ్యేది. ఒక భార్యా భర్తలకు ఇద్దరు పిల్లలు ఉండకూడదని లేదు కదా. అలాగే ఒకే తెలుగు వారికి రెండు రాష్ట్రాలు.

17 జిల్లాల సీమాంధ్రకు రాజధాని కావటానికి ఇఛ్ఛాపురం , శ్రీకాకుళం నుండి కల్యాణదుర్గం, రాయచోటి వరకు, తడ, సూళ్ళూరు పేటల వరకు ప్రతి పట్టణానికి అర్హత ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారి, రైలు సౌకర్యం ఉన్నవాటికి ఇంకా ఎక్కువ అర్హత ఉంది. ఈకోణంలోంచి చూస్తే గుత్తి , గుంటకల్, కర్నూలు, రేణిగుంట, కడప, ప్రొద్దటూరు, మైదుకూరు, ఒంగోలు, కావలి, గూడూరు, వెంకటగిరి, రాజమండ్రీ, తాడేపల్లిగూడెం, ఏలూరు, (ఈలిస్టు నేను పూర్తి చేయలేను) అందరూ అర్హులే. కేవలం విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతులే కాదు. ఈనాలుగు నగరాలూ ఎందుకు అనర్హాలు అంటే, ఇక్కడ ఇప్పటికే జనాభా విపరీతంగా పెరిగిపోయి ఇసకేస్తే రాలటంలేదు. లక్షరూపాయలకు సూదిమొనంత స్థలం కూడ లభించటం లేదు. లక్షరూపాయలు పెట్తే మనం విజయవాడలో, మంగళగిరిలో, గుంటూరులో ఒక చెట్టును కొనగలమేమో అనే పరిస్థితి వచ్చింది.

లేదా డజన్ల కొద్దీ ఉన్న ఈ నగరాల్లో ఏనగరమూ అర్హం కాకపోవచ్చు.

రాయలసీమలో ఎక్కడ రాజధాని పెట్టినా వలస సమస్య వస్తుంది



రాయలసీమలో ఎక్కడ రాజధానిని పెట్టినా లక్షలాది మంది నిరుద్యోగులు ఆపట్టణానికి (మాట వరసకి కర్నూలు) వలసవెళ్తారు. కనీసం ఇడ్లీబండి వేసుకునో, పండ్లమ్మి బతకచ్చనో, అందరూ రాయలసీమ రైళ్ళు ఎక్కుతారు. ఈ వలస దిగుమతులను రాయలసీమ వారు తట్టుకోలేరు. అప్పుడైనా వారు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం, కోస్తా ఆంధ్రులు గోబ్యాక్, అని స్లోగన్లు ఇచ్చి మరల కొందరు యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపించవలసి వస్తుంది. తరువాత ఈ కోస్తాంధ్రుల నందరిని కర్నూలునుండి ఎలా గెంటి వేయాలా అని ఆలోచించే, కెసీఆర్, హరీష్ రావు, కెటీఆర్ వంటి ప్రబుధ్దులు తయారవుతారు.

కోస్తా భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కర్నూలు (లేక కడప లేక ఏదైనా) లో విపరీతంగా భూములు కొని, కబ్జాలు చేసి, కొత్త నగరాన్ని నిర్మిస్తారు. కానీ అదే సమయంలో రాయలసీమ భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు గుండెకోత మొదలవుతుంది. ముల్కీలు, పెద్దమనుషుల ఒప్పందాలు, కోర్టుతీర్పులు, వంటివి నాలుక గీచుకోటానికి కూడ పనికిరావు. ఇంక వీళ్ళే కాక, బెంగుళూరు, చెన్నయి, ముంబాయి, ఢిల్లీ నుండి కూడ పెట్టుబడిదారులు కూడ వచ్చి కర్నూలులో వాలతారు. కర్నూలు నగరం , నేటి హైదరాబాదు లాగానే రావణాకాష్టం లాగా మారుతుంది. ఉదాహరణకి కుమారి జయలలిత గారికి హైదరాబాదులో భూములు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆమె కర్నూలులో భూములు కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకోటేమిటంటే, ఈరోజు ఎకరం 20 లక్షలు చేసే భూమిని కర్నూలు రైతు కోటి రూపాయలు వస్తుందని అమ్ముకున్నా తరువాత దుఃఖమే మిగులుతుంది. తరువాత ఆభూమి వందకోట్లు అవుతుంది. అయ్యో నేను కోటికి అమ్ముకున్నానే అని ఆరైతు వంశానికి చెందిన వారంతా బాధ పడాలి.

చంద్రబాబు గారు కమ్మ, కాపు కులాల మధ్య సమతౌల్యాన్ని సాధించారా?



అలాగని పత్రికలలో వచ్చింది. తన కులంవారు లేకపోతే చంద్రబాబు బ్రతకలేడు. అలాగని కాపుల మద్దతు పొంది నిలుపుకోక పోతే, ఈసారి వనవాసమే గతి అవుతుంది. అందుకని ఆయన తనకులానికి, తన మద్దతుదారులకు పెద్దపీట వేస్తూనే, కాపులను సంతృప్తి పరుస్తున్నట్లుగా నటించాడు. నిజానికి చంద్రబాబు పార్టీకి 29.1% వోట్లు వస్తే జగన్ కి 28.9% సీట్లు వచ్చాయి. తేడా కేవలం రెండు శతాంశ పాయింట్లే. కానీ, సీట్లలో 35 సీట్లదాకా తేడా వచ్చింది. అంటే ప్రజాదరణలో ఇరువురికీ పెద్ద తేడాలేదు. అయితే జాగ్రఫికల్ స్ప్రెడ్ లో తేడా ఉంది. నేనేం జగన్ అభిమాని నేమీ కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలాగా తయారయిందే అనే చింత కాల్చి వేస్తున్నది. పీపుల్ గెట్ దీ గవర్నమెంట్ దే డిజర్వు అని సర్దుకు పోవాలేమో. పీపుల్ గెట్ దీ ఆపోజిషన్ దే డిజర్వు అని కూడ వ్రాసుకోవచ్చు.

సరియైన స్లోగన్



ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు (ఇది కాదు,కింద చూడండి.).
మెరుగైనది:

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాయలసీమకూ హక్కు.

ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితులను చూస్తుంటే, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమలు, బేషరతుగా కలసి ఒకే రాష్ట్రంగా కొనసాగటం దాదాపు అసాధ్యం. వచ్చే పదేళ్లలో మనం ఎన్నో ఉద్యమాలను, బందులను చూడాల్సి రావచ్చు.

ఏ ప్రాంత పట్టణాన్ని రాజధాని చేసినా మిగిలిన వాళ్ళు బందులు మొదలుపెట్తారు. బస్సులను కాలుస్తారు (తెలుగు వాళ్ళకి చేతైన మహావిద్యలలో బస్సులను కాల్చటం గొప్పది).



ఏకైక మార్గం



పదేళ్ల తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించి స్టేడియాలను ఆక్రమించుకొని, మూసేసిన సినిమా హాళ్ళను, ఇంజనీరింగు కాలెజీలను టెండర్లు పిలిచి లీజుకు తీసుకుని, తక్షణమే, పాలనను నార్మల్ టెంపరేచర్ కి తేవటం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , శాసనమండలి, సమావేశమయి మూడురాష్ట్రాలను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపి, చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి, చిరంజీవి, మొ|| వారందరు ఢిల్లీ వెళ్ళికూర్చుని చెప్పులు అరగతీసుకొని (నేను నా చేతివేళ్ళను, లాప్ టాప్ కీ బోర్డును, స్క్రీన్ ను అరగతీస్తున్నట్లుగా) మూడు ప్రత్యేక రాష్టాల ఏర్పాటు బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో వీలైనంత తొందరగా, గతంలో వాడిన ఆర్టికిల్ 3 ప్రకారమే పాస్ చేయించుకోటం చేయాలి.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమైనా నిధులను విదిలిస్తే, వాటిని మూడు ప్రాంతాల్లో మూడు పట్టణాలకు కొత్త రాష్ట్రాలజనాభా దామాషాలో పంచుకొని నిర్మాణాలను మొదలు పెట్టుకోటం. మూడు పట్టణాలలోనూ, రాష్ట్రస్థాయికార్యాలయాలను ఏర్పాటు చేసుకొని అంతిమ విభజనకు స్నేహపూర్వకంగా, సర్వసన్నధ్ధంగా ఉండటం.

