Though this blog has been started as 'problems of telugus', we have expanded into National problems of India, and the problems of the World, particularly Poverty, Inequalities of Income and Wealth. I support Atheism and Marxism which I call TOTAL TRUE SOCIALISM, but I do not wish to impose on others. If you do not like what I write, pl. write your comment here. If you like anything, pl. tell others.
Search This Blog typing in English or Telugu, and sometimes Hindi
Friday, June 27, 2014
272 Publicity Craze of the New Government
272 క్రొత్త ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ క్రేజ్
చర్చనీయాంశాలు: 272, పబ్లిసిటీ, ఇందిరాగాంధీ, నరేంద్రమోడీ
నాపోస్టు నంబర్ 269లో వ్రాసినట్లుగానే జరిగింది. అక్కడ వ్రాసింది: శ్రీమతి ఇందిరా గాంధీ తరువాత పబ్లిసిటీ స్పృహ అదే స్థాయిలో కలిగిన ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోడీ. శ్రీమతి ఇందిర పాలించిన కాలంలో, మీడియా మొత్తం శ్రీమతి ఇందిరా వాక్కులతో, యాత్రావివరాలతో, నిండి ఉండేవి. శ్రీ నరేంద్రమోడీ గారు ఎంత చిన్న పనిచేసినా, ఆఫొటో, ఆవార్త, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వెంటనే దర్శనమిస్తుంది. శ్రీమోడీని దర్శించటానికి వచ్చిన వాళ్ళు కూడ పబ్లిసిటీ కాన్షస్ అయితే ఇంక డబుల్ ధమాకా.
ఇపుడు క్రొత్తప్రభుత్వం, 30 రోజులు పూర్తయిన సందర్భంగా తమ ఘనకార్యాలను చాటి చెప్తూ ఒకవీడియోను విడుదల చేసింది. ఈ 30రోజులలో తాము ఏమి సాధించారోవారికే తెలియాలి:
నేరాన్ని పాత ప్రభుత్వం పైకి నెట్టి, రైలు ఛార్జీలను పెంచేశారు. కనీసం రైల్వై బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో, ఈపని చేసి లోక్ సభలో చర్చ జరిపించి, అందరూ కలిసి పెంపు అనివార్యం అని తీర్మానించి ఉంటే సబబుగా ఉండేది. గత ప్రభుత్వం వలెనే, పార్లమెంటులో చర్చ అంటే భయం.
ఛార్జీలను పెంచకుండా, ఇతర పధ్ధతులలో రెవెన్యూని , వనరులను పెంచుకోటం అసాధ్యమా అనేది అధ్యయనం చేసి, ఆ అధ్యయనంలోని అంశాలను ఇంటర్ నెట్ లో పెట్టి ఉండాల్సింది.
ఛార్జీలను పెంచాక, దానిమీద నిలబడలేదు. మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ముంబాయి వోటర్ల ఆగ్రహానికి గురి కాకుండా, 80 కిలోమీటర్ల కన్నా తక్కువ ప్రయాణానికి పెరుగుదలను వెనక్కిలాగి, సీజన్ టికెట్లకు 30 ప్రయాణాల ఛార్జి చెల్లింపును మార్చి పాత 15 రోజుల ప్రయాణాలు చెల్లింపును పునరుధ్ధరించి, మొత్తానికి తమకు రైల్వేల ప్రక్షాళన కన్నా, ఎన్నికలు, వోట్లే ముఖ్యమని ఋజువు చేసుకున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీచేత నాలుగేళ్ళ డిగ్రీకోర్సును మూడేళ్ళ కోర్సుగా మార్పు చేయించటంలో, మానవ వనరుల వికాసమంత్రిణి వ్యవహరించిన తీరు కూడ, కొంత నియంతృత్వ ధోరణిలోనే ఉంది. నాలుగు సంవత్సరాల కోర్సులను, మూడేళ్ళకోర్సులను ఎవరికి కావలసింది వారికి ఇచ్చే పధ్ధతి అచరణలో అసాధ్యం కాదు. ఇపుడు ఆ ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపకులపతి నాలుగేళ్ళ కోర్సుకి చేసిన కృషి అంతా, వృధా అయ్యింది. మేథావులను గౌరవంతో చూసే అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. బిజెపి కూడ ఆతానులోని ముక్కేనని ఋజువు చేసుకున్నది.
విశ్వవిద్యాలయాల స్వాయత్తత గురించి శ్రీమతి స్మృతి ఇరానీ గారు చేసిన వ్యాఖ్యానం కూడ సమంజసంగా లేదు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులను గుమాస్తాలుగా చూడటం కాంగ్రెస్ సంస్కృతి. గ్లామర్ గాళ్స్ కు 120 కోట్ల భారతీయుల మానవ వనరుల వికాసానికి నియోగిస్తే వాళ్ళకి వైస్ ఛాన్సలర్లను గౌరవించటం కూడ చేత కావటం లేదు. విద్యార్ధుల హితం మేము మాత్రమే కోరుతున్నాము, వైస్ ఛాన్సలర్లకేం తెలుసు, నిమ్మకాయ పులుసు అనుకుంటున్నారేమో.
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా గోపాల్ సుబ్రహ్మణ్యం నియామకం విషయంలో, కేంద్ర ప్రభుత్వం చాల దురుసుగా వ్యవహరించి నట్లయ్యింది. కేంద్రన్యాయ శాఖ మంత్రి లేక ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి, ఆయనకు నచ్చచెప్పి, అదనపు క్రొత్త పేర్లను కాలేజియం చేత సిఫార్సు చేయించు కోవలసి ఉంది. కానీ అలా జరగలేదు. బ్లంట్ గా గోపాల్ సుబ్రహ్మణ్యం పేరును తిరస్కరించి, స్వతంత్రంగా వ్యవహరించే జడ్జీలంటే భయం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగ చేశారు. ఈతరహా నిరంకుశ పధ్ధతులలో ఇందిరా గాంధీకి , కొత్త బిజెపి ప్రభుత్వానికి ఏమీ తేడాలేదు, అని నిరూపించుకున్నారు.
ఇంక, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో సమర్ధతను పెంచే నెపంతో, కార్యదర్శులను, ఉద్యోగులను భయపెట్టటం జరిగిందే తప్ప, స్వఛ్ఛంద క్రమశిక్షణ ను ప్రోత్సహించే పని జరుగలేదు.
ప్రభుత్వం ఎన్నికయ్యింది 1826 రోజులకి, 60 నెలలకే, కాబట్టి మనకు 60 వీడియోలను చూపించ బోతున్నారన్నమాట.
271 We have a PM and HRD Minister who do not know how to deal with intellectuals!!
271 We have a PM and HRD Minister who do not know how to deal with intellectuals!!
271 మేథావులతో ఎలా డీల్ చేయాలో తెలియని ప్రధాని, మానవ వనరుల మంత్రిణి మనకున్నారు!!
చర్చనీయాంశాలు: 271, ప్రధానమంత్రి, మానవ వనరుల మంత్రి, ఢిల్లీ యూనివర్సిటీ, నాలుగేళ్ళ డిగ్రీలు, మూడేళ్ళడిగ్రీలు
చిన్న చిన్న విషయాలకు నియంతృత్వపోకడలను చూపటం మన భారతీయులకి అలవాటు. తమ అధికార దర్పాన్ని పాలితులపై రుద్దాలి. అవతల వారి డిగ్నిటీని నేలకు రాసినా ఫరవాలేదు. ఢిల్లీయూనివర్సిటీలో ఇటీవల స్క్రాప్ చేసిన నాలుగు సంవత్సరాల డిగ్రీ పథకాన్నే తీసుకోండి. దీనిని బోధనా వృత్తిలో ఉన్నవారి గౌరవానికి భంగం కలుగకుండా, పరిష్కరించుకోతగిన మార్గం, ఈ గాడిద దృష్టిలో:
మూడేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి B.A.(B), B.Com.(B), B.Sc.(B) లేక B.A.(T), B.Com.(T), B.Sc.(T) డిగ్రీలను ఇవ్వవచ్చు. B.A.(B) == B.A. (Bharat). లేదా B.Com.(T) అంటే B.Com.(Three years).
నాలుగేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి B.A.(I), B.Com.(I), B.Sc.(I) లేక B.A.(F), B.Com.(F), B.Sc.(F) డిగ్రీలను ఇవ్వవచ్చు. B.A.(I) == B.A. (International). లేదా B.Com.(I) అంటే B.Com.(International). లేదా B.A.(F)= B.A. (Four Years), B.Com.(F)= (B.Com Four years), B.Sc.(F) = B.Sc. (Four Years).
మొదటి మూడేళ్ళూ సిలబస్ ను కామన్ గా ఉంచుకొని క్లాసులనూ కామన్ గా నిర్ణయించుకోవచ్చు. B.A.(I), B.Com.(I), B.Sc.(I) వారికి కొంత అదనపు సిలబస్ ను, అదనపు పేపర్లనూ తగిలించవచ్చు. B.A.(I), B.Com.(I), B.Sc.(I) వారికి నాలుగో సంవత్సరంలో ఎంత అంతర్జాతీయ సమాచారాన్నైనా, నైపుణ్యాలనైనా, అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా బాదుకోవచ్చు. కోరిక ఉంటే మార్గం ఉంటుంది. దీనినే మనం సమన్వయం co-ordination అనచ్చు. అంతే కానీ కర్ర పెత్తనం, అధికార దర్ప ప్రదర్శనం కాదు.
అంతర్జాతీయ ప్రాక్టీస్ కు, ముఖ్యంగా అమెరికన్ ప్రాక్టీస్ కు అనుగుణంగా, ఢిల్లీ యూనివర్సిటీ వారు ఈ మార్పును తలపెట్టారని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే, ఢిల్లీయూనివర్సిటీకి తగిన సూచనలిచ్చి ప్రోత్సహించి ఉండవలసినది. వద్దనే విద్యార్ధులకు, అంతర్జాతీయ|అమెరికన్ ఆచారం గురించి తెలిసి ఉండక పోవచ్చు.
