116 Who is scholar and who is ignoramus? ఎవరు పండితుడు? ఎవరు శుంఠ? చర్చనీయాంశాలు: bifurcation, విభజన, తెలంగాణ, సీమాంధ్ర, స్వామి వివేకానంద
జైపాల్ రెడ్డి
కేంద్రమంత్రి శ్రీ జైపాల్ రెడ్డి గారి మాటల్లో చూద్దాం:
టంగుటూరి ప్రకాశం పంతులు, బోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి ఉద్దండులు పుట్టిన చోట ఇప్పుడంతా పరమ శుంఠలు జన్మించారు.
వ్యాఖ్య:జైపాల్ కూడ ఈగడ్డమీదే పుట్టాడుకదా.
భారత దేశంలో పుట్టినవారు ఎక్కడైనా ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఎక్కడో పంజాబ్లో పుట్టిన షీలా దీక్షిత్ ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రి కాలేదా అని ప్రశ్నిస్తూ సీమాంధ్రులకు శక్తి ఉంటే తెలంగాణాకు ముఖ్యమంత్రి కావచ్చు
వ్యాఖ్య: సీమాంధ్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కావటం సంగతి అలాఉంచండి. జైపాల్ లాంటి రెడ్డిశ్రీలు, కెసీఆర్ లాంటి వెలమశ్రీలు, ఎప్పటికైనా తెలంగాణలో జన్మించిన బీసీని కానీ, దళితుడిని కానీ ముఖ్యమంత్రి కానిస్తారా? కళ్లుకాయలు కాచేలా వేచి ఉండటమేనా వారు చేయవలసిన పని?
వైబీరావుగాడిద వ్యాఖ్యలు
తిట్లు, శాపనార్ధాలు మామూలుగా చంద్రబాబుగారి రాజకీయపాఠశాలలో నేర్పిస్తారు. ఈవ్యాధి కెసీఆర్ కి ఆయనద్వారా సోనియా రాజకీయపాఠశాలకి వ్యాపించినట్లుగా కనిపిస్తుందికాని, భారతీయలకీ తిట్లరోగం మహాభారత కాలంనుండీ ఉన్నది.
మహాభారతంలో భీముడు, కర్ణుడినుద్డేశించి
నన్నయ ఆంధ్రమహాభారతం, 6వ ఆశ్వాసం, 57వ పద్యం.
తేటగీతి.
ఉత్తమ క్షత్రియ ప్రవరోపయోగ్య
మైన అంగరాజ్యంబు నీ కర్హమగున
మంత్ర పూతమై గురుయజ మాన భక్ష్య
మగుపురోడాశ మదికుక్క కర్హ మగునె.
అప్పటికి భీముడికి కర్ణుడికి లేక పాండవులకు కర్ణుడికి వైరములేదు. అయినా భీముడు కర్ణుడిని తిడ్తున్నాడు. కుక్క యజ్ఞపాయసాన్ని తినటానికి ఎలా అర్హం కాదో నీవు అంగరాజ్యానికి అలా అర్హుడవుకావు , అని భీముడు కర్ణుడిని తిడ్తున్నాడు.
మనం ఈ 150వ జన్మదినోత్సవ శుభసందర్బంలో, తిట్లపురాణంలో స్వామీ వివేకానందగారికి ప్రథమ స్థానం ఇవ్వాలి.
వాళ్ళంతా రాస్కెల్స్, కుచ్చితులు, కలియుగ రాక్షసులు
సందర్భం: స్వామీ వివేకానందగారు, శ్రీహరిదాస్ విహారీదాస్ దేశాయి గారికి లేఖవ్రాశారు. ఈయన, జునాగఢ్ సంస్థానానికి దివాన్. తారీకు: 22.8.1892. వ్రాసింది ముంబాయి నుండి.
"... Poor fellows! Whatever the rascally and wily priests teach them — all sorts of mummery and tomfoolery as the very gist of the Vedas and Hinduism (mind you, neither these rascals of priests nor their forefathers have so much as seen a volume of the Vedas for the last 400 generations) — they follow and degrade themselves. Lord help them from the Raakshasas in the shape of the Brahmins of the Kaliyuga..."
షుమారు సారం: పాపం దరిద్రులు ! రాస్కెల్స్ , మోసగాళ్ళు అయిన పురోహితులు ఏమి బోధించినప్పటికి, చొప్పదంటు కర్మలను, అర్ధరహితమైన ప్రవర్తనను, వేదసారం మరియు హిందుయిజంగా బోధించినప్పటికి, (తెలుసుకోండి, ఈరాస్కెల్స్ అయిన పురోహితులు , వాళ్ళ తాతముత్తాతలు, గత 400 తరాలుగా వేదాలయొక్క ఒకసంపుటంకూడ చూసి ఉండరు). -ఆదరిద్రులు (పురోహితులు బోధించే చెత్తనే) పాటిస్తారు, తమనితాము దిగజార్చుకుంటారు. కలియుగ రాక్షసులైన ఈబ్రాహ్మణులనుండి వారిని ఆభగవంతుడే రక్షించాలి.
