చర్చనీయాంశాలు, topics for discussion: Vijayashanti, విజయశాంతి, తెరాస, కెసిఆర్
10-4-2014 నాడు మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం, సినీనటి, భీకర తెలంగాణా వాది, విజయశాంతిగారు మీడియోతో ఇలా అన్నారు.
ప్రస్తుతం ఈ వేదికపై అంతర్గత విషయాలు చెబితే తెరాసను ఖతం చేస్తారు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
చెప్పకుండా ఎంత కాలం దాస్తారు? తెరాస ఏమి చేసిందో చెప్పవలసిన బాధ్యత శ్రీమతి విజయశాంతి గారిపై తప్పక ఉంటుంది. దాచి పెట్టి, తడవ తడవకూ బెదిరించుకుంటూ పోతే అది బ్లాక్ మెయిలింగు అవుతుంది. చెప్పాక, తెరాసను ఖతం చేయాలా వద్దా, రాళ్ళు వేయాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక వేళ ప్రజలు సరియైన నిర్ణయం తీసుకోకపోతే అది వారి కర్మం. కనుక శ్రీమతి విజయశాంతి గారు తమ కర్తవ్యాన్ని నిర్వహించటం కొరకైనా ఆమె దాస్తున్న విషయాలను బయట పెట్టాలి. బయట పెట్టక పోతే సిబిఐ విచారణ కోరుతూ, కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయవలసిన బాధ్యత గవర్నర్ గారిపై ఉంటుంది.తెరాస వారు తన మీదనే దాడి చేస్తే అనే ధర్మ సందేహం ఆమెకు రావచ్చు. జవాబు: అడ్డుకోటానికి బౌన్సర్లను ఇప్పటికే నియమించుకొని ఉండాలి. గతంలో అలాంటి తెరాస కార్యకర్తల మద్దతుతోనే కదా ఆమె లోక్ సభకు ఎన్నికయ్యింది. అపుడు మంచివాళ్ళుగా ప్రవర్తించిన తెరాస కార్యకర్తలు ఇపుడు గూండాలుగా మారరు కదా!!
ఈనాటి తెలుగు పద్యం
కూరిమి కల దినములలోనేరము లెన్నడు కలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబై నపుడు
నేరములో తోచుచుండు నిక్కము సుమతీ!!
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.