ఈనాటి స్లోగన్



కలలో, కథల్లో నైనా కలిసి ఉండటం చేతకాని వాళ్లు, స్నేహపూర్వకంగా, పూర్తి స్థాయి ముందస్తు వ్యూహంతో విడిపోటం నేర్చుకోవాలి.

Saturday, July 5, 2014

289 Should the future of Telugu people, always be quarrelling? Can't we put an end to it?

289 Should the future of Telugu people, always be quarrelling? Can't we put an end to it?
289 తెలుగు ప్రజల భవిష్యత్ తన్నుకోటమేనా? దానికి మనం ముగింపుపాడలేమా?
చర్చనీయాంశాలు: 289, తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమ, రాజధాని, హరీష్ రావు, కెటిఆర్, కెసిఆర్

సీమాంధ్ర ప్రజలపై శ్రీ కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ లు పగబట్టినట్లుగా కనిపిస్తున్నది. వాళ్ళు నోరు తెరిస్తే సీమాంధ్ర ప్రజలపై విషం కక్కుతున్నారు. వారి ప్రతిచర్య యొక్క గమ్యం, తెలంగాణ అభివృధ్ధి కన్నా, సీమాంధ్ర ప్రజలను వేధించటమే లక్ష్యం గా కనిపిస్తుంది. వారికి, శ్రీచంద్రబాబునాయుడికి మధ్య పాత పదవీ కుళ్ళు ఏదైనా ఉంటే ఉండవచ్చు. అలాంటివేమైనా ఉంటే వాళ్ళూ వాళ్ళూ చూసుకోవాలి. హైదరాబాదులో శ్రీ చంద్రబాబుకి బినామీ ఆస్తులు ఉన్నాయనీ, తాను ముఖ్యమంత్రి అయితే వాటన్నిటినీ బయట పెడతామనీ గతంలో కెసీఆర్ అన్నారు. ఇపుడా పని చేయవచ్చు కదా? జగన్ అక్రమాస్తులు ఏమైనా ఉంటే వాటిపై చర్య తీసుకోవచ్చు కదా? శ్రీచంద్రబాబు గారు కూడ కెసీఆర్ ధంధాలను బయట పెడతానన్నారు. ఆపని చేసి తెలంగాణ ప్రజలను రక్షించ వచ్చు కదా. చేయరెందుకు?

కెసీఆర్ కుటుంబం, ఒకే ప్రాంతం ప్రజలపై పగబట్టినట్లుగా వ్యవహరించటం సమంజసం కాదు. ఈవిషయంలో, కేంద్ర హోమ్ మంత్రి గారు ఇరు ప్రాంతాల వారిని తన్నుకోవద్దని సలహా ఇచ్చారే కానీ, పార్లమెంటులో తమ రాజకీయ స్వార్ధం కోసం, అతిఘోరమైన తడిగుడ్డతో గొంతును కోసే విభజన బిల్లును పాస్ చేయించి, సీమాంధ్ర ప్రజలను హైదరాబాదులో సరియైన కార్యాలయం లేని వాళ్ళుగా రోడ్డున పడేయటంలో, అఖిల భారత బిజేపి నేతలయైన తమకు, అఖిల భారత కాంగ్రెస్ నేతలకు పాత్ర ఉందని మర్చిపోయారు. ఈసందర్భంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తనను తెలంగాణకు చిన్నమ్మగా చెప్పుకోటాన్ని మర్చిపోరాదు.

ఇపుడు కెసీఆర్ భారత్ లో తెలంగాణను ఒక నిజాం రాజ్యంగా మార్చేశాడు. భారత దేశం ఒక దేశం, ఈ దేశంలో ప్రజలు ఎక్కడనుండి ఎక్కడకైనా పొట్టకోసం వలస వెళ్ళవచ్చు, పరిమితికి లోబడి చిన్న చిన్న ఆస్తులను సమకూర్చుకోటానికి రాజ్యాంగం అనుమతిస్తున్నది, అని ఆయన మర్చిపోయాడు. నియంత్రించ వలసిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాలు అనేవి స్వతంత్ర దేశాలు కావు. ఒక రాష్ట్రంలో ఉండే భూమి అంత ఆ ఒక్క రాష్ట్ర ప్రజలది కాదు. ఆభూమి మొత్తం భారత దేశానికి చెందినవి. ఒక నగరానికి వచ్చిన వివిధ ప్రాంతాలవారు, అక్కడ వివిధ రకాల పన్నులను చెల్లిస్తున్నప్పుడు, ఆ పన్నులతో చేపట్టే సంక్షేమ కార్యక్రమాల ఫలితాన్ని అందరూ అనుభవించాలి తప్ప, ఆప్రదేశంలో 1956 కు ముందు అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు. ఈ దేశంలో అందరూ ముల్కీలే. తెలంగాణా ముల్కీలనీ, సీమాంధ్రముల్కీలని, బీహార్ ముల్కీలని, ఉత్తరప్రదేశ్ ముల్కీలని ప్రత్యేకంగా ఉండరు.

కెసీఆర్ -హరీష్ రావు-కెటీఆర్ ల ప్రవర్తన, రైల్లో టవలు పరుచుకొని సీటుని ఆక్రమించుకొని పండుకున్నవాళ్ళు, మిగతావాళ్ళను గెంటి వేయటానికి బోగీతలుపులు వేయటానికి ప్రయత్నించినట్లుగా ఉన్నది.
తెలంగాణలో బండిలాగే కూలి వాడి కొడుక్కి సీమాంధ్రనుండి వచ్చినా, బీహార్ నుండి వచ్చినా, ఝుంజున్ను నుండి వచ్చినా, వాళ్ళు 1956 ముందు వచ్చారా తరువాత వచ్చారా అనేదానితో సంబంధం లేకుండా సర్వసమాన ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వాల్సిందే. అందరూ ముల్కీలే. ఇక్కడ నిజాం రాజ్యంలేదు.

కేంద్ర ప్రభుత్వానికి ఈ మౌలిక సూత్రం మీద విశ్వాసం ఉంటే, వెంటనే కెసీఆర్ దుష్ట చర్యలను నలిఫై చేస్తూ , రాజ్యాంగ పరిస్థితిని స్పష్టం చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి. లేకపోతే , దేశంలో, ప్రతిరాష్ట్రంలోనూ కెసీఆర్ లాంటి నిజాములు తయారయి, స్వంత రాజ్యాలను నెలకొల్పుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా చూస్తూ ఊరుకుంటే, సోవియట్ యూనియన్ వలె , భారత్ కూడ విఛ్ఛిన్నం బాట పట్టే అవకాశం ఉంది.

తోటకూర దొంగిలించిన నాడే పిల్లవాడికి మంచి చెడు నేర్పితే, వాడు మంచి పౌరుడుగా రూపు దిద్దుకునే అవకాశం ఉంటుంది. బాగా చేసావురా అని మెచ్చుకుంటే, తాను చేస్తున్న పని సరియైనదే అనుకొని అతడు మరీ పేట్రేగి పోయే అవకాశం ఉంది.