వైబీరావు గాడిద వ్యాఖ్య
పురోహితులు రాస్కెల్ స్, కుచ్చితులు, కలియుగ రాక్షసులు. తానేమో గొప్ప ప్రబోధకుడు. పురోహితులు చేసేవన్ని చెత్తపనులు. మరి స్వామీజీ తన ఆఖరురోజుల్లో క్రిస్టీనా గ్రీన్ స్టైడెల్ అనే యువతికి వ్రాసిన లేఖలో ఏమని డబ్బా కొట్టుకున్నారు? ఈదుర్గపూజ సందర్భంగా మేము ఒక మేకను బలి ఇచ్చాం. టపాకాయలు కాల్చాం. తన ప్రాణ రక్షణ కోసం మేకను బలి ఇచ్చే స్వామీజీ చేయించిన పనిని గొప్పపని అనాలా చెత్త పని అనాలా? కానీ బేలూరి మఠ్ వారి అధికారిక వెబ్ సైట్ ప్రకారం, స్వామి వివేకానందా గారి మేకను బలి ఇద్దామంటే, శారదా మాత అంటే రామకృష్ణ పరమహంస భార్య, అరటిపండ్లను నివేదన చేసే ఆచారాన్ని ప్రవేశపెట్టింది. ఈయన గురువుగారు , ఇంకా తెలివైన వాడు. కాళికాదేవికి మేకను బలి ఇస్తే అభ్యంతరంలేదు. కానీ అష్టమినాడు మాత్రమే బలి ఇవ్వాలి. ఆమేక మాంసాన్ని పరమహంసగారు తన నుదుటికి అద్దుకొని ఆరగిస్తారు. ఈపరమహంసగారు గదాధరుడనే బ్రాహ్మణశ్రేష్ఠుడుట.
ఇంకొక ఉదాహరణ: వాళ్ళంతా క్రాంకులు
స్వామి వివేకానంద గారు ఆల్బర్టా సర్జెస్ గారికి వ్రాసినలేఖ. తారీకు 5.12.1895. అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక ఓడనుండి వ్రాశారు.
"...In your country, Alberta, the Vedantic thought was introduced in the beginning by ignorant "cranks", and one has to work his way through the difficulties created by such introductions ..."
షుమారు భావం: మీదేశంలో, ఓ ఆల్బర్టా, వేదాంతిక ఆలోచనలను మొదట ప్రవేశపెట్టిన వాళ్ళు అజ్డానులైన క్రాంకులు (పిచ్చివెధవలు). వారిచే ప్రవేశపెట్టబడిని ప్రథమవివరణలలోంచి (introductions) వచ్చే కష్టాల్లోంచి పనిచేసుకుంటూ వెళ్ళాలి.
వైబీరావు గాడిద వ్యాఖ్య
వివేకానందగారి ముందు కొద్దిమంది భారతీయులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తమకు తెలిసిన వేదాంత తత్వవిచారాలను అక్కడివారికి పరిచయం చేయాలని ప్రయత్నించి ఉండవచ్చు. ఆంగ్లభాషా ప్రావిణ్యలేమి వల్లకానీ, వాక్చాతుర్యలేమి వల్లకానీ, వారు అందులో కృతకృత్యులు అయి ఉండకపోవచ్చు. అంతమాత్రానే వారిని క్రాంకులు (పిచ్చివెధవలు) అనాలా. ఈ ఆల్బర్టా అనే అమ్మాయికి వివేకానందా గారు లేఖ వ్రాసిన సమయానికి కేవలం 19 ఏళ్ళే. స్వామీజీ వ్రాసిన వన్నీ నిజమే అని ఆ అమ్మాయి అనుకొని ఉంటుంది. జైపాల్ రెడ్డిగారు సీమాంధ్రనేతలను శుంఠలు అన్నట్లుగా, కొందరైనా తెలంగాణ ప్రజలు నమ్మినట్లుగా.
ఎవరు రెలిజియస్ ఫెనెటిక్ స్ (మత పిచ్చి, అహంకారం కలవారు) ఎవరు కాదు?
భారతీయులలో క్రైస్తవమత ఫెనెటిజం ప్రబలటానికి యూరోపియన్ ల ప్రోత్సాహం, ఇస్లాం మత ఫెనెటిజం ప్రబలటానికి జిన్నా వంటివారు ఎంతకారకులో, హిందూమత ఫెనెటిజం ప్రబలటానికి వివేకానందగారు కూడ అంతే కారకులు అనే విషయాన్ని సర్వశ్రీ సోనియా, మన్మోహన్, మోడీ, అద్వానీ వంటి వారు గ్రహించక పోవటం దురదృష్టకరం. ఫలితంగా, స్వామీజీ 150వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా, సర్వశ్రీ మన్మోహన్, సోనియాల ప్రబోధం వోట్లకొరకు చేసినదో, లేక ఆఉత్సవ నిర్వాహకులు అడిగారు కాబట్టి ఏదో మర్యాదకోసమో చేసినవైనాయి తప్ప, వాస్తవాలు తెలుసుకొని చేసినట్లు కనిపించవు.ప్రజలలో, పరిశీలకులలో ప్రబలి ఉన్న అభిప్రాయం ఏమిటంటే, కాంగ్రెస్, సమాజవాది, ఆర్ జె డీ, బి ఎస్ పీ వంటి పార్టీలు పరోక్షంగా మైనారిటీ మతతత్వాన్ని పోషిస్తు ఉండగా, బిజెపి మెజారిటి మతతత్వాన్ని పోషిస్తున్నది. ఏపార్టీకా పార్టీ అద్దంలో చూసుకుంటే, తమప్రతిబింబం కనపడుతుంది.
నిజమైన పండితులు, మేధావులు వెలువరించే అభిప్రాయాలకు భారత్ విలువ ఇచ్చేరోజులు రావాలంటే, ప్రజలు పండితులు, మేధావులుగా మారాలి.
శుంఠలు, రాస్కెల్స్, క్రాంకులు, అని తమకు ముందు ఉన్నవారిని, తమపోటీదారులని తిట్టిపోసేవారిని ప్రజలు నమ్మినంతకాలం ఈదేశం బాగుపడదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.