చర్చనీయాంశాలు: bifurcation, విభజన, శేషాంధ్ర, సీమాంధ్ర, బిజెపి, కాంగ్రెస్, టీడీపి, రాజశ్రీ
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మూజువాణి వోటుతో లోక్ సభలో పాస్ చేయబడే సూచనలు కనిపిస్తున్నాయి. అడ్డు వచ్చే మిగిలిన సీమాంధ్ర కేంద్ర మంత్రివర్గ సభ్యులను, ఎం.పీ. లను బహిష్కరించి వారు చర్చలో గానీ, వోటింగులో గానీ పాల్గొనకుండా అడ్డుకోటం, డివిజన్ వోటింగ్ కోరకుండా చేయటం జరగచ్చు.
బిజెపి పాత్ర
బిజెపి మొదటి నుండి తెలంగాణ పక్షానే ఉంటున్నది.
టిఆర్ఎస్ తో చెలిమి చేసింది. బిజెపి అగ్ర నేతలందరు తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టమని కాంగ్రెస్ ను పొడిచిన సంగతి మనం మరువరాదు. కాంగ్రెస్, బిజెపి పోటీపడి తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం అనే పల్లవి రాజకీయ అవకాశవాదంలో భాగంగా ఒక నెల క్రింద మాత్రమే ఎత్తుకున్నది. బిజెపి అగ్రనేత కాంగ్రెస్ ఏదో విషబీజాలు నాటిందని ప్రసంగాలు చేస్తున్నారు గానీ విషబీజాలు నాటటంలో ఇరువురూ పోటీపడ్డారు.
బిజెపి ప్రతిపాదించిన సవరణల గతి
కొన్నిటిని నామమాత్రంగా కాంగ్రెస్ అమలు చేసినా, చెప్పుకోతగ్గ సవరణలు ఉండవు. బిజెపి తన తెలివి తేటలను ఉపయోగించి మూజువాణీ వోటుతో బిల్లును పాస్ చేయనిస్తుంది. మబ్బుల్లో నీళ్ళుచూసి ముంత ఒలకపోసుకోనా అనే సామెత గుర్తుకు తెచ్చుకొని తెలంగాణలో వచ్చే ఒకటి రెండు మూడు సీట్లతో సరిబుచ్చుకుంటుంది.
తాము వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామనే వాగ్దానం
ఇది వట్టి కల్లబొల్లి హామీ. అపుడు మాజిక్ ఫిగర్ 271 కి సీట్లు తక్కువ బడితే వెన్నుపోటు సార్వభౌమ చంద్రబాబును, అవినీతి సార్వభౌమ జగన్ ను, వాడుకోవాలనే పథకం తప్ప మరేమీ కాదు. అప్పటి ఆర్ధిక మంత్రిగా ఎవరుంటారో తెలియదు. బడ్జెట్ లోటు ఎంత ఉంటుందో తెలియదు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, ఐ.ఎమ్.ఎఫ్. లనుండి ఎటువంటి ఒత్తిళ్ళు వస్తాయో తెలీదు. బిజెపికి నిజంగా ఇవ్వాలనే కోరిక ఉంటే ఇవ్వగలిగేది రాజధాని నిర్మాణానికి ఆర్ధిక సాయం, హైదరాబాదును కోల్పోయిన ఫలితంగా వచ్చే రెవిన్యూ లోటును పూడ్చుకోటానికి సహాయం చేయటం. ఇది భాజపాకు ఆనాటికి సీమాంధ్ర ప్రజలతో, ఎంపీలతో కలిగే అవసరాలను బట్టి ఉంటుంది.
నరేంద్ర మోడీ రికార్డును బట్టి చూస్తే ఆయన శ్రీరామచంద్ర మూర్తి లాగ అగ్ని సాక్షిగా వివాహమాడిన ధర్మపత్నిని, '' నేను ఆయన ధర్మపత్నినే '' అని కలవరించే లాగ చేస్తున్నాడు. ప్రచురించ బడిన పరిమితమైన రిపోర్టులను బట్టి, ఆయన భార్య పైనే నిఘా ఉన్నది.
