
భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ తన భారతరత్న అవార్డును, ఆఖరి టెస్టును, ముందుగా తన మాతృశ్రీకి, తరువాత భారత్ లోని మాతృశ్రీలందరికి అంకితం చేయటం కూడ, మీడియాలో తాటికాయలంత అక్షరాలతో ప్రాచుర్యం పొందాయి.
శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ తన మాతృశ్రీని గౌరవించుకోటం ముదావహం. అది ఆయన వ్యక్తిగత విషయం కూడాను.
భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ తన భారతరత్న అవార్డును, భారత్ లోని మాతృశ్రీలందరికి అంకితం చేయటం, ఒక ముఖ్యమైన ప్రశ్నను, ఈ రచయిత వైబిరావు గాడిదబుధ్ధి లేవదీసింది.
భారతీయ మాతృశ్రీలు ఈ అంకితం చేయబడిన భారతరత్న, క్రికెట్ ల భారాన్ని మోయగలరా? భారతీయ యువ గర్భిణీ స్త్రీలకు, ఏ ఆధారమూ లేని వృధ్దమాతలకు, భారత రత్న నాలుక గీచుకోటానికి కూడ పనికి రాదు. ఇవాళ్ళా రేపూ టంగ్ క్లీనర్లు కూడ ఐదు రూపాయలు లేనిది రావటం లేదు.
భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ చెమటోడ్చో, ఓడ్చకుండానో, కొంతభాగం చెమటోడ్చి, కొంతభాగం ఓడ్చకుండా, ఒక వెయ్యి కోట్లదాకా కూడబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఒక పది శాతం చెమట ఓడ్చనిది అనుకుంటే, ఒక 1౦౦ కోట్లు అవుతుంది.
డబ్బు పిల్లలు పెట్తుంది అంటారు.
ఆ 1౦౦ కోట్లు పెట్టే పిల్లలు ఏడాదికి 1౦ కోట్లు అనుకుంటే, టెండూల్కుడు, ఆ 1౦ కోట్లను వృధ్ధమాతల, గర్భిణీ స్త్రీల సంక్షేమానికి విరాళంగా ఇవ్వ వచ్చు.
టెండూల్కుడు, రిటైరయిన మర్నాడు, ప్రొద్దున్నే తనకు ఏమి చేయాలో తోచలేదని చెప్పినట్లు, మీడియా టాంటాం కొట్టింది. తాను ఒక గౌరవనీయ రాజ్యసభ సభ్యుడనని, ఆయన, మీడియా కూడ మర్చి పోయింది. టెండూల్కుడు, రాజ్యసభ సభ్యుడిగా తని విధులను నిజాయితీగా నిర్వహించ దలుచుకుంటే ఇరవయి నాలుగు గంటలు సరిపోవు. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు వివిధరూపాలలో నెలకు ఒక లక్ష రూకలదాకా ముట్టుతాయి. అవి వృధ్ధమాతృశ్రీలకు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చినా మహోపకారమే.
పరిమితులకు మించి సమీకరించే లక్ష్మీపతులకు భవిష్యత్ వివేకం అవసరం. వారు సమాజానికి చిన్న వాటా అయినా ఇవ్వకపోయినా ఇబ్బందేమీ లేదు. దేశంలో నిజమైన మార్క్సిస్టు ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చినపుడు మొత్తం లాక్కొని ప్రజలపరం చేస్తుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.