న్యాయశాస్త్రంలో ఒక ముఖ్యసూత్రం ఉంది. ఆడి ఆల్టెరిమ్ పార్టెమ్ అంటే, అవతల వాడు చెప్పేది వినండి, అని. ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన సైడ్ నించి ఏమి చెప్ప దలుచుకున్నాడో సరియైన హియరింగు ఇచ్చారా? ముందుగానే, ఆయన పాత హెచ్ ఆర్ డీ మంత్రి శ్రీ కపిల్ సిబాల్ గారి అనుచరుడు అనే అభిప్రాయంతో, ఆయన చెప్పేది ఏదీ వినకూడదు అనే నిర్ణయానికి వచ్చి, బలవంతంగా ఆయన మెడలు వంచుతున్నారా? మొదట నాలుగు సంవత్సరాలు డిగ్రీని ప్రవేశపెట్టటానికి యూజీసీ ఆయనకు అనుమతి నిచ్చిందా? యూజీసీ అనుమతి తీసుకోవలసిన చట్టపరమైన అవసరం ఉందని , ఆయనకు ముందుగా తెలుసా? తెలిసి కూడ ఆయన యూజీసీ అనుమతి తీసుకోకుండా తనంత తానే దూకుడు గా ముందుకు వెళ్ళాడా?
దేశంలో కొన్ని వందల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో కూడ ఇతర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మూడు సంవత్సరాల కోర్సుకావలసిన వారు ఇతర యూనివర్సిటీలలో చేర వచ్చు. లేదా , ఢిల్లీ విశ్వవిద్యాలయమే, రెండు రకాల కోర్సులనూ అందజేస్తే, ఎవరికి కావలసినది వాళ్ళు ఎంచుకునే వాళ్ళు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసలేం జరిగిందో అర్ధం కావటం లేదు.
విద్యార్ధుల హితం అనేది ముఖ్యమే. కానీ, మూడు సంవత్సరాల కోర్సులోనే విద్యార్ధులకు హితం ఉందని యూజీసీ అధ్యక్షులవారూ, మానవవనరుల మంత్రిణి గారూ, ప్రధానమంత్రిగారూ ఎలా నమ్మారో వివరిస్తే బాగుండేది. మౌలికంగా ఆలోచిస్తే 10+2+4 అయినా, 10+2+3 అయినా విద్యార్ధులకు స్వదేశంలో కుటుంబపోషణ చేసుకునే నైపుణ్యాలను కలిగించాలి. ఆడిగ్రీలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అంతర్జాతీయ ప్రమాణాలకూ, ఆచారాలకు, అనుగుణంగా లేవు, అని నిరాదరణకు గురి కాకూడదు. చాలా మంది విద్యార్ధులు 10+2+3 పధ్ధతిలో తమ డిగ్రీలను పూర్తిచేసినా, ఖాళీగానే ఉంటున్నారు. వీలైనన్ని ఎక్కువ కోర్సులను ప్రొఫెషనల్ కోర్సులుగా డిజైన్ చేయగలిగితే, నైపుణ్యాలను పెంచ గలిగితే, విద్యార్ధులు ఒక సంవత్సరం అదనంగా చదవటానికి వెనుకాడి ఉండేవాళ్ళు కాదేమో.
మన ప్రధాన మంత్రి గారి కుటుంబ పోషణా నైపుణ్యం సరియైన పరీక్షకు గురి కాబడలేదు. చాయ్ బండీ మానేశాక (ఎన్ని నెలలో తెలీదు), వారు పూర్తి స్థాయి ఆర్ ఎస్ఎస్ కార్యకర్తగా మారి, వారి నుండి పోషణను పొంది ఉన్నారనుకోవాలి. తల్లి దండ్రులను గానీ, భార్యను గానీ కుటుంబాన్ని ఏర్పరుచుకొని, పోషించే బాధ్యతను తీసుకుని ఉంటే, నైపుణ్యాలను ప్రసాదించే డిగ్రీ అవసరాన్నిగుర్తించే వారు.
ఇంక, మానవ వనరుల మంత్రిణి గారు 12 తరగతి స్థాయిలోనే టీవీ నటిగానో, ఏంకర్ గానో మారినందు వల్ల గ్లామర్ తో ధనార్జన చేయటం, తప్ప నైపుణ్యాలతో ధనార్జన చేయటం జరగలేదు. అందువల్ల నైపుణ్యాలను ప్రసాదించే డిగ్రీలను ఎలా తయారు చేయించాలో అనే విషయంపై శ్రధ్దవహించకుండా , విద్యార్ధులు మూడేళ్ళ కోర్సులు అడుగుతున్నారు కాబట్టి , గతంలో లాగానే ఆడిగ్రీలను వండి వడ్డిస్తే సరిపోతుందనుకున్నట్లున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నది కాబట్టి నైపుణ్యాల డిజైన్ ఇప్పుడు కుదరదు అనుకున్నట్లైతే, తమ నియంతృత్వ పోకడలతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ వంటి అనుభవజ్ఞులైన మేథావులను అవమానించకుండా, రెండు రకాల కోర్సులనూ అనుమతిస్తే పోయేది. విద్యార్ధులు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించేనాటికి, కుటుంబ పోషణా నైపుణ్యాలను ప్రసాదించే అదనపు సబ్జెక్టులను కొన్నిటిని జోడిస్తే సరిపోయేది.
ఇపుడు అసలేం జరిగిందో వివరించి, పదవినుండి తప్పుకోవాల్సిన నైతిక బాధ్యత, ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై ఉంటుందేమో. యూజీసీ అధ్యక్షుల వారికి కూడ , గతంలో నే తాను ఇంటర్ వీన్ కాకుండా, ఇంత ఆలస్యంగా ఎందుకు ఇంటర్వీన్ అయ్యారో వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. మొట్ట మొదటి సారి, నాలుగేళ్ళ డిగ్రీ ప్రతిపాదన ఢిల్లీయూనివర్సిటీవారు తెచ్చిన సమయంలోనే, తన అభ్యంతరాలను ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్స లర్ కు ఎందుకు తెలియజేయలేదో చెప్పాలి. ఆఖరి నిమిషం దాకా ఎందుకు ఆగినట్లు?
271 మేథావులతో ఎలా డీల్ చేయాలో తెలియని ప్రధాని, మానవ వనరుల మంత్రిణి మనకున్నారు!!
చర్చనీయాంశాలు: 271, ప్రధానమంత్రి, మానవ వనరుల మంత్రి, ఢిల్లీ యూనివర్సిటీ, నాలుగేళ్ళ డిగ్రీలు, మూడేళ్ళడిగ్రీలు
చిన్న చిన్న విషయాలకు నియంతృత్వపోకడలను చూపటం మన భారతీయులకి అలవాటు. తమ అధికార దర్పాన్ని పాలితులపై రుద్దాలి. అవతల వారి డిగ్నిటీని నేలకు రాసినా ఫరవాలేదు. ఢిల్లీయూనివర్సిటీలో ఇటీవల స్క్రాప్ చేసిన నాలుగు సంవత్సరాల డిగ్రీ పథకాన్నే తీసుకోండి. దీనిని బోధనా వృత్తిలో ఉన్నవారి గౌరవానికి భంగం కలుగకుండా, పరిష్కరించుకోతగిన మార్గం, ఈ గాడిద దృష్టిలో:
మూడేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి B.A.(B), B.Com.(B), B.Sc.(B) లేక B.A.(T), B.Com.(T), B.Sc.(T) డిగ్రీలను ఇవ్వవచ్చు. B.A.(B) == B.A. (Bharat). లేదా B.Com.(T) అంటే B.Com.(Three years).
నాలుగేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి B.A.(I), B.Com.(I), B.Sc.(I) లేక B.A.(F), B.Com.(F), B.Sc.(F) డిగ్రీలను ఇవ్వవచ్చు. B.A.(I) == B.A. (International). లేదా B.Com.(I) అంటే B.Com.(International). లేదా B.A.(F)= B.A. (Four Years), B.Com.(F)= (B.Com Four years), B.Sc.(F) = B.Sc. (Four Years).
మొదటి మూడేళ్ళూ సిలబస్ ను కామన్ గా ఉంచుకొని క్లాసులనూ కామన్ గా నిర్ణయించుకోవచ్చు. B.A.(I), B.Com.(I), B.Sc.(I) వారికి కొంత అదనపు సిలబస్ ను, అదనపు పేపర్లనూ తగిలించవచ్చు. B.A.(I), B.Com.(I), B.Sc.(I) వారికి నాలుగో సంవత్సరంలో ఎంత అంతర్జాతీయ సమాచారాన్నైనా, నైపుణ్యాలనైనా, అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా బాదుకోవచ్చు. కోరిక ఉంటే మార్గం ఉంటుంది. దీనినే మనం సమన్వయం co-ordination అనచ్చు. అంతే కానీ కర్ర పెత్తనం, అధికార దర్ప ప్రదర్శనం కాదు.
'मैं किसी भी संस्था की स्वायत्तता का सम्मान करती हूं। फिर भी एक बार सबको याद दिलाना चाहूंगी कि संस्थाओं की स्वायत्तता लोगों की सेवा कर सकने के लिए दी जाती है। यह मामला छात्रों के हित से जुड़ा है। इसे व्यक्तिगत सम्मान का प्रश्न नहीं बनाना चाहिए।'
నేను సంస్థల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తాను. అయినా, ఒకసారి అందరి గుర్తుచేయాలనుకుంటున్నాను. ఏమంటే: సంస్థలకు స్వయం ప్రతిపత్తి ప్రజలకు సేవ చేయటానికి ఇవ్వబడుతుంది. ఈ సమస్య విద్యార్ధుల హితం తో ముడిపడి ఉంది. దీనిని వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా చేయకూడదు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
అంతర్జాతీయ ప్రాక్టీస్ కు, ముఖ్యంగా అమెరికన్ ప్రాక్టీస్ కు అనుగుణంగా, ఢిల్లీ యూనివర్సిటీ వారు ఈ మార్పును తలపెట్టారని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే, ఢిల్లీయూనివర్సిటీకి తగిన సూచనలిచ్చి ప్రోత్సహించి ఉండవలసినది. వద్దనే విద్యార్ధులకు, అంతర్జాతీయ|అమెరికన్ ఆచారం గురించి తెలిసి ఉండక పోవచ్చు.