ఆయనకు తన కన్నా పదేళ్ళు సీనియర్ నేతలైన కేశూభాయ్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా వంటి వారిని భ్రష్టు పట్టించి, ఢిల్లీనుండి ముఖ్యమంత్రిగా దిగివచ్చిన చరిత్ర ఉంది.
ఆయనను పెంచి పోషించిన వాజపేయీ, లాల్ కృష్ణ ఆద్వానీలు ఇప్పటికే పశ్చాత్తాప పడుతూ ఉండవచ్చు. భవిష్యత్ లో పశ్చాత్తాప పడాల్సిన వాళ్ళలో సుష్మా స్వరాజ్, జస్వంత్ సింగ్, మురళీమనోహర్ జోషీ, అరుణ్ జైట్లీ, గడ్కారీ, వెంకయ్యనాయుడు ఎవరైనా ఉండచ్చు. అందరూ ఉండచ్చు. ఏది ఏమైనా శేషాంధ్ర ప్రజలకు సహాయం పరిమితంగానే ఉండచ్చు.
టాటా నానో కార్ల ఫ్యాక్టరీ భూ యజమానులను సత్కరించినట్లు నరేంద్రమోడీ సార్ సీమాంధ్ర ప్రజలను సత్కరిస్తారా?
బెంగాల్ నుండి విరమించుకున్న టాటాలకు నానో యూనిట్ కు గుజరాత్ లో స్థలం సేకరించటానికి శ్రీ నరేంద్రమోడీ వ్యూహం ఏమిటంటే, ఎకరం ౩ లక్షల రూపాయలు చేసే భూమికి ౩౦ లక్షలు చొ|| ఇవ్వటం. ఈఔదార్యం వల్ల అక్కడి రైతులు కోటీశ్వరులుగా మారారు. వారికి టాటాలు నానో కారును చవకగా అమ్మజూపితే, వారు మాకు నానో ఎందుకు? మేము ఆడీ కారు కొనుక్కుంటున్నామన్నారు.
ఇలా భారీ పరిహారాన్ని ఇవ్వటాన్ని నేను తప్పు పట్టటం లేదు. అటువంటి ఔదార్యాన్ని, గుజరాత్ ప్రభుత్వం తరువాత జరిగిన భూసేకరణల్లో ఎక్కడా చూపలేదు. జన్మకొక్క శివరాత్రి లాంటిదన్నమాట. ఈభాగ్యం రైతుకు కలగటం మహాశివరాత్రిలాంటిదని చెప్పనక్కరలేదు. శేషాంధ్ర ప్రజలపై అటువంటి ఔదార్యాన్ని శ్రీమోడీ చూపిస్తారని కోరటం, దురాశే అయినా, ఆశించే సాహసం చేస్తున్నాను.
రైళ్ళలో ఢిల్లీ వెళ్ళిన వారి సంగతి
సీమాంధ్ర ప్రజలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారని ఢిల్లీ ప్రజలకి తెలుస్తుంది. బహుశా లాఠీలతో బాదటం, నీళ్ళు చిమ్మటం, బాష్పవాయు గోళాలను ప్రయోగించటం, గాలిలోకి కాల్పులు వంటివి జరగచ్చు. ఢిల్లీ ప్రజలు కూడ ముంబాయి ప్రజల వలె మొద్దు బారి పోయారు. ఒక ఐదు నిమిషాలు ఈవింత చూసిన తరువాత, వాళ్ళు ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు.
