Though this blog has been started as 'problems of telugus', we have expanded into National problems of India, and the problems of the World, particularly Poverty, Inequalities of Income and Wealth. I support Atheism and Marxism which I call TOTAL TRUE SOCIALISM, but I do not wish to impose on others. If you do not like what I write, pl. write your comment here. If you like anything, pl. tell others.
Search This Blog typing in English or Telugu, and sometimes Hindi
Sunday, November 10, 2013
051 Musings on Casteism in Andhra Pradesh, and India.
11 Chief Ministers of Undivided Andhra Pradesh were from the Reddy Caste, which is one of the three dominant LANDED CASTES in Andhra Pradesh. Another six Chief Ministers are from Kamma Caste, which is No. 2 dominant LANDED CASTE of Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ కమిటీ చేసిన సిఫార్సులు ప్రాధమికంగా కొంతమేరకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. అయితే ఆయన రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావించకుండా, విశాఖకు ఐటిఐఆర్, విశాఖకు మెట్రో వంటివి ప్రతిపాదించటం ద్వారా పరోక్షంగా , విశాఖను క్రొత్త సీమాంధ్ర రాజధానిగా ప్రతిపాదిస్తున్నట్లు కనిపిస్తుంది.
మంత్రి కిశోర్ చంద్రదేవ్ గారి కోరిక కూడ విశాఖ రాజధానియే. శ్రీచిరంజీవికి కూడ విశాఖపై అభిలాష ఉండటం సహజమే. కేంద్రమంత్రిణి పురందరేశ్వరి గారు ప్రస్తుతం విశాఖ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించుతున్నారు. కానీ విశాఖను మరొక రాజ్యసభ సభ్యుడు శ్రీ టీఎస్ఆర్ కూడ ఆశిస్తున్నందువల్ల ఆమె విజయవాడను రాజధానిగా ముందుకు తేవాలని, తాను విజయవాడకు మారాలని, చూస్తున్నట్లు కనిపిస్తుంది. కోస్తాంధ్ర నేతలు పలువురికి, హైదరాబాదు, విజయవాడ, విశాఖల్లో విలువలు పెరిగే భూములు ఉండటం వల్ల వారికి అన్ని నగరాలూ ఆమోదయోగ్యమే. అదనంగా వచ్చే ప్యాకేజీలు, భోజనాలకు పనికి వస్తాయి. అందుకే వారు విశాఖ నుండి అనంతపురం వరకు ఎనిమిది లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే పాట అందుకున్నారు.
రాయలసీమ నేతలు పలువురికి హైదరాబాదు, తిరుపతుల్లో భూములు ఉన్నాయి తప్ప విశాఖలో లేవు. అనంతపురం వారికి బెంగుళూరు, చిత్తూరు , కడప, నెల్లూరు,వారికి చెన్నై, కర్నూలు వారికి హైదరాబాదు ల్లో భూములు ఉంటాయి. వారందరికీ విశాఖ పెడ. విశాఖ నుండి అనంతపురానికి ఎనిమిది లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే వేసినా, టోల్ గేట్ బిల్లులు ఎవరిస్తారు ? మోత మోగించే బస్ ఛార్జీలు ఎవరు కట్తారు?
స్వర్గీయ వైయస్ గారు విజయవాడ లో కొన్ని భారీ ఆస్థులు కలిగియున్నారంటారు.
ఇప్పుడిప్పుడే గూళ్ళలోంచి పక్షులు పాటలు అందుకుంటున్నాయి. ఎండోమెంట్స్ మంత్రి శ్రీరామచంద్రయ్యగారు రాజధాని రాయలసీమలోనే ఉండాలని పాడారు.
తూర్పుగోదావరిదాటి ఈశాన్యానికి వెళ్తే , 11 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేసిన కులం నంబర్ 1 కి అంత ప్రాధాన్యత లేదు. హైదరాబాదులో , తెలంగాణలో కులం నంబర్ 1కి మంచి బలం ఉంది. అందువల్ల హైదరాబాదు రాజధానిగా ఉన్నంతకాలం, కులం నంబర్ 1కి పెద్ద సమస్యలు లేవు.
కులం నంబర్ 2 ముఖ్యమంత్రులుగా వచ్చి నపుడు, హైదరాబాదు భూములపై వత్తిడి పెరిగింది. భారీగా కులం నంబర్ 2 వారు నగరంలో భూములు కొనటం ఎక్కువయ్యాక, ఈ రెండు కులాలే కాకుండా, ఇతల కులాలు కూడా రంగప్రవేశం చేయటంతో, కుమ్ములాటలు అధికమయ్యాయి.
ఆంటోనీ కమిటీ సిఫార్సులలో మొదటిది అంటే, 'హైదరాబాదులో సంస్థలకు కేటాయించిన భూముల హక్కులకు భంగం కలిగించే పాతతేదీనుండి వర్తించే చట్టాలను కొత్త తెలంగాణ ప్రభుత్వం చేయకూడదు' అనేది అక్రమంగానో, సక్రమంగానో, భారీగా భూములను కూడగట్టుకున్న వర్గాలు కోరే రక్షణ ఏర్పాట్లకు సంబంధించినదే. కెసిఆర్&కో మొదటి కోరిక కూడా ఇదే, ఈవర్గాలను బెదిరించి వసూళ్ళకు దిగటం. అంటే, తెరాస ఉద్యమాలకు మూలం, సమైక్యాంధ్ర ఉద్యమాలకు మూలం, హైదరాబాదు లోని,ఈ వందల వేలాది ఎకరాల భూములే.
ముఖ్యమంత్రులు -- కులం నంబర్ 1.
నీలం సంజీవరెడ్డి.
కాసు బ్రహ్మానందరెడ్డి, సుదీర్ఘకాలం.
మఱ్ఱి చెన్నా రెడ్డి.
నెదురుమిల్లి జనార్దన రెడ్డి.
భవనం వెంకట్రామ రెడ్డి.
కోట్ల విజయ భాస్కర రెడ్డి.
మఱ్ఱి చెన్నా రెడ్డి, రెండవసారి.
కోట్ల విజయభాస్కర రెడ్డి, రెండవసారి.
శ్రీవైయస్ రాజశేఖరరెడ్డి.
శ్రీవైయస్ రాజశేఖరరెడ్డి, రెండవసారి.
శ్రీకిరణ్ కుమార్ రెడ్డి.
ముఖ్యమంత్రులు -- కులం నంబర్ 2.
శ్రీనందమూరి తారక రామారావు.
శ్రీనాదెండ్ల భాస్కర రావు, స్వల్పకాలం.
శ్రీనందమూరి తారక రామారావు రెండవసారి.
శ్రీనందమూరి తారక రామారావు మూడవసారి.
శ్రీనారా చంద్రబాబు నాయుడు, సుదీర్ఘకాలం.
శ్రీనారా చంద్రబాబు నాయుడు, రెండవసారి, సుదీర్ఘకాలం.
ముఖ్యమంత్రులు -- కులం నంబర్ ౩ (కలగూరగంప).
దామోదరం సంజీవయ్య.
పీవీ నరసింహారావు.
జలగం వెంగళరావు.
టీ. అంజయ్య.
కొణిజేటి రోశయ్య , స్వల్పకాలం.
సారం: కులం 1, మనకు 11 మంది ముఖ్య మంత్రులను ప్రసాదించగా, కులం 2 మనకు ఐదుగురిని ఇచ్చింది. కులం ౩ లో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరూ పూర్తి టరమ్ చేసిన వాళ్ళు కాదు.
తెలంగాణా 2వ డామినేటింగ్ భూకులానికి ఇంత వరకు ముఖ్యమంత్రి పదవి ఒక్క సారి మాత్రమే దక్కింది. వారిలో కరీంనగర్, వరంగల్ ప్రాంతీయులు, ముఖ్యమంత్రి పదవి కొరకు ఆవుర్ ఆవుర్ అంటున్నారు. నోటిదాకా వచ్చిన కొత్త తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని మరల కులం నంబర్ 1 వారు ఎగరేసుకు వెళ్తారా, అనే ప్రశ్న తప్పదు. తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకుండా, స్వతంత్రంగా పోటీ చేస్తే, ఎన్నికల తరువాత వారు కాంగ్రెసుకు కేంద్రంలో మద్దతునిచ్చే ఏర్పాటు ఉన్నా, లేకున్నా, తెలంగాణలో భూకులాలన్నీ తమతమ ఐదు పార్టీల ద్వారా (కాంగ్రెస్, తెరాస, టిడిపి, బిజెపి, వైయస్ఆర్ కాంగ్రెస్) సంకుల సమరం చేయబోతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎవరు గెలుస్తారా అనే విషయంలో పెద్ద పట్టింపులు లేవు . 2014 లో కొత్త లోక్ సభలో తమకు మద్ధతు నిస్తారా లేదా అనేదే కీలకం. ఇవ్వకపోతే సిబిఐ సహకారం ఎలాగో ఉంటుంది.
సీమాంధ్రకు సంబంధించి నంత వరకు రాయల సీమ కులం కులం 1కి సోనియా ఏదో ఒక దారి చూపించ వలసి ఉంటుంది. అధిష్ఠానం దానిని గ్రహించే, శ్రీకోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపింది. ఆయన ఒప్పుకోలేదు, అనేది వేరే సంగతి.
ఇప్పుడు రాయలసీమకు రాజధానిని ఇస్తే విశాఖ, విజయవాడల్లో భూపెట్టుబడులు పెట్టిన నేతల గుండెలు ఆగిపోతాయి. If Capital of Andhra Pradesh is established in Rayala Sima, the leaders who invested in Visakhapatnam and Vijayavada will get heart attacks.
ఈసమస్యలన్నిటి నుండి, తెలుగు ప్రజలందరు బయట పడాలంటే అయిదు రాష్ట్రాలే మార్గం.
1. ఉత్తర తెలంగాణ, కరీం నగర్ , వరంగల్ మిలిటెంట్లను తృప్తి పరచటానికి.
2. దక్షిణ తెలంగాణ, కరీం నగర్ , వరంగల్ మిలిటెంట్లనుండి, నల్గొండ, ఖమ్మం, మహబూబునగర్ జిల్లాల సౌమ్యులను రక్షించటానికి.
౩. ఉత్తరాంధ్ర, విశాఖ అర్హతను గౌరవించటానికి.
4. దక్షిణాంధ్ర, ఆప్రాంతీయులు, విశాఖకో, కర్నూలుకో వలసపోయి, అక్కడ తాము బాధలు పడుతూ,ఇతరులను బాధ పెట్టకుండా ఉండటానికి.
5. రాయలసీమ. కోస్తాకు, సీమకు మధ్యలో నల్లమల కొండలు అడ్డు గా ఉండటం వల్ల. వారు విశాఖ వెళ్ళో, విజయవాడ వెళ్ళో, అక్కడ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తూ, కొన్నిసార్లు సోనియా మాత అనుగ్రహం పొందుతూ, కొన్ని సార్లు పొందకుండా, ఉన్న మతి కోల్పోకుండా.