కేంద్రానికి దేశప్రజలు ఎక్కడినుండి ఎక్కడకైనా స్వేఛ్ఛగా వలస పోవచ్చు, అక్కడి ప్రజలతో సమానంగా జీవీస్తూ, హక్కులను, బాధ్యతలను రెండిటినీ స్వీకరిస్తూ సంచరించే హక్కు ఉన్నది అనే మౌలిక సూత్రం పై నమ్మకం లేక పోతే ఆవిషయమే స్పష్టం చేస్తే బాగుంటుంది. సీమాంధ్ర ప్రజలు ఏనుయ్యో గొయ్యో చూసుకుంటారు.

దీనిని , ఎవరి మనోభావాలైనా దెబ్బతింటున్నాయో గమనించి తిరగ వ్రాయవలసి ఉన్నది.

Monday, June 2, 2014

247 Travails of travel between Rayalaseema and Andhra Coast


247 రాయలసీమ మరియు కోస్తాంధ్ర మధ్య ప్రయాణాలలో కష్టనష్టాలు

చర్చనీయాంశాలు: రాయలసీమ, కోస్తాంధ్ర, విభజన, రాజధాని, కర్నూలు, విగుంతె




తమతమ స్వార్ధాలవల్ల శ్రీ చంద్రబాబు, శ్రీ జగన్, మొ|| రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కొరకు కృషి చేయకపోటం దురదృష్టకరం. రాజధానిని విగుంతెలో పెట్టినా, కర్నూలులో పెట్టినా, అటువారిటు, ఇటువారటు, నల్లమల ఘాట్ లలో ప్రయాణం చేయక తప్పదు.

కర్నూలు మరియు గుంటూరు మధ్య ఉన్న రహదారి ప్రయాణం, రైలు ప్రయాణం, ఎన్నో కష్టనష్టాలతో కూడు కున్నదని, గతంలో కర్నూలును రాజధానిగా పెట్టుకున్నప్పుడు ఈ బాధలను భరించలేకే, తెలంగాణతో విలీనం అయ్యి హైదరాబాదుకు వెళ్ళి ఉంటారని నేను ఈ బ్లాగులో పలుచోట్ల వ్రాశాను. నేను నంద్యాలలోను, మహబూబ్ నగర్ జిల్లాలోని శాంతినగర్ ప్రాంతంలోనూ పనిచేసి ఉండటం వల్ల నాకు బాగా అనుభవం కలిగి ఈవిషయాన్ని వ్రాస్తున్నాను.













నేను వ్యక్తం చేస్తున్న అనుమానం కేవలం ఊహాగానం కాదు, సాధ్యమే అనే విషయాన్ని ఈరోజు ఈనాడులో వచ్చిన ఈక్రింది వార్త ఋజువు చేస్తుంది.

సాంకేతిక లోపంతో నిలిచిన గరీబ్ రథ్



గార్డు లేకుండానే కదిలిన రైలు





గిద్దలూరు, న్యూస్ టు డే: గిద్దలూరు నంద్యాల మార్గంలో బోగద సొరంగం వద్ద ఆదివారం మధ్యాహ్నం బెంగుళూరు నుండి పూరీ వెళ్తున్న గరీబ్ రథ్ రైలు కొంతసేపు నిలిచిపోయింది. జీ5 ఏసీ భోగీలో (ఏసీ భోగం ఉంటుంది కాబట్టి భోగీ అంటున్నాను) ఏసీ గాలి వెనక్కిరావటంతో ప్రయాణీకులు ఆందోళన చెంది ఛెయిన్ లాగారు. దాంతో రైలు నిలిచి పోయింది. అనంతరం కొందరుప్రయాణీకులు భయపడి రైలునుండి క్రిందకు దిగారు. వెంటనే గార్డు బోగీ వద్దకు చేరుకుని ప్రమాదమేమీ లేదని ప్రయాణీకులకు చెప్పి బోగీలోకి ఎక్కించారు.

అక్కడ నుండి గార్డు తన బోగీ వద్దకు వెళ్ళే లోపే వాకీటాకీ సిగ్నల్ పనిచేయకపోటంతో డ్రైవర్ రైలును పోనిచ్చేశారు. కింద ఉన్న గార్డు సొరంగం నుండి రహదారికి చేరుకుని అక్కడనుండి దిగువమెట్ట రైల్వే స్టేషన్ మాస్టరుకు సమాచారం అందించారు.

దిగువమెట్ట రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 12.45 కు వచ్చిన గరీబ్ రథ్, గార్డు వచ్చేంత వరకు ఆ స్టేషన్ లోనే నిలిచి పోయింది. గార్డు వచ్చిన అనంతరం, మధ్యాహ్నం 1.30కి అక్కడ నుండి ముందుకు కదిలింది.


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే, ఏదో ఒకరోజుకి రాయలసీమకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటమే, రెండు ప్రాంతాల వారికీ (కోస్తా, రాయలసీమ) శ్రేయస్కరం అని ఋజువవుతుంది.

ఈనాటి పాట శకలం


చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం. రచన కొసరాజు. పాడింది ఘంటసాల.

అపాయమ్ము దాటడాని కుపాయమ్ము కావాలీ
అంధకార మలమినపుడు వెలుతురుకై వెదకాలీ
ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
మత్తువదలరా… నిద్దుర మత్తువదలరా !! మత్తు వదలరా !!
ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదువురా…!! మత్తు వదలరా !!

Sunday, May 11, 2014

233 Visit of the Central team for selecting Seshandhra Capital

233 Visit of the Central team for selecting Seshandhra Capital

233 శేషాంధ్రకు రాజధానిని ఎంపిక చేయటానికి పంపబడిన కేంద్ర అధికారుల బృందం

చర్చనీయాంశాలు: సీమాంధ్ర, శేషాంధ్ర, రాజధాని, విశాఖ, రాయలసీమ, కర్నూలు, విగుంతె
కేంద్ర ప్రభుత్వం వారు పంపిన అధికారుల బృందం వారు మాపులు ముందేసుకుని, విశాఖలో రాజధాని కవసరమైన డేటాకై ఏదో తంటాలు పడ్డారు. ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, వారు విజయవాడకు సింహాద్రి ఎక్స్ప్రెస్ లో వస్తున్నారట. అపుడు కానీ సుమారు 350 కి.మీ. ల ప్రయాణం ఎంతటెడియస్ గా ఉంటుందో అర్ధం కాదు. వీళ్ళు డెల్టాలో తిరిగినంతకాలం అంతా పచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాజమండ్రి కడియంలో పూలతోటలు చూసి సీమాంధ్ర అంతా అభివృధ్ధి చెందింది అని భ్రమ పడే అవకాశం ఉంది. వీరు తమ పర్యటనను రాయదుర్గంనుండో అనంతపురంనుండో మొదలెట్టి దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, గుంటకల్, నాగార్జునసాగర్, కడప, కర్నూలు, లను కూడ చూస్తే బాగుంటుంది. సంపూర్ణమైన అవగాహనకి గ్రీన్ బెల్టులతో పాటు, డ్రై బెల్టులను కూడ చూడాలి.

శేషాంధ్ర అనే పేరు ఎందుకు వాడుతున్నానంటే: 1) శేష అంటే శేషాచలం. తిరుపతిలోని సప్తగిరులలో (ఏడుకొండలలో) ఒకటి. నాదృష్టిలో ఇది రాయలసీమకు సంకేతం. 2) శేష అంటే మిగిలిన. తెలంగాణను కత్తిరించిన తరువాత మిగిలింది కనుక శేషాంధ్ర (Residual Andhra Pradesh). శేషాంధ్ర పాము ఆకారంలో ఉందనుకుంటే, తల అనంతపురం, తోక చివర శ్రీకాకుళం అవుతుంది.

