చర్చనీయాంశాలు: bifurcation,విభజన,
సప్పంబు పడగనీడన కప్ప వసించినట్లు
శ్రీకల్వకుంట తారకరామారావుగారు, తెరాస అధ్యక్షులు శ్రీకల్వకుంట్ల చంద్రశేఖరరావుగారి పుత్రులు. శ్రీవారు ఈమధ్య హైదరాబాదులోని చిత్ర పరిశ్రమలవారికి అభయ ప్రదానం చేశారు. శ్రీవారు ఎవరినుండి చిత్ర పరిశ్రమ వారిని రక్షిస్తారో తెలియదు.
In the past many film personalities have told me that the industry had become a soft target for all political movements. But I assure all industry people that you are safe in Hyderabad and won't get any trouble from any party or people. Hyderabad is very important for Telangana State. ... If any disturbance happens here it will affect all of Telangana. So we want to help everybody for a better future.
తెలుగు సారం: గతంలో చాలమంది సినిమా పెద్దలు సినిమా పరిశ్రమ అన్ని రాజకీయ ఉద్యమాలకు సాఫ్ట్ టార్జెట్ గా మారిందని నాకు చెప్పారు. కానీ, నేను పరిశ్రమలో అందరికీ ''మీరు హైదరాబాదు లో భద్రంగా ఉంటారనీ మీకు ఏ పార్టీనుండి | ప్రజలనుండి ఎలాంటి ఇబ్బందులు కలుగవని'' హామీ ఇస్తున్నాను. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ... ఇక్కడి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే, అది తెలంగాణ మొత్తం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక, మేము మంచి భవిష్యత్ కొరకు పరిశ్రమలో అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. )
తెలుగు సారం: గతంలో చాలమంది సినిమా పెద్దలు సినిమా పరిశ్రమ అన్ని రాజకీయ ఉద్యమాలకు సాఫ్ట్ టార్జెట్ గా మారిందని నాకు చెప్పారు. కానీ, నేను పరిశ్రమలో అందరికీ ''మీరు హైదరాబాదు లో భద్రంగా ఉంటారనీ మీకు ఏ పార్టీనుండి | ప్రజలనుండి ఎలాంటి ఇబ్బందులు కలుగవని'' హామీ ఇస్తున్నాను. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ... ఇక్కడి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే, అది తెలంగాణ మొత్తం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక, మేము మంచి భవిష్యత్ కొరకు పరిశ్రమలో అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. )
ఈ సందర్భంగా గుర్తుకు వచ్చేవి
సుమతీ శతక పద్యం
ఎప్పుడు తప్పులు వెదకెడు
అప్పురుషుని కొల్వ కూడదదియెట్లన్నన్
సప్పంబు పడగనీడన
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ.
ఆంధ్రజ్యోతి సంగతి ఏమిటి
శ్రీ కెటిఆర్ హైదరాబాదులో భూసెటిల్ మెంట్లలో జోక్యం చేసుకుంటున్నట్లు, అది ఒరిస్సా దాక విస్తరించినట్లు ఆధారాలతో సహా ఒక వార్త ప్రచురించింది. శ్రీవారు పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఆంధ్రజ్యోతి వారు బెదరమన్నారు. తరువాత ఏమి జరిగింది? వారూ వారూ రాజీ పడ్డారా?కెసీఆర్ అన్న పుత్రిక సంగతి ఏమిటి?
తన ప్రాణానికి భద్రత లేదని, కెసీఆర్ అన్న పుత్రిక రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ వారు కేసును జూన్ 5 కి వాయిదా వేశారు.అప్పటిదాకా ఆమె ప్రాణాలు గాలిలో దీపమేనా?
విజయశాంతి ప్రాణాల సంగతి ఏమిటి?
మెదక్ తెరాస లోక్ సభ సభ్యురాలు తన ప్రాణాలకు భద్రత లేదని, తన చావుకొరకు తెరాస వారు ఎదురుచూస్తున్నారని మీడియాతో మొత్తుకున్నది.
ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకోటాన్ని కెసీఆర్ గారు తప్పు పట్టారు.
ఆమె ఎందుకు అభద్రతాభావానికి గురి అవుతున్నదో చెప్పాల్సిన బాధ్యత కెసీఆర్ కుటుంబం పై ఉంటుంది. ఆమె తెరాసను వదలి ఎందుకు వదలి వెళ్ళవలసి వచ్చిందో ఏమో?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.