చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్, వారణాసి, కాశి, వడోదారా, బిజెపి,ఆమ్ ఆద్మీ
శ్రీనరేంద్ర మోడీకి గానీ, ఆయన నిర్ణయాలను ప్రభావితం చేసే వారికి గాని ఆత్మ విశ్వాసం కొరవడిందని భావించాల్సి ఉంటుంది.
ఋజువులు: వారణాసి హిందూ సన్యాసులతో, పండాలతో నిండిన నియోజకవర్గం. అక్కడ హిందూ మతతత్వ అభ్యర్ధులు గెలవటం అనేది నల్లేరుపై బండి. అలాంటపుడు, వారణాసి నుండే కాకుండా, వడోదారా (బరోడా) నుండి కూడ పోటీచేయటం ఎందుకు?
మోడీ రెండు చోట్లనుండి గెలిచాడనుకుందాం. దేనిని వదులుకుంటాడు? దేనిని వదులుకున్నా, ఆనియోజక వర్గానికి అన్యాయం చేసినట్లేకదా. పైగా వదులుకున్న నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖర్చులు ప్రభుత్వ ఖజానాకి, అభ్యర్ధులకు తడిసి మోపెడవుతాయి. ఆనియోజక వర్గంలో ఎన్నికల కోడ్ రెండు సార్లు అమలు చేయటం వల్ల అభివృధ్ధి యంత్రాంగంపై పని భారం అధికం కావటం, కీలకమైన కార్యక్రమాలు ఆగిపోటం జరుగుతుంది.
మెరుగైన పధ్ధతి: ఒకచోట నుండే పోటీచేసి, అక్కడ ఓడిపోతే ప్రధాని మన్మోహన్ సింగు లాగా రాజ్యసభ రూట్ లో ప్రధాని కావటం. లేదా తన కన్నా సీనియర్లు, అన్ని విధాల తమతో సమానులు అయిన శ్రీ అద్వానీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్ వంటి వారిని ప్రధాని కానివ్వటం.
శ్రీ అరవింద్ కేజ్రీవాల్ మోడీని ఢీ కొట్టేటపుడు రిస్క్ తీసుకుంటున్నప్పటికీ ఎంత ఆత్మ విశ్వాసంతో ప్రసంగిస్తున్నాడు? అటువంటి ఆత్మవిశ్వాసం మోడీలో ఎందుకు కొరవడింది?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.