శేషాంధ్ర గరిట ఆకారంలో ఉందనుకుంటే, అనంతపురం గరిట మూతి అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తోక అవుతుంది.

ఏవిధంగా చూసినా ఈచివరనుండి ఆచివరికి 700 కిలో మీటర్ల ప్రయాణం తప్పదు. గుంటూరు కర్నూలు, ఒంగోలు కర్నూలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలు తప్పవు. వీటికి అదనంగా జాతీయ రహదారి నం. 5 పై అనవసరపు ప్రయాణాలు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే విశాఖ శేషాంధ్రకు రాజధానిగా పనికిరాదు. కావాలనుకుంటే, విశాఖ రాజధానిగా, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను కలిపి (అవసరం అనుకుంటే బరంపురం, కోరాపుట్ , రాయగఢ్, లను కలిపి మరొక కొత్త రాష్ట్రాన్ని తయారు చేసుకోవచ్చు. లేదు , భారతీయులు , తెలుగు వాళ్ళు వెల్డింగులకు తగరు అనుకుంటే, శ్రీకాకుళం , విజయనగరం, విశాఖ, తూగోజీ, లతో ఒక రాష్ట్రాన్ని ఏర్పరచ వచ్చు. పూర్వం గోదావరి ఉత్తర ప్రాంతమంతా గజపతులచే పాలించబడింది. విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు దండయాత్రలకు వెళ్ళి సింహాచలంలో విజయ స్థంభాన్ని పాతినా, అది కప్పం వసూలు చేసుకోటానికి ఉపయోగ పడిందే కానీ, నిజమైన రాయల పాలన జరగలేదు.

తూర్పు సముద్రానికీ, రాయలసీమకు మధ్యలో నల్లమల అడవులు శేషాచలం కొండలు పెట్టని కోటగోడలులాగా ఉండి ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలకు ఆటంకంగా ఉంది. ఘాట్ రోడ్ లలో దొంగల బెడద, వానాకాలం వాగులు పొంగి వాహనాలు కొట్టుకుపోటం, ఎత్తు పల్లాలకు ఒళ్ళు హూనం కావటం జరుగుతాయి. అందుకే మానసికంగా రాయలసీమ వారూ, కోస్తావారు కలిసి పోలేదు. రాయలసీమలో చిత్తూరు, కడప జిల్లాల వారికి చెన్నై సౌకర్యం. అనంతపురం, కర్నూలు వారికి బెంగూళూరు సౌకర్యం. అందుచేత, ఆఏడుకొండలవాడిని దర్శించుకోటానికి తప్ప కోస్తా , రాయలసీమల మధ్య రాకపోకలు లేవు. ఆప్రయాణం నెల్లూరు జిల్లా గూడూరుకి పశ్చిమ దిశగా, వెంకటగిరి, కాళహస్తిల మీదుగా జరుగుతుంది. తుంగభద్ర డాం, రాజోలిబండ పథకం వచ్చేక, కొందరు కోస్తాంధ్రులు హోస్పేట, బళ్ళారి, శాంతినగర్ (అలంపురానికి పశ్చిమం, తెలంగాణ) లలో కాలువ ఇరిగేషన్ భూములు కొని అక్కడకి వలసపోయి కాంపులను స్థాపించుకోటం జరిగింది. అక్కడ వాళ్ళు పక్కాగా వెల్డింగ్ అయ్యారని నేను అనుకోలేక పోతున్నాను. రాయలసీమ వారికి చెన్నై, బెంగుళూరు సౌకర్యం కావటం వలననే, వారు ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటానికి ఉత్సాహం చూపలేదు. వారికి నచ్చచెప్పటం కొరకే 1937 లో చెన్నయిలోని కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి శ్రీబాగ్ అనే భవనంలో ఆనాటి కోస్తానేతలు, రాయలసీమ నేతలు శ్రీబాగ్ ఒడంబడిక అనే ఒప్పందం చేసుకోటం జరిగింది. దీని ప్రకారం ఆంధ్రరాష్ట్రానికి రాజధాని రాయలసీమలో ఉండాలి. ఈరోజు రాయలసీమ నేతలు మౌనంగా ఉన్నా, తిరిగి వారు ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని తీవ్రంగా సాగించే అవకాశం ఉంది.

ప్రత్యేక రాయలసీమ అవసరం





కొత్తసీమాంధ్ర రాజధాని నిర్మాణానికి జరిగే వేలకోట్ల నిర్మాణ కాంట్రాక్టులలో వాటా కోసం రాయలసీమ రాజకీయవేత్తలు, గుత్తేదారులు, కోస్తా రాజకీయనేతలు, గుత్తేదారులు తన్నుకోటం నిశ్చయం. ఇది కాక రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, కొత్తరాజధానిలో ఎవరు ఎన్ని ఎక్కువ భూములను చేజిక్కించుకున్నారు అనేదానిపై ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయి. దానికి అనుగుణంగానే మాఫియా ముఠాలు చెలరేగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటే, రాయలసీమకు నేడే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటం మేలు. వారు ఎక్కువగా ముంబాయి చెన్నయి రైల్వే లైనుపై, కర్నూలు బెంగుళూరు రైల్వే లైనుపై ఆధారపడతారు. కోస్తావారు దానికి భిన్నంగా కోల్ కత్తా చెన్నయి ట్రంకు లైను పై ఆధార పడతారు.

నాదృష్టిలో క్రొత్త శాసన సభకు అప్పగించ వలసిన బాధ్యతలు



రాష్ట్రాన్ని మూడు ముక్కలు చిన్నరాష్ట్రాలు సౌకర్యవంతంగా విభజించుకొని, కొత్తజీవితాలను ప్రారంభించుకోటం. శాసనసభలో సభ్యుల సంఖ్య పెంచుకోటం, నియోజకవర్గాల వైశాల్యాన్ని తగ్గించుకోటం, ప్రతిమండలాన్ని ఒకనియోజకవర్గంగా ప్రకటించటం, శాసన సభ్యులకి కొన్నైనా ఎగ్జిక్యూటివ్ ఆధికారాలను, బాధ్యతలను ఇవ్వటం, ఎంఆర్ఓ గది పక్కనే శాసన సభ్యుడి గదిని ఏర్పాటుచేయటం, ఎంఆర్ఓ అధికారాలకి, శాసన సభ్యుడి ఆధికారాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖలను గీయటం, శాసన సభ్యులు అధికార దుర్వినియోగం చేసినపుడు, అవనీతికి పాల్పడ్డప్పుడు క్రిమినల్ లయబిలిటీని నిర్వచించటం, ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించటానికి దోహదం చేస్తాయి. ప్రస్తుతం 86,000 దాకా ఇస్తున్న ఇతర భత్యాలను తగ్గించి, ప్రభుత్వ అద్దె వాహనాలను ఏర్పాటుచేయాలి.

మూడు కొత్తరాష్ట్రాలకు మూడు రాజధానులను నిర్మించుకోటం.



ఈపని జగన్, చంద్రబాబు చేయరా?



చేయరు. చేస్తే వాళ్ళకేమి వస్తుంది? ఏమీరాదు, కనుక చేయరు. ఆయా జిల్లాల ప్రజలే తమ తమ శాసన సభ్యులపై వత్తిడి తెచ్చుకొని, ఈ 720 కిలోమీటర్ల ప్రయాణ బాదరబందీల నుండి తప్పించుకోవాలి. పెద్ద రాష్ట్రాలయితే ఎక్కువమంది ఎంపీలతో ఢిల్లీలో చక్రాలు తిప్పి , ఎక్కువ నిధులు తెచ్చి, చెరో లక్ష కోట్లు పోగేసుకోవచ్చని వారనుకుంటూ ఉండ వచ్చు. చిన్న రాష్ట్రాలలో అది కుదరదు. చిన్నరాష్ట్రాలలో ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా, అంతర్జాతీయ సమావేశాలూ, ఫెస్టివల్సూ నిర్వహించుకుంటూ, గోల్ఫ్ కోర్సులకి భూములు ధారాదత్తం చేస్తూ, నిమిషానికొకసారి విదేశాలకు వెళ్లటం కుదరదు.