సీమాంధ్ర నుండి 8 రైళ్ళు ఢిల్లీ బుక్ చేయటానికి అయిన ఖర్చు ఎవరిచ్చారో కానీ, వారి లక్ష్యమేమిటో కాని, సామాన్యమైనది కాదు. అట్టై బుట్టై అన్నట్లుగా తోటకూర కాడల్లాగ రావచ్చు. లేక ఇతరుల ఖర్చుతో ఢిల్లీ వెళ్ళి ఆటపాటగా ఆగ్రా తాజ్, బృందావనం మొ|| చూచుకొని, కనాట్ సర్కస్ లో షాపింగులు మొ|| చేసుకుని ఖుషీగా కూడ రావచ్చు.
ఇప్పుడు సీమాంధ్ర ప్రజల దుర్గతి
కాంగ్రెస్ , బిజేపీ లను చెత్తకుండీ లో పారేయక తప్పదు. తెలుగు దేశం, జగన్ గారి వైయస్ఆర్ పీ లనూ కూడ చెత్తకుండీలో పారేయక తప్పదు. కిరణ్ తన సోదరుడి పై వచ్చిన ఆరోపణలపై, ఇంతవరకు విచారణలకు తలఒగ్గటం వంటి చర్యలేమీతీసుకోలేదు. చివరి రోజులలో కాంట్రాక్టర్లకు అంచనాలను పెంచివేసి కోట్లు పంచి పెట్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. భూముల పంద్యారం కూడ జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. అంతే కాక ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ ల అవనీతి విషయంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గా తూష్ణీంభావం వహించి పరోక్షంగా భాగస్వామి అయ్యారు. కనుక ఆయన పెట్టబోయే సమైక్యాంధ్రపార్టీ కూడ అలానే తయారయ్యే అవకాశం ఉంది.
ఆం ఆద్మీ, లోక్ సత్తా
రెండు పార్టీలు అవగాహన లేకుండా తెలంగాణ ను సమర్ధించాయి. సమన్యాయం అన్నా అవగాహన ఉన్నట్లు కనపడదు.
సారాంశం
1. ఇపుడు రెండు కొత్త పార్టీలను స్థాపించుకోవాలి. లేక సీపీఎమ్ కు, మరొక కొత్త పార్టీకి, ఒక అవకాశం ఇవ్వవచ్చు.
2. బిజెపి ఏదో ప్రేమతో న్యాయం చేస్తానంటుంది
కాబట్టి, అది కేంద్రంలో అధికారానికి వస్తే, ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ మూడురాష్ట్రాలను ఇవ్వమని అడగాలి. మూడురాష్ట్రాల రాజధానుల నిర్మాణానికీ ఆర్ధిక సాయం కేంద్ర బడ్జెట్ లోంచి చేయాలి. ఎవరో అడ్డమైన పారిశ్రామిక వేత్తలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించింది కదా. దాని బదులు మూడు చిన్న రాష్ట్రాలకు మూడు చిన్న ప్యాకేజీలనిచ్చి తన చిత్తశుధ్ధిని నిరూపించుకోవచ్చు.
ఈనాటి పాట
దేవుడమ్మ చిత్రంలోది.
రాజశ్రీ వ్రాశారు. బాలసుబ్రహ్మణ్యం గొంతు.
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు … సామీ …ఎక్కడో||
Oh God! You have sat far away
And writing fate on our faces here
And seeing fun!
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
You create unnecessary illusions in us ..
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
You play making us puppets
లేనిపోని|| you create ||
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
You make us believe that everything is our own ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..హ హ హ..చేసేస్తావు.. సామీ ఎక్కడో దూరాన||
In no time, you make everything fugacious! You have sat||
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది||
We think that we are growing but we never understand that our lifespan is dwindling We think that we are|| (repeat)
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
Before we open our eyes and realise the truth
మా కళ్ళముందు మాయతెరలు..కప్పేస్తావు
you cover our eyes with delusions … సామీ ఎక్కడో|| Oh Lord, you have sat||
ఇంకా ఉంది. తిరిగి ఎడిటింగ్ చేయాల్సి ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.