Saturday, November 9, 2013
050 Part 1 of Shiva's Role in Vishnu Scriptures పోతన శ్రీమద్భాగవతంలో శివ వర్ణనలు Encomia of Lord Siva in Srimad bhAgavatam of Potana
శ్రీమద్ భాగవతం ప్రాధమికంగా విష్ణుకావ్యం. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల చరిత్రను వర్ణించటం, ఇందలి ప్రధాన కథాంశం.
పోతనగారు చేసిన భాగవతానువాదం, సంస్కృతంలో వ్యాసుడు వ్రాసినది. వ్యాస భాగవతం రూపొందేనాటికే, శివ వైష్ణవాల మధ్య కొంత మేరకు విభేదాలు తగ్గి, వైష్ణవ గ్రంధాలలో, శంకరుడి గొప్పతనాన్ని అంగీకరించటం ప్రారంభమయ్యింది.
వేరొకచిత్రాన్ని కూడ మనం ఊహించుకోవచ్చు. ఆదినుండి హైందవంలో శివ వైష్ణవులకు సమాన ప్రాధాన్యత ఉండేది. ఇతిహాసాల కాలంలో దేవాలయాల నిర్మాణంలేదు. నిర్గుణ బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా సంభావించటం మొదలయినా, దేవాలయాల నిర్మాణం ఇంకా మొదలు కాలేదు, లేక మొదలయినా ప్రారంభ దశలో ఉండి ఉండ వచ్చు.
దేవాలయాల నిర్మాణం ప్రారంభమయ్యి, దేవాలయాలు, పూజారులలో కొందరు బంగారం పోగుచేసుకోటం ఎక్కువయ్యాక, తమతమ గుళ్ళలోని దేవుళ్ళ గొప్పలను, మహిమలను, పెంచుకోటం కొరకు, వారిని సర్వ శక్తి మంతులుగా చూపటం, వారు ఇతర దేవతలను రక్షించి నట్లుగా చూపటం ఎక్కువయ్యింది.
పోతన గారి భాగవతానువాద కాలానికి, ఓరుగల్లులో దేవాలయాల నిర్మాణం, పక్వస్థాయికి చేరుకుంది. వేయి స్థంభాల దేవాలయం, రామప్పగుడి, వీటికి ప్రబల సాక్ష్యాలు.
పోతన్నగారు శ్రీరామభక్తి తత్పరుడే అయినా త్రిమూర్తులకు సమగౌరవం ఇచ్చాడు. శ్రీమద్ భాగవతంలో, పోతన్నగారి ఇష్టదైవతా ప్రార్ధనంలో త్రిమూర్తులూ ఉన్నారు.
శ్రీకైవల్య పదంబు చేరుటకునై నేను చింతించెదన్, లోకరక్షైకారంభకు అనే పద్యం శ్రీమహావిష్ణువుని ఉద్దేశించినది. ఇందులో, విష్ణుదేవుడి పాత్ర , సృష్టి, స్థితి, లయాల్లో, స్థితి == పోషణ,రక్షణ సుస్పష్టం.
ఇప్పుడు, పోతన్న గారి శివ స్తుతిని చూద్దాం.
ఉత్పలమాల పద్యం.
వాలిన భక్తి మ్రొక్కెద(న్) న (అ)వారిత తాండవ కేళికి దయా
శాలికి శూలికి శిఖరిజాముఖపద్మ మయూఖమాలికి
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహహాళికి.
అంత్యప్రాసా వైభవం చూడండి. కేళి, శాలి, శూలి, మాలి, మౌళి, కపాలి, ఉన్మూలి, సరసీరుహ అళి.
కేళి== ఆట. శాలి== కలవాడు. శూలి== బల్లెం ధరించినవాడు. మయూఖమాలి== కిరణాలు కలిగిన సూర్యుడు. మౌళి== కొప్పు. కపాలి== కపాలం ధరించేవాడు. ఉన్మూలి== నిర్మూలించినవాడు. ఆళి== వరుస.
అహో! బతా! ఆధునిక నాగరికతా వేగంలో మనకిట్టి పద్యాలు నోటికి రాకుండా పోతున్నాయే.
వైష్ణవ గ్రంధమైన శ్రీమద్ భాగవతంలో ఈశ్వర స్తుతి శిఖరాగ్రానికి చేరుకోటం, మనకు దక్ష యజ్ఞం ఘట్టంలో చక్కగా కనిపిస్తుంది. హాలాహాల భక్షణం ఘట్టంలో ఎంతో సత్యం, శివం,సుందరంగా, దర్శనమిస్తుంది. ఈపద్యాలు చూడండి.
మత్తేభపద్యం.పోతన గారు సాక్షాత్కరింప చేసిన ఈసుందర దృశ్యం మనం ఎన్నటికీ మరువలేము. తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు ఈజన్మ ధన్యమైంది. ఇంక మరణించినా భయం లేదు.
అమరన్ లోకహితార్ధమంచు అభవుండౌ గాక యంచాడె పో
యమరుల్ భీతిని మ్రింగవే యనిరి వో అంభోజగర్భాదులున్
తము కావన్ హరలెమ్ము లెమ్మనిరి వో తాఁ జూచి కన్గంట అ
య్యుమ ప్రాణేశ్వరునెట్లు మ్రింగుమనె అయ్యుగ్రానల జ్వాలలన్.
వచనం. అనిన శుకుండిట్లనియె.
కందం.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో.
మత్తేభ పద్యం.
తన చుట్టున్ సురసంఘముల్ జయజయ ధ్వానంబులన్ బొబ్బిడన్
ఘనగంభీరరవంబుతో శివుఁడు లోకద్రోహి హుం పోకు ర
మ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలం
బని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.
వచనం.: అయ్యవిరళ మహాగరళ దహన పాన సమయంబున
ఇంకో మత్తేభ పద్యం.
కదలంబారవు పాఁపపేరులొడలన్ ఘర్మాంబు జాలంబు వు
ట్టదు నేత్రంబు లెఱ్ఱగావు నిజజూటాచంద్రుడున్ కందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో జాయుచో
పదిలుండై కడి సేయుచో , తిరుగుచో, భక్షించుచో, మ్రింగుచోన్.
కడి అంటే ముద్ద. నేడు మనం అన్నానికి వాడటం లేదు. పేడకడి అనే పదగుఛ్ఛం గ్రామాల్లో వాడుకలో ఉంది.
కందం.
ఉదరము లోకంబులకును
సదనంబగుటెఱిగి శివుఁడు చటుల విషాగ్నిన్
కుదురుకొన కంఠబిలమున
పదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.
మరో కందం.
మెచ్చిన మచ్చిక కలిగిన
ఇచ్చిన ఈవచ్చు గాక , ఇచ్చన్ ఒరులకున్
చిచ్చు కడిగొనగ వచ్చునె
చిచ్చఱ రూపచ్చు పడిన శివునకుఁ దక్కన్.
ఆటవెలది పద్యం.
హరుడు గళమునందు హాలాహలము వెట్ట
కప్పు కలిగి తొడవు కరణి నొప్పె
సాధు రక్షణంబు సజ్జనులకునెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర.
వచనం.
తదనంతరంబ.
కందం.
గరళంబుఁ గంఠబిలమున
హరుఁడు ధరించుటకు మెచ్చి యౌననుచున్
హరియు విరించియు నుమయును
సురనాధుడు పొగడిరి సుస్థిరమతితోన్.
కందం.
హాలాహల భక్షణ కథ, hAlAhala bhakshaNa katha,
హేలాగతి విన్న వ్రాయ నెలమి బఠింపన్ hElA gati vinna nelami paThimpan,
వ్యాళానల వృశ్చికముల vyALAnala vrischikamula
పాలై చెడరెట్టి జనులుభయ విరహితులై. pAlai ceDareTTi janulu bhaya virahitulai.
Briefest gist of this verse: Those who read this story with devotion, will never be bit by snakes, fire and scorpions.
కొన్ని వైబీరావు గాడిద ఆలోచనలు.
౧. ఆఖరు పద్యం ఫలశృతికి చెందినది. ఈహాలాహల భక్షణ కథ చదివిన వారికి వచ్చే సత్ ఫలితాలు.
వ్యాళం= పాము. అనలం= నిప్పు. వృశ్చికం=తేలు. అంటే మనం వోల్వో బస్సు ఎక్కబోయేముందు ఈహాలాహల భక్షణ కథ చదివి, నిర్భయంగా బస్సు ఎక్కవచ్చు.
౨. విష్ణువు మరియు శివుఁడి మధ్యలో భేదం పాటించే వారికి , ఈహాలాహల భక్షణ కథ కనువిప్పు కలిగించాలి.
౩. పటేల్ నెహ్రూ లను ఒక విధంగా శివకేశవులతో పోల్చవచ్చు. వారి మధ్య ఏదో భయంకరమైన తీవ్ర అభిప్రాయభేదాలున్నాయని అడ్వాణీగారు ఎంత గిలగిలలాడినా, వారి ప్రయత్నం వృషణాల ప్రయాస అవుతుందేమో. అయితే వృషణాల ప్రయాస అనే పదగుఛ్ఛం కొంత అసభ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి వృధా ప్రయాస అంటే సరిపోతుంది.
#049 No SImAndhra leader to come forward to work as CM of AP ముఖ్యమంత్రిగా పనిచేయటానికి ఏనేతా ముందుకు రాకపోవచ్చు
రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీకోట్ల సూర్యప్రకాశరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వచూపినా, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, కాంగ్రెస్ ప్రతిష్ఠకు, భంగకరమని ఆయన గుర్తించి , తిరస్కరించటం ముదావహం.
రవాణా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణకు ఈ ఆఫర్ ఇచ్చి ఉంటే ఆయన ముందుకు వచ్చే వాడేమో. శ్రీమతి పురందేశ్వరి, పనబాక లక్ష్మి , కిల్లి కృపారాణి వంటి వారు కూడ ముందుకు వచ్చేవారేమో. కానీ కాంగ్రెస్ సంస్కృతిలో ముఖ్యమంత్రి పదవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒకేకులం వారికి దక్కుతూ ఉండటం గమనార్హం.