Monday, December 2, 2013

082 Won't people have any role in bifurcation of AP? విభజనలో రాష్ట్ర ప్రజలకు పాత్ర ఉండదా?


చర్చనీయాంశాలు: bifurcation, విభజన, బిజెపి, రాయలసీమ, నదీజలాలు, కడప, చిత్తూరు

కేంద్ర బిజెపి స్వభావం, ఉచ్చలగుంటల్లో చేపలు పట్టే తత్వం లాగా తయారు అయ్యింది. ఈసామెత అనాగరికం అనుకుంటే, అత్తగారూ మీకొంగు తొలగిందన్నా తప్పే, తొలగలేదన్నా తప్పే అన్నట్లుగా తయారు అయ్యింది.



లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ను చూడండి. ఆమె సీమాంధ్రలో విస్తృతంగా పర్యటించిన నేత కాదు. అసలు సీమాంధ్ర ప్రజలు అనేవాళ్ళు 5కోట్లమంది ఉన్నారో లేదు ఆమెకు తెలియదు. ఉండిరిపో వారి సమస్యలేమిటో ఆమెకు తెలియదు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆమె వెంట పడుతున్నది. నిజంగా కేంద్రం తెలంగాణా బిల్లును శీతాకాలం లోక్ సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టినా, బిజెపి ఏదో ఒక అభ్యంతరాన్ని లేవదీస్తుంది. కాంగ్రెస్ ను ఏదో విధంగా దుయ్యబట్టి ఆపార్టీని గద్దె దించటమే వారి లక్ష్యం తప్ప న్యాయాన్యాయాల ప్రసక్తి లేదు.

అలాగని బిజేపి వారు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా వోటు వేయక పోవచ్చు. ఎందుకంటే, బిజెపి కేంద్రనేతల మెడ గొలుసు, సర్వశ్రీ కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయల చేతిలో ఉంది.

నదీజలాల వ్యవహారం


కెసిఆర్ రాయల తెలంగాణను అభ్యంతరం చెప్పటానికి రెండు ముఖ్యకారణాలను ఊహించ వచ్చు. 1. హైదరాబాదు పై పెత్తనాన్ని రాయలసీమ భూకులం నంబర్ 1 తో పంచుకోటం ఇష్టం లేకపోటం. 2. కెసీఆర్ కోరిక అయిన జూరాల నుండి కృష్ణా జలాలను మెదక్ కు, గోదావరి నది వరకు పంపింగ్ చేసుకోటానికి రాయలసీమ నేతలు అభ్యంతరం చెప్పవచ్చు. క్రింద శ్రీశైలం నుండి కడపకు, చిత్తూరుకు కృష్ణా జలాలను తరలించుకు వెళ్ళాలన్న రాయలసీమ నేతల కోరికకు కెసీఆర్ కోరికకు సంఘర్షణలు అనివార్యం.

జైపాల్ రెడ్డి గారు రాయల తెలంగాణను అభ్యంతరం చెప్పటానికి రెండు ముఖ్యకారణాలను ఊహించ వచ్చు. 1. సోనియా ముఖ్యమంత్రులను నిర్ణయించేటపుడు రాయలసీమ భూకులం నంబర్ 1 కి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. కిరణ్ కు ఆఅవకాశం ఇవ్వటం, కోట్లకు ఆఅవకాశాన్ని ఇవ్వచూపటం, మనకు దృష్టాంతాలు. 2.జైపాలుడికి స్వంత నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పై ఎంత ప్రేమ ఉందో మనకు తెలియదు. నల్గొండ దిగువ ప్రాంతాలవారికి కొంత సాగర్ నీటి రుచి తెలిసినా, ఎగువవారికి, మహబూబ్ నగర్ తూర్పు వారికి ఇంతవరకు ఆరుచి లభించలేదు. శ్రీశైలం ఎడమకాలం సొరంగం , లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏడుస్తున్నాయి. రాయలతెలంగాణా ను నెత్తినేసుకుంటే, ఆయన నీటినీ కడపకు పంపించాల్సి ఉంటుంది. నల్గొండ, మహబూబ్ నగర్ వారికి న్యాయం చేయలేడు.

సహజన్యాయం

ఏనది నీళ్ళైనా ముందు ఆనది సమీప ప్రాంతాల వారి సాగునీటి, త్రాగు నీటి అవసరం తీర్చాలి. ఆ తరువాత, నదికి లంబంకాలువలద్వారా సుదూర ప్రాంతాలకు తరలించటం. అంటే, మొదటి శ్రేణి కాలువలు నదులకు సమాంతరంగానే ఉండాలి. లంబం కాలువలు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. నదీజలాలను సుదూరం తీసుకు వెళ్తున్న కొద్దీ ఇంకుడు నష్టాలు, ఆవిరి నష్టాలు, ఎక్కువవుతాయి. ఇంతచేసినా ఆఖరు లో ఉన్నవాళ్ళకి నీళ్ళు అందవు. అంతేకాదు, కృష్ణాజలాలు పూర్తిగా వరదలపై ఆధార పడినవి. అంటే కర్నాటకలో వరదలు వస్తేకానీ అవి నిండవు.

నదీజలాలను ఎన్ని కిలో మీటర్ల వరకు లంబంగా తీసుకు వెళ్ళటానికి అనుమతించవచ్చు అనేదానిపై శాస్త్రీయమైన, సాంకేతిక అధ్యయనాలు జరగాలి. ఆ గరిష్ఠ దూరాన్ని (మాట వరసకు నాగార్జున సాగర్ నుండి లంబంగా 50కిలోమీటర్లు) ఆనదీజలాల పంపిణీ చట్టాల్లో పొందు పరచాలి. కెసీఆర్ ఒకటంటే, జైపాల్ మరొకటంటే, కోట్ల మూడోమాటంటే, దివాకర్ నాలుగో మాటంటే, నదీజలాలను కుక్కలు చింపిన విస్తరి లాగా పంచుకోలేరు కదా.

తెలుగుదేశం వ్యూహం

తెలుగుదేశం పార్టీ, కోస్తాంధ్ర భూకులం నంబర్ 1, మరియు చిత్తూరు జిల్లా భూకులం నంబర్ 2 వారి కుటుంబ నాయకత్వంలో ఉన్న విషయం పాఠకులకు తెలిసిందే. రాష్టంలోని రెండు ప్రముఖ తెలుగు దిన పత్రికలు కూడ తెలుగు దేశం నేతల ప్రభావానికి లోనైయున్న విషయం పాఠకులకు తెలిసినదే. అందరి సమష్ఠి కోరిక ఏమిటంటే, కర్నాటక ఆల్ మట్టీ వద్ద తమ వాటా నీటిని వాడుకోకుండా, మొత్తం నీటిని తొలకరి వానలు పడ్డ మొదటి పక్షంలోనే కృష్ణా డెల్టాకు విడుదల చేయాలి. కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండగా నీరు మిగిలినా మిగిలక పోయినా, చేపల చెరువులు,రొయ్యల చెరువులు నిండాలి. ఎగువ ప్రాంతాలు ఎండి పోయినా తమకు అభ్యంతరం లేదు. ఈకోరిక తీరటంతో పాటు, చంద్రబాబునాయుడు గారి చిత్తూరు జిల్లాకు కూడ సాగునీరు వెళ్ళాలి. సమైక్యరాష్ట్రం అయితే ఇది తేలిక. టీడీపీ బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై (కొంత అతిగా) స్పందించటం, ఈఆవేదనలో ఒక భాగమే. ఇది తప్పా రైటా అనే వ్యాల్యూ జడ్జిమెంటు వ్రాయటం నా పని కాదు. ఎందుకంటే, ప్రజా సమస్యలకు, ప్రాంతీయ సమస్యలకు ఎన్నో కోణాలు ఉంటాయి.

జూరాలనుండి గోదావరి వరకు, కృష్ణనీటిని తరలించటాన్ని కెసీఆర్ కల కనటం తప్పనలేం. తన స్వంత జిల్లా కడపకు కృష్ణనీటిని తరలించుకెళ్ళాలనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి తపన తప్పన లేము . కానీ అవి నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం లను మాడ్చకుండా జరగాలి. పోలవరం, దుమ్ముగూడెం, పులిచింతల, సాగర్ టెయిల్ పాండ్ వంటి రాజశేఖర రెడ్డి ప్రణాలికలు కృష్ణాడెల్టా వారికి గోదావరి నీటిని అలవాటు చేసి, శ్రీశైలంనుండి దిగువకి నీటిని పారకుండా చేయటానికే. నేను సూచించినట్లుగా శ్రీశైలం నుండి లంబంగా 50 లేక 100కిలో మీటర్లు వంటి పరిమితులను విధిస్తే ఈకోరిక ఎన్నటికి తీరదు.

రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కెసీఆర్, జయపాల్ లు, శకుని మామలకు ఏమాత్రం తీసిపోరు.

కడపకు, చిత్తూరుకి సాగునీటి ఉపాయాలు చెప్పండి

శ్రీశైలం నుండి కర్నాటక వదిలే వరదనీటితో కడప, చిత్తూరుల కడుపు నిండదు. కర్నాటక స్వార్థం, నీళ్ళన్నీ ఎండకి ఆవిరవటం, భూమివేడికి ఇంకి పోటం , కాలువల పూడికలు, డిజైన్ లోపాలు, ఇంజనీర్ల అవనీతి ఎన్నో కారణాలు.

సముద్రజలాల శుధ్ధే పరిష్కారం

నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరంలో, సముద్రజలాల శుధ్ధి కర్మాగారాలను నెలకొల్పుకొని శుధ్ధ జలాలను, విద్యుత్ ను ఏకకాలంలో ఉత్పత్తి చేసుకోవాలి. శుధ్ధిచేసిన జలాలను పెన్నానదిలోకి మళ్ళించి అక్కడనుండి ఎగువకు పంపు చేసుకోవాలి. అవసరాన్నిబట్టి, తూర్పునుండి పడమరకు నీటిని పంపు చేసుకోటానికి వీలుగా, అదనపు కాలువలను, పైపులైన్లను నిర్మించుకోవాలి.

ఇవన్నీ పగటి కలలు కావు. సాంకేతిక విప్లవం మనముందుకు తెచ్చిన అభివృధ్ధి ద్వారాలు. వినియోగించుకోవాలా, లేక తన్ను కోవాలా అనేది మన ఇష్టం.

సారాంశం

విభజన అనేది ప్రజల భాగస్వామ్యంలో జరగాల్సిందే తప్ప, ఢిల్లీలో కూర్చొని సోనియాగాంధి, సుష్మా స్వరాజ్ లు చేయాల్సింది కాదు. ఒక పది కంపెనీల సైన్యాన్నో, పెరామిలిటరీ దళాలనో రంగంలోకి దించితే జనాలను అణచి వేయవచ్చు అనుకోటం, ప్రమాదకరం. తాత్కాలికంగా జనం సద్దు మణిగి అణగి ఉన్నా, తగిన సమయంలో వారు పేట్రేగుతారు. ప్రజాస్వామ్యం ప్రజాభిమతానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం కుదరదు.

విభజన విషయంలో తక్షణ తాత్కాలిక పరిష్కారం చెప్పండి.

కష్టం. అయినా ఈక్రింది ప్రతిపాదనను పరిశీలించ వచ్చు. తాత్కాలికం మాత్రమే.

హైదరాబాదును యూనియన్ టెరిటరీ (కేంద్ర పాలిత ప్రాంతం చేయటం). 10 జిల్లాల తెలంగాణాను ఇవ్వటం. నదీజలాల సమస్యను కేంద్ర అథారిటీల ద్వారా పరిష్కరించటం.

తాత్కాలిక సీమాంధ్ర తాత్కాలిక రాజధానిని విజయవాడ గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల గల మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను వెతికి లీజుకు తీసుకొని వాటిలో నెలకొల్పటం, శాసనసభను, సచివాలయాన్ని అక్కడికి తరలించటం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతి కార్యాలయం శాఖను కర్నూలు లో నెలకొల్పి, విజయవాడకుప్రయాణాలను తగ్గించటం. శాసనసభ కొన్ని సమావేశాలను కర్నూలులో నిర్వహించటం. ఆర్ టీ సీని మూడు గా విభజించటం. విజయవాడ హైదరాబాదు బస్సులను తగ్గించటం. విజయవాడ అనంతపురం బస్సులను రాయలసీమ ఆర్టీసీకి అప్పగించటం.

తరువాత, సీమాంధ్రను ఎన్ని చిన్నరాష్ట్రాలు చేయాలి, వాటి రాజధానులు ఎక్కడుండాలి, అనే సమస్యలకు చర్చలద్వారా శాశ్వత పరిష్కారాలను వెతుక్కోటం. ముందు సీమాంధ్రులు కెసీఆర్-కోదండరాం-సోనియా-సుష్మా-కిషన్ రెడ్డి ల కుట్రల నుండి బయట పడాలి.

Sunday, December 1, 2013

080 Danger to RAyalasIma in Royal TelangANa రాయల తెలంగాణలో రాయల సీమకు పొంచి ఉన్న ప్రమాదం


చర్చాంశాలు: రాయలసీమ, విభజన, bifurcation


పత్రికల్లో వచ్చిన నేటి (2-12-2013) వార్తలబట్టి చూస్తుంటే, కొద్దిమంది రాయలసీమ నేతలు, తమ స్వంత ఎజెండాలో భాగంగా, రాయలసీమ లోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపించుకోటంలో కృతకృత్యులైనట్లు కనిపిస్తుంది. ఉపముఖ్యమంత్రి దామోదర్ తాను ఒప్పుకోలేదని స్పష్టంగా చెప్పగా, కొందరు తెలంగాణ నేతలకు ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది.

ఆంధ్రజ్యోతి వ్రాసిన ప్రకారం చూస్తుంటే, రాయలసీమ రెడ్డి సామాజిక వర్గ నేతలు, తెలంగాణ రెడ్డి సామాజిక వర్గ నేతలు ఏకమై తమ అధికారాన్ని స్థిర పరుచుకోటానికి ప్రయత్నిస్తున్నట్లు తోస్తుంది.

తెరాస నేతలు, టీజాక్ నేతలు, హైదరాబాద్ పై తమ పెత్తనం కొరకు ఆవుర్ ఆవుర్ మంటుంటే, వార్ రాయలసీమ భూకులం నంబర్ 1 వారి పెత్తనాన్ని అంగీకరిస్తారని ఆశించటం వృధా. ఫలితంగా విభజన తరువాత కూడా, హైదరాబాదులో కుమ్ములాటలు తప్పవు. కెసీఆర్ కెటీఆర్ హరీష్ కవిత లు పెట్టే పొగకు తట్టుకోలేక, రాయలసీమ ప్రజలు తిరిగి బయట పడటానికి ప్రయత్నించ వలసి వస్తుంది. లేదా రాయలసీమ నేతలను బయటకి పంపటానికి కేసీఆర్ కొత్త వ్యూహాల వెతుక్కోవలసి వస్తుంది.

రాయలసీమ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించటమే మేలు. గుంతకల్లు - ద్రోణాచలం మధ్యప్రదేశాన్ని రాజధానిగ్ పెట్టుకొని, రాయలసీమ నాలుగు జిల్లాల సరిహద్దు ప్రదేశాలను పారిశ్రామికంగా వృధ్ధి చేసుకొని, ఉపాధి అవకాశాలను పెంచుకుంటే, రాయలసీమ ప్రజలు సుఖంగా జీవించ వచ్చు. బంగారు పంజరంలో బంధించబడిన చిలుకలాగా జీడి పప్పు కొరకు ఆశపడేకన్నా , స్వతంత్ర విహంగాల్లా రాగులు, సజ్జలపై బ్రతకటం మేలు. రాజధానిని షెడ్ లలో ఏర్పాటు చేసుకున్నా రోజులు గడిచి పోతాయి. అవి మనకొరకు ఆగవు.

కెసీఆర్ కృష్ణనీటిని రాయలసీమకు ధారా దత్తం చేస్తాడని రాయలసీమ నేతలు, ప్రజలు ఆశిస్తే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు. స్వతంత్ర రాష్ట్రంగా ఉంటే, కనీసం ట్రిబ్యునళ్ళను, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.

Tuesday, November 19, 2013

065 ఎవరికి వారే యమునాతీరే!

065 ఎవరికి వారే యమునాతీరే!
bifurcation, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర
image courtesy gisserver.nic.in

సీమాంధ్ర నేతలు ఎవరి కోణంలో నుంచి వారు చూడటంలో తప్పు లేదు. కానీ అందరూ కలసి ఐకమత్యంగా వ్యవహరించాలి కదా.

ఉదాహరణ: శ్రీకాకుళ నేత, కేంద్ర మంత్రి,కిషోర్ చంద్ర దేవ్ సార్. రాష్ట్రానికి రాజధానికి భౌగోళికంగా మధ్యలో ఉండనక్కర లేదుట. విశాఖను రాష్ట్ర రాజధానిగా చేయాల్సిందేట. వీరు రాయలసీమ వారిపై కొంత దయ దలిచారు. కావాలనుకుంటే రాయలసీమ వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చుకో మన్నారు.

కేంద్రమంత్రిణులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి లకు, రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య కావాలిట. రాయలసీమ, విశాఖ నివాసుల అభిప్రాయాలతో వారికి నిమిత్తం లేదు.

రాజధాని విషయంలో, కర్నూల్ నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డి గారి అభిప్రాయం ఇంతవరకు బయటికి రాలేదు. దివాకర్ రెడ్డి గారు రాయల తెలంగాణ అంటున్నారే తప్ప రాజధాని విషయం చెప్పటంలేదు. శ్రీ దివాకర హృదయం, హైదరాబాదునుండి బెంగుళూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఎలా లాభదాయకంగా నడపవచ్చా అనేదానిపై లగ్నం అయి ఉంటుంది. రాయలసీమ నేతలు రాయలసీమ భవిష్యత్ గురించి కాకుండా, హైదరాబాదులో తమ ఆస్తుల భవిష్యత్ గురించి, ఆలోచించటం మానేయటం అవసరం. విశాఖలో, విజయవాడలో పాగా వేయటం ఎలాగా అని ఆలోచించే కన్నా, సీమ భవిష్యత్ గురించి, ఆలోచించటం అవసరం.

రాయలసీమ ఫౌండేషన్ కి చెందిన శ్రీ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి గారు ,ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-11-2013 సంచికలో 'శ్రీబాగ్: నేటి కర్తవ్యాలు' అనే సంపాదక పేజీ వ్యాసం ద్వారా, రాయలసీమ భవతవ్యం పై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

వీటన్నిటిని బట్టి మనకు తేలేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజ్వరిల్లుతుంది. రాయలసీమలో రాజధానిని పెట్టినా, పెట్టక పోయినా, ఇది అనివార్యం. ఎందుకంటే, రాయలసీమలో రాజధానిని పెట్తే, కర్నూలైనా, ఇంకో నగరమైనా, కోస్తానుండి వచ్చే లక్షలాది మంది ఉద్యోగార్ధులను , వాణిజ్య వేత్తలను, పారిశ్రామికులను తట్టుకోలేదు. రాజధానిలో తమ పొట్ట నిండే మార్గాలు దొరుకుతాయని వారాసించటం తప్పు కాదు. 1953 నుండి కర్నూలే రాష్ట్ర రాజధానిగా కొనసాగి ఉన్నా ఇది జరిగేదే. కర్నూలుకి జరగాల్సిన మేలుకీళ్ళు హైదరాబాదుకి చేరాయి.

పైవన్నీ పరిశీలించటం ద్వారా మనం గుర్తించాల్సిన విషయాలు.

ముద్దొచ్చి నప్పుడే చంకకెక్కాలి. కేంద్రం, కాంగ్రెస్, బిజేపి, ఆంధ్రప్రదేశ్ ను 2 రాష్ట్రాలుగా చేయటానికి కత్తులు నూరుతున్నప్పుడు, తెలుగు వాళ్ళకు కలిసి ఉండే శుభ లక్షణాలు లేనప్పుడు, మెరుగయిన పధ్ధతి ఏది? అందరూ కలసి 4 లేక 5 రాష్ట్రాలను కోరటం మంచి దారి. అస్సాం 7 ఈశాన్య రాష్ట్రాలుగా విభజించ బడ్డప్పుడు, లేని అభ్యంతరం,ఇప్పుడు ఉండ నవసరం లేదు.

కాబట్టి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని పార్టీలు, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హైదరాబాదును Union Territory కేంద్ర పాలిత ప్రాంతం చేయటం, హైదరాబాదు లోని ఎన్ జీ వో లకు నగరంలో ఉండటానికి అవసరమైన ఆప్షన్లను ఇవ్వటం, నదీజలాల పంపిణీ, ప్రాజెక్టులకు నీటి విడుదలకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పరిపాలక వ్యవస్థను ఏర్పరచటం, కొత్తరాజధానుల నిర్మాణానికి ఆర్ధిక సహాయం, మొ|| డిమాండ్లకు ఈ నాలుగు లేక అయిదు రాష్ట్రాల డిమాండు అదనం గా ఉండాలి.

కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికీ, బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డుకి, భవిష్యత్ దృష్టి అవసరం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కలాగ ఉండరు. ఏనేతలైనా విజృంభించి, సీమాంధ్రప్రదేశ్ ని, మరో కాశ్మీర్ గానో, శ్రీలంకగానో, మార్చే అవకాశం ఉంది. హైదరాబాదుని మరొక పాకిస్థాన్ గా టీలీడర్లు తీర్చి దిద్దే అవకాశాలున్నాయి. సీమాంధ్ర మరియు తెలంగాణ మధ్య అంతర్యుధ్ధాలు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక దౌర్భాగ్యపు ఆదర్శం గా తయారు అయ్యే అవకాశాలు పుష్కలం.

ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశ హితం కాకుండా, పార్టీల స్వల్పకాలిక రాజకీయ లాభాల కొరకు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అశాంత చెలరేగి, దేశఐక్యతకే భంగకరం కావటం అనివార్యం.

Tuesday, November 12, 2013

#056 Bifurcation of A.P. రాష్ట్ర విభజన

విభజన, బిజెపి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, హైదరాబాదు, తెలంగాణ, మెట్రో

భవిష్యత్ లోరాబోయే సమస్యలను దృష్టిలో ఉంచుకొని,వైబిరావు గాడిద, ఈరోజు 13.11.2013 బిజెపి ఢిల్లీకి , ఒక ఈమెయిల్ పంపటం జరిగింది.