న్యాయశాస్త్రంలో ఒక ముఖ్యసూత్రం ఉంది. ఆడి ఆల్టెరిమ్ పార్టెమ్ అంటే, అవతల వాడు చెప్పేది వినండి, అని. ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన సైడ్ నించి ఏమి చెప్ప దలుచుకున్నాడో సరియైన హియరింగు ఇచ్చారా? ముందుగానే, ఆయన పాత హెచ్ ఆర్ డీ మంత్రి శ్రీ కపిల్ సిబాల్ గారి అనుచరుడు అనే అభిప్రాయంతో, ఆయన చెప్పేది ఏదీ వినకూడదు అనే నిర్ణయానికి వచ్చి, బలవంతంగా ఆయన మెడలు వంచుతున్నారా? మొదట నాలుగు సంవత్సరాలు డిగ్రీని ప్రవేశపెట్టటానికి యూజీసీ ఆయనకు అనుమతి నిచ్చిందా? యూజీసీ అనుమతి తీసుకోవలసిన చట్టపరమైన అవసరం ఉందని , ఆయనకు ముందుగా తెలుసా? తెలిసి కూడ ఆయన యూజీసీ అనుమతి తీసుకోకుండా తనంత తానే దూకుడు గా ముందుకు వెళ్ళాడా?
దేశంలో కొన్ని వందల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో కూడ ఇతర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మూడు సంవత్సరాల కోర్సుకావలసిన వారు ఇతర యూనివర్సిటీలలో చేర వచ్చు. లేదా , ఢిల్లీ విశ్వవిద్యాలయమే, రెండు రకాల కోర్సులనూ అందజేస్తే, ఎవరికి కావలసినది వాళ్ళు ఎంచుకునే వాళ్ళు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసలేం జరిగిందో అర్ధం కావటం లేదు.
విద్యార్ధుల హితం అనేది ముఖ్యమే. కానీ, మూడు సంవత్సరాల కోర్సులోనే విద్యార్ధులకు హితం ఉందని యూజీసీ అధ్యక్షులవారూ, మానవవనరుల మంత్రిణి గారూ, ప్రధానమంత్రిగారూ ఎలా నమ్మారో వివరిస్తే బాగుండేది. మౌలికంగా ఆలోచిస్తే 10+2+4 అయినా, 10+2+3 అయినా విద్యార్ధులకు స్వదేశంలో కుటుంబపోషణ చేసుకునే నైపుణ్యాలను కలిగించాలి. ఆడిగ్రీలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అంతర్జాతీయ ప్రమాణాలకూ, ఆచారాలకు, అనుగుణంగా లేవు, అని నిరాదరణకు గురి కాకూడదు. చాలా మంది విద్యార్ధులు 10+2+3 పధ్ధతిలో తమ డిగ్రీలను పూర్తిచేసినా, ఖాళీగానే ఉంటున్నారు. వీలైనన్ని ఎక్కువ కోర్సులను ప్రొఫెషనల్ కోర్సులుగా డిజైన్ చేయగలిగితే, నైపుణ్యాలను పెంచ గలిగితే, విద్యార్ధులు ఒక సంవత్సరం అదనంగా చదవటానికి వెనుకాడి ఉండేవాళ్ళు కాదేమో.
మన ప్రధాన మంత్రి గారి కుటుంబ పోషణా నైపుణ్యం సరియైన పరీక్షకు గురి కాబడలేదు. చాయ్ బండీ మానేశాక (ఎన్ని నెలలో తెలీదు), వారు పూర్తి స్థాయి ఆర్ ఎస్ఎస్ కార్యకర్తగా మారి, వారి నుండి పోషణను పొంది ఉన్నారనుకోవాలి. తల్లి దండ్రులను గానీ, భార్యను గానీ కుటుంబాన్ని ఏర్పరుచుకొని, పోషించే బాధ్యతను తీసుకుని ఉంటే, నైపుణ్యాలను ప్రసాదించే డిగ్రీ అవసరాన్నిగుర్తించే వారు.
ఇంక, మానవ వనరుల మంత్రిణి గారు 12 తరగతి స్థాయిలోనే టీవీ నటిగానో, ఏంకర్ గానో మారినందు వల్ల గ్లామర్ తో ధనార్జన చేయటం, తప్ప నైపుణ్యాలతో ధనార్జన చేయటం జరగలేదు. అందువల్ల నైపుణ్యాలను ప్రసాదించే డిగ్రీలను ఎలా తయారు చేయించాలో అనే విషయంపై శ్రధ్దవహించకుండా , విద్యార్ధులు మూడేళ్ళ కోర్సులు అడుగుతున్నారు కాబట్టి , గతంలో లాగానే ఆడిగ్రీలను వండి వడ్డిస్తే సరిపోతుందనుకున్నట్లున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నది కాబట్టి నైపుణ్యాల డిజైన్ ఇప్పుడు కుదరదు అనుకున్నట్లైతే, తమ నియంతృత్వ పోకడలతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ వంటి అనుభవజ్ఞులైన మేథావులను అవమానించకుండా, రెండు రకాల కోర్సులనూ అనుమతిస్తే పోయేది. విద్యార్ధులు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించేనాటికి, కుటుంబ పోషణా నైపుణ్యాలను ప్రసాదించే అదనపు సబ్జెక్టులను కొన్నిటిని జోడిస్తే సరిపోయేది.
ఇపుడు అసలేం జరిగిందో వివరించి, పదవినుండి తప్పుకోవాల్సిన నైతిక బాధ్యత, ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై ఉంటుందేమో. యూజీసీ అధ్యక్షుల వారికి కూడ , గతంలో నే తాను ఇంటర్ వీన్ కాకుండా, ఇంత ఆలస్యంగా ఎందుకు ఇంటర్వీన్ అయ్యారో వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. మొట్ట మొదటి సారి, నాలుగేళ్ళ డిగ్రీ ప్రతిపాదన ఢిల్లీయూనివర్సిటీవారు తెచ్చిన సమయంలోనే, తన అభ్యంతరాలను ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్స లర్ కు ఎందుకు తెలియజేయలేదో చెప్పాలి. ఆఖరి నిమిషం దాకా ఎందుకు ఆగినట్లు?
Thursday, June 26, 2014
270 What Ms. Sonia Gandhi is doing in Kausani?
270 సోనియా గాంధీ గారు కౌశానీ లో ఏమి చేస్తున్నారు?
270, Uttarakhand, Sonia Gandhi, Uttarakhand, Almora, Swami Vivekananda, Mahatma Gandhi, Sumitranandan Pant,
జవాబు: సేద తీరుతున్నారుట.
ఎన్నికల ప్రచారంలో ఎండలో తిరిగి తిరిగి చేతులు ఊపీ ఊపీ , గొంతు చించుకొనిహామీలు ఇచ్చీ ఇచ్చీ సోనియా గాంధీ గారు అలసి పోయారో ఏమో, కూలింగు సెంటర్ కి వెళ్ళి సేద తీర్చుకుంటున్నారట. ఈ కూలింగ్ సెంటర్ పేరు కౌశానీ.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, బాగేశ్వర్ జిల్లాలో ఉన్నది. హిమాలయ పర్వత శిఖరాలను తనివి తీరా దర్శించటానికి సరియైన ప్రదేశంట. ఆల్మోరాకు 52 కిలోమీటర్ల దూరంలో, ఆల్మోరా బాగేశ్వర్ దీదీహాట్ హైవే పై ఉందిట. ఇక్కడనుండి త్రిశూలి, నందాదేవి, పంచౌలీ, వంటి హిమాలయా శిఖరాలను చూచాయగా దర్శించ వచ్చునట. పైన్ చెట్ల గుబురులు ఎక్కువట (మనకు తాడిచెట్లలాగా అనుకోండి). గాంధీగారు ఈ ప్రదేశాన్ని స్విట్ జర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నారుట. గాంధీగారు ఇక్కడి అనాసక్తి ఆశ్రమం లో బస చేసినపుడు, అనాసక్తి యోగా అనే వ్యాఖ్యానాన్ని కూడ వ్రాసారుట.
Kausani
ఆల్మోరా ఉత్తరాఖండ్ లో ఒక జిల్లా కేంద్రం. ఆల్మోరా జిల్లా పరిపాలన వెబ్ సైట్ http://almora.nic.in/pages/view/29/48-kausani-location కి వెళ్ళటానికి క్లిక్
సాధారణంగా ప్రభుత్వ వెబ్ సైట్లలో సరియైన సమాచారం ఉండదు. కానీ ఆల్మోరా జిల్లా వెబ్ సైట్ ని ఒక మినహాయింపు అనచ్చు.
The wide expanse of the famous Katyur Valley lies in front of it as you wake up to experience the Kausani sunrise. Kausani's beauty arrested the feet of even Mahatama Gandhi, who stayed for some time at this place. The memory that brief stay of that great man lingers behind in the Anasakti Ashrama. Another great man of India the famous Hindi poet Sumitra Nandan Pant was born here. There is small museum to earmark that sacred spot. The famous folk singer Gopidas was also inspired by the beauty of Kausani. Pinnath (10KMs), Bura Pinnath (5KMs) and Bhakot are the highest points near Kausani.
తెలుగు సారం: విస్తృతమైన కత్యూర్ లోయ, కౌసాని పట్టణం ముందు, సూర్యోదయం కాగానే, మనం నిదుర లేవగానే, మన కళ్ళముందు దర్శన మిస్తుంది. ఇక్కడ కొంత సమయం ఆగిన మహాత్మా గాంధీ గారి పాదాలను కౌసానీ సౌందర్యం కట్టిపడేసిందట. ఆ క్లుప్తమైన విడిది యొక్క జ్ఞాపకం, అనాసక్తి ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భారత్ యొక్క మరొక మహనీయుడు, హిందీ మహాకవి, సుమిత్రానందన్ పంత్ గారు ఇక్కడ జన్మించారుట. ఆ పవిత్ర స్థలాన్ని గుర్తించటానికి ఒక చిన్న మ్యూజియం కూడ ఉన్నది. ప్రఖ్యాత జానపద గాయకుడు గోపీదాస్ జీ , కౌసానీ సౌందర్యంతో ఎంతో ముగ్ధుడు అయ్యారు. పిన్నత్ 10 కిమీ, బూరా పిన్నత్ 5కిమీ, మరియు భకోట్ ఇక్కడి ఉన్నత ప్రదేశాలు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమహాత్మాగాంధి గారు విడిది చేశారంటున్న కౌసానీ లోని అనాసక్తి ఆశ్రమాన్ని సందర్శించారో లేదో తెలియదు.
సోనియా మేడమ్ అనే తెలంగాణ మాతకు ఉన్నసేద తీరే హక్కుని మనం తప్పక గౌరవించి తీరవలసినదే. అదే సమయంలో, పాపం గాంధీగారు!! అనాసక్తి ఆశ్రమం యొక్క చరిత్రను గురించి వాకబు చేసి, గాంధీజీ రచించిన అనాసక్తి యోగా గ్రంధం , దీని ఆంగ్ల నామం , Anasakti Yoga, or The Gospel of selfless action చదవాలనే ఆసక్తిని ఆమె చూపి ఉంటే ఎంతో ఆదరణీయంగా ఉంటుంది. ఇది 390 పేజీల గ్రంధం. రాజకీయనేతలు చదువవలసినది. దురదృష్ట వశాత్తు, ఇది కాపీరైట్ లో ఉండి డబ్బు పెట్టి కొనాల్సిందే తప్ప, ఫ్రీ డౌన్ లో డ్ గా లభ్యమవుతున్నట్లు కనిపించదు. దీని యొక్క సంక్షిప్తసారాన్ని ఈ క్రింది వెబ్ సైట్ లో చూడచ్చు. http://www.mkgandhi.org/swmgandhi/chap01.htm సంక్షిప్త సారం చదువటానికి క్లిక్
ఈ సందర్భంగా, మరొక్క విషయం వ్రాయటం తప్పు కాదనుకుంటాను.
తెలంగాణ మాత సోనియా గాంధీ కనీసం, నెలకొక్కరోజైనా తనకొరకు తెలంగాణా లో నిర్మించి దేవాలయాలలోని విగ్రహాలలోకి ప్రవేశించి భక్తుల కోరికలను తీరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా కరీంనగర్ భూత్ పూర్వ్ ఎంపీ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, భూత్ పూర్వ్ ఎం.ఎల్.ఏ. శ్రీ శంకరరావు గారికి, ఏవైనా వరాలను ఇస్తే బాగుంటుంది.
ఆల్మోరాలో స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద గారు కౌసానీ వెళ్ళారో లేదో తెలియదు కానీ, సేవియర్ దంపతులతో ఆల్మోరాలో చాలా కాలం ఉన్నారు. అంతేకాక తన మిత్రురాలైన క్రిస్టీనా గ్రీనై స్టైడల్ గారికి సేవియర్ దంపతుల చేత ఆశ్రయం ఇప్పించారు. స్వామీజీకి ఆల్మోరాలో స్వంత ఇల్లు కొనుక్కోవాలని కోరిక. అది తీరకుండానే కన్ను మూశారు.
Wednesday, June 25, 2014
269 Repaying the debt?
269 Repaying the debt?
269 తీసుకున్న బాకీని తిరిగ చెల్లిస్తున్నారా?
చర్చనీయాంశాలు: 269, బిజెపి, ఆటోరంగం, పరోక్షపన్నులు, ఎక్సైజు పన్ను, అరుణ్ జైట్లీ
ఈనాటి నవభారత్ టైమ్స్ హిందీ దిన పత్రికలోని క్రింది వార్తను చూడండి.
భారత ప్రజలకు వ్యక్తి గత, లేక కుటుంబ ప్రైవేటు కార్ల అవసరం ఉందా? ఏరోడ్డు మీద చూసినా ఇళ్ళముందు కార్లను నిలిపి ఉంచటం (గ్యారేజీలేక గానీ, లోపల పెట్టుకోటానికి బధ్ధకం వల్లగానీ, ప్రతిసారీ కుదరకగానీ), అవి దుమ్ముకొట్టుకోటం మనం చూడచ్చు.
కన్స్యూమర్ డ్యూరబుల్స్ విషయానికి వస్తే, ప్రతి ఇంటికిటికీకి ఒక స్ప్లిట్ ఏసీ పెట్టె తగిలించి ఉంటుంది. వాటి ఫిల్టర్లను సరిగా శుభ్రం చేయరు. గాలి లీక్ కాకుండా పకడ్బందీగా కిటికీలలో, వెంటీలేటర్లలో కంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోరు.
ఇది డబ్బున్న వాళ్ళ, లేక వాయిదాలలో అప్పు పుట్టే వాళ్ళ స్థితి.
రోడ్ల ఇరుకు వల్ల నగరాలలో, పట్టణాలలో ట్రాఫిక్ మధ్య కార్లెక్కి ఎక్కడికి వెళ్ళాలి? కార్లు అనేవి మనకి రోజూ అవసరం లేదు.
వివాహాల సమయంలో ప్రదర్శనకు, అతిథులను రవాణా చేసుకోటానికి అవసరం కావచ్చు. కొన్ని యాత్రలకు అవసరం కావచ్చు. రైళ్ళలోనూ, బస్సులలోనూ మారుతూ ప్రయాణం చేయలేని వృధ్ధుల పాయింటు టూ పాయింటు రవాణాకి వాడుకోవచ్చు. రోగుల రవాణాకి ఎలాగో అంబులెన్సులు ఉంటాయి. సినీ నిర్మాతలు నటీనటులను లొకేషన్లకు తీసుకువెళ్ళటానికి గ్రూపు కార్లను వాడచ్చు.
ఏవిధంగా చూసినా, అంబాసెడర్ వంటి కార్లు, మహీంద్ర వారి వివిధరకాల జీప్ తరహా, మినీబస్ తరహా వాహనాలు, ఈ గ్రూప్ రవాణాకి సరిపోతాయి. ఇంకా మిగిలిన అవసరాలను, ఆటోలు, బైక్ లు తీరుస్తున్నాయి. అనవసరంగా మనం అంబాసెడర్ తయారు చేసే హిందూస్థాన్ మోటార్స్ ను మూతపడనిచ్చాము.
భారత్ లో మారుతి వంటి అతి చౌక కారునుండి బిఎమ్ డబ్ల్యూ , మెర్సిడెజ్ బెంజ్ వంటి కార్ల వరకు మనం తయారు చేయటం సంతోషకరమే అయినా అవి స్వదేశీ వినియోగానికి కాకూడదు. వాటిని ఎగుమతుల ద్వారా విదేశమారక ద్రవ్యం సంపాదించుకోటానికి వినియోగించుకోవాలి. ఎందుకంటే, ఈ బడా ఆధునిక కార్ల తయారీ దారులందరు, కార్లను మనకి అమ్మి సంపాదించే లాభాలను డివిడెండ్ల రూపంలో తమ స్వదేశాలకు ప్రతి ఏటా చెల్లింపులు చేస్తూ ఉంటారు. వారు కనీ సం తమ డివిడెండ్ల చెల్లింపులకు సరిపడేంత అయినా విదేశ మారకాన్ని సంపాదించటం అవసరం. దీని కొరకు వారు ఎగుమతి తత్వాన్ని అలవర్చుకోవాలి. భారత్ లో డొమెస్టిక్ మార్కెట్లను కొల్లగొట్టటం పరిమితం గానే చేసుకోవాలి. డొమెస్టిక్ మార్కెట్లలో అమ్మేటపుడు , ఎక్సైజు సుంకం తగ్గింపులు, మినహాయింపులు కోరకూడదు.
మనం ప్రైవేటు కార్లను ప్రోత్సహిస్తే దిగుమతి ఇంధనం బిల్లు పెరిగిపోయి చెల్లింపుల సంక్షోభానికి దారి తీయవచ్చు. మధ్య తరగతి కుటుంబాలు ఋణ గ్రస్తమవుతాయి. బ్యాంకులు తమ ఋణాలను వసూలు చేసుకోటానికి గూండాలను నియమించుకో వాల్సి వస్తుంది. (ఇది ఊహ కాదు!! చాల సర్వసాధారణం. ఋణాలు వసూలు చేసే గూండాలకే ముద్దు పేర్లు ఫ్యాక్టరర్లు, ఫర ఫెయిటర్లు.). నేడు ప్రయివేటు బ్యాంకింగు రంగంలో జనరేట్ అవుతున్న ఉపాధి అవకాశాలలో అధిక భాగం ఈతరహా కు చెందినవే.
పారిశ్రామిక వేత్తలనుండి మన రాజకీయ పార్టీలు ఎంత మొత్తంలో ఎన్ని దఫాలుగా విరాళాలు పొందుతున్నారో గానీ, ఏదో వంకపెట్టి వారికి కొత్త కన్ సెషన్లను ఇవ్వటం, పాత కన్ సెషన్లను పొడిగించటం, ఒక అలవాటుగా మారటమే కాక, ''తాడి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం,'' అని వివరించటం అలవాటు అయింది.
శ్రీ అరుణ్ జైట్లీ స్వాముల వారి మాటలలో నే:
ఆహా!! అహహా!!
269 తీసుకున్న బాకీని తిరిగ చెల్లిస్తున్నారా?
చర్చనీయాంశాలు: 269, బిజెపి, ఆటోరంగం, పరోక్షపన్నులు, ఎక్సైజు పన్ను, అరుణ్ జైట్లీ
ఈనాటి నవభారత్ టైమ్స్ హిందీ దిన పత్రికలోని క్రింది వార్తను చూడండి.
सरकार ने गाड़ियों और कंजयूमर ड्यूरेबल्स क्षेत्रों के लिए उत्पाद शुल्क में रियायत की समयसीमा 6 महीने के लिए बढ़ा दी है। इस कदम से कारों और कई उत्पादों की कीमतें बढ़ने की संभावना टल गई है।
తెలుగుసారం: ప్రభుత్వం వాహనాలు, మరియు కన్సూమర్ డ్యూరబుల్ రంగాలలో ప్రస్తుతం ఇస్తున్న ఎక్సైజు సుంకాల మినహాయింపులను ఆరు నెలల వరకు పొడిగించింది. ఈ చర్య వలన కార్లు మరియు పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయనే భావన నెమ్మది అయ్యింది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
భారత ప్రజలకు వ్యక్తి గత, లేక కుటుంబ ప్రైవేటు కార్ల అవసరం ఉందా? ఏరోడ్డు మీద చూసినా ఇళ్ళముందు కార్లను నిలిపి ఉంచటం (గ్యారేజీలేక గానీ, లోపల పెట్టుకోటానికి బధ్ధకం వల్లగానీ, ప్రతిసారీ కుదరకగానీ), అవి దుమ్ముకొట్టుకోటం మనం చూడచ్చు.
కన్స్యూమర్ డ్యూరబుల్స్ విషయానికి వస్తే, ప్రతి ఇంటికిటికీకి ఒక స్ప్లిట్ ఏసీ పెట్టె తగిలించి ఉంటుంది. వాటి ఫిల్టర్లను సరిగా శుభ్రం చేయరు. గాలి లీక్ కాకుండా పకడ్బందీగా కిటికీలలో, వెంటీలేటర్లలో కంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోరు.
ఇది డబ్బున్న వాళ్ళ, లేక వాయిదాలలో అప్పు పుట్టే వాళ్ళ స్థితి.
రోడ్ల ఇరుకు వల్ల నగరాలలో, పట్టణాలలో ట్రాఫిక్ మధ్య కార్లెక్కి ఎక్కడికి వెళ్ళాలి? కార్లు అనేవి మనకి రోజూ అవసరం లేదు.
వివాహాల సమయంలో ప్రదర్శనకు, అతిథులను రవాణా చేసుకోటానికి అవసరం కావచ్చు. కొన్ని యాత్రలకు అవసరం కావచ్చు. రైళ్ళలోనూ, బస్సులలోనూ మారుతూ ప్రయాణం చేయలేని వృధ్ధుల పాయింటు టూ పాయింటు రవాణాకి వాడుకోవచ్చు. రోగుల రవాణాకి ఎలాగో అంబులెన్సులు ఉంటాయి. సినీ నిర్మాతలు నటీనటులను లొకేషన్లకు తీసుకువెళ్ళటానికి గ్రూపు కార్లను వాడచ్చు.
ఏవిధంగా చూసినా, అంబాసెడర్ వంటి కార్లు, మహీంద్ర వారి వివిధరకాల జీప్ తరహా, మినీబస్ తరహా వాహనాలు, ఈ గ్రూప్ రవాణాకి సరిపోతాయి. ఇంకా మిగిలిన అవసరాలను, ఆటోలు, బైక్ లు తీరుస్తున్నాయి. అనవసరంగా మనం అంబాసెడర్ తయారు చేసే హిందూస్థాన్ మోటార్స్ ను మూతపడనిచ్చాము.
భారత్ లో మారుతి వంటి అతి చౌక కారునుండి బిఎమ్ డబ్ల్యూ , మెర్సిడెజ్ బెంజ్ వంటి కార్ల వరకు మనం తయారు చేయటం సంతోషకరమే అయినా అవి స్వదేశీ వినియోగానికి కాకూడదు. వాటిని ఎగుమతుల ద్వారా విదేశమారక ద్రవ్యం సంపాదించుకోటానికి వినియోగించుకోవాలి. ఎందుకంటే, ఈ బడా ఆధునిక కార్ల తయారీ దారులందరు, కార్లను మనకి అమ్మి సంపాదించే లాభాలను డివిడెండ్ల రూపంలో తమ స్వదేశాలకు ప్రతి ఏటా చెల్లింపులు చేస్తూ ఉంటారు. వారు కనీ సం తమ డివిడెండ్ల చెల్లింపులకు సరిపడేంత అయినా విదేశ మారకాన్ని సంపాదించటం అవసరం. దీని కొరకు వారు ఎగుమతి తత్వాన్ని అలవర్చుకోవాలి. భారత్ లో డొమెస్టిక్ మార్కెట్లను కొల్లగొట్టటం పరిమితం గానే చేసుకోవాలి. డొమెస్టిక్ మార్కెట్లలో అమ్మేటపుడు , ఎక్సైజు సుంకం తగ్గింపులు, మినహాయింపులు కోరకూడదు.
మనం ప్రైవేటు కార్లను ప్రోత్సహిస్తే దిగుమతి ఇంధనం బిల్లు పెరిగిపోయి చెల్లింపుల సంక్షోభానికి దారి తీయవచ్చు. మధ్య తరగతి కుటుంబాలు ఋణ గ్రస్తమవుతాయి. బ్యాంకులు తమ ఋణాలను వసూలు చేసుకోటానికి గూండాలను నియమించుకో వాల్సి వస్తుంది. (ఇది ఊహ కాదు!! చాల సర్వసాధారణం. ఋణాలు వసూలు చేసే గూండాలకే ముద్దు పేర్లు ఫ్యాక్టరర్లు, ఫర ఫెయిటర్లు.). నేడు ప్రయివేటు బ్యాంకింగు రంగంలో జనరేట్ అవుతున్న ఉపాధి అవకాశాలలో అధిక భాగం ఈతరహా కు చెందినవే.
పారిశ్రామిక వేత్తలనుండి మన రాజకీయ పార్టీలు ఎంత మొత్తంలో ఎన్ని దఫాలుగా విరాళాలు పొందుతున్నారో గానీ, ఏదో వంకపెట్టి వారికి కొత్త కన్ సెషన్లను ఇవ్వటం, పాత కన్ సెషన్లను పొడిగించటం, ఒక అలవాటుగా మారటమే కాక, ''తాడి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం,'' అని వివరించటం అలవాటు అయింది.
శ్రీ అరుణ్ జైట్లీ స్వాముల వారి మాటలలో నే:
"...Short-term loss will benefit the economy in the long run. ..."
''...స్వల్పకాలిక నష్టము, ఆర్ధిక వ్యవస్థకు దీర్ఘ కాలిక లాభాన్ని సమకూరుస్తుంది. ...''
ఆహా!! అహహా!!
268 Feudalism and Capitalism do not suit India
268 భూస్వామ్య వ్యవస్థలు, పెట్టుబడి దారీ వ్యవస్థలు భారత్ కు పనికిరావు
చర్చనీయాంశాలు: 268, నరేంద్రమోడీ, రిజర్వుబ్యాంకు, భూస్వామ్య వ్యవస్థ, ఇందిరాగాంధీ, ఢిల్లీ యూనివర్సిటీ
శ్రీమతి ఇందిరా గాంధీ తరువాత పబ్లిసిటీ స్పృహ అదే స్థాయిలో కలిగిన ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోడీ. శ్రీమతి ఇందిర పాలించిన కాలంలో, మీడియా మొత్తం శ్రీమతి ఇందిరా వాక్కులతో, యాత్రావివరాలతో, నిండి ఉండేవి. శ్రీ నరేంద్రమోడీ గారు ఎంత చిన్న పనిచేసినా, ఆఫొటో, ఆవార్త, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వెంటనే దర్శనమిస్తుంది. శ్రీమోడీని దర్శించటానికి వచ్చిన వాళ్ళు కూడ పబ్లిసిటీ కాన్షస్ అయితే ఇంక డబుల్ ధమాకా.
శ్రీమతి ఇందిరా గాంధీ emergency అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో ఉద్యోగులు ఎన్నింటికి వస్తున్నారు అనే విషయంపై కొంతకాలం కొంత హడావుడి చేసారు. అత్యవసర స్థితి కాలంలోనే, ఆహడావుడి అవసరం తీరిందని పాలకులు అనుకోగానే, కుక్కతోక వంకరలాగా పరిస్థితి మొదటికి వచ్చింది.
శ్రీ నరేంద్రమోడీ పాలనకు పగ్గాలు తీసుకోగానే, ఉద్యోగులను ఏదో క్రమశిక్షణలో పెట్టేస్తున్నారు అనే మీడియా ప్రచారం మొదలయింది. ఉద్యోగులలో కొంత భయాన్ని నయా పాలకులు ప్రవేశ పెట్టటం తప్పుకాక పోయినా, ఆతరువాత ఆభయాన్ని లూజ్ చేసినపుడు, క్రమశిక్షణా రాహిత్యం రెట్టింపు అవుతుంది.
ఉద్యోగులు, నౌకర్లను తాము 24 గంటలు పర్యవేక్షిస్తేగానీ వారు పని చేయరనుకోటం, పెట్టుబడిదారీ విధానపు మూఢ నమ్మకాలలో ఒకటి.
ప్రాధమికంగా ప్రతి మనిషీ , ముఖ్యంగా ప్రతి భారతీయుడూ, పని చేయాలనుకుంటాడే తప్ప, పని ఎగ్గోట్టి ఉచితంగా జీతం తీసుకోవాలనుకోడు. అదేసమయంలో, కొంత పనిచేశాక, ఉష్ణమండల దేశం కాబట్టి, సులభంగా అలిసిపోయి, కొంత విశ్రాంతి , విరామం కోరుకోటం జరుగుతుంది. దీనిని సోమరి తనంగా యజమానులు భావిస్తారు. పెట్టుబడిదారీ విధానంలో, తాము ముల్లుకర్రతో పొడిచి టాప్ మేనేజర్లు, మిడిల్ మేనేజర్లు, ఎకౌంటెంట్లు, గుమాస్తాలు, నౌకర్లు, కార్మీకులు, కూలీలు, అందరినీ తాము పర్యవేక్షించి దారిలో పెట్తున్నామని యజమానులు అనుకుంటూ ఉంటారు. అది ఒక భ్రమ. ఈభ్రమ వల్ల వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అందు వల్ల టాప్ మేనేజర్లు, కూడ ఆత్మగౌరవం లేకుండా, కేవలం తమకు వచ్చే క్యాష్ పై దృష్టి పెట్టి తాము కూడ వేధింపులలో పాల్గొనటం జరుగుతుంది.
ప్రైవేటు రంగంలో హైర్ అండ్ ఫైర్ పధ్ధతిలో పధ్ధతిలో పనిచేయటానికీ, ప్రభుత్వరంగంలో జీవితకాలం పని చేయటానికీ చాల తేడా ఉంది. ప్రభుత్వం రంగంలో ఉద్యోగులు, సంస్థలు తమవి అనుకుంటారు. టాప్ ఎగ్జిక్యూటివ్ ల వలె తాము కూడ యజమానుల మనుకుంటారు. మధ్య మధ్య శ్రీమతి ఇందిరా గాంధీ, శ్రీ నరేంద్రమోడీ వంటి వారు అవతరించి మీరు కేవలం టైమ్ ప్రకారం వచ్చి పోయే టెంకయ్యలే అని గుర్తుచేసి టైముకి రా అని కొరడాలు ఝళిపిస్తు ఉంటారు. ఈ పధ్ధతిలో ఉద్యోగులు టైమ్ ప్రకారం వచ్చి పోతుంటారే తప్ప, వారిలో జీవం చచ్చి పోతుంది. వారిలో చొరవ అంతరిస్తుంది.
కొద్ది నెలల క్రితం 21.౩.2014 ప్రాంతంలో, మూడు నెలల ముందే రాజీనామా చేసిన విశ్రాంత రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ కమలేష్ చంద్ర చక్రవర్తి అనుకుంటాను, తన వీడ్కోలు సందర్భంగా , రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాలో, భూస్వామ్య సంస్కృతి నెలకొని ఉన్నది అన్నట్లు, నాకు గుర్తు.
“Ours is a very feudal system. I have no agenda. We (deputy governors) propose certain things and they become the governor’s agenda.”
తెలుగుసారం: ''...మాది ఒక చాల భూస్వామ్య వ్యవస్థ. నాకు ఎజెండాలేదు. మేము (డెప్యూటి గవర్నర్లము) కొన్ని విషయాలను ప్రతిపాదిస్తాము మరియు అవి గవర్నర్ యొక్క ఎజెండా అవుతుంది....''
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
రిజర్వుబ్యాంకు గవర్నర్ల మనసు నొచ్చుకోకుండా, తన మనసులోని విషయాన్ని స్పష్టంగా, నిర్మొహమాటంగా, చెప్పినందుకు శ్రీ కె.సీ. చక్రవర్తి గారికి అభినందనలు చెప్పాలి.
భూస్వామ్య వ్యవస్థలు కేవలం రిజర్వు బ్యాంకు కే పరిమితం కావు. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నిటిలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఉన్నాయి. క్లోజ్ లీ హెల్డ్ కంపెనీలలోనూ ఉన్నాయి. వైడ్ లీ హెల్డ్ కంపెనీలలోనూ ఉన్నాయి.
రిజర్వుబ్యాంకులో ఉన్న భూస్వామ్య వ్యవస్థ కొంత మేరకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలలో కన్నా, ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో ఉన్నదానికన్నా మెరుగైనదనే చెప్పాలి. ఎలా అంటే, డిప్యూటి గవర్నర్లు ప్రతిపాదించిన విషయాలు గవర్నర్లకు ఎజెండా కావటం, నియంతృత్వానికి కాకుండా పార్టిసిపేటివ్ మేనేజిమెంటుకి సంకేతం అవుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలలో ఉండే ఆశించే పని పధ్ధతి ఏమిటంటే, అధికారులు, ఉద్యోగులు, తమ మెదళ్ళను ఇంటి దగ్గర వదిలేసి కార్యాలయానికి రావాలి. ఈరోజు బాస్ కి ఏమి కావాలి? ఏమి చేస్తే నాకు బాస్ అనుగ్రహం కలుగుతుంది? ఏమి చేస్తే, లేక ఏమిచేయకపోతే బాస్ నాపై అందరి ముందు విరుచుకు పడతాడు? అభిమానం పొందటానికి, అవమానం తప్పించుకోటానికి ఎంతమేరకు అవసరమో, అంతమేరకే వారు పని చేస్తారు.
అసలు అధికారులు, ఉద్యోగులనుండి నేతలు, ఉన్నతాధికారులు ఆశించాల్సింది ఏమిటి? అవినీతికి, ఒత్తిడులకు లొంగకుండా, చట్టప్రకారం పనిచేయటం. చట్టవిరుధ్ధమైన ఆజ్ఞలు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎవరిచ్చినా, వారు చేయటానికి నిరాకరించే ధైర్యాన్ని చూపాలి. ఒక రాష్ట్రం లో పని చేస్తున్న పోలీస్ అధికారిని, నీవు మరో రాష్ట్ర రాజధానిలో నివసిస్తున్న ఒక అమ్మాయి యొక్క సెల్ ఫోన్, కదలికలపై నిఘా ఉంచమని ఆజ్ఞాపించబడినపుడు, అతడు అది చట్టబధ్ధమా కాదా అని ఆలోచించే ధైర్యం చేయాలి.
గుడ్డిగా బాసుల ఆజ్ఞలను అధికారులు పాటించినపుడు, ప్రజలకు బాధలు కలుగ వచ్చు. ఉదాహరణకి, ఢిల్లీ యూనివర్సిటీలో మూడేళ్ళడిగ్రీ స్థానంలో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సును ప్రవేశ పెట్టటం, నాటి కేంద్ర మంత్రి శ్రీ కపిల్ సిబాల్ గారిని ఆనందింపచేయటానికి జరిగిందట. ఇపుడు శ్రీ స్మృతి ఇరానీ గారు వచ్చి నాలుగేళ్ళు కాదు మూడేళ్ళే అంటే, యూజీసీ వాళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గొంతు పైకూర్చొని, నాలుగేళ్ళ స్కీముని ఎత్తేయటం మొదలైంది.
నాలుగేళ్ళ డిగ్రీ కోర్సుని ప్రవేశ పెట్టటం, అమెరికాలో ఉన్న విద్యా వ్యవస్థకు మ్యాచ్ అవటం కొరకు జరిగిందిట. చేసింది ఒక్క ఢిల్లీ యూనివర్సిటీలోనే. దేశంలోని అన్ని యూనివర్సిటీలలో చేసి ఉంటే, ట్యూబ్ లోంచి బయటకు ప్రెస్ చేసిన టూత్ పేస్టును లోపలకి పంపమనటం లాగా, పెద్ద చాకిరీ అయ్యేది.
ఇంకా ఉంది. వ్రాసిన దానిని కూడ సంస్కరించాల్సింది ఉంది.
Tuesday, June 24, 2014
267 May we worship Shirdi Saibaba or not?
267 షిర్దీ శాయి బాబాను పూజించ వచ్చా, పూజించ రాదా?
చర్చనీయాంశాలు: 267, షిర్దీ శాయిబాబా, Shirdi Saibaba, పీఠాధిపతులు, ద్వారకా పీఠం, మోహన్ బాబు, సినీహీరోలు
ద్వారకా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతిగారు ఒక బాంబు పేల్చారు.
''... షిర్డీ సాయిబాబు దేవుడు కాదు. మనిషిని దేవుడిగా పూజించవద్దు. ...''
''...ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదు...''
"... This is a conspiracy to divide the belief of common man. There are only 2 Gods- Lord Ram and Krishna, ..."
తెలుగుసారం: ... సామాన్యమానవుడి యొక్క నమ్మకాన్ని విభజించటానికి ఇది ఒక కుట్ర. ఇద్దరు దేవుళ్ళే ఉన్నారు: ప్రభువు రాముడు మరియు క్రిష్ణుడు. ...
''...All those people who don't want the Govt to construct Ayodhya temple are spreading these beliefs that Sai Baba was a God. Even Sai Baba trust is involved in the conspiracy. ..."
తెలుగుసారం: ... ప్రభుత్వం అయోధ్య ఆలయం నిర్మించకూడదు అనుకునే వారంతా, శాయిబాబా దేవుడు అనే నమ్మకాన్ని వ్యాపింప చేస్తున్నారు. ఈకుట్రలో సాయిబాబా ట్రస్టుకు కూడ పాత్ర ఉంది. ...
''...साईं भक्तों को गंगा में स्नान नहीं करना चाहिए और शादी की रस्म करना भी छोड़ दें...''
తెలుగు సారం: ''...శాయి భక్తులు గంగలో స్నానం చేయవలసిన అవసరం లేదు. వివాహ కార్యక్రమాలు చేయటం కూడ వదిలేయచ్చు...''
''... साईं भक्तों को राम का नाम नहीं लेना चाहिए ...''
తెలుగుసారం: ''... శాయి భక్తులకు రామ నామం తీసుకోవలసిన అవసరం లేదు...''
''... साईं पूजा हिंदू धर्म के खिलाफ है ...''
''... శాయి పూజ హిందు ధర్మానికి విరుధ్ధం... ''
''...साईं भक्तों को भगवान राम की पूजा, गंगा में स्नान और हर-हर महादेव का जाप नहीं करना चाहिए...''
''...శాయి భక్తులకు భగవాన్ రాముడి పూజ, గంగా స్నానం మరియు హర-హర మహాదేవ జపం చేయనవసరం లేదు ...''
हनुमानगढ़ी के महंत ज्ञानदास: ''...शंकराचार्य की याद्दास्त कमजोर हो गई है और सरकार को तुरंत उन्हें जेल में बंद कर देना चाहिए... शंकराचार्य की टिप्पणी धार्मिक नहीं बल्कि लोगों को जात-पात में बांटने वाली है ...अगर लोग साईं पर आस्था रखते हैं, तो किसी का क्या जाता है? ... शंकराचार्य सोने-चांदी के सिंहासन पर बैठकर खुद की आरती उतरवाते हैं... ''
తెలుగుసారం: హనుమాన్ గఢీ మహంత్ జ్ఞాన్ దాస్ గారన్నారుట: ''...శంకరాచార్యుల వారి జ్ఞాపకశక్తి క్షీణించింది. ప్రభుత్వం వారిని జైలులో బందీ చేయాలి. ... శంకరాచార్యుల వారి వ్యాఖ్య ధార్మికము కాదు. ప్రజలను జాతులవారీగా విభజించేదిగా ఉంది. ప్రజలు శాయిపై విశ్వాసాన్ని ఉంచితే, ఎవరికి ఏమి పోతుంది? ... శంకరాచార్య బంగారు-వెండి సింహాసనం పై కూర్చొని తనకు తానే హారతి ఇప్పించుకుంటారు. ...''
వైబీరావు గాడిద మనోభావాలు
పాఠకుల, భక్తుల, మనోభావాలు గాయపడకుండా వ్రాయటం చాలా కష్టం. అయినా, రేపు నా శక్తికొలది ప్రయత్నిస్తాను. ఈలోగా విజ్ఞులైన పాఠకులు తమ మనోభావాలు క్రింద కామెంట్స్ లో వ్రాయటానికి ఆహ్వానం.
Added on 25.06.2014
1. దేవుడు(దేవత) అనే పదానికి సరి యైన నిర్వచనం లేదు. దేవుడు ఉన్నట్లుగా ఋజువులు లేవు.
2. దైవం == మానవాతీత శక్తి అనే అర్ధం లో అయితే ఉంది. అన్ని ప్రకృతి శక్తులు ఇంకా మనిషికి స్వాధీనం కాలేదు.
3. దైవం == మనలను ప్రార్ధనలను విని, మన పూజలను స్వీకరించి, మనలను రక్షించి, మనకు ఇంకచాలు బాబో అనేంతగా డబ్బిచ్చే శక్తి అనే అర్ధంలో అయితే , ఉన్నట్లు ఋజువులేదు.
4. ప్రకృతి, గ్రహాలు, నక్షత్రాలు మొ|| వాటిలో జరిగే రసాయనిక చర్యల వల్ల మన చుట్టూ మార్పులు జరుగుతాయి. మనిషికో, చెట్లకో, జంతువులకో మేలు చేద్దామనో, కీడు చేద్దామనో, శిక్షిద్దామనో, అవి జరగవు.
5. షిర్దీ శాయిబాబా 1918 ప్రాంతంలో మరణించిన ఒక మానవుడు. ఆయన ఉత్త మానవుడు కాక ఉత్తమోత్తమ మానవుడు అయితే అయి ఉండ వచ్చు. సాధారణంగా, గుళ్ళు కట్టించే వారు, పూజలు చేయించే వారు, ఈ ఉత్తమోత్తమత్వానికి గౌరవ సూచకంగా, పూజలు చేస్తే స్వాగతించ వచ్చు. నేటి యాత్రలు, పూజలు అలా జరగటం లేదు. శాయికి మానవాతీత శక్తులు ఉన్నాయి అని నమ్మించటానికి, కొన్ని కథలను సృష్టించి, ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తున్నారు. శాయిబాబా గుళ్ళను కట్టటం, నిర్వహించటం, అనేది ఒక వ్యాపారంగా మారింది. ఒక ఫకీరుగా షిర్దీ శాయికి బంగారంతో పనిలేదు. కానీ, ఆయన గుడిని నడిపే ట్రస్టువారికి బంగారం వ్యామోహం పట్టుకున్నది. ధనిక భక్తులెవరైనా సరే, బంగారం సమర్పించుకుంటామని వస్తే , ట్రస్టువారు అట్టి భక్తులను నిరుత్సాహ పరిస్తే ఆరోపణలకు, అవినీతికి తావుండదు. రియల్టర్లు, నల్లబజారు వర్తకులు, అవినీతి పరులైన అధికారుల దగ్గర విరాళాలు స్వీకరించటం మానేయచ్చు. కానీ మానేయరు.
6. అన్య మతస్తులు కుట్రలు చేస్తున్నారు అనేది, శ్రీ ద్వారకా పీఠాధిపతుల వారి అపోహ. శాయిబాబా గుడుల నిర్వహణ అనేది ఒక వ్యాపారమే కానీ, ఇతర మతస్తులు చేసే కుట్ర అనటానికి ఋజువులు లేవు.
ట్రాఫిక్ కి అడ్డంగా, రోడ్లను ఆక్రమించి, శాయిబాబా గుడులను నిర్మిస్తున్నారు. పెద్దగా మైకులు పెట్టి భజనలు, మొ|| శబ్ద కాలుష్యంతో వేధిస్తున్నారు. ఇతర గుడులు, మసీదులు, చర్చీల వారు కూడ ఈపని చేస్తున్నందు వల్ల, అతిక్రమించే అందరిపై , అతిగా కాకుండా, సముచితమైన చర్యలు తీసుకోవాల్సింది పోలీసు శాఖవారు.
మనిషిని దేవుడు అనటం , దేవుడి కొడుకు అనటం, ప్రవక్త అనటం, ఇవన్నీ అన్ని మతాలలోనూ ఉన్నది.
భారత దేశాన్ని పాలించిన కొందరు రాజులు, తమ వంశానికి చెందిన మూలపురుషులను, పూర్వీకులను, దేవుడిగానూ, దేవుడి అవతారాలుగానూ చిత్రిస్తూ, కథాగానాలను చేయించటం, పురాణాలను, కావ్యాలను వ్రాయించటం జరిగినపుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మానవులను కూడ అవతార పురుషులుగా చిత్రించి స్థిరీకరించటం జరిగింది. మనుష్యులను, వారెంతటి వారైనా, దైవీ సంపత్తి గలవారైనా, పూజించకూడదు అనుకుంటే, బహుశా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి స్థానంలో కేవలం శ్రీ మహావిష్ణువును మాత్రమే పూజించ వలసి వస్తుంది. ఇది తప్పా , అది తప్పా అని మనం నిర్ధారించలేము. అన్ని కూడ సాధ్యమే.
పీఠాధిపతులు మానవులను దేవుళ్ళుగా పూజించకూడదు, అని చిత్త శుధ్ధితో నమ్ముతున్నట్లైతే, ముందుగా వారు, తమ పీఠాలలో జరుగుతున్న వ్యక్తి పూజలను నిరుత్సాహ పరచాలి. వారు తమ పాద పూజ చేయటానికి ఎవరినీ అనుమతించకూడదు. వాటికి ఛార్జీలు పెట్టకూడదు. తాము సింహాసనం పైకూర్చుండి, హారతులు ఇప్పించుకోకూడదు.
తమకు ఏవిధమైన అధికారాలూ లేవని పీఠాధిపతులు గుర్తించటం వల్ల వారి సన్యాసం శోభిస్తుంది. కేవలం కాషాయ గుడ్డలు, బొట్లు, పీఠాలే కాదు, సన్యాసమంటే. రాగద్వేషాలను విసర్జించాలి. అలా విసర్జించిన వాళ్ళకి స్వమతం, అన్యమతం తేడాలు కనిపించవు. స్వమతస్తులపై కానీ, ఇతర మతస్తులపై కానీ పెత్తనం చలాయించాలనే కోరిక అసలు జనించదు.
ఎవరైనా తనను దేవుడు అన్నప్పుడు, అలా అన్న వ్యక్తి నేను మనిషినే, అన్నవిషయాన్ని మరల మరల స్పష్టంగా చెప్తూ తనకు గొడుగులను పట్టే వాళ్ళని గెంటి వేయాలి. పై ఫొటో చూడండి, షిర్దీ శాయిబాబా గారు తనకు గొడుగు పట్టేవాళ్ళతో ఎలా సేవ చేయించుకుంటున్నాడో. అంటే, సాయిబాబా ప్రోత్సాహంతోనే , ఆయనను దేవుడిగా చేసిన తంతు నడిచింది.
మహాత్మా గాంధీగారికీ ఈ సమస్య ఎదురైంది. నేను మహాత్ముడను కాను,నేను మామూలు మనిషినే, నన్ను మహాత్ముడు అనటం ద్వారా, మీరు మానవ జాతిని అవమానిస్తున్నారు, అని ఆయన స్పష్టంగా చెప్పి, తనను మహాత్ముడు అని ప్రచారం చేస్తున్న వారినుండి దూరంగా జరగ వలసి ఉన్నది. కానీ ఆయన అలా చేయలేదు. అయితే ఆయన కాలానికి ఆయన ప్రధాన సమస్య, స్వాతంత్ర్య పోరాటం. సత్యాగ్రహానికి, సహాయనిరాకరణానికి, జనాన్ని మోటివేట్ చేయటం. తను మహాత్ముడు అని జనంలో ఉండే నమ్మకాన్ని ఆయన స్వాతంత్ర్యోద్యమాన్ని బలోపేతం చేయటానికి వాడుకున్నాడు, అనే భావం నాకు ఉన్నది.
ఏసును దేవుని కుమారుడిగా నమ్మి ప్రార్ధించటం అనేది క్రీ.శ. 2వ శతాబ్దపు పరిణామం కాగా, శాయిని దేవుడిగా పూజించటం 20వ శతాబ్దపు పరిణామం. హిస్టరీ రిపీట్స్ అంటే చరిత్ర పునరావృత్తం అవటం ప్రతి శతాబ్దంలోను జరిగింది. అయితే 36 కోట్ల భారత జనాభా 120 కోట్లకు విస్తరించినపుడు, శాయి పూజ కూడ మూడు దేవాలయాలూ ఆరు గోపురాలుగా విలసిల్లటం ప్రారంభమయ్యింది. ఇతర మతాలలో లాగానే, శాయి భక్తులలోనూ అసహనం బయలు దేరింది. ద్వారకా పీఠాధి పతి ఇలా ఒకమాట అన్నాడో లేదో, వెంటనే ఆయన దిష్టిబొమ్మను తగలేశారు. ఒక మనిషిని తాము దేవుడిగా భావించి, పూజలు చేసి, తమ కోరికలు తీర్చుకోవాలనుకోటం సబబా, కాదా, అనే విషయాన్ని వారు ఒకసారి కూడ పరిశీలించుకోకుండా, వెంటనే స్వరూపానంద దిష్టిబొమ్మను తయారు చేసుకున్నారు. కోర్టులో ఒక దావా పారేశారు.
మన పట్టణాలలో కొన్నలక్షలమంది తమ పుట్టుక మతానికి చెందిన దేవుళ్లనే కాక, పొరుగు వాళ్ళ దేవుళ్ళను, పొరుగువారి సమీపంలో తిరిగే మతబోధకులయొక్క దేవుళ్ళని కూడ పూజిస్తున్నారు. ఇక్కడ వారు ఆశించేది: తమ రోగాలు తగ్గటం, పిల్లలకు ఉద్యోగాలు రావటం, పెళ్ళిళ్ళు కావటం, సంతానం కలగటం, కోర్టు తగాదాల్లో నెగ్గి ఆస్తి కొట్టుకురావటం, నేరం చేసినా జైలుకు పోకుండా దేవుడి చేత రక్షించబడటం, వ్యాపారాల్లో తమ వాటా, దేవుడి వాటా, మొత్తం కలిపి మొక్కుకున్నంత లాభం రావటం ఇలా ఎన్నో.
అనుకున్నది నెరవేరితే, వారు కాంగ్రెస్ లోంచి బిజెపీ లోకి దూకిన నేత, సోనియాను వదిలి మోడీని కీర్తించినట్లుగా, లేక వైయస్ ఆర్ పీ లోంచి టిడిపి లోకి దూకిన నేత జగన్ ను తిట్టినట్లుగా, కొత్తమతానికి తగ్గట్లు తమ శరీరాలపై వాతలు పెట్టుకోటం, గతంలో తమ రొమ్ములమీద పొడిపించుకున్న పాత నేతల (పాత దేవుళ్ళ) పచ్చబొట్లను చెరిపించుకోటం, కొత్తమత ప్రచారంలో విజృంభించటం జరుగుతుంది. ఇంక వాహనాలూ, క్యాష్, లభ్యమైతే, ఆహా సొగసు చూడ తరమా.
తెలుగు నటుడుమోహన్ బాబు
''...షిరిడిసాయి దేవుడు కాదంటే బాధగా ఉంది. ...''
''...ఓ హిందువుగా ఆవేదన చెందాను. ...''
''...కొంతమంది మతిచలించి మాట్లాడుతున్నారు..''
''...ఈశ్వరుడి అంశ సాయిబాబా...''
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
శ్రీ మోహన్ బాబు గారు ఒక వృధ్ధ సర్వసంగ పరిత్యాగి యైన సన్యాసిని పట్టుకొని ''..కొంతమంది మతి చలించి మాట్లాడుతున్నారు ..'' అనటం సరికాదు. నేను 1983 సంవత్సర ప్రాంతంలో, తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట సమీపంలోని ఒక కుగ్రామంలో నివసించే సమయంలో, అచ్చంపేట పట్టణంలోని ఒక సినిమా హాల్ లో, శ్రీ మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాను చూసే భాగ్యం కలిగింది. ద్వంద్వార్ధాలతో నిండి ఉండి, అసహ్యకరమైన సంభాషణలు, పిచ్చి డాన్సులతో ఆసినిమా బాగా విసిగించింది. ఎంతో కొంత విద్యా గంధం ఉన్న నా బోటి వాళ్ళకు వికృతంగా కనిపించిన ఆసినిమా నిరక్షరాస్యులు, లేక అల్పాక్షరాస్యులు అయిన ఆ గ్రామీణ లేక గిరిజన యువతీ యువకులను ఎంత ఉద్రేక పరచి ఉంటుందో ఊహించటానికి ప్రయత్నించినా, నాకు అంతు చిక్కలేదు.
ఆతరువాత హీరోగా శ్రీ మోహన్ బాబు ఎంతో ఖ్యాతి సంపాదించటం, ఎన్నో చచ్చు పుచ్చు అసభ్య సినిమాలు, హింసాత్మక సినిమాలలో నటించి, అలాంటి సినిమాలను తీసి, కోట్లు గడించటం గమనార్హం. తాను సంపాదించిన సంపద లో అధిక భాగం చెడు పధ్ధతులతో రాజీ పడటం వల్ల వచ్చింది అనే విషయాన్ని మరచి, అంతా శాయి కృప అనుకోటం దురదృష్టకరం. ఈవిషయంలో శ్రీ మోహన్ బాబు ఒక్కరినే తప్పు పట్టవలసిన అవసరం లేదు. అన్ని రంగాలూ అలానే ఉన్నాయి- గొంగట్లో తింటు వెంట్రుకలు లెక్క పెట్టటం లాగా ఉంది.
రెండు ఒక దానితో మరొక దానికి సంబంధం లేని విషయాలకు కార్య కారణ సంబంధాలను ఆపాదించి, తమకు వచ్చిన లప్పం అంతా షిర్దీ శాయి దయతోనో, పుట్టపర్తి శాయి దయతోనో, ఇంకో ఇంకో ఏదో ఒక మతం దేవుడి దయతోనో లభించింది అనుకోటం చాలమంది నేతలకు, అధికారులకు, ప్రముఖులకు, అలవాటుగా మారింది.
అలాంటి వారు ఆత్మ పరీక్ష చేసుకునేందుకు వారికి తీరిక లేదు (డబ్బు సంపాదనలో బిజీ బిజీ), కోరికలేదు (అలాటి ఆత్మ పరీక్షలో డబ్బులు రావు), ఓపిక లేదు (ఆత్మ పరీక్ష చేసుకోవాలంటే చాల అధ్యయనం చేసుకోవాలి, మధన పడాలి. మనకు పిచ్చి గంతులు వేస్తూ వాటిని డాన్సులు గా ప్రచారంచేసుకునే ఓపికే గాని, ఆత్మ పరీక్షకు శ్రమపడే శక్తి ఉండదు.) అలాంటి ఓపికే ఉంటే ఇంకో రుద్రాక్ష తోటను పెంచి రుద్రాక్షలతో వ్యాపారం చేసుకోవచ్చు.
ఇంకా ఉంది. వ్రాసిందాన్ని పునః సమీక్షించి మనోభావాలు గాయపడే విషయాలను తొలగించాల్సి ఉంది.
Sunday, June 22, 2014
266 Will nobody be admited into KCR's Pakistan?
265 కెసీఆర్ పాకిస్థాన్ లోకి ఇతరులకి ప్రవేశం ఉండదా?
చర్చనీయాంశాలు: 265, KCR, Bifurcation, విభజన, తెలంగాణ, కెసిఆర్
ఊహించినట్లే అయింది. కెసిఆర్ కుటుంబం, తెలంగాణను కుటుంబ ఆస్తి గానే కాక పాకిస్థాన్ వంటి వికృతపు ఊహలు కలదేశంగా మార్చింది. వారు చేస్తున్న పనులు ఈ దేశం అంతా ఒకటి అనే లక్ష్యాన్ని డొక్కలో పొడుస్తుంది.
తెలంగాణ విద్యాలయాల్లో ఫీజు రీయింబర్సుమెంటుకి అర్హత పొందటానికి, పిల్లవాడే కాక తండ్రి కూడ తెలంగాణ లోనే పుట్టాలనే నిబంధన వంటి వాటిని, బహుశా తమ రాజ్యాలలో మహమ్మద్ ఘోరీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబులు కూడ పెట్టి ఉండరు.
కెసిఆర్ కుటుంబానికి సీమాంధ్ర ప్రజలు అంటే కుళ్ళు ఉంటే ఉండ వచ్చు. సీమాంధ్ర విద్యార్ధులకు రీయింబర్సుమెంటు ఇవ్వటం ఇష్టంలేకపోతే మానేయవచ్చు. సీమాంధ్ర విద్యార్ధులు బిచ్చగాళ్ళు కాదు.
కెసీఆర్ కుటుంబం చేస్తున్న పని జాతీయ స్ఫూర్తికి విరుధ్ధంగా ఉంది. ఎలాగంటే, ఒరిస్సానుండో, బిహార్ నుండో ఒక రాళ్ళు కొట్టుకునే కూలీయో, లేక ఒక ఇటుక బట్టీలో పని చేసే కూలీయో హైదరాబాదు వచ్చి పొట్టపోసుకుంటున్నాడనుకోండి. వాడు, వాడి కొడుకు తెలంగాణలో పుట్టలేదు కాబట్టి ఇంక రీయింబర్స్ మెంట్ లేదంటే వాడి గతి ఏమిటి? ఇంక భారత దేశాన్ని ఒకటే దేశం అనటం ఎందుకు?
అసలు కెసీఆర్ తండ్రి ఎక్కడ పుట్టాడు? కెసీఆర్ తాత ఎక్కడ పుట్టాడు? ఈతలతిక్కల ప్రశ్నలకు జవాబులు ఏమిటి?
మనకి మొహమ్మదాలీ జిన్నా, బాలా సాహెబ్ థాక్రె, నిజాం నవాబు లేని లోటుని కెసిఆర్ కుటుంబం తీరుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరచి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, కెసీఆర్ చిన్నప్పుడు తోటకూర కాడ దొంగిలిస్తే తల్లి ప్రోత్సాహం పొందిన బుల్లి దొంగ , పెద్దయి గజదొంగగా మారినట్లు, భింద్రన్ వాలే, హిట్లర్ లను దాటిపోయి తెలంగాణ భవిష్యత్ కే ఎసరు తెస్తాడు.
కెసీఆర్ చేస్తున్న పనులు చూసి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు కెసీఆర్ తమకేదో బంగారపు గనులు త్రవ్వి ఇవ్వబోతున్నాడు అనుకుంటే, వారు దగా పడక తప్పదు. ఎలాగంటే, తెలంగాణకి ప్రథమ ముఖ్యమంత్రిగా దళితుడిని ఎన్నిక చేయిస్తానని వేయిసార్లు చెప్పి, ధోకా చేసింది గుర్తుకు తెచ్చుకోవాలి:
తెలంగాణ విద్యాలయాల్లో ఫీజు రీయింబర్సుమెంటుకి అర్హత పొందటానికి, పిల్లవాడే కాక తండ్రి కూడ తెలంగాణ లోనే పుట్టాలనే నిబంధన వంటి వాటిని, బహుశా తమ రాజ్యాలలో మహమ్మద్ ఘోరీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబులు కూడ పెట్టి ఉండరు.
కెసిఆర్ కుటుంబానికి సీమాంధ్ర ప్రజలు అంటే కుళ్ళు ఉంటే ఉండ వచ్చు. సీమాంధ్ర విద్యార్ధులకు రీయింబర్సుమెంటు ఇవ్వటం ఇష్టంలేకపోతే మానేయవచ్చు. సీమాంధ్ర విద్యార్ధులు బిచ్చగాళ్ళు కాదు.
కెసీఆర్ కుటుంబం చేస్తున్న పని జాతీయ స్ఫూర్తికి విరుధ్ధంగా ఉంది. ఎలాగంటే, ఒరిస్సానుండో, బిహార్ నుండో ఒక రాళ్ళు కొట్టుకునే కూలీయో, లేక ఒక ఇటుక బట్టీలో పని చేసే కూలీయో హైదరాబాదు వచ్చి పొట్టపోసుకుంటున్నాడనