157 శేషాంధ్ర రాజధానిగా దొనకొండ
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, రాజధాని, ప్రకాశం జిల్లా, దొనకొండ
ఈనాడు పత్రిక వారు మొదటి పేజీలో వ్రాసిన దాని ప్రకారం ఐఎఎస్ అధికారులు దొనకొండను రాజధానిగా సిధ్ధం చేస్తున్నారు.
రాయలసీమ వారు ఇప్పటికే చెప్పారు, కర్నూలు రాజధానిగా ఉండాలని, లేకపోతే ఉద్యమం చేస్తామని.
కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్ గారు, పళ్ళంరాజుగారు, రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇతర ఉత్తరాంధ్ర నేతలు విశాఖను రాజధానిగా కోరుకుంటారని వేరే చెప్పనక్కరలేదు.
కేంద్ర మంత్రిణులు పనబాకలక్ష్మి, పురందరేశ్వరి, రాష్ట్రమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా వర ప్రసాద్, పార్ధసారధి మొ|| వి-గుం-తె కోరుకుంటారు కదా.
ఈకుమ్ములాట మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి. మననేతలంతా మెడబట్టి గెంటించుకోవాలి. ఇది తప్పేలాగా లేదు.
శాశ్వత ఏర్పాటు
నేను ఇంతకు ముందే వ్రాశాను. మూడు రాష్ట్రాలు, మూడు రాజధానులు. అనివార్యం. ఈ సమస్యను మనమే పరిష్కరించుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలతో బేరాలాడుకోవాలి.
రాజధాని రొటేషన్ తాత్కాలిక ఏర్పాటు
ప్రస్తుతానికి రెండేళ్ళ కొకసారి మూడు ప్రాంతాల మధ్య రొటేషన్ చేసుకోటం మంచిది. ఇదికూడ నేను ఇప్పటికే వ్రాసాను. పోస్ట్ నంబర్ 152 చూడండి.
దొనకొండ
మన ఐఎఎస్, ఐపీఎస్, అధికారులకు, పారిశ్రామిక వేత్తలకు, నేతలకు, జడ్జీలకు, పటాటోపాలు ఎక్కువ. బంగళాలు, విమానాలు, హెలికాప్టర్లు, మాల్స్, ఎసీలు, కాల్ గరల్స్ కావాలి. అవన్నీ దొనకొండలో దొరుకుతాయా?
రియల్ ఎస్టేట్ లో స్తబ్ధత
దొనకొండలో రాజధానిని పెట్టటం మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒకముఖ్య లాభాన్ని గమనించవచ్చు. విశాఖ, వి-గుం-తె, ఒంగోలు, తిరుపతి, కర్నూలు లో విపరీతంగా పెరిగన రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ లు కొంత శమిస్తాయి.
ప్రస్తుతం పైనగరాలలో రిజిష్ట్రేషన్లు బాగా తగ్గాయి. రేట్లను విపరీతంగా పెంచేయటం వల్ల పేదలు, దిగువ మధ్యతరగతి వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోటం లేదు. రియాల్టర్లు కూడ పూర్తిగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇంకా బ్యాంకులు (బంకులా?) పారిశ్రామికాభివృధ్ధి, వాణిజ్యాభివృధ్ధి పేరుతో కార్పోరేట్లకు తక్కువ వడ్డీకి కుమ్మరిస్తే, దారి మళ్ళించటానికి వారు సిధ్ధమే. రాజకీయ ఒత్తిళ్ళతరువాత ఫ్రెష్ రౌండ్లు మొదలవుతాయి.
ఈలోపల ఈ దొనకొండ ఏమవుతుందో చూడాలి.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteReason for deleting the above comment: Their Business spam link, unconnected with our blog.
ReplyDelete