1. Put up proposals to make Seemandhra three States North Andhra, South Andhra and Rayala Seema and save people from future agitations.

2. Union Territory a must for Hyderabad to save not only people of Seemandhra from KCR&Co, Kodandaram & Co, but also to save people of South TelangaNa, and Indians who wants to settle in Hyderabad.

3. Pl. put up a separate proposal for declaring all cities in India with population of more than 20 lakhs as Union Territories, to save them from 1. Zehadi terrorism, 2. Regional terrorism. Center shd administer law & order of these cities.

సామాన్య మానవుడిగా పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశానే తప్ప ఇతరులపై నా అభిప్రాయాన్ని రుద్దటం నా అభిమతం కాదు. ఇతర తెలుగు వారు కూడ తమ అభిప్రాయాలను బిజెపి కేంద్ర కార్యాలయానికి ఈక్రింది ఈమెయిల్ అడ్రస్ కి పంపచ్చు.

bjpco2006@gmail.com .

నేను పంపిన ఈమెయిళ్లు డెలివరికాక తిరిగి రాలేదు కాబట్టి, బిజెపికి చేరాయనే నమ్ముతున్నాను.

కాంగ్రెస్ కేంద్రకార్యాలయం యొక్క ఈమెయిల్ అడ్రస్ సంపాదించలేక పోయాను. పాఠకులు సహాయం చేస్తే కృతజ్ఞుడనై ఉంటాను

పై ఈమెయిల్ షుమారు తెలుగు అనువాదం.
సీమాంధ్రను మూడు రాష్ట్రాలుగా అంటే, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ గా ప్రతిపాదించండి. భవిష్యత్తులో ఆందోళనలు చెలరేగకుండా సీమాంధ్ర ప్రజలను రక్షించటానికి ఇది అవసరం.

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటం అవసరం. సీమాంధ్ర ప్రజలనే కాక, కెసీఆర్&కో, కోదండరాం&కో లనుండి దక్షిణ తెలంగాణ, మరియు భవిష్యత్తులో హైదరాబాదులో సెటిల్ కాగోరే భారతీయులను రక్షించటానికి కూడ ఇది అవసరం.

భారత్ లో 20 లక్షలు దాటిన ప్రతి నగరాన్ని కూడ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటానికి, ఒక ప్రత్యేక ప్రతిపాదన, తయారు చేయండి. మతతత్వ ఉగ్రవాదం, ప్రాంతీయవాద ఉగ్రవాదం నుండి ప్రజలను రక్షించటానికి ఇది అవసరం. ఈనగరాలలోని శాంతి భద్రతల పరిరక్షణను కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి.


నదీజలాల పంపిణీకి ప్రత్యేక సాధికారిక పరిపాలనా సంస్థ మొ|| వ్రాయవలసి ఉండింది. కానీ మర్చి పోయాను. ఇంకోసారి ప్రయత్నించగలను. సీమాంధ్ర ప్రజలందరు కూడ, బిజెపి కేంద్ర కార్యాలయాన్ని తమ అభిప్రాయాలతో ముంచెత్త వలసిన అవసరం ఉంది. సీమాంధ్ర బిజేపీ జిల్లా యూనిట్లు ఉదాసీనంగా ఉండటం దురదృష్టకరం. వారు పూర్తి స్థాయిలో సీమాంధ్రుల సమస్యలను వారి కేంద్ర కార్యాలయంతో ఎందుకు ప్రస్థావించటంలేదో తెలియదు. వారు కొంత మొక్కు తీర్చు కుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తోస్తుంది.

కెసిఆర్&కో, కోదండరాం&కో పై నాకేదో ప్రత్యేక రాగ ద్వేషాలున్నట్లు గా భావించరాదు. Readers may please NOT THINK that I have special hatred towards KCR&Co and Kodandaram&Co.

రాగ ద్వేషాలేవో వారికే ఫుల్ గా ఉన్నాయి. ఉదాహరణకు, హైదరాబాదు మెట్రోలో కొన్ని అవకతవకలు, కొంత అవినీతి జరిగి ఉండవచ్చు. దానిని బయటపెట్టటము తప్పు కాదు, వ్యతిరేకించటమూ తప్పుకాదు . కెసీఆర్ తాను అధికారంలోకి రాగానే దానిని కూలగొట్తానంటున్నాడు. కొంత పని నడచిన తరువాత కూలగొట్టటం ఎలా కుదురుతుంది. లోపాలను సరి చేయవచ్చు. అవినీతి సొమ్మును జప్తులు చేసి వసూలు చేయవచ్చు. ఆయన ఈమాటలను సిధ్ధిపేట ప్రజలను రెచ్చగొట్టటానికి అన్నట్లుగా కనిపిస్తుంది.

ఏది ఏమైనా, తెలంగాణా ప్రజలకు, సీమాంధ్ర ప్రజలకు, రాబోయే రోజులు గడ్డురోజులే.

Sunday, October 20, 2013

018 Feedback to feedbacktogom-mha[at]nic[dot]in ప్రజల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ తో ఏమి చేశారు? చెత్త కుండీలో పారేశారు. లేక పకోడీలు పొట్లాం కట్టుకున్నారు.


STOP THIS HASTY UNILATERAL IMPOSED DIVISION OF ANDHRA PRADESH. Pl. come up with amicable choices and allow people of both telangANa and SImAndhra to select.

New Capital for residual A.P. is going to be a very serious problem. Nallamala Hill Ghats on Guntur Kurnool Highway with hundreds of dilapidated culverts, robbers, wild animals will cause great trouble both to people of RAyala SIma and Coastal Andhra.

SImAndhra needs at least three States: Uttara Andhra (Visakhapatnam area), dakshiN Andhra (Vijayavada-Guntur Area), rAyala SIma.

Telangana needs division into uttara telangANa and dakshiNa telangANA.

Proposed States will compare favorably in area and population with kErala, and himAcal.

All these States will be bigger than North Eastern seven States.

These are to be decided by people of Andhra Pradesh. Not you and me.

Pl. PREPARE 3 TO 5 ALTERNATIVE SEPARATION PLANS AND SEND TO AP ASSEMBLY FOR THEIR CHOICE. GIVE FREEDOM TO THEM TO SEND MODIFIED ALTERNATIVE CHOICES.

PEOPLE OF AP HAVE TO DECIDE. NOT YOU.

If you still consider that your dictatorship should prevail over the feelings of people of AP, please foresee with vision of this part of India in the next 50 years to come:

Continuous strikes, bands, agitations, suicides for the next 50 years.

People may start a non-cooperation movement and refuse to pay taxes, particularly Central taxes.

People may rush to international fora for justice.

People will flood courts with writs, and you may have to face strictures from courts.

National Integration and the concept of United India will be severely endangered.

I can't foresee 100%. But, you have wiser heads. You must foresee.

Hence, please think like statesmen, and work hard for amicable solution. Pl. forget that you are slaves of Ms. Sonia Gandhi and Mr. Rahul Gandhi or even Congress Working Committee.

Just as Prime Minister and President cannot be slaves of Congress President, Cabinets and GOMs should not be slaves-to-slaves of Prime Minister.

Your doing justice to telangANa should not result in injustice to SImAndhra.

Added on 04th Jan 2016.



What did the Central Government do with the feedback obtained from the people of Residual Andhra Pradesh? Everything was a drama.

ప్రజల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ తో ఏమి చేశారు? చెత్త కుండీలో పారేశారు. లేక పకోడీలు పొట్లాం కట్టుకున్నారు.
,br />To continue. असंपूर्ण . ఇంకా ఉంది.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |