
४७६ भारतीय संपूर्ण पागल शायद नहीं होगे, परन्तु निश्य तौर पर, अर्ध मूर्ख हो सकते।
476 భారతీయులు బహుశా పూర్తి పిచ్చి జాతి కాక పోవచ్చు, కానీ నిశ్చయంగా, అర్ధమూర్ఖులు కావచ్చు.
Karakoram Highway map courtesy: http://en.wikipedia.org/wiki/Karakoram_Highway.
మహాకవి కాళిదాసు సినిమా చూసిన వారికి గుర్తు ఉండి ఉంటుంది. ఎఎన్ఆర్ కాళిదాస మహాకవి కాకముందు ఒక మూర్ఖుడు. తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ ఉంటాడు.
చిత్రం వికీపీడియా వారి దయ. Link for those who want study the story of Mahakavi Kalidasu. http://en.wikipedia.org/wiki/Mahakavi_Kalidasu .
ఆరాజ్యంలో మంత్రిగారు రాజకుమార్తె మీద పగబూనాడు. ఆమెకు ఒక పరమ మూర్ఖుడిని తెచ్చి పెళ్ళి చేయాలనుకుని, అలాటి పరమ మూర్ఖుడి కొరకు వెతుకుతుంటుంటే, తను కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న మూర్ఖ కాళిదాసు కనిపించాడు. మంత్రి అతడిని బాగా అలంకరించి తీసుకెళ్ళి, గొప్ప పండితుడని చెప్పి రాజకుమార్తెకు పెళ్ళి చేయించాడు. మూర్ఖ కాళిదాసు సంగతి మొదటి రాత్రే రాజకుమార్తెకు తెలిసింది. తరువాత మూర్ఖ కాళిదాసు కాళికాదేవిని ప్రార్ధించి మహాకవి కాళిదాసుగా మారతాడు.
మనకీ ఈకథకీ సంబంధం ఏమిటంటే, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ గారు, ఒకసారి భారతీయులలో 90% మంది మూర్ఖులని అంచనా వేశారు. తరువాత జనం వత్తిడి మీద, దానిని విత్ డ్రా చేసుకున్నారు. కానీ కట్జూ గారి మాట నిజమేమో అనటానికి మనకి చాలా దృష్టాంతాలు దొరుకుతాయి.
పైన ఇచ్చిన సన్ డే స్టాండర్డ్ (ఆదివారం ఇండియన్ ఎక్స్ ప్రెస్ ) 21.10.1962 క్లిప్పింగు చూశారు కదా. అందులో ఏముంది. 20.10.1962 నాడు చైనా సైన్యం భారత్ సరిహద్దులలోకి చొచ్చుకొని వచ్చింది. భారత ప్రజలందరి గుండెల్లో బాకుతో పొడిచినట్లయింది.
చైనా గోబ్యాక్ వంటి నినాదాలతో భారత్ హోరెత్తింది. కవులు పాటలు వ్రాశారు. పత్రికలు సంపాదకీయాలు వ్రాశాయి. చైనా వాడు పొడిచిన వెన్నుపోటుకి పంచశీల సిధ్ధాంతాన్ని చైనా ప్రధాని చౌ ఎన్ లై గారికి బోధించిన భారత్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి ఆరోగ్యం దెబ్బ తిన్నది. అప్పటి రక్షణ మంత్రి శ్రీ కృష్ణమీనన్ గారు నెహ్రూ గారిని తప్పు దారి పట్టించటం వల్లనే, నెహ్రూగారు సరిహద్దుల వద్ద అశ్రధ్ధ చేశారన్నారు. మీనన్ గారిని మార్చి వైబీ చవాన్ గారిని తెచ్చారు.
చైనావాడు లడఖ్ లో , అరుణాచల్ ప్రదేశ్ లో (అప్పటి పేర్లు నేఫా, అక్సాయి చిన్, మొ||) 36,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించేశాడు. కాశ్మీర్ లో మూడో వంతు భూభాగం చైనా వాడి వశమయింది.
20,000 మంది దాకా భారత సైనికులు మంచు కొండలలో ప్రాణాలు కోల్పోయారు. వారి భార్యలు భర్తృహీనలు అయ్యారు. పిల్లలు పితృహీనులయ్యారు. వారి తల్లి దండ్రులకు కడుపు శోకం మిగిలింది.
దేశ రక్షణ నిధికి ప్రజలు తమ బంగారు నగలు స్వఛ్ఛందంగా సమర్పించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు కెనెడీ గారు, చైనాను అడ్డుకోటానికో నేమో అన్నట్లుగా అమెరికన్ నౌకా దళాన్ని హిందూ మహాసముద్రానికి తరలించబోతున్నారని వార్త రావటంతో, చైనా వాడు వెనక్కి తగ్గాడు అనే అభిప్రాయం ఉంది. అయితే, ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయలేదు.
ఆతరువాత చైనా వాడు, తానాక్రమించిన లడఖ్ మీదుగా, పాక్ ఆక్రమణలోని ఆజాద్ కాశ్మీర్ మీదుగా, పాకిస్థాన్ కి రోడ్ ను, రైలు మార్గాన్ని నిర్మించటం ప్రారంభించాడు.
చైనా పాకిస్థాన్ కు ఆయుధాలు ఇవ్వటమే కాక, ఆర్ధిక సహాయం చేయటమే కాక , దానిని అన్ని విధాల సమర్ధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
చైనాకు భద్రతా సంఘం శాశ్వత సభ్యత్వం రావటానికి భారత్ కృషి చేసింది. భారత్ కు భద్రతా సంఘం శాశ్వత సభ్యత్వానికి చైనా అడ్డు పుల్లలు వేస్తున్నది.
నేటికి కూడ చైనా అరుణా చల్ ప్రదేశ్ ను తన భూభాగంగా చూపిస్తున్నది.
కాశ్మీర్ నివాసులు చైనా సందర్శించటానికి వీసాల కొరకు దరఖాస్తు చేస్తే, చైనా స్టేపుల్డ్ వీసాలు ఇచ్చేది.
చైనా సైన్యం , భారత సైన్యం, చైనా నేవీ, భారత్ నేవీ కలిసి జాయింటు సైనిక విన్యాసాలు చేశారు.
మనం జపాన్ తో, వియత్నాంతో, స్నేహం చేయటం చైనాకు గిట్టదు. పసిఫిక్ మహాసముద్రంలో మనం ఎక్కడ పరిశోధనలు చేసినా చైనాకు అనుమానం రోగం వస్తుంది.
నేపాల్ ను, శ్రీలంకను భారత్ యొక్క స్నేహ పరిథినుండి తప్పించి తమవంక ఆకర్షించాలని చైనా విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఎవరెస్టు శిఖరం అడుగున సొరంగం తవ్వి నేపాల్ కు రైలు మార్గం వేస్తానంటున్నది.
శ్రీలంకలో, చైనా తన నౌకలకు, స్థావరాన్ని ఏర్పాటు చేసుకోటంలో కొంతమేరకు విజయం సాధించింది.
ఈలాటి చైనాతో భారత్ ఎలా వ్యవహరించాలి ?
చైనా వంటి శక్తివంతమైన దేశంతో శాశ్వత శతృత్వం పెట్టుకోటం ప్రమాదం కనుక, వెన్నుపోట్ల దేశం కాబట్టి చైనాను కౌగలించుకోటం ప్రమాదం కనుక, మధ్యే మార్గం అవలంబించాలి. శతృవని బహిరంగంగా ప్రకటించక పోయినా, చైనాను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి కదా.
ఇపుడు చైనా ఎడల మనం అవలంబిస్తున్న మార్గం మధ్యే మార్గమా ?
చైనాతో షుమారు భారత్ షుమారు 70 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తుంది. చైనా నుండి భారత్ షుమారు 45 బిలియన్ డాలర్ల చైనాలో తయారయిన సరుకు కొంటుంటే, వాళ్ళు మన దగ్గర 25 బిడాల సరుకు కొంటున్నారు. అంటే, మనం చైనా వస్తువులను భారీగా కొని చైనాను ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామన్న మాట.
మనం మన మార్కెట్లను చైనా వస్తువులతో ముంచెత్తుకోటంతో, భారత్ లోవస్తువుల తయారీ రంగం దెబ్బతిన్నది. మనం మన ప్రజలకు వస్తువుల తయారీ ద్వారా ఉపాధి కల్పించుకోకుండా , చైనా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాము.
మన వస్తువులను కొనమని చైనాను అడిగే దమ్ము ఎలాగో మనకి లేదు, కానీ చైనా నుండి కొంతమేరకైనా అనవసరపు దిగుమతులను తగ్గించుకోవచ్చు, కదా.
మనకి వచ్చిన దిగుమతుల రోగం, విదేశీ పెట్టుబడులకు అడుక్కునే రోగం, హెచ్ ఐవీ ఎయిడ్స్ వైరస్ కన్నా భయంకరమైనవి.
తమ దేశాన్ని సందర్శించమని చైనానుండి ఎప్పుడు ఆహ్వానం వస్తుందా అని మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, విదేశాంగ రక్షణ మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ముఖ్యమంత్రులు, ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. వారు ఆహ్వానించక పోతే భారత రాయబార కార్యాలయం ద్వారానో, మరో రకంగానో పైరవీలు చేసుకుంటారని నా అనుమానం. ముందు మనం వాళ్ళని ఆహ్వానిస్తే, తరువాత బదులుకి బదులు అన్నట్లు, వాళ్ళు మనల్ని ఆహ్వానించక పోతారా అని కూడ అనుకుంటూ, వాళ్ళని తరచుగా ఆహ్వానిస్తూ ఉండవచ్చు.
టాటాలు మొ|| మన పారిశ్రామిక వేత్తలు స్వంతంగా గానీ, మన నేతల వెంట గానీ, చైనాకు వెళ్ళి అక్కడ ఏమి పెట్టుబడులు పెట్టవచ్చా అని వెతుక్కుంటూ ఉంటారు.
శ్రీమతి నిర్మలా సీతారామన్ వంటి మన మంత్రిమణులు, విశాఖ లాంటి భారతీయ నగరాలను షాంఘై నగరం లాగా చేస్తామని కోతలు కోస్తూ ఉంటారు.
శ్రీ నరేంద్ర మోడీ (గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా) , శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ వాజ్ పేయీ (ప్రధానిగా ఉండగా) చైనా సందర్శించి వచ్చి పునీతులయ్యారు. పెట్టుబడుల కోసం అడుక్కోటం మామూలే.
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నౌకాశ్రయాల అభివృధ్ధిని చైనాకు అప్పగించాలనే ప్రతిపాదన భారత్ కూ ఉంది, శేష్ ఆంధ్రప్రదేశ్ కూ ఉంది.
చైనా వాళ్ళ పెట్టుబడుల కొరకు కార్మిక చట్టాలనూ, నిబంధనలనూ సవరించటానికి శేష్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు వాగ్దానం చేశారని వార్తలు వచ్చాయి. అంటే, ముఖ్యమంత్రిగారు భారతీయులు, ఆంధ్ర ప్రదేశ్ కార్మికుల వీపులను వంచుతూ ఉంటే, చైనా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు మన కూలీల వీపులపై దరువు కొట్తారనుకోవాలేమో.
మీ హార్డ్ వేరూ, మా సాఫ్టు వేరూ కలిపి కొట్టి కావేటి రంగా అన్నట్లుగా "జోరుగా హుషారుగా షికారు పోదమా" అని చైనా వాళ్లకి శ్రీచంద్రబాబు నాయుడు గారు కిక్కెంచగా, చైనా వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బయ్యి మీదేశంలో లాప్ టాప్ లన్నీ మావే అన్నారుట.
మనకు వైద్యశాలలను చైనా వాళ్ళు నిర్మించాలేమో. రోడ్లను చైనా వాళ్ళు వేయాలేమో.
తెలుగు భార్యాభర్తలు, భారతీయ భార్యా భర్తలు సంసారాలు చేయాలంటే, చైనా వాడు వచ్చి పక్కలు పరిచి, పాలగ్లాసు, కప్పుర విడెము, వయాగ్రా చేతికిచ్చి "ఎంత హాయి ఈ రేయీ ఎంత మధురమీ హాయి , చందమామ చల్లగా మత్తు మందు చల్లగా" అని మనకు మత్తెక్కించాలేమో.
ఇవన్నీ జరిగాక, చైనా వాడు , శేషాంధ్ర ప్రదేశ్ ను తన భూభాగంలో చూపుకోటం ప్రారంభించినా ఆశ్చర్య పోనక్కర లేదు.
మనకి ఉపాధి లభించదా ?
మనల్ని కొరడాలతో కొట్తూ పనిచేయించటానికే వాళ్ళని ఆహ్వానిస్తున్నాము.
లక్కీగా మరణానంతర జీవితం, ఆత్మలు, స్వర్గనరకాలు లేవు. ఉండి ఉంటే, వీర స్వర్గ మలంకరించిన భారతీయ సైనికులు, మన నాయకుల లీలలను చూసి కుమిలి పోవాల్సిందే. ఆత్మలు లేవని, స్వర్గనరకాలు లేవని, మన నేతలు భావిస్తూ ఉండచ్చు.
English and Hindi versions will be added shortly. (ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.