ఏది ఏమైనా పదవుల తాయిలాలను పంచిపెట్టి, తెలుగు వాళ్ళను లొంగతీసుకునే కాంగ్రెస్ అధిష్ఠానం ఇంద్రజాలాలకు కాలం చెల్లబోతుందని, కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించటం అవసరం.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అవన్ని, అడియాసలు కాకమానవు. సీమాంధ్రప్రజలకు న్యాయం చేస్తే ఆయనకు ఏమి లాభం వస్తుంది? ఆయన,గతంలో రాజీవ్ ని, సోనియామాతను ధిక్కరించి బెంగాల్లో దెబ్బ తిని ఆమె విశ్వాసాన్ని పొందలేక ప్రధాన మంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయి అతికష్టంమీద రాష్ట్రపతి పదవిని పొంది ఉన్నవాడు. అణకువగా ఉంటే రాష్ట్రపతిగా రెండవ టరమ్ లభిస్తుంది. లేకపోతే మాజీ రాష్ట్రపతిగా బెంగాల్లో చిన్న చిన్న చెరువుల్లో చేపలు పట్టుకుంటూ, శేషజీవితాన్ని గడపాల్సి వస్తుంది.
దిగ్విజయసింగ్ గారు, చెప్తున్నదాని బట్టి చూస్తుంటే, రాష్ట్రశాసనసభ అభిప్రాయాలను పట్టించుకోకుండా, కేంద్రమంత్రివర్గం తెలంగాణా బిల్లును ముందుకు నెట్టబోతుంది. లోకసభలో బిజెపికూడ కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యే సూ చనలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే అఖిల భారత పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీలుగా చరిత్రలో నిలబడపోతున్నాయి.
రాష్ట్రశాసనసభల తీర్మానాలను పట్టించు కోకపోటం అనేది అసాధారణమైన వాటిలో అసాధారణమైన కేసుల్లో (rarest of the rarest) కేసుల్లో జరగాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితులేమీ లేవు. శాసనసభలో సీమాంధ్ర,తెలంగాణా సభ్యుల మధ్య విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కారాలను వెతకాలి. అసలు ఈ పనిని కాంగ్రెస్, బిజేపీలు, 2004-2012 మధ్యలో ఎప్పుడో చేయాల్సి ఉంది. చేయకుండా ఎందుకు నిద్ర పోయారు? ఇప్పుడు, శాసనసభను కూడ పట్టించుకోకుండా, ఎందుకు చిందులు తొక్కుతున్నారు?
రాష్ట్ర విభజన అనేది, మాతృదేవతలు పడే ప్రసవ వేదనల వంటిది కాదు. సిజేరియన్ చేసి పిల్లను తీయకపోతే తల్లికీ, పిల్లకు ప్రమాదం అనే భయం ఇక్కడ ఇప్పుడు పొంచి లేదు.
పదవీవేదనతో బాధ పడుతున్న చంద్రశేఖరరావుకి సోనియామాత ఎందుకు భయపడుతున్నదో అర్ధంకాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఫిబ్రవరి 26, 1997 నాడు శ్రీ చంద్రశేఖరరావు ఏమన్నారో చూస్తే ఆయన నక్కజిత్తులు అర్ధం అవుతాయి.
"ఎవరి ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో , రాయలసీమ లో ఉద్యమాల కోసం ఏదో సమితి అనేది పెడుతున్నారు. రాయలసీమ లో రాయలసీమ విమో...చన సమితి, రాయలసీమ పోరాట సమితి, తెలంగాణ ప్రజా సమితి ఈ విధంగా అనేక పేర్లతో సమితి నాయకత్వాన ఉద్యమం చేపట్టే ఉద్యమకారుడు ఏదైనా ఉద్యోగం లభించినట్లయితే ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కాని వారికి హోదా వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించరు. పలు నినాదాలు వస్తున్నాయి. ఇందాక హౌస్ లో దామోదరరెడ్డి గారు స్లోగన్ తో సహా జైతెలంగాణ అని కూర్చున్నారు. ఈ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రిగారు తక్షణ చర్యలు చేపట్టాలి."
Friday, November 8, 2013
048 SUGGESTION OF SHRI KISHORE CHANDRA DEV శ్రీ కిషోర్ చంద్రదేవ్ గారి సూచన పరిశీలన
Mr. Kishore Chandra Dev is Union Cabinet Minister for Tribal Welfare and Panchayat Raj, in 2009-14 UPA2 Government. He is from the State of United Andhra Pradesh. He wanted Capital of Residual Andhra Pradesh, to be located at Visakhapatnam City, which is near to his Constituency, "Araku". According to him, the Capital of a State need not be in the Centre of its territory, geographically. This idea does not appear to be correct. But our Minister is an intelligent person. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గారు తమ లేఖలో ప్రస్తావించారని చెప్పబడుతున్న రెండు మూడు విషయాలు మనం తప్పక చర్చించ వలసినవి:--
సీమాంధ్రుల మధ్య అత్యంత కలహకారకమైనది: రాజధాని ఎక్కడ అనే ప్రశ్న.
కిషోర్ చంద్రదేవ్ గారి ప్రకారం రాష్ట్ర రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండనవసరం లేదు. ఈభావం సరి యైనది కాదు. రాష్ట్ర రాజధానులైనా, దేశరాజధానులైనా, వీలైనంత వరకు, భౌగోళికంగా మధ్యలో ఉండి, రవాణా సౌకర్యాల కలిగి ఉండాలి.
ఎందుకంటే సామాన్య ప్రజలకు కార్లు, హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు. వారు బస్సుల్లో, రైళ్ళల్లో తిరగాలి. వీలైనంత వరకు రాజధానిలో అదేరోజు పనిని పూర్తి చేసుకొని రాత్రి 11 గంటలలోపున కనీసం తన స్వంత మండల కేంద్రానికి వచ్చిపడి, అక్కడ ఏమడత మంచమో అద్దెకు తీసుకొని తెల్లారి లేచి తన పొలం లోకి పనికి వెళ్ళ గలగాలి. గ్రామీణులు, నగరాల్లో హోటళ్ళగదుల కిరాయిలను భరించ లేరు.
అనంతపురం వారికి విశాఖ షుమారు 700 km. వారు నల్లమల అడవులలో బడి విశాఖ వెళ్ళేదెలా, తిరిగి వచ్చేదెలా. అందు వల్ల రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం తప్పనిసరి.
కేంద్ర మంత్రిణిలు పురందరేశ్వరి, పనబాక లక్ష్మి మొ|| విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పాట అందుకున్నారు. గుంటూరు విజయవాడ నగరాలు ఇప్పటికే అతిగా పెరిగి భూకబ్జాలకు అడ్డాలుగా మారాయి. ఇంక అక్కడ రాజధానిని నెలకొల్పితే, ఆహా సొగసు చూడతరమా!
ఒంగోలు లో కూడా భూధంధాలు మొదలయ్యాయి.
కర్నూలును మొత్తం సీమాంధ్ర రాజధానిగా పెట్టటంలోనూ రెండు ప్రధాన సమస్యలు వస్తాయి.
మొదటిది. గుంటూరు కర్నూలు రోడ్, రైలుమార్గం దుస్థితి.
రెండవది. కర్నూలు లోకి కోస్తాంధ్రుల వలసలు తప్పదు. దీనికి తట్టుకోలేక రాయలసీమ ప్రజలు కూడా భవిష్యత్ లో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరవలసి ఉంటుంది. ఆ పనేదో ఇప్పుడు చేయటం లాభం. క్రొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం, రాష్ట్రాలను విడదీయటం అనేది రోజూ జరగవు. 10 ఏళ్ళకో, 25 ఏళ్ళకో గానీ ఆఅవకాశాలు రావు. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి. వీలైనన్ని ప్రత్యేక రాష్ట్రాలను రాబట్టుకోవాలి. వీలైనన్ని ప్రత్యేక ప్యాకేజీలను, కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాబట్టుకోవాలి.
ఒక చివర ఉండటాన విశాఖ కోస్తాంధ్ర మొత్తం రాష్ట్రానికి రాజధానిగా పనికి రాదు. అలాగని మనం ఉత్తరాంధ్ర వారి న్యాయపూరితమైన కోరికలను త్రోసిపారేయకూడదు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, వంటి ప్రదేశాలు కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం గా అవతరించటం అభిలషణీయం.
ఒంగోలు కేంద్రంగా దక్షిణాంధ్ర కూడ వాంఛనీయమే.
పెద్ద నగరాలు ఉగ్రవాద పేలుళ్ళకు స్థావరాలుగా మారుతున్న విషయం మనకు ఆఖరు సారిగా పాట్నా గాంధి మైదానం పేలుళ్ళు రుచితో తెలిసింది. కేంద్రం ఇంటెలిజెన్సు సమాచారం పంపించామంటుంది. రాష్ట్రాలు అందలేదంటాయి. 15 లక్షలు జనాభా దాటిన నగరాల నన్నిటిని కేంద్రం తన అధీనంలోకి తీసుకొని, ప్రత్యేక పోలీసు, నిఘా, దర్యాప్తు సంస్థలను ఏర్పరుచు కోవటం అవసరం. ఈవిధానంలో భాగంగా, హైదరాబాదును UT గా మార్చి తెలంగాణాకు వరంగల్ లేక సంగారెడ్డి లను రాజధానిగా పెట్తే, నగర వివాదం పరిష్కారం అవుతుంది.
రాష్ట్రాన్ని పలు చిన్నరాష్ట్రాలుగా విభజించే విషయాన్ని నేను సీమాంధ్ర ఎంపీలు పలువురికి ఈమెయిళ్ళుగా పంపాను. దురదృష్ట వశాత్తు వారినుండి ఏ స్పందనా లేదు.
చిన్న రాష్ట్రాలను ఏర్పరచేటపుడు, కనీస వైశాల్యం, కనీస జనాభా ఎంతఉండాలి అనే విషయాలపై శాస్త్రీయ అధ్యయనాలు అవసరం.
తెలుగు వాళ్ళకు ఇంకో 50 సంవత్సరాల అశాంతి పొంచి ఉన్నట్లే కనిపిస్తుంది. ఇదంతా చెన్నారెడ్డి, ఇందిర, సోనియా, కెసీఆర్, రాజశేఖర్, జగన్, బాబు, చిరు , వంటి నేతల స్వార్ధ రాజకీయాల ఫలితమే కాదా?
047 KCR's love of dharma is genuine or a stick to beat BJP with? कॆसीआर् के धर्म निरति प्रदर्शन असली है या बीजॆपी को मारने के लिये एक लाठी है బిజెపి తో పోటీనా నిజంగా ధర్మం అంటే ప్రేమేనా?
నిజాం నవాబు పాలనను ఎంత నెత్తిన పెట్టుకున్నా, మైనారిటి వోటర్ల మద్దతు తో పాటుమెజారిటీ వోటర్ల మద్దతు కూడ అవసరం అని శ్రీవారు గుర్తించి నట్లు వారు వ్యవహరిస్తున్నారు.
ఈమధ్య శ్రీవారు నగరంలో రవీంద్రభారతిలో, శ్రీపాలకుర్తి నృశింహరామ సిధ్ధాంతి గారికి ఘన సన్మానం జరిపించారు. కెసిఆర్ గారు సిధ్ధాంతిగారి పల్లకీని మోశారు. శ్రీపాలకుర్తి నృశింహరామ సిధ్ధాంతి గారికి పసిడి కంకణ ధారణకూడ చేయించారు. ఛాయాచిత్ కూడ పత్రికల్లో వచ్చింది.
