I reproduce below for the benefit of our readers , the text of a comment on our blog post No. 670 (Click to go to 670), received through email from a scholarly friend of mine. My apologies to him for not seeking his prior consent to make it public. Reason: Public Benefit.
The views expressed in the comments are the views of one of our learned readers. They are not the views of ybrao-a-donkey.
I do now know when I shall be able to provide English and Hindi versions. I hope to do it soon.
విద్యావినయసమ్పన్నే అను శ్లోకమునుకు సరియైన అర్థం - మీరు వ్రాసిన అర్థం పూర్తిగా పొరపాటు
విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః || 18 ||
అంటూ రెండేసి రెండేసి జంటలని చూపించేడు. అందులో, 'కాస్త సాత్త్వికంగా వున్నారు' అనుకునే రెండు, 'కాస్త రాజసంగా వున్నాయి' అనుకునేవి రెండు, 'కాస్త తామసంగా వున్నాయి' అనుకునే రెండు, జంటలుగా చూపించేడు. అందులో, 'బాగా చక్కి చదువు, చదువుకి తగిన వినయం వుండేవాడు', ఒకడు,
'ఏమాత్రం కూడా చదువు సంస్కారాలు అబ్బకుండా, 'నేనుకూడా ఒక ఉత్తమమైన మనిషినే' అని చెప్పుకోడానికి తగినట్లుగా అలాంటి కులంలో మాత్రం పుట్టిన ఒక బ్రాహ్మణుడు' మరొకడు. వీరిద్దరూ ఒక జంట.
వీడికేం అక్షరం ముక్క అంటలేదు ఎప్పుడూ కూడా. అయితే, ఈ అంటనివాడిలోవుండే చేతనుడు ఎలా వుంటాడో, బాగా విద్యని గడించిన ఆ వినయశీలుడి యొక్క శరీరంలో కూడా అదిగో ఆ జీవుడు అంతే అలాగేవున్నాడు, ఈ విషయాన్ని కాస్త దృఢపరచాలి అని స్వామియొక్క అభిప్రాయం. అందుకే విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే 'విద్యావినయసంపన్నుడు' అని మనం పిలిచే ఒక దేహం, ఆ దేహంలో దీన్ని ఆధారంగా చేసుకునివున్నాడు, వాడు చేతనుడు, జీవుడు. అలానే బ్రాహ్మణే ఆ బ్రాహ్మణుడు అని పిలిచే శరీరంలోనూ ఒకడున్నాడు, వాడికి అది శరీరం.
ఆవులో ఒక జీవుడున్నాడు, ఏనుగులో ఒక జీవుడున్నాడు. శునకములో ఒక జీవుడన్నాడు, శునకమాంసము తినే నికృష్టమైన దేహంలో కూడా వున్న జీవుడు. ఇన్ని రూపాల్లో, ఇన్ని శరీరాల్లో వుండే జీవులుకూడా వాళ్ళ ఆకారాల్లో ఏం తేడాలుండవు. అంతా సమానమైన ఆకారాలు కలిగివుాంరు. మరి తేడా అంతా, వాడివాడి కర్మప్రభావవిశేషంచేత ఏర్పడ్డది. దేహాల్లో మార్పు తప్ప మిగతావి వాడికేవీ వుండవు, అంటవు కూడా.
'ఇప్పుడు వాడి విషయంలో మనం ఎలా చూడాలి', అనే విషయాన్ని స్వామి ఈ శ్లోకంద్వారా మానవాళికి అందిస్తున్నాడు, దాన్ని మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
'మానవులందరినీ చూడ్డం ఎలా ? మానవులంతా సమానంగా వుంటారా? ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, ఒకడు మనకు ఇష్టుడు, ఒకడు మనకి అయిష్టుడు. రకరకాలుగా వుంటారే, ఎలా సమానంగా చూడ్డం?'
'అసలు సమానంగా చూడ్డం అంటే ఏమి', అనే ప్రశ్నకి భగవద్గీతలో అయిదవ అధ్యాయం, పద్ధెనిమిదో శ్లోకంలో చూసినట్లయితే, మనకి సమాధానం దొరకుతుంది.
కేవలం మనుష్యులలోనే కాదు, మానవులతోబాటు అనేక రకాలుగా జీవించే ప్రాణికోటి వుంది. 84 లక్షల జీవరాశులు అంటూ ఉంటారు మనవాళ్ళు, అదొక లెక్క. ఈ చుట్టూవుండే ఇంత ప్రాణికోటికూడా మనకి ఒకే రకమైన ప్రేమపాత్రం కావాలీ అనంటే, దాని విషయంలో మనకు వుండాల్సిన చూపు ఎలా వుండాలనేది స్వామి చెప్పేడు. 'ఈ పైన కనిపించేవన్నీ కూడా పంచభూతాలతో తయారైన శరీరాలు. అది ఒక్కొక్కీ ఆ వెనకాతల వుండే జీవుడియొక్క కర్మకు అనుకూలంగా తయారయ్యాయి. కర్మ అనుభవంవరకూ అవి వుంటాయి, తరువాత అవి రాలి పోతాయి. లోపలివాళ్ళంతా సమానాకారం, పైవి విషమాకారం', అని మనకి తెలియాలి.
అందులో కొన్నింకటికి, బాగా ఉత్కర్ష కలిగిన దేహం వుంటుంది, కొన్నిటికి అపకర్ష అయిన దేహం వుంటుంది. లోపలుండేచేతనులంతా సమానకారమని ఏనాడైతే మనకి తెలుస్తుందో, ఆ వేళ మనం ఆ వ్యక్తులందరినీ కూడా ఆదరించగలుగుతాం సమానమైన భావనతో. మనకి అనుకూలంగా వుంటే వాళ్ళని మరింత బాగా ప్రేమిస్తాం. మనకి ప్రతికూలంగా వుంటారా, 'అయ్యో', అని మనం జాలిపడగలుగుతాం. ఎప్పుడూ అనంటే, 'ఆ లోపలుండే ఆత్మలన్నీ కూడా సమానాకారం కలవి, పైదేహాలు మాత్రమే మార్పు' అని తెలిసినప్పుడు. కానీ, సామాన్యంగా లోకంలో, 'ఆ లోపలుండే ఆత్మలు సమానాకారం' అని తెలియక, పైన దేహంలో వుండే లక్షణాలనిబ్టి ఆత్మలని మనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం.
ఒకడెవడో మంచి ధర్మాత్ముడైతే, 'ఆ ఆత్మ చాలా పవిత్రం కాబోలు' అనిన్నీ, ఇంకొకడెవడో మరొక రకంగా ప్రవర్తిస్తున్నట్లయితే, 'వీడిలో ఆత్మ చాలా చెడ్డది' అనిన్నీ మనం అనుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఆ మంచితనంగానీ, చెడ్డతనంగానీ రెండూ ఆత్మకి లేనేలేవు. అవి రెండూ కేవలం శరీరపు లక్షణాలు మాత్రమే. శరీరపు యోగ్యతలు మాత్రమే. కానీ, మనకి ఏమనిపిస్తుందంటే, ఆ పైనుండే దేహం చేసే పనులు చూసి, 'ఆ లోపలవాడుకూడా అంతే చెడ్డవాడు' అనిపించడంతో ఆగకుండా తత్సంబంధం కలిగినవాళ్ళందరి మీదకీ ఆ కోపం వెడుతుంది. ప్రేమ కలిగితే ఆ ప్రేమా వెళుతోంది.
ఎలాగంటే, మనకి ఒకడంటే అంత బాగా పడదనుకోండి, వాడంటే మనకిష్టం లేదు. ఏం చేస్తాం దాంతో? నిజానికి, ఆ పడనిది ఆ లోపలుండే జ్ఞానం, జ్ఞానం కలిగిన జీవుడు, ఆ జ్ఞానం ప్రసరించింది శరీరంలో, అక్కడితో ఆగిపోయిందది. కానీ, మన కోపం ఎంతవరకూ వెడుతుందంటే, ఆ వ్యక్తికి సంబంధించిందేదైనా ఇక్కడొక వస్తువు వుంటే, 'ఈ వస్తువుకూడా వాడికి సంబంధించింది కదా, దీన్ని చితక్క్టొట్టి వాడిని ఏడిపిస్తాను', అంటూ, దీనిమీద మన ప్రతాపాన్ని చూపిస్తాం.
దాంతో ఆ వస్తువుని నాశనం చేసేయడమో, చితగ్గొట్టేయడమో, విరగ్గొట్టేయడమో, ఆ వ్యక్తికి సంబంధించిన మరొక వ్యక్తికి హాని కలిగించడమో, ఇదిగో, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం.
ఇష్టం కలిగితే, కేవలం వచ్చిన ఆ వ్యక్తి ఒక్కడి మీదే, ఆ ఇష్టం వుండి ఊరుకోదు. ఆ వ్యక్తికి సంబంధించిన ఎక్కడైనా ఒక కాగితం, ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక వస్తువు, ఏది వున్నప్పికిన్నీ కూడా, ఆ ఇష్టం అతనిమీదనుండి, ఈ వస్తువులదాకా కూడా వ్యాపించి, వాటినికూడా ప్రేమించేట్టు చేస్తుంది.
కనక, ప్రేమకానీ, ద్వేషంకానీ రెండూ, అలా అలా ఒక తీగలాగా, ఒక పరంపరగాను సాగుతూనే వెడతాయి.
గతంలో మనం రావణాసురుడి గురించి చెప్పుకున్నాం. రావణాసురుడిని తలచుకుని విభీషణుడు, 'వాడెంత చెడ్డవాడో వాడి శరీరంకూడా అంత చెడ్డది', అంటాడు.
శరీరానికి మంచిచెడ్డలెందుకు ఉంటాయిగనక? రెండూ లేవు శరీరానికి.
లోపల వాడున్నాడు గనక వాడు నడిపితే అది నడిచింది, అంతవరకే. లోపలనుంచి వాడు వెళ్ళిపోయాడా? అంతే. ఒక చిన్న చెట్టుమీదనుంచి ఒక పువ్వు రాలితే విలువ ఎంత వుంటుందో ఈ శరీరం లోపలనుంచి జీవుడు వెళ్ళిపోయినప్పికిన్నీ కూడా దీనికి అంతే విలువ వుండడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీలేదు. ఆ రకంగా విభీషణుడికి రావణాసురుడి పైన, 'రావణాసురుడి సంబంధ, సంబంధ' దాకా ఆ కోపం వెళ్ళిపోయింది. ఇది పొరబాటు.
ప్రేమ కలిగినా అంతే. ఒక వ్యక్తి నాకెంతో యిష్టమైతే ఆ ఇష్టమైన వ్యక్తిని కూడా మనం ప్రేమిస్తాం. ఆ వ్యక్తి ఇదిగో ఈ వస్తువుని పట్టుకున్నాడంటే, ఆ వస్తువుని తీసుకుని మనం జాగ్రత్తగా పెట్టుకుాంం. ఇదిగో, ఆ వ్యక్తికి ఈ రుచి యిష్టమంటే, ఆ రుచిని మనంకూడా మనకిష్టమయ్యేట్లు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఇలాగ మనకి పరంపరగా, పరంపరగా ఆయా ఆయా వ్యక్తులమీదుండే సంబంధం దేహాన్నిబ్టి ఏర్పడటం, సామాన్యంగా లోకంలో చూస్తున్నాంగానీ, ఈ జీవుడు దేహానికి సంబంధించినవాడు కాడు. అందుకే స్వామి చెబుతున్నాడు,
విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః || 18 ||
ఎవడైతే, ఇన్నింలోనూ వుండే ఆత్మ ఏకాకారం అని చూడగలుగుతాడో, వాడు మాత్రమే 'పండితుడు' అని అంటాం.
అంచేత పండితుడైతే 'సమదర్శి' కాగలుగుతాడు. 'సమదర్శి' అయితే పండితుడు కాగలుగుతాడు.
'అయితే ఏదిముందు? ఏది వెనక?' - అంటే, వీడిలో ఎంతెంత ఎంతెంత జ్ఞానం పెరుగుతుందో, అంతంత అంతంత సమదర్శిత్వం పెరుగుతూవుంటుంది. సమదర్శిత్వం పెరుగుతుంటే, వీడి జ్ఞానం మరింత మరింతగా పెరుగుతూవుంటుందన్నమాట. 'ఇవి రెండూ సుమారుగా ఒకటే' అని మనం అనవచ్చు. అయితే, ఈ జ్ఞానం అందులో మొట్టమొదిది, ఈ జ్ఞానం కలగాలంటే వీడు కర్మాచరణ చేయక తప్పదు. ఇక్కడ సాధన, అనుష్ఠానం చేయక తప్పదు.
ఒక వ్యక్తి అద్భుతంగా నృత్యం చేస్తూ, మధ్యలో ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా వున్నాడూ అనంటే ఎంతబాగా సాధన చేసుంటాడో కదా. అలాగే కఱ్ఱసాము చేసేవాళ్ళనో, కత్తులు త్రిప్పేవాళ్ళనో మనం చూసినట్లయితే ఏ క్షణంలో అయినప్పికిన్నీ, అది ఎక్కడ తాకినప్పికిన్నీ, వాడికెంతో ప్రమాదం జరగవలసిందే. కానీ, అలా జరక్కుండా ఆ వ్యక్తి ఆ నృత్యాన్ని ప్రదర్శించగలుగుతున్నాడూ అంటే, ఎంత అభ్యాసం చేసివుంటాడో కదా.
కనక, అంత అభ్యాసపుస్థితి వాడిలోవున్నప్పుడు తొణకడం, బెణకడం అనేది వుండదు.
అలాగే చేసే కర్మ అనుష్ఠానాన్ని వీడు తీవ్రంగా చేస్తే, ఆ వేళ ఏ వ్యక్తిని చూసినా, పై ఆకారాల్లో మార్పును తెలుసుకున్నప్పి కిన్నీ స్పందించడు. ఒకచోట మనం పామును చూసేం. 'అమ్మో, పాము' అని భయపడిపోతాం. ఏమిటవసరం భయపడ్డానికి? నిజానికి ఆ పాముగా కనిపించిన దేహంలో ఏ జీవుడు ఎలాటి వాడున్నాడో, నేను మనిషిని అనుకునే ఈ శరీరంలో కూడా అలాటివాడే వున్నాడు.
'ఈ రిెంలోని జీవులిద్దరూ కూడా సమానాకారంలో వుంటారు, ఇద్దరూ దేవుడికి చెందే వుంటారు. 'ఇదీ పైన కనిపించే పాంచభౌతికశరీరమే, అదీ పైన కనిపించే పాంచభౌతికశరీరమే', అంటూ మనస్సులోకూడా వీడు వికారాలు లేకుండావున్నట్లయితే ఆ పాము వాడిప్రక్కనుంచి అవతలకి వెళ్ళిపోతుంది తప్ప, వీడు దానికి భయపడి, అది వీడిని కరవవలసిన అవసరం రానేరాదు. వీడు ఎప్పుడైతే దాన్ని చూసి 'ఆఁ..' అన్నాడో, మరి భయంవేసిందన్నమాట.
దేన్ని గురించి భయంవేసిందో దాన్ని కొంచెం దూరంగా ఉంచుదామనిపిస్తుంది. దూరం చేయడానికి ఏదో ఒక ప్రయత్నం ప్రారంభిస్తాడు. వీడు ప్రయత్నం ప్రారంభించేడంటే, మరి అదిమాత్రం ప్రయత్నం ప్రారంభించదా?
కనక, వీడినుంచి తనకేదైనా ఉపద్రవం వస్తుందేమోనని, వీడికంటే అది ఎక్కువ స్పందనగల జంతువు గనక, అదీ ప్రతిచర్యకు పూనుకుంటుంది. ఒక్క పాము అనే కాదు, అన్ని జంతువులూ అలాగే, అవి మానవులకంటే, మరింత ఎక్కువగా చురుకుగానే వుంటాయి, చుట్టూవుండే ప్రకృతియొక్క ప్రభావాన్ని గమనించడంలో.
మనకీ తెలుసును, భూకంపాదులు వచ్చేటప్పుడు, మనుష్యులు సాంకేతిక పరికరాల మీద ఆధారపడాల్సిందేగానీ, జంతువులన్నింటికీకూడా ఆ సూచన ముందే అందుతుంది. దానికి తగినట్లుగా అవి సిద్ధపడతాయి. ఆ పాముకూడా వీడిలో కలిగే ప్రతిచర్యని చూస్తుంది. వెంటనే తనలోనూ ఒక ప్రతిచర్య ప్రారంభమవుతుంది. తనను తాను రక్షించుకోవాలని పిస్తుంది. వెంటనే పడగ విప్పుతుంది. వీడిమీదకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 'అదికూడా తనలాంటిదే' అని అనుకుంటే, హాయిగా వాడు అలాగే వుంటాడు, అది వీడి ప్రక్కనుంచే, లేక వీడిమీదనుంచే వెళ్ళిపోతుంది.
'శ్రీరామచంద్రుడు అలా వుండేవాడు, సీతమ్మమీద మనస్సు వుండడవలన' అంటారు. హనుమంతుడు సీతాన్వేషణలో లంకలోకి వెళ్ళినప్పుడు చెబుతాడు, 'అమ్మా, రాముడు ఆహారమే తినడంలేదు. రాముడు నిద్రపోవడంలేదు. ఒకవేళ ఎప్పుడైనా కాస్త కునుకు తీసినా, 'హా సీతే!' అని ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నాడు. అతని ఒంటిపై సరీసృపాలు ప్రాకిపోతున్నప్పికిన్నీకూడా తను అదేమీ గుర్తించడంలేదమ్మా, నీయందు పెట్టుకున్న మనస్సు అలా చేస్తోంది రామచంద్రుడిని', అన్నాడు.
ఇంత తీవ్రమైన శోకాన్ని పొందిన రామచంద్రుడికి, సీతమ్మ తన దృష్టిలో నిండడంచేత, పామును చూస్తే భయం కలగలేదు. వాటికీ ఇతడిని చూస్తే భయం కలగలేదు. కేవలం కలగకపోవడమే కాదు, అవన్నీకూడా అతనికోసం స్పందించాయి. ప్రాణాలు అర్పించాయి. చివరికి అతడిని పరిపాలకుడిగా గుర్తించి ఆర్తితో ఆరాధనచేసేయని మనకి చరిత్ర చెబుతోంది.
కనక, ఈ మనిషి ప్రధానంగా గుర్తించవలసినది, 'అన్ని శరీరాల్లోవుండే జీవులు సమానాకారం కలిగివుంటారు, ఒకడిమీద ద్వేషం పెంచుకోవడం, ఒకడిమీద విపరీతమైన ప్రేమ పెంచుకోవడం, రెండూ వీడికి అవసరంలేదు. అయితే, అన్నింనీ కలిపివేయవలసిన అవసరంకూడా లేదు. వాటిహద్దుల్లో వాటిని వుంచి, దానికి తగినట్లుగా వాడు ప్రవర్తిస్తుంటాడు. మనం మురికిని, పాలని ఒకేరకంగా కలిపివేయం కదా. అయితే, 'అయ్యయ్యో, ఛీ..ఛీ! ఇది మురికే', అని ద్వేషించడంకూడా తప్పే. కారణమేమి?
అదికూడా మనయ్లింట్లో తయారయిందే, పాలూ మన ఆవులు ఇచ్చినవే, రెండూ ఒకే స్థానంలోంచి, ఒకేచోట తయారయినప్పుడు, నువ్వు మురికిని ద్వేషించాల్సిన అవసరమేమి గనక?
'అయితే నీళ్ళనీ, పాలనీ కలుపుతామా?' - కలపనే కలపం. అయితే, దాని స్థితిలో దాన్ని వెళ్ళనిస్తాం, దీని స్థితిలో దీన్ని ప్రవర్తింపనిస్తాం.
ఇలాగ, సమదృష్టి ఎవరిలో వుంటుందో, పైశరీరాలమీద వుండే భావనని దానికి సంబంధించిన పరంపరదాకా కూడా వెళ్ళకుండా, ఎవడైతే లోపల ఆత్మలయొక్క ఆకృతిని సమానంగా భావించగలుగుతాడో, వాడికి కలిగే లాభం ఏమిటో స్వామి చెప్పేడు అయిదవ అధ్యాయంలో,
ybrao-a-donkey's humble comments. वैबीराव एक गधे के विनम्र राय . వైబీరావ్ గాడిద వినమ్ర వాణి. You have every right to differ with me. I respect your right. आपको मेरे मत से भिन्न राय रखने के संपूर्ण हक है। मै उस अधिकार को परिपूर्ण रूप से गौरव देता हुँ. మీకు, మీ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిఉండే సంపూర్ణ హక్కు ఉంది. దానిని ఎంతో నేను గౌరవిస్తాను. However, pl. examine this donkey's views also. परन्तु एस गधे के दृष्टिकोण को भी अनुशीलन कीजिये. కానీ ఈ గాడిద దృష్టికోణాన్ని కూడ ఓర చూపుతో కంటజూడుమీ, క్రీగంట జూడమీ.
పైవాటి గురించి వ్రాయాలంటే వేయి పేజీలు కావాలి. నా ప్రాథాన్యత ఆత్మ ఉన్నదా లేదా అనేది కాదు. నేను నాస్తికత్వాన్ని, సంపూర్ణ సోషలిజాన్ని, సంపూర్ణ సమానత్వాన్ని , వాటి సాధనకు అహంసను అభిమానించే వాడిని తప్ప పండితుండను, కాదు. ఉత్త ముండను మాత్రమే. ఉత్తముడను కాదు. సాధారణ మనిషిని, అప్పుడప్పుడు గాడిద లక్షణాలు ప్రకోపిస్తూ ఉంటాయి.
నా గాడిద దృష్టిలో , శరీరంలో శరీరానికి భిన్నమైన ఆత్మలు, మనో బుధ్ధ్యాహంకార చిత్తాలు , అనేవి లేవు. మనో బుధ్ధ్యాహంకార చిత్తాలు అనేవి శరీరంలో ఒక భాగమే. అవి కేవలం కాన్ సెప్టులు మాత్రమే. శరీరానికి సంబంధించిన అనుభూతులు మాత్రమే. శరీరం చచ్చినప్పుడు మనోబుధ్ధ్యాహంకార చిత్తాలు కూడ నశిస్తాయి. వాటికి కొంతమేరకైనా మనం చరిత్లలో స్థానం కల్పించాలనుకుంటే వాటిని మనం అక్షర రూపంలోకో, రాతి శిల్పాల రూపంలోకో, చిత్రాలలోకో,(ఆధునిక కాలంలో అయితే జెపీజీలు, వీడియోలలోకో, ఆడియోలలోకో) మార్చుకోవాల్సిందే. శబ్ద స్పర్శ రస రూప గంధాలు అనేవి శరీరానికి టూల్సు మాత్రమే. వాటిని మనం , మన సౌకర్యాలకనుగుణంగా కొంతమేరకు కాన్ ఫిగర్ చేసుకోవచ్చు. మన శరీరం నశించినపుడు అవికూడ నశిస్తాయి.
Question: Do you mean to say that there are no "AtmA"s? ఆత్మలు లేవంటారా ?
Ans: In my donkey's humble view: Body itself is the soul of itself, which includes, body's mind, intellect, ego, mental disposition. Atma Samyama yOga means control of body, and the associated senses of thought, vision, smell, taste, touch, hearing. నా గాడిద బుధ్ధి ప్రకారం, ఆత్మలు లేవు. శరీరంలో మనో బుధ్ధ్యహంకార చిత్తాలు భాగాలే. శరీరంలో జీవుడు అనేవాడొకడుంటాడు అనేది గ్యాస్. అయితే తాను అనే భావన శరీరానికి సంబంధించినదే. జీవుడికి సంబంధించినది కాదు.
పై కామెంట్లలో, శ్రీరాముడి గురించి, శ్రీరామ భక్తులను క్షమాపణ వేడుకుంటూ నేను ఒక విషయాన్ని వ్రాస్తాను. శ్రీరాముడిని చూస్తే పాములకి భయం కలుగక పోవటం గురించి పైన వ్రాశారు. శ్రీరాముడిని చూస్తే జింకలు, అడవి పందులు, ఉడుములు భయపడే ఉంటాయి. ఎందుకంటే, శీతాపహరణానికి ముందు ౧౩ ఏళ్ళూ శ్రీరామ లక్ష్మణులు వాటిని వేటాడేవాళ్ళు. వాల్మీకి రామాయణం, 3-47-27 చూడండి.
సీత , తనను అపహరించటానికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన రావణుడితో , ఆవిషయం తెలియక అంటుంది.
aagamiSyati me bhartaa vanyam aadaaya puSkalam. ruruun godhaan varaahaan ca hatvaa aadaaya amiSaan bahu. 3-47-23.
ఆగమిష్యతి మే భర్తా వన్యం, ఆదాయ పుష్కలం,
రురూన్, గోధాన్, వరాహాన్, చ హత్వా ఆదాయ ఆమిషాన్ బహు.
తెలుగు సారం: మా ఆయన శ్రీరాముడు వేటనుండి తిరిగి వస్తూ వస్తూ బోలెడు వన్య వస్తువులు, జింకలు, ముంగిసలు, అడవి పందులను కొట్టుకొని బోలెడు మాంసం తెస్తారు.
రామాయణ బ్రాహ్మణులు మాంసం తిన్నారు కాబట్టి నేటి బ్రాహ్మణులు తినాలనేమీ లేదు. అలాగే, ఉత్తర భారతంలో కొన్ని బ్రాహ్ణణ వర్గాలు (బెంగాలీ, బీహారీ, ఒరియా, మొ.) ఆవుమాంసం తప్ప ఇతర మాంసాలను తింటారు కాబట్టి, ఇప్పటి వరకు మాంసాదులను త్యజించిన దక్షిణ భారత బ్రాహ్మణ వర్గాలు వాటిని పునృప్రారంభించాలనో, లేక ఉత్తర భారతీయ బ్రాహ్మణులను నిందించాలనో లేదు. నమ్మకాలు, ఆచారాలు అనేవి, దేశ కాల మానాలను బట్టి మారుతు ఉంటాయి. స్వామి వివేకానంద గారు అమెరికాలో గోమాంసాన్ని బాగానే భుజించినా, భారత్ లో ఆపని చేయటానికి వెనకాడి ఉండచ్చు. తాను గొమాంసాన్ని భక్షించటానికి వెనకాడనని విశ్రాంత జస్టిస్ మార్కండేయ కట్డూగారు అంటే అని ఉండచ్చు. ఎందుకంటే, శ్రీవారి దృష్టిలో (తరువాత వారు విత్ డ్రా చేసుకున్నారనుకోండి), ౯౦ శాతం భారతీయులు మూర్ఖులు. మరి ఆవు మాంసాన్ని తింటే, తాము ౧౦ శాతం పండితులలో ఉండచ్చని వారు భావించారేమో. శ్రేష్ఠులుగా భావించబడేవారు ఏమి చెప్పినా, ఏమి చేసినా చెల్లుతుంది, కదా.
సీతావియోగం వల్ల శ్రీరాముడికి కలిగిన దుఃఖం వలెనే, ఆయన, చేసిన వేటల వల్ల, ఆడ జింకలను కోల్పోయిన మగ జింకలు, మగజింకలను కోల్పోయిన ఆడజింకలు కూడ ఎంతో వియోగ దుఃఖానికి గురి అయి ఉండాలి. వాల్మీకి ఆశ్రమంలో కల్యాణీ కపిల అనే ఆవుదూడను శ్రీవాల్మీకి మునీంద్రుల వారు రేగుపండ్ల గుజ్జుతో, తేనెతో కలిపించి డేగ్చాలతో వండిస్తూ ఉంటే, కల్యాణీ కపిలను కోల్పోయిన ఆ తల్లి ఆవు ఎంత తల్లడిల్లి ఉంటుంది. పార్ట్ల్ నర్ వియోగ దుఃఖాలు కేవలం మనుషులకే, జంతువులకి కాదు., అనే ఆలోచనను పాశ్చాత్యులు పట్టించుకోరు. కానీ భారతీయులలో కొందరైనా పట్టించుకుంటారు.
సీతాపహరణం తరువాత రామ లక్ష్మణులు వేట మానేసి కేవలం పండ్లు మాత్రమే తిని బ్రతికారో లేదో తెలియదు. ఆ పదునాలుగేళ్ళూ, అడవిలో జింకలు, ముంగిసలు, అడవి పందులు, విల్లంబులను ధరించిన దాశరథీ కరుణా పయోనిథులను చూడగానే వణికి పోతూ ఉండాలి. వాళ్ళు పొదలలో నక్కి నక్కి బాణాలు వేస్తుంటే, పాపం ఈ జంతులు ఒక పొదలోనుండి మరొక పొదలోకి పారిపోతూ నానా బాధలు పడుతూ ఉండాలి.
ప్రశ్న: ఇది మీకెలా తెలుసు, మీరేమైనా జింకల్లోకి, ముంగిసల్లోకి, పందుల్లోకి పరకాయ ప్రవేశం చేశారా
Ans: మా ఇంట్లో మిగిలిపోయిన పాలను, పెరుగును చిన్న చిన్న గిన్నెలలో పోసి పిల్లులకు అట్టే పెట్తూ ఉంటాము, అవి వచ్చి తాగిపోతూ ఉంటాయి. మధ్యాహ్నం పూట అందరూ నిద్ర పోయే సమయంలో, మా వీధిలోకి అప్పుడప్పుడు పిల్లులను పట్టుకుపోయే వాళ్ళు పాశాయుధులై ( పాశం అంటే తాడుతో చేసిన ఉచ్చు, పిల్లుల మెడకు వేసి వాటిని లాగి తమ బుట్టలో వేసుకుంటారు) వస్తూ ఉంటారు. వాళ్ళు వీధిలోకి వచ్చి ఒక పిల్లికి పాశం వేసి బుట్టలో పడేసుకోగానే, మిగిలిన పిల్లు అప్రమత్తమవుతాయి. అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటాయి. గోడలు దూకుతూ ఉంటాయి. ఆ గోలను అర్ధం చేసుకున్న మేము బయటకు వచ్చి ఆ పాశ హస్తులను వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పినపుడు వాళ్ళు వాదిస్తూ ఉంటారు. మానోటి దగ్గర కూడు తసేస్తారా అంటూ ఉంటారు. పాపం, వాళ్ళాకలి వారిది. వీటి భయం వీటిది.
ప్రశ్న. ఇంతకి మీరు ఎద్దుకూర తినటాన్ని సమర్దిస్తారా సమర్ధించరా.
Ans: కోతులనుండి వచ్చిన మానవులు మొదట శాకాహారులు. ఆదిమ భారతీయులు శాకాహారులే. కాల క్రమంలో ఆహారానికి కరువొచ్చి, పాత రుచులతో విసుగొచ్చి, వారు మాంసాహారానికి మారారు. నేడు గుంటూరులో క్యాష్ ఉంటే చాలు మాంసాహారం మయసభ రుచులతో సమానంగా కోకొల్లలుగా దొరుకుతుంది. రెండు పెగ్గులకి ఒక పెగ్గు ఫ్రీగా మద్యం కూడ దొరుకుతుంది. కులాతీతంగా, మతాతీతంగా క్యాష్ ఉన్నవారు ఎవరికి కావలసింది వారు తింటూ ఉంటారు.
అయితే రెడ్ మీట్ ఆరోగ్యానికి అంత క్షేమదాయకం కాదని వైద్య అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతే కాక మద్య మాంసాదులు అసాత్వికమైనవి కావటం వల్ల ఆ మత్తు ఆవహించిన సమయంలో, మనుషులు అన్ ప్రెడిక్టబుల్ గా ప్రవర్తించే అవకాశం ఉంది. భగవద్ గీతకు భక్తులైనా కాకపోయినా, అసాత్వికమైన రాజసిక తామసిక ఆహారాలను కొంత మేరకు తగ్గించుకోటం శ్రేయస్కరం.
అహింసకు సంబంధించినంతవరకు చట్టాలలో, మతాలలో , కులాచారాలలో ఏమి ఉన్నా, లేకపోయినా జంతువులపై, చెట్లపై కరుణను చూపించదలుచుకునేవారు, వాటిని తినటం కొంతమేరకు తగ్గించుకోటం అభిలషణీయం. అయితే ఇది స్వఛ్ఛందంగానే జరగాలి. దీనికి మోరల్ పోలీసింగ్ కుదరదు. నీను ఫలానా జంతువును తిన్నావంటే నిన్ను చంపి పాతరేస్తాం అనటం కుదరదు. సమాజంలో సభ్యులకి మేథోన్నతి సత్యాన్వేషణ వల్ల జరగాల్సిందే తప్ప మోరల్ పోలీసింగ్ వల్ల, లీగల్ పోలీసింగ్ వల్ల జరగదు.
సత్యాన్వేషణ చేసుకోవాలనుకునే వాళ్ళకి సమ దృష్టి అవసరం. ప్రపంచంలో ఏ ప్రవక్త చెప్పినా, నాయకుడు చెప్పినా, సెలబ్రిటీ చెప్పినా, సత్య పరిశీలన, నిర్దారణ అనే గీటు రాళ్ళమీద గీసి, ఎవరికివారు నిజానిజాలను తేల్చుకోవాల్సిందే. పుస్తకాలు వ్రాయటం, చదవటం, ఉపన్యాసాలు వినటం, ఉపన్యాసాలు చేయటం, ఇవన్నీ ఎవరు చేసినా, వారు కాషాయ గుడ్డలు కట్టుకున్నా, కట్టుకోకపోయినా, నామాలు , బొట్లు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, మన ముందుకి వచ్చే విషయాలు పరిశీలనకు గురికావలసిందే. లేదా పెండింగులో ఉంచుకోవచ్చు.
సర్వం బ్రహ్మ మయం అని చెప్పే ఒక సన్యాసి గారిని, మీరు ఎప్పుడూ అడ్డబొట్టేనా, ఒక్కసారైనా నామం పెట్టుకోండి అని అడగండి. ఒప్పుకోడు. సర్వం బ్రహ్మమయం అని చెప్పటమే కానీ, రాగ ద్వేషాలు జాస్తిగానే ఉంటాయి. అందుకే మా మతం, వేరే మతం అనే దృష్టి , రాగ ద్వేషాలు, మామూలు మనుషులకన్నా సన్యాసులకి, పూజారులకి ఎక్కువగా ఉంటాయి. మామతమే గొప్ప. పాశ్చాత్యులకి మేమే గోచీ పెట్టుకోటం నేర్పాం. వాళ్ళు విమానాలను తయారు చేసుకోటం మన రామాయణంలోంచి కాపీ చేశారు వంటి ప్రచారాలు భారతీయ (అన్నిమతాల, కులాల) ప్రచారకులకూ ఎక్కువే.
సంపూర్ణ సోషలిజం స్థాపనకు, విజయానికీ, అన్ని వర్గాల పౌరుల మేధోన్నతి కూడ అవసరమే. ఎందుకంటే, మేధోన్నతి పొందిన ధనికుడు, తన ధనం, తమ భవనాలు, బంగారం, షేర్లూ, పత్తి కట్టే అన్నీ తన నిజమైన సంక్షేమానికి అడ్డే నని గుర్తిస్తాడు. తను తినేది అన్నం. తనకు కావలసింది బట్టలు, నీడ, ఆరోగ్యం, విద్యావివేకాలు, స్వేఛ్ఛ, మిథ్యాగౌరవం స్థానంలో సత్యమైన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని గుర్తిస్తాడు. సంపూర్ణ సోషలిజంలో ఆస్తులను రక్షించుకునే బాధ్యతలనుండి ధనికుడు విముక్తిని పొందుతాడు కాబట్టి, దానిని స్వాగతించటానికి వెనకాడడు. శ్రామిక వర్గం మేథోన్నతిని పొందిపుడు, వారు మానసిక లేబర్ అవసరమైన పనులను అవలీలగా చేయకలుగుతారు. ఇపుడు కొన్ని కులాల వారు తమకు మాత్రమే తెలివితేటలు ఉన్నాయి. మిగిలిన వారికి అవిలేవు అని విర్రవీగుతున్నారు.
మానసిక లేబర్ ను శ్రామిక వర్గం షేర్ చేసుకుని, తాము నానా బాధలు పడుతూ చేస్తున్న కొంత శారీరిక బండచాకిరిని ప్రస్తుతం తాము మానసిక చాకిరి చేస్తున్నాం కాబట్టి శారీరిక శ్రమ చేయనక్కర లేదు అనుకునే వర్గాల వారికి శారీరిక శ్రమ సౌందర్యాన్ని బదిలీ చేయాల్సి వస్తుంది. అంటే నేను ప్రొఫెసర్ అనుకునే పిహెచ్ డీ డాక్టర్ గారు, రోజుకో మూడుగంటలు ఆటో నడిపి శారీరిక శ్రమను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కొవ్వెక్కిన వాళ్లు జిమ్ముల్లో పడే శారీరిక శ్రమకు, సమాజంలో నిమ్న వర్గాలవారు పడుతున్న శారీరిక శ్రమకు హస్తి మశకాంతర భేదాన్ని గుర్తించటం అవసరం.
Tail-piece धूमकेतु తోకచుక్క
పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ మధ్య కొన్ని మంచి పిలుపులను ఇచ్చారు. అడ్డుగోడలను కట్టేవాడు నిజమైన క్రిష్టియన్ కాజాలడని, డొనాల్డ్ ట్రంప్ గారిని ఉద్దేశించి చేసిన ప్రకటన ఈసందర్భంగా గుర్తుంచుకోతగినది.
బాగానే ఉంది. విద్య, వైద్యం, ఎన్ జీవో ల ముసుగులో మత మార్పిడులకు పూనుకోవద్దని, శ్రీ ఫ్రాన్సిస్ గారు, తమ ఆర్చి బిషప్పులకు, కార్డినల్సు కు, బిషప్పులకు, బ్రదర్సుకు, నన్నుకు బోధన చేస్తే బాగుంటుంది. ప్రపంచ అశాంతిలో కొంత భాగం బడుగుదేశాలను ముంచెత్తాలనే క్రైస్తవం యొక్క దురాశ కూడ కారణమే అనేది నగ్న సత్యం. సామ్రాజ్య విస్తరణ లాగానే, మత విస్తరణ క్రైస్తవానికీ, ఇస్లాముకూ సహజగుణాలుగా వ్యాకోచిస్తూ పోతున్నాయి. ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నాయి. వీళ్ళని చూసి, హిందువులలో కూడ అభద్ర్రత, విస్తరణవాదం తలెత్తుతున్నాయి.
మతం మార్పిడీ అనేది ఎన్నో సిధ్ధాంతాలను అవగాహన చేసుకోటం, చర్చించకోటం, సత్యాన్వేషణ చేసుకోటం, తరువాత అత్యంత అరుదుగా ఏకొద్ది మంది వ్యక్తులో తమ ప్రయోగాలలో భాగంగా చేసుకోవాల్సిన విషయమే తప్ప బట్టలను మార్చుకున్నట్లుగా జరిగే రొటీన్ కాకూడదు. ముఖ్యంగా భారత్ విషయంలో అసలు కుదరదు. ఏందుకంటే, కామన్ సివిల్ కోడ్ లేదు. వివాహాల్లో సమస్యలుంటాయి. స్మశానాల్లో కూడ సమస్యలుంటాయి.
ఈ గొర్రె పిల్ల, వాటికన్ సిటీలో డిన్నర్ టేబుల్సు పైకి వచ్చే లాంబూ ప్రిపరేషన్ ఒకటి కాకూడదని ఆశిస్తున్నాను.
ENGLISH and HINDI Versions, I shall try to add in due course.
This particular blog post will be subject to revision, to eliminate views which may hurt the sentiments of our readers.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.