చర్చనీయాంశాలు: బూర్జువా సమాజం, ధనిక వర్గం, వాణిజ్య వర్గం, రాజకీయనేతలు
ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఒక హై ప్రొఫైల్ ఆడంబర వివాహంలో ఎవరెవరు గుమి గూడారు?
శ్రీరాహుల్ గాంధీ, శ్రీ వై జగన్ మోహన్ రెడ్డి, శ్రీ నరేంద్ర మోడీ, శ్రీలాల్ కృష్ణ అద్వానీ ఇంకా ఎందరో దిగ్గజాలు అక్కడ సాక్షాత్కరించారు.
ఇద్దరు భవిష్యత్ ప్రధానులు, ఒక బహుశా అంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ్యమంత్రి, బహుశా ఒక భవిష్యత్ భారత రాష్ట్రపతి.
ఎందుకు? అంటే, అది వర్గ స్వభావం.
ఒకరితో ఒకరికి పని ఉంటుంది. ఒకరితో ఒకరికి పోటీ ఉంటుంది. సమయానుగుణంగా కౌగలించుకుంటూ ఉంటారు, కుమ్ముకుంటూ ఉంటారు.
తన్నుకొని చావాల్సింది ప్రజలే కానీ నాయకులు కాదు. వారు తన్ను కుంటున్నట్లుగా నటిస్తూ ఉంటారు.