ఈనాడు 5-11-2013, 11వ పేజీ చూడండి. శ్రీవారివి కొన్ని సుభాషితాలు మచ్చుకి:--
ధర్మం పునాదులపైనే దేశం .
దేశంలో ధర్మాత్ములు 98% ఉన్నారు. విఛ్ఛిన్నం చేసే వారు, లఫంగాలు , కేవలం 2% మాత్రమే.
త్వరలోనే అయత చండీ యాగం చేయాలని యోచిస్తున్నాను. దేశంలో గతంలో ఒకే ఒక్క సారి అయత చండీయాగం జరిగింది.
గతంలో శ్రీశృంగేరీ పీఠాధిపతి గారు తన పుట్టిన రోజు యాగం చేశారు. నేను కూడా అలాటి యాగం చేయాలని తలపెట్టాను. శ్రీపాలకుర్తి నృశింహరామ సిధ్ధాంతి గారి అధ్వర్యం లోనే నేనీ యాగాన్ని నిర్వహిస్తాను.
శ్రీకెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రధమ దళిత ముఖ్యమంత్రిని ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు యజ్ఞాలు, యాగాలూ చేసి, ఆయజ్ఞఫలంతో, చివరకి తన కొడుకునో, కూతురునో , అల్లుడినో, ప్రజలపై రుద్దుతారా? మన్మోహన్ ప్రధాని అయినా, అధికారం మొత్తం సోనియా మాత చేతిలో ఉన్నట్లుగా, దళితుడికి ముఖ్యమంత్రి అయ్యే సౌభాగ్యాన్ని కెసీఆర్ ప్రసాదించినా, అది కేవలం తన గుమాస్తాగాయే, అని వ్రాయనవసరంలేదు.
శ్రీవారికి యజ్ఞయాగాదులపై మొదటినుండి మోజు ఉన్నది. అయితే , బిజెపిని మించి పోవాలనే తపన, ఈకోరికను ఇనుమడింప చేస్తున్నదా?
ఆ రెండు శాతం లఫంగాలు ఎవరో తెరాస నేత శ్రీ చంద్రశేఖరేంద్రుల వారు చెప్పలేదు.
046 బ్రాహ్మణులు లేకపోతే కరువు వస్తుందా? Does a country suffer from famines, if there are no Brahmins?
మనుస్మృతి 8వ ఆధ్యాయం, 1 నుండి 150 శ్లోకాలు. లా విద్యార్ధులకు ఉపయోగం.
Click.
or లేక ఇంకొక హోస్ట్ ayyo.x10.mx. నుండి.
Click.
మనుస్మృతిని పలు విశ్వవిద్యాలయాలలో న్యాయ శాస్త్ర విద్యార్ధులకు పాఠ్య గ్రంథంగా నిర్దేశించారు. ఒకసారి 8 వ ఆధ్యాయం, 22వ శ్లోకం చూద్దాం.
08-022
యద్రాష్ట్రం శూద్ర భూయిష్టం
నాస్తికా క్రాంతం అద్విజం
వినశ్యత్యాశు తత్కృత్స్నం
దుర్భిక్షం వ్యాధి పీడితం.
తాత్పర్యం: ఏరాజ్యం లో నయితే శూద్రులు మిక్కుటముగా ఉంటారో, ఏరాజ్యం అయితే నాస్తికులతో లుకలుకలాడుతూ ఉంటుందో, ఏదేశంలో అయితే ద్విజులు నివసించరో, ఆదేశం కరువు కాటకాలు, వ్యాధులతో బాధ పడుతూ ఉంటుంది.
వ్యాఖ్యానం : అమెరికాలో, ఇంగ్లండులో, రష్యాలో, బ్రాహ్మణులు ఉండరు. ఆదేశాల్లో నాస్తికులు బహుళంగానే ఉన్నారు. అక్కడ అధిక సంఖ్యాకులు శూద్రులే. మరి ఆదేశాలు సుభిక్షంగానే ఉన్నాయి. దీన్ని బట్టి మను స్మృతి ఎలాటి పుస్తకమో మనం అర్ధం చేసుకోవాలి.
భారత్ లో, ఆంధ్రప్రదేశ్ లో, ద్విజులు తగిన సంఖ్యలోనే ఉన్నారు. అయినా, భారత్ లో, ఆంధ్రప్రదేశ్ లో, కరువు కాటకాలు , వరదలు, బాగానే వస్తూ ఉంటాయి. దీని భావమేమి తిరుమలేశ?? ఒక దేశంలో, లేక, ఒకరాష్ట్రంలో, ఒకకులంవారో, ఒకమతంవారో, ఒకవృత్తివారో, ఎంతమంది ఉన్నారు అనేవిషయానికీ, ఆదేశంలో వచ్చే ప్రకృతి విపత్తులకూ, అనులోమ సంబంధంగానీ, విలోమసంబంధంగానీ, పరోక్ష సంబంధంగానీ ఉండదు.
Thursday, November 7, 2013
045 Part 2 of పటేల్_నెహ్రూ పోలికలు 2వ భాగం. Advani's comparison of Patel & Nehru,Part 2
ఏదో విధంగా , పటేల్ గారిని జగదేకవీరుడు, అతిలోకసుందరుడు గాను, నెహ్రూగారిని అసమర్ధుడు గానూ నిరూపించి , పటేల్ గొప్ప తనానికి తనను వారసునిగా ప్రకటించకోవాలనే తాపత్రయం శ్రీ ఎల్ కె అడ్వాణీ గారిలో ప్రవేశించి ఆవేశించి నట్లు కనిపిస్తుంది.
జవహర్ లాల్ నెహ్రూ యొక్క వారసులం, తామని ప్రకటించుకునే హక్కు నెహ్రూ కుటుంబానికే లేదు. ఎందుకంటే నెహ్రూ గారి యొక్క సిధ్ధాంతాలకు, ఆయన స్వప్నాలకు ఇందిరాగాంధీ కాలంలోనే తిలోదకాలు ఇవ్వటం జరిగింది. నెహ్రూ నిర్మించుకున్న సౌధాలకు , నెహ్రూకుటుంబ పాలన నేడు మిగిల్చింది మొండిగోడలే.
పటేల్ గారికి వారసులు తామని బిజెపీ వారు అనుకుంటే, అప్పుడు వారు సావర్కార్, గోల్వల్కర్ల వారసత్వాన్ని కోల్పోతారు. పార్టీల సిధ్ధాంతాలు అనేవి ఎలా పడితే అలా లాగటానికీ పీకటానికీ, పీచుమిఠాయిలు కావు. అవో ఇవో, అంతేకానీ రెండూ కావు.
పటేల్ నెహ్రూల గొప్పతనాలను పోల్చటం అర్ధం లేని పని. ఎందుకంటే, ఎవరి గొప్పతనాలు వారికి ఉంటాయి. ఎవరి లోపాలు వారికి ఉంటాయి. వారి మధ్య సిధ్ధాంతిక విభేదాలు తీవ్రమైనవే ఉండి ఉండ వచ్చు. అయితే వారు కలసి నిర్మాణాత్మకంగా పనిచేయటానికి ఆ విభేదాలు అడ్డురాలేదు. వారి మధ్య జరిగిన చిన్నచిన్న కీచులాటలను అడ్వాణీగారు అదే పనిగా, పైగా సరియైన సాక్ష్యాలు లేకుండా కేవలం చేతులుమారిన సెకండ్ హ్యాండ్ సమాచారం ఆధారంగా, వేలెత్తి చూపటం సరికాదు.
స్వాతంత్ర్యానంతరం పటేల్ దీర్ఘకాలం జీవించి లేరు. ఉంటే ఏమి జరిగి ఉండేది అనేది ఉహాజనితమైన ప్రశ్న. రాజాజీ లాగా వేరే పార్టీ పెట్టుకునేవారా, లేక రాజకీయాల నుండి విరమించేవారా,లేదా సర్దుకుపోయి నెహ్రూజీ మరణానంతరం ప్రధాని అయ్యే వారా, ఇవి అన్నీ పరిశీలనకు పనికి వచ్చినా చరిత్ర అవవు.
గాంధీగారికి కూడా, ఈ ఆల్టర్ నేటివ్ లు వర్తిస్తాయి. స్వాతంత్ర్యానంతరం గాంధీజీ దీర్ఘకాలం జీవించి లేరు. ఉంటే ఏమి జరిగి ఉండేది అనేది ఉహాజనితమైన ప్రశ్న. రాజాజీ లాగా వేరే పార్టీ పెట్టుకునేవారా, లేక తన నిర్మాణాత్మక సంఘ సంస్కరణా కార్యక్రమాలనూ, గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వారా, లేదా ప్రార్ధనలకు_పత్రికా రచనలకు అంకితమయ్యేవారా, ఈప్రశ్నలన్నీ, అన్నీ పరిశీలనకు అర్హమైనవే అయినా, చరిత్ర అవవు.
ఇంక, శ్రీఅడ్వాణీగారు భారత ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేశారు. శ్రీ పటేల్ గారి ఆదర్శాలను ఏమాత్రం ఆచరణలోకి తెచ్చారు అనేది అనుమానాస్పదమే. భారత ప్రయాణీకుల విమానాన్ని తాలిబాన్లు (లేక కాశ్మీర్ తీవ్ర వాదులు) కాబూల్ కు హైజాక్ చేసినపుడు, హోంమంత్రిగా శ్రీవారు ఎంత దృఢంగా వ్యవహరించారో చరిత్ర చెప్తుంది. వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే, పాలక్యారేజీ తీసుకొని గుళ్ళకు పరుగెత్తే మన శ్రీ అడ్వాణీవారు, సీమాంతర తీవ్రవాదం అని మొత్తుకోటం తప్ప ఎన్ని దృఢ నిర్ణయాలు తీసుకున్నారో చరిత్రే చెప్తుంది.
2013 విషయానికి వస్తే, నరేంద్రమోడీ గారు , శ్రీఅడ్వాణీవారిని బిజెపీ పార్లమెటరీ బోర్డు నుండి గెంటి వేయలేదనే తప్ప , తత్సమానమైన పరిస్థితులనే కల్పించారు. రాజాజీ లాగా వేరే పార్టీ పెట్టుకునేవారా, లేక రాజకీయాల నుండి విరమించేవారా,లేదా సర్దుకుపోయి నెహ్రూజీ మరణానంతరం ప్రధాని అయ్యే వారా, వంటి ప్రశ్నలు శ్రీఅడ్వాణీవారికి కూడా వర్తిస్తాయి. శ్రీఅడ్వాణీ, నరేంద్రమోడీ , రాజ్ నాథ్ ల మధ్య ఏమి రహస్య సమాలోచనలు జరిగాయో కానీ భీష్మపితామహులవారు, నిజంగా భీష్మపితామహులవలెనే యుధ్ధరంగంలోకి దిగారు. అయితే, సుయోధనుడు భీష్మపితామహులవారిని మనసా వాచా కర్మణా నమ్మి గౌరవించారు. మోడీజీకి సుయోధనుడికి ఉన్న నిజాయితీ ఉన్నదా, లేదా అనేది ప్రశ్నార్ధకం.
#044 తెలంగాణా తెలుగుదేశం telangANa telugu dESam may have to separate
తెలంగాణా తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా ఎర్రబిల్లి దయాకర రావు గారు ఇరుకులో పడిపోయి నట్లు కనిపిస్తుంది. ఏఎండకు ఆగొడుగు పట్టే శ్రీచంద్ర బాబు నాయుడు గారిని నమ్ముకున్నందు వల్ల కలిగిన దుస్థితి.
ఇప్పుడు వేరొక మార్గం లేదు. తెలుగుదేశం తెలంగాణా విభాగం వారు, తెలంగాణ తెలుగుదేశం పేరుతో కొత్త పార్టీని పెట్టుకోటమే మేలు. పార్టీ ఆస్తుల పంపకాల వివాదాలు వచ్చినప్పుడు , వాటిని న్యాయస్థానాలను ఆశ్రయించుకోటం ద్వారా పరిష్కరించుకో వచ్చు.
తెలంగాణా ఉద్యమంలో జరిగిందాన్ని ఒకసారి పునః పరిశీలించుకోటం మేలు.
తెరాస నేతల, టీజెకెసీ నేతల దుర్బోధనలు, తెలంగాణా ప్రజలపై చాల దుష్ప్రభావాన్ని చూపాయి. తెలంగాణ ఉద్యమంలోకి సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయి. (ఇలాంటివే,సమైక్యాంధ్ర ఉద్యమంలోకి కూడ కొన్ని చోట్ల జరిగాయి. ఈవిషయాన్ని దానికి సంబంధించిన వ్యాసంలో పరిశీలించటం జరుగుతుంది). వారి విధ్వంసక చర్యల వల్ల, తెలంగాణ అతివాదాన్ని సమర్ధిస్తే తప్ప తెలంగాణ నేతలు రోడ్లపై తిరగలేని పరిస్థితులు వచ్చాయి. ఈకారణం వల్లనే తెలంగాణ నేతలు వారే పార్టీ వారైనా, మధ్యే వాదాన్ని వదిలేసి, అతివాదులుగా మారక తప్పని పరిస్థితులు వచ్చాయి.
తెలంగాణా అతివాదుల కోరికలు అసమంజసమైనవి. తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం, ఉద్యమాలను నడుపుకోటంలో తప్పులేదు. హైదరాబాదు నగరాన్ని కోరుకోటంలో కూడ తప్పు లేదు. వారు పటేల్ ను, పోలీస్ యాక్షన్ ను తిట్తూ, నిజాం నవాబునైనా నెత్తిన పెట్టుకోటానికి సిధ్ధ పడుతున్నారు తప్ప ఈదేశంలో ఒక ప్రాంతం వారికి ఏమి హక్కులు ఉంటాయో, ఉండవో అనే విషయాన్ని అర్ధం చేసుకోటంలేదు.
ఈదేశ వాసులకు ఈదేశంలో ఎక్కడైనా పొట్టకొరకు తిరిగే హక్కులు, చిన్నచిన్న ఆస్తులు కొనుక్కునే హక్కులు ఉంటాయి. ఆవిషయాన్ని మర్చిపోయి, ఎవరినో పంపించేయాలి, తరిమేయాలి, అని తెలంగాణ అతివాదులు ఆలోచిస్తున్నారు.
ఏది ఏమైనా, తెలంగాణ తెలుగుదేశం నేతలు, తమ ప్రజలముందు తమ ముఖాలను చూపాలంటే ఒక ప్రత్యేక పార్టీగా అవతరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డాక, వారైనా, విభజన విషయంలో కొంత ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటానికి ప్రయత్నిస్తే మేలుగా ఉంటుంది.
Wednesday, November 6, 2013
043 Have lions on tombs సమాధులపై సింహాలు
భారతీయులకు తమ వారసత్వ బానిసత్వంలో భాగంగా (లేక బానిసత్వ వారసత్వం) బ్రిటీష్ వాళ్ళను అనుకరించే అలవాటు ఉంది.
భారతీయ చట్టసభల స్పీకర్లకు , న్యాయమూర్తులకు, అనుమానాలు వచ్చి నపుడు, ఇంగ్లండు చట్టసభలు ఏమి చేశాయి, ఇంగ్లండు కోర్టులు ఏమి చేశాయి, అని వెతికే అలవాటు ఉంది.
దక్కన్ క్రానికల్ పత్రిక 5-11-2013 సంచికలో, Deborah Ross వ్రాసిన The joy of cemeteries అనే వ్యాసాన్ని ప్రచురించింది. ఈ వ్యాసం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. చదవదలచిన వారికి లింకు: క్లిక్ చేస్తే దక్కన్ క్రానికల్ పత్రిక 5-11-2013 వ్యాసం .
ఈవ్యాసంలో ఒక ముఖ్య అంశం: Ann Treneman అనే రచయిత్రి Finding the Plot: 100 Graves to Visit Before You Die first అనే పుస్తకాన్ని వ్రాసింది. ఈ పుస్తకరచనా పరిశోథన లో భాగంగా ఆమె ఒక వంద సమాధులను దర్శించి వాటిని లోతుగా పరిశీలించి, తాను గమనించిన విషయాలను, తన గ్రంథంలో పొందు పరచింది.
గమనించిన ఒక ముఖ్యమైన అంశం: సమాధులపై తమ పెంపుడు కుక్కల శిల్పాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వటం. వాటిని సింహాలుగా వర్ణించటం.
అయితే బ్రిటీష్ వాళ్ళు తమ పెంపుడు కుక్కలకు ఇచ్చినంత ప్రాధాన్యం తమకు అత్యంత విశ్వశ్వనీయులుగా వ్యవహరించిన సేవకులకు,అనుచరులకు,ఇవ్వలేదు. వారి శిల్పాలు సమాధులపై కన్పించవు. బ్రిటీష్ ప్రధానమంత్రులకు, వారి అనుచర ఎంపీలకు , ఈపెంపుడు కుక్కల సంబంధం ఉన్నట్లు కనపడదు. కానీ భారత్ లో ప్రధానమంత్రులకు, పార్టీల అధ్యక్షులకు, అధ్యక్షురాండ్రకు, ఈ ఋణానుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి ఎంపీలు, ఎంఎల్ఏలు, తమ ప్రధాన మంత్రులకు, ముఖ్య మంత్రులకు, పార్టీ అధినేతలకు, కుక్కల వలె భౌభౌ రక్షణ సేవల నందించటమే కాక గుళ్లు గోపురాలూ కట్టిస్తూ ఉంటారు. కానీ అనుచరులకు తమ నేతలపై ఉండే అభిమానం, నేతలకు తమ అనుయాయులపై ఉండాల్సిన కృతజ్ఞతలో ప్రతిఫలించదు. అంతా వన్ వే ట్రాఫిక్. క్రికెటర్లు, సినీతారలు, వంటి సెలబ్రిటీల విషయంలోనూ ఇదే తంతు.
అయితే రాజకీయనేతలలో బహుకొద్ది మందికి మాత్రమే ఢిల్లీలో ఎకరాలకొద్దీ ప్రభుత్వ స్థలాల్లో సమాధులను నిర్మించుకునే భాగ్యం కలుగుతుంది. ఉదా: మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికీ భాగ్యం కలుగలేదు.
ఎకరాలెకరాలలో తమ సమాధులను నిర్మించుకునే భాగ్యం కల్గు నేతలు, నిర్మించే వారసులు, అనుయాయులను మరువరాదు. తమకు కుక్కల్లాగా వ్యవహరించిన వారిని , గుళ్లు గోపురాలూ నిర్మించిన వాళ్ళను చరిత్రలో శాశ్వత స్థానం కల్పించక పోతే ఎలా? తమ సమాధులపై, లేక ప్రక్కన, వారి కనీసం బస్ట్ స్థాయి విగ్రహాలను ప్రతిష్ఠించి, వారిని సింహాలుగా వర్ణిస్తూ ఫలకాలను, కవితలను వ్రాయించాలి.
కృతజ్ఞత అనేది కుక్కలకే కాకుండా యజమానులకు కూడా ఉండ వలసిన గుణం.
ముగింపు: ఉర్దూలో ఒక సామెత ఉంది. جان حای تو جحان حے۔ . జాన్ హయ్ తో జహాన్ హయ్. దీని అర్ధం, ప్రాణం ఉంటే కదా, విశ్వం ఉండేది. గీత: జాతస్య మరణం ధృవం. పుట్టిన వాడు గిట్టక తప్పదు అని గీత చెప్పినా, ప్రాణం విలువ ప్రాణానిదే. సమాధుల పాత్ర ఊహాజనితమైనది. మన నాయకులు ఉర్దూ సామెతకే ఎక్కువ విలువ ఇచ్చి వేలకోట్లు పోగు చేసుకుంటున్నారు. వైయస్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా జీవించి ఉండి కత్తెరల నాడిస్తున్న నేతలు సుజ్ఞానవంతులే కదా.
Tuesday, November 5, 2013
042 వోల్వో బస్సుకు 45 మంది ఆహుతి Volvo bus consuming 45 people in Andhra Pradesh
అక్టోబర్ 2013 లో మహబూబ్ నగర్ జిల్లా , పాలెం సమీపంలో జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాదం 45 మందిని బలి తీసుకున్న దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి తనదేమీ బాధ్యతలేదని చెప్పి రాజీనామా చేయటానికి తిరస్కరించటం మన మంత్రులు ఏస్థాయిలో ఉన్నారో నిరూపిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా వోల్వో బస్సులు అత్యవసర ద్వారాలు లేకుండా తిరుగుతున్నాయని రవాణా మంత్రి గారికి తెలుసా తెలియదా? ఆయన ఎప్పుడైనా ఏదైనా వోల్వో బస్సును ఎక్కి అక్కడి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారా? వాటిని తక్షణమే ఏర్పాటు చేయమని దిశానిర్దేశం చేశారా? పోనీ రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులెవరికైనా ఈ పని చేయమని ఆదేశించి, వారా పని చేశారా లేదా అని సమీక్షించారా? ఉన్నతాధికారులు, మంత్రిగారు, వేలాది రూపాయల జీతాలు, పెర్కులు తీసుకంటున్నారు. తానంటే జోడు పదవుల రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్నాడు. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఉన్నతాధికారులు దేనితో తలమునకలై యున్నారు?
వోల్వో బస్సులలో అత్యవసర ద్వారాలు లేనందు వల్ల అవి ప్రమాద భరితాలని రాష్ట్ర రవాణా మంత్రి గారు , ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంలోని ఆటోమోబైల్ డిజైన్లకు ఆమోదాన్ని తెలిపే శాఖకు అత్యవసర పత్రాన్ని వ్రాశారా? రకరకాల వ్యాపారాలలో తలమునకలై ఉన్నందు వల్ల కుదరలేదా? రవాణా శాఖ మంత్రి గారికి తీరిక లేకపోతే తీరిక ఉండే శాఖకు మారవచ్చు. లేదా జోడు పదవులలో ఒకదానిని వదిలి వేయవచ్చు.
వోల్వో బస్సులో నిర్దేశించ బడిన భద్రతా ఏర్పాట్లను చూస్తుంటే నవ్వు రాకమానదు. ప్రతి మూడు కిటికీలకు ఒక సుత్తి పెట్టాలిట. దీనితో ప్రయాణీకులు అద్దాలను పగులగొట్టుకొని బయటకు రావాలిట! ఇంకా నయం, ప్రయాణీకులను టార్చిలైట్లతో పాటు ఒకసుత్తిని కూడా చంకలో పెట్టుకొని రమ్మనలేదు. ఇప్పటికైనా ప్రయాణీకులు ఈ అలవాటును మొదలు పెట్టుకోటమే కాకుండా, అద్దాలను పగులకొట్టటం పగులకొట్టటం, కిటికీల్లోంచి దూకటం , అభ్యాసం చేయాలి. ఈసూత్రాల రైలు ప్రయాణాలకు కూడ వర్తిస్తాయి. రైలు ప్రయాణాలకు అదనంగా మరొక సూత్రం కూడా ఉంది. ఒక హ్యాక్ సా బ్లేడ్ ను కూడ వెంట తీసుకు వెళ్ళి కిటికీ చువ్వలను కోయటం అభ్యసించాలి.
ఇప్పటికైనా, రవాణా మంత్రిగారు , బాధ్యులైన రవాణా శాఖ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తారా, చేయరా?
వోల్వో బస్సులు అఖిల భారత స్థాయిలో , బహుశా ఎగుమతులకుకూడా, తయారవుతాయి. అత్యవసరద్వారాలు ఉంటే శీతల యంత్రాలు సరిగా పనిచేయవని వాహన డిజైనర్లు భావించి సుత్తుల ఏర్పాటు సూచించి ఉండవచ్చు. వోల్వో బస్సుల ధరలు, ఛార్జీలమోతా చాలా ఎక్కువే. ఆ బస్సుల డిజైన్లను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ ఆధికారులపై చర్యలు అవసరం. ఇది కేంద్రంలో ఏశాఖ పరిధి లోకి వస్తుందో తెలియదు. ఉపరితల రవాణా శాఖ కిందికి రావచ్చు. లేదా పరిశ్రమల శాఖ పరిధిలోకి రావచ్చు.
మత తత్వ ఉగ్రవాద పేలుళ్ళను, విద్రోహచర్యలను ఎలాగూ నిరోధించలేక పోతున్నాం. కనీసం, వాణిజ్య అశ్రధ్ధనైనా సరిదిద్ద లేక పోతే ఎలా.
Monday, November 4, 2013
041 Some Musings on Religious conversions మతాంతరీకరణలు -మతాంతరీకరణ నిరోధీకరణలు
India is a poor country. But it has a pluralist ancestry and culture, with extra-ordinary religious tolerance. But, tolerance and religious freedom seems to be misused by some Missionaries receiving funds from abroad. Missionaries engaging themselves in activities of Religious conversions of innocent persons has become a very lucrative business in India. In the guise of running hospitals, orphanages, schools, this business goes on with targets for number of persons converted.
భారత్ లో కొండల్లో అడవుల్లో వందలాది గిరిజన ప్రాంతాలున్నాయి. అందరిదీ ఒకే సంస్కృతి కాదు. వారు తమకు నచ్చిన స్థానిక దేవతలను తమకు నచ్చిన పధ్ధతులలో కొలుచుకుంటున్నారు. ఈగిరిజనులు ఎన్నో వేల ఏళ్ళ బట్టీ ఈపధ్ధతిలో జీవస్తున్నారు. వారి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు, శాంతి, వారికి ఉన్నాయి.
వారి ప్రధాన సమస్యలు , ఇతర భారతీయులకు వలెనే తిండి,గుడ్డ,గూడు,ఆరోగ్యం,విద్య ,వృధ్ధాప్యంలో భద్రత,రవాణా సమాచార సౌకర్యాలలేమి, ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అవినీతి మయమైన వైనా , ఈ సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తున్నాయి.
పావురాల గూడు లోనికి పిల్లులు దూరినట్లుగా, పక్షులగూడులోనికి పాములు దూరినట్లుగా, గిరిజన ప్రాంతాల్లోకి సేవ నెపంతో విదేశీ, స్వదేశీ మతప్రచారకులులు చొరబడ్డారు. భారత్ లో మతమార్పిడీలు, సేవ స్థానంలో వ్యాపారాలుగా మారాయి. ఎంత మందిని మతం మార్చారు అనే దానిని బట్టి విదేశీ నిధులు వస్తు ఉంటాయి. ఆర్ధిక అవసరాల్లో ఉన్న గిరిజనులను ఆదుకుంటున్నట్లుగా కనిపిస్తూ, విదేశీ నిధుల్లోంచి కొంతభాగాన్ని వారికి అందిస్తూ, మిగిలినవి తాము మింగుతూ, ఈవ్యాపారం మూడు పూవులూ ఆరుకాయలుగా విస్తరిస్తున్నది.
భారత రాజ్యాంగం పౌరులకు మత స్వాతంత్ర్యాన్నీ, మతప్రచారహక్కునూ, హామీ ఇస్తున్న మాట నిజమే అయినా, ఈహక్కు అనంతమైనది కాదు.
గిరిజనుల్లో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులు. ఎన్నో బాధల్లో ఉన్న వాళ్ళు. అలాటి వాళ్ళకు మేం ప్రార్ధనలు చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది, దేవుడు మీ దరిద్రాన్ని పోగొట్టి అన్నీ ఇస్తాడు అని మాయమాటలు చెప్పి మతమార్పిడీలకు పూనుకోటం రాజ్యాంగం ప్రసాదించిన స్వాతంత్ర్యాలను దుర్వినియోగం చేయటమే అవుతుంది.
మతం మారాలనుకునే వ్యక్తి తన మతం లోని మత గ్రంధాలను క్షుణ్ణంగా చదవాలి . ఇతర మత గ్రంధాల్లోని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తనమతంలోని వ్యక్తులతో చర్చించాలి. ఇతరమతాల వ్యక్తులతోనూ చర్చించాలి. గుణదోషాలను బేరీజు వేసుకోవాలి. చాలాసార్లు ఒక జీవితకాలం సరిపోదు. ఆషామాషీగా , వ్యాపారులుగా మారిన మతప్రచారకులు చెప్పే కల్లబొల్లి విషయాలను నమ్మి, చడీచప్పుడు లేకుండా మతం మార్చుకోటం, కుటుంబ సభ్యులను కూడా మారమని బలవంతపెట్టటం , తాముకూడా అరకొర మత జ్ఞానంతో మతప్రచారాలకు దిగటం ఏమాత్రం సమంజసం కాదు. తాము ప్రచారం చేస్తున్న మతం యొక్క పవిత్ర గ్రంధాల్లోంచి గట్టిగా రెండు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేని ప్రచారకులు ఇతరులకు ఎలా దారి చూపగలుగుతారు?
మతం మారిన వారు కొంత మంది , తమ కొత్త మతం విషయాన్ని ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. తమ అంతరాత్మలను తామే మోసగించుకున్నట్లు అవుతుంది. అయితే ఈ విషయంలో అట్టి వారిని , వారి దరిద్రాన్ని, నిరక్షరాస్యతను దృష్టిలో ఉంచుకుంటే తప్పు పట్టలేము.
మతప్రచారకులు పెట్టే బాధలు చాలనట్లు, గిరిజన ప్రాంతాల్లోకి స్వామీజీలు ప్రవేశిస్తున్నారు. ఈ స్వామీజీల నమ్మకం ఏమిటంటే తాము ప్రచారం చేసే యజ్ఞాల మంత్రాల పూర్ణాహుతుల మతమే సరియైన భారతీయ మతం, మిగిలినవి కాదని. నిజానికి హిందూ మతం భారతదేశంలో నివసించే అందరియొక్క సమష్ఠి జీవన విధానమే తప్ప మంత్రాల మఱ్ఱి కాదు. ఇది ఒక్క వ్యక్తి స్థాపించినది కాదు. రకరకాల పధ్ధతులను, దేవుళ్ళను, దేవతలను, ఆచారాలను ఆమోదించే ఒక సమష్ఠి సంఘం. తాము బోధించేవే సరియైనవి అని జనాలపై తమ నమ్మకాలను రుద్దే హక్కును సంఘం స్వాములకు, పీఠాధిపతులకు ఇవ్వలేదు. వారికి రియల్ ఎస్టేట్లవారు, అవనీతి పరులైన అధికారులు, నల్లబజారు వ్యాపారులు, భారీగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి , తాము ఆప్రోత్సాహాన్ని, ప్రజల్లో విభేదాలు సృష్టించటానికి వినియోగించ వచ్చు అనే అర్ధాన్ని వారు తీసుకొని చెలరేగి పోకూడదు.
స్వమత రక్షణ అంటే పరమత ద్వేషం కారాదు. స్వమత రక్షణ లోని ప్రధాన లక్షణం , స్వమతం లోని లోపాలను సవరించుకోటం. దాన్ని ఇంకా ఆనందకారకంగా మార్చుకోటం. అప్పుడు ఎవరికీ ఇంకో మతానికి వెళ్ళ వలసిన అవసరమే కలుగదు. అక్కడ లభించే సంతోషం ఇక్కడ లభించే సంతోషం కన్నా ఎక్కువగా ఉండదు కాబట్టి.
రెండు మూడు మతాల ప్రచారకులు, వాటి నిరోధకులు, ఒకే చోట దుష్ప్రచారాలకు పూనుకొని కత్తులు దూసుకొటం వల్ల హత్యలు, మతకలహాలు జరుగుతాయి.
ప్రభుత్వం ఇల్లు బూడిదై పోయింతరువాత మొండి గోడలపై నీళ్ళు చల్లినట్లు మొక్కుబడి దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతను మరుస్తున్నది.
మత మార్పిడీలను నిషేధించ వలసిన అవసరం లేదు. ఒక నియంత్రణా అథారిటీని నెలకొల్ప వలసిన అవసరం ఉంది. ఇవి కోర్టుల్లాగా పనిచేయాల్సి ఉంటుంది. మతం మార్చుకో దలుచుకున్న వాడు, మతమార్పిడీ అనుమతి కోర్టుకు తన దరఖాస్తును ఇవ్వాలి. న్యాయమూర్తి ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియచేసి అభ్యంతరాలను ఆహ్వానించాలి. మార్పిడీ కోరుతున్న వ్యక్తి పూర్తిగా స్వంత బుధ్ధిని, వినియోగిస్తున్నాడా, అన్ని మతాల సారం తెలిసిన వాడేనా, అన్ని మతాల సారం ఒకటే నని తెలిసి కూడా మతం మారటానికి బలవత్తరమైన కారణమేమిటి, అనే విషయంపై దర్యాప్తు చేయాలి. అవసరమైతే దరఖాస్తుదారుకు, అతడిప్రోత్సాహకులకు, లిఖిత పరీక్షలు నిర్వహించాలి. అతడు తన స్వంత విజ్ఞానంతో, ఏ ప్రలోభాలు లేకుండా , నిర్హేతుక భయాందోళనలకు గురి కాకుండా, మతం మార్పిడీకి నిర్ణయించుకున్నాడని ధృవ పర్చుకున్నాకే, అనుమతి డిక్రీ ఇవ్వాలి.
మతమార్పిడీ 100% వ్యక్తిగత విషయం కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల మతాల్నీ, కులాల్నీ, ప్రభుత్వం, చట్టం, పిల్లలకు అంటగట్టుతున్నాయి. వీటినిబట్టి రిజర్వేషన్లు మొదలగునవి నిర్ణయం అవుతున్నాయి.
పుట్టుక అనేది యాదృఛ్ఛికం. ఏమతంలో , ఏకులంలో పుట్తారు అనేది ఇంకా యాదృఛ్చికం. నిజానికి 18 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు పిల్లలకు కులం, మతం ఉండకూడదు. తాము ఏకులం, ఏమతం అనేది మానసిక పరిపక్వత, మతాలకు సంబంధించిన సమాచారం సేకరణ, విశ్లేషణలు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులతో సమాలోచనలు, పూర్తి అయ్యాక, విచక్షణతో, యువతీ యువకులు, తమకు అసలు మతం అవసరమా, అవసరమైతే ఏ మతం, ఆమతంలో ఏవర్గం, అనేది నిర్ణయించుకోవాలి.
ముగింపు: విదేశ మతాలు, స్వదేశ మతాలు, గిరిజనుల స్వేఛ్ఛా స్వాతంత్ర్యలలో జోక్యం చేసుకోకుండా, బలహీనులపై మతాంతరీకరణలను రుద్దకుండా, నియంత్రణా చట్టాలను, అమలు కోర్టులను, ఏర్పాటు చేయాలి.
040 Indirect murders and direct murders పరోక్ష హత్యలు, ఆత్మహత్యలు
రైతుల పరోక్షహత్యలు, ఆత్మహత్యలు అనేవి మనకు ఈనాటివి కావు. కొన్ని వందల సంవత్సరాలనుండి వారసత్వంగా వస్తున్నాయి.
15వ శతాబ్దంలో శ్రీనాథమహాకవి ఎంతో వైభవంగా బ్రతికాడు. కాని చివరిరోజుల్లో బ్రతుకుతెరువుకు కటకటపడి , వ్యవసాయం చేయవలసి వచ్చింది. ఈపద్యాలు చూడండి.
సీసపద్యం.
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా
పురవీథి నెదురెండ పొగడదండ
యాంధ్రనైషథకర్త యంఘ్రి యుగ్మంబున
దగిలియుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
వియ్యమందెను గదా వెదురుగొడియ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
నగరి వాకిట నుండు నల్లగుండు
తేటగీతి.
కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబి లాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేటి మోస పోతి
నెట్లు చెల్లింతు టంకము లేడు నూర్లు
నువ్వులు, పెసలను, పిట్టలు (బిలబిలాక్షులు) తిన్నాయి. శ్రీనాథుడు, తన సేద్యాన్ని కృష్ణానది ఒడ్డున చేసినట్లున్నాడు. ఏరొచ్చి పంట కొట్టుకు పోయింది. సేద్యాన్ని బొడ్డుపల్లె అనే ఊళ్ళో చేశాడు. బొడ్డుపల్లె అనే గొడ్డేటిని నమ్మి మోసపోయానని దుఃఖిస్తున్నాడు. కౌలు గజపతుల వద్ద తీసుకున్నట్లున్నాడు. గజపతులు అంటే ఓఢ్రులు, అప్పటికే రెడ్డి రాజులను ఓడించి అధికారం నిరంకుశంగా క్రూరంగా చెలాయిస్తున్నారు. 700 టంకాల పన్ను కట్ట వలసి వచ్చింది. ఎలా చెల్లించ గలను, అని వాపోతున్నాడు.
ఓఢ్రులు శ్రీనాథుడికి సంకెళ్లు వేసి , చేతులకు వెదురు గొడియలు బిగించి, వీపుపై ఒక పెద్ద నల్లగుండుని పెట్టి, ఎదురెండలో, రోడ్లమీద తిప్పినట్లున్నారు. ఆబాథకు తట్టుకోలేక, శ్రీనాథుడికి ప్రాణం పోయినట్లుంది. కానీ ఆసమయంలో కూడ, అమ్మహాకవి, తన కవితా శక్తిని కోల్పోలేదు. తనను పోషించిన రాజులని తలచు కున్నాడు.
సీసపద్యం.
_______
కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గ స్థు డయ్యె వి స్సన మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు
తేటగీతి.
భాస్క రుడు మున్నె దేవుని పాలి కరిగె
కలియు గంబున నికనుండ కష్ట మనుచు
దివిజ కవివరు గుండియల్ దిగ్గు రనగ
అరుగు చున్నాడు శ్రీనాథు డమర పురికి
శ్రీనాథుడు వస్తున్నాడంటే , స్వర్గంలో ఉన్న కవుల గుండెలు గుబగుబ లాడాయిట. లబలబ లాడి ఉంటారు.
ఆకాలంలో ఎక్కువగా రైతులు తమ కుటుంబ అవసరాల కొరకే వ్యవసాయం చేసేవాళ్ళు. విత్తనాలు పాతపంటలవే. ఇప్పటిలాగా ప్యాకెట్ 1200 పెట్టి కొననక్కర లేదు. మార్కెట్ కొరకు, నగదు కొరకు పండించటం అనేది తక్కువ. ఎందుకంటే నాలుగోవంతో, మూడోవంతో, సగమో రాజుకు శిస్తుగా చెల్లించాలి. లేకపొతే వెదురు గొడియ, నల్లగుండు, ఎదురెండ, సంకెళ్ళు, సిధ్ధంగా ఉండేవి. ఆపండేది కుటుంబావసరాలకు, శిస్తుకు సరిపోయేది. ఆహారేతర అవసరాలు తక్కువగా ఉండేవి కనుక నగదు లేక పోయినా రోజులు గడిచేవి. కాబట్టి, ఆకాలంలో వ్యవసాయం ఒక వ్యాపారంగా మారలేదు.
నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. వ్యవసాయం నూటికి నూరపాళ్ళూ వ్యపారం అయ్యింది. అనధికారిక మౌఖిక కౌలుకు భూమిని తీసుకోటంతోనే నగదు చెల్లింపులు మొదలవుతాయి. హైబ్రిడ్ | లేక బీటీ విత్తనాలు నగదు పెట్టి కొనాలి. ట్రాక్టర్లకు ఎకరానికి ఇంత అని కట్టి దున్నించాలి. విత్తనాలు చల్లించాలి. కుటుంబ సభ్యుల స్థానంలో ప్రతి దానికీ కూలీలు. వారికి నగదు బట్వాడా చేయాలి. కలుపు తీయటానికి కూలీలు. పురుగు మందులు నల్లబజారులో కొనాలి. యంత్రాలతో వాటిని చల్లించాలి. ఎలుకలను పట్టుకోటానికి కూలీలు. ఇంత పెట్టుబడి పెట్టి శ్రమ పడ్డాక, అకాల వర్షాలకు, వరదలకు, మొత్తం కొట్టుకుపోతే అప్పులిచ్చిన వారికి ఏమి చెప్పుకోవాలి?
చిన్నయజమాన రైతులైనా, కౌలురైతులైనా, వ్యవసాయేతర కుటుంబ ఖర్చులు పెరిగి పోయాయి. పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాల్సి వస్తున్నది. రోగాలు వస్తే ప్రైవేటు వైద్య శాలలకు వెళ్ళ వలసి వస్తున్నది. ఆరోగ్యశ్రీ అనేది ఉన్నదని పేరే కానీ , రీయింబర్సుమెంట్లు రావని, రకరకాల పేర్లతో వారు ఎన్నో రకాలుగా డబ్బులు గుంజుతున్నారు. ఇంక ఆడపిల్ల పెళ్ళి చేసిన రైతు భూలోక నరకంలో ఉంటాడని చెప్పనవసరం లేదు. శ్రీనాథుడికాలంలో ఈబాధలు అంతగా లేవు.
వడ్డీ వ్యాపారులు నానా మాటలు అంటారు. వెదురు గొడియ, నల్లగుండు, ఎదురెండ, సంకెళ్ళు, ఉండవనే కానీ మాటలు సూదుల్లాగా నాటుకుంటాయి.
తిక్కనగారి కందం.
తనువున విరిగిన అలుగును
అనువున బుచ్చెంగవచ్చు అతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
వినుమెన్ని ఉపాయముల వెడలునె అధిపా!
శరీరంలో బాణాల ములుకులు గుచ్చుకుంటే వాటిని ఎలాగో అలాగా పీకేయవచ్చు. కత్తుల్లాంటి మాటలు మనస్సులో గుచ్చుకుంటే ఎన్ని ఉపాయాలను వాడినా వాటిని మరువలేము.
నీవు చావనైనా చావరాదా? నీ పెళ్ళాం పిల్లలకు సర్కారు వాళ్ళచ్చే పరిహారంతో నీ అప్పు తీరుతుంది. నీవు బ్రతికుంటే అప్పు ఎలాగో కట్టలేవు, చచ్చన్నా కట్టు అని వడ్డీ వ్యాపారులు, రైతులను ఆత్మ హత్యలకు ప్రేరేపించే అవకాశం ఉంది. వీటిని మనం పరోక్ష హత్యలనాలి.
వరదలు వచ్చినపుడు ప్రభుత్వం కొంత పరిహారం చెల్లించే మాట నిజమే అయినా, దానిని పెద్దరైతులు చేజిక్కించుకున్నంత తేలికగా బక్కరైతులు పొంద లేరు. పైరవీకారులు గుంట దగ్గర నక్కల్లాగా కాచుకొని ఉండి వాటిని ఇస్త్రీ బట్టల వాళ్ళకి అందేలా చూస్తారు. కౌలు రైతులకి చెందాల్సిన పరిహారాన్ని యజమాని కాజేస్తాడు, భూమి రికార్డుల్లో కాస్తుదారుగా యజమాని పేరు ఉంటుంది కానీ అనధికారిక కౌలురైతు పేరుండదు.
పంటల బీమా ఉంటుందని పేరే కానీ , బీమా ప్రీమియాలు తింటానికి బీమా కంపెనీలు ఇచ్చే ప్రాధాన్యత,వేగం, క్లెయిముల చెల్లింపుల్లో చూపటం లేదు.
-
Notes: The Hindi page 471 in the picture above, is only for demonstration purpose, to show how Devnagari Ancient Scripts look like. The ve...
-
How did Rayalaseema crowds suddenly wake up for a separate Rayalaseema demand? ఆధార వార్త ఈనాడుకి, కృతజ్ఞతలతో - https://www.eenadu.net/te...
-
This is in continuation of my previous blog post No. 1024 Click to go to Part 1 of Telugu Vairagya Satakam, of Yenugu Lakshmana Kavi , in ...
From Post Nos. 001 to 500
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 |
61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 |
81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 |
91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 |
121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 |
141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | 151 | 152 | 153 | 154 | 155 | 156 | 157 | 158 | 159 | 160 |
161 | 162 | 163 | 164 | 165 | 166 | 167 | 168 | 169 | 170 | 171 | 172 | 173 | 174 | 175 | 176 | 177 | 178 | 179 | 180 |
181 | 182 | 183 | 184 | 185 | 186 | 187 | 188 | 189 | 190 | 191 | 192 | 193 | 194 | 195 | 196 | 197 | 198 | 199 | 200 |
201 | 202 | 203 | 204 | 205 | 206 | 207 | 208 | 209 | 210 | 211 | 212 | 213 | 214 | 215 | 216 | 217 | 218 | 219 | 220 |
221 | 222 | 223 | 224 | 225 | 226 | 227 | 228 | 229 | 230 | 231 | 232 | 233 | 234 | 235 | 236 | 237 | 238 | 239 | 240 |
241 | 242 | 243 | 244 | 245 | 246 | 247 | 248 | 249 | 250 | 251 | 252 | 253 | 254 | 255 | 256 | 257 | 258 | 259 | 260 |
261 | 262 | 263 | 264 | 265 | 266 | 267 | 268 | 269 | 270 | 271 | 272 | 273 | 274 | 275 | 276 | 277 | 278 | 279 | 280 |
281 | 282 | 283 | 284 | 285 | 286 | 287 | 288 | 289 | 290 | 291 | 292 | 293 | 294 | 295 | 296 | 297 | 298 | 299 | 300 |
301 | 302 | 303 | 304 | 305 | 306 | 307 | 308 | 309 | 310 | 311 | 312 | 313 | 314 | 315 | 316 | 317 | 318 | 319 | 320 |
321 | 322 | 323 | 324 | 325 | 326 | 327 | 328 | 329 | 330 | 331 | 332 | 333 | 334 | 335 | 336 | 337 | 338 | 339 | 340 |
341 | 342 | 343 | 344 | 345 | 346 | 347 | 348 | 349 | 350 | 351 | 352 | 353 | 354 | 355 | 356 | 357 | 358 | 359 | 360 |
361 | 362 | 363 | 364 | 365 | 366 | 367 | 368 | 369 | 370 | 371 | 372 | 373 | 374 | 375 | 376 | 377 | 378 | 379 | 380 |
381 | 382 | 383 | 384 | 385 | 386 | 387 | 388 | 389 | 390 | 391 | 392 | 393 | 394 | 395 | 396 | 397 | 398 | 399 | 400 |
401 | 402 | 403 | 404 | 405 | 406 | 407 | 408 | 409 | 410 | 411 | 412 | 413 | 414 | 415 | 416 | 417 | 418 | 419 | 420 |
421 | 422 | 423 | 424 | 425 | 426 | 427 | 428 | 429 | 430 | 431 | 432 | 433 | 434 | 435 | 436 | 437 | 438 | 439 | 440 |
441 | 442 | 443 | 444 | 445 | 446 | 447 | 448 | 449 | 450 | 451 | 452 | 453 | 454 | 455 | 456 | 457 | 458 | 459 | 460 |
461 | 462 | 463 | 464 | 465 | 466 | 467 | 468 | 469 | 470 | 471 | 472 | 473 | 474 | 475 | 476 | 477 | 478 | 479 | 480 |
481 | 482 | 483 | 484 | 485 | 486 | 487 | 488 | 489 | 490 | 491 | 492 | 493 | 494 | 495 | 496 | 497 | 498 | 499 | 500 |
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।
501 to 1000 Post Nos. here.
501 | 502 | 503 | 504 | 505 | 506 | 507 | 508 | 509 | 510 | 511 | 512 | 513 | 514 | 515 | 516 | 517 | 518 | 519 | 520 |
521 | 522 | 523 | 524 | 525 | 526 | 527 | 528 | 529 | 530 | 531 | 532 | 533 | 534 | 535 | 536 | 537 | 538 | 539 | 540 |
541 | 542 | 543 | 544 | 545 | 546 | 547 | 548 | 549 | 550 | 551 | 552 | 553 | 554 | 555 | 556 | 557 | 558 | 559 | 560 |
561 | 562 | 563 | 564 | 565 | 566 | 567 | 568 | 569 | 570 | 571 | 572 | 573 | 574 | 575 | 576 | 577 | 578 | 579 | 580 |
581 | 582 | 583 | 584 | 585 | 586 | 587 | 588 | 589 | 590 | 591 | 592 | 593 | 594 | 595 | 596 | 597 | 598 | 599 | 600 |
601 | 602 | 603 | 604 | 605 | 606 | 607 | 608 | 609 | 610 | 611 | 612 | 613 | 614 | 615 | 616 | 617 | 618 | 619 | 620 |
621 | 622 | 623 | 624 | 625 | 626 | 627 | 628 | 629 | 630 | 631 | 632 | 633 | 634 | 635 | 636 | 637 | 638 | 639 | 640 |
641 | 642 | 643 | 644 | 645 | 646 | 647 | 648 | 649 | 650 | 651 | 652 | 653 | 654 | 655 | 656 | 657 | 658 | 659 | 660 |
661 | 662 | 663 | 664 | 665 | 666 | 667 | 668 | 669 | 670 | 671 | 672 | 673 | 674 | 675 | 676 | 677 | 678 | 679 | 680 |
681 | 682 | 683 | 684 | 685 | 686 | 687 | 688 | 689 | 690 | 691 | 692 | 693 | 694 | 695 | 696 | 697 | 698 | 699 | 700 |
701 | 702 | 703 | 704 | 705 | 706 | 707 | 708 | 709 | 710 | 711 | 712 | 713 | 714 | 715 | 716 | 717 | 718 | 719 | 720 |
721 | 722 | 723 | 724 | 725 | 726 | 727 | 728 | 729 | 730 | 731 | 732 | 733 | 734 | 735 | 736 | 737 | 738 | 739 | 740 |
741 | 742 | 743 | 744 | 745 | 746 | 747 | 748 | 749 | 750 | 751 | 752 | 753 | 754 | 755 | 756 | 757 | 758 | 759 | 760 |
761 | 762 | 763 | 764 | 765 | 766 | 767 | 768 | 769 | 770 | 771 | 772 | 773 | 774 | 775 | 776 | 777 | 778 | 779 | 780 |
781 | 782 | 783 | 784 | 785 | 786 | 787 | 788 | 789 | 790 | 791 | 792 | 793 | 794 | 795 | 796 | 797 | 798 | 799 | 800 |
801 | 802 | 803 | 804 | 805 | 806 | 807 | 808 | 809 | 810 | 811 | 812 | 813 | 814 | 815 | 816 | 817 | 818 | 819 | 820 |
821 | 822 | 823 | 824 | 825 | 826 | 827 | 828 | 829 | 830 | 831 | 832 | 833 | 834 | 835 | 836 | 837 | 838 | 839 | 840 |
841 | 842 | 843 | 844 | 845 | 846 | 847 | 848 | 849 | 850 | 851 | 852 | 853 | 854 | 855 | 856 | 857 | 858 | 859 | 860 |
861 | 862 | 863 | 864 | 865 | 866 | 867 | 868 | 869 | 870 | 871 | 872 | 873 | 874 | 875 | 876 | 877 | 878 | 879 | 880 |
881 | 882 | 883 | 884 | 885 | 886 | 887 | 888 | 889 | 890 | 891 | 892 | 893 | 894 | 895 | 896 | 897 | 898 | 899 | 900 |
901 | 902 | 903 | 904 | 905 | 906 | 907 | 908 | 909 | 910 | 911 | 912 | 913 | 914 | 915 | 916 | 917 | 918 | 919 | 920 |
921 | 922 | 923 | 924 | 925 | 926 | 927 | 928 | 929 | 930 | 931 | 932 | 933 | 934 | 935 | 936 | 937 | 938 | 939 | 940 |
941 | 942 | 943 | 944 | 945 | 946 | 947 | 948 | 949 | 950 | 951 | 952 | 953 | 954 | 955 | 956 | 957 | 958 | 959 | 960 |
961 | 962 | 963 | 964 | 965 | 966 | 967 | 968 | 969 | 970 | 971 | 972 | 973 | 974 | 975 | 976 | 977 | 978 | 979 | 980 |
981 | 982 | 983 | 984 | 985 | 986 | 987 | 988 | 989 | 990 | 991 | 992 | 993 | 994 | 995 | 996 | 997 | 998 | 999 | 1000 |
From 1001 (In gradual progress)
1010 | |
1011 | 1012 | 1013 | 1014 | 1015 |
1016 | 1017 | 1018 | 1019 | 1020 |
1021 | 1022 | 1023 | 1024 | 1025 |
1026 | 1027 | 1028 | 1029 | 1030 |
| 1031 | | 1032 | | 1033 | | 1034 | | 1035 | | 1036 | 1037 | 1038 | 1039 | 1040 |
| 1041 | 1042 | 1043 | | 1044 | | 1045 |
| 1046 | 1047 | 1048 | | 1049 | | 1050 |
| 1051 | 1052 | 1053 | | 1054 | | 1055 |
| 1056 | 1057 | 1058 | | 1059 | | 1060 |
| 1061 | 1062 | 1063 | | 1064 | | 1065 |
| 1066 | 1067 | 1067 | 1068 | 1069 | 1069 | 1070 |
| 1071 | 1072 | 1073 | 1074 | 1075 | 1076 |
1077 | 1078 | 1079 | 1080 |
| 1081 | 1082 | 1083 | 1084 | 1085 | 1086 |
1087 | 1088 | 1089 | 1090 |
| 1091 | 1092 | 1093 | 1094 | 1095 | 1096 |
1097 | 1098 | 1099 | 1100 |
| 1101 | 1102 | 1103 | 1104 | 1105 | 1106 |
1107 | 1108 | 1109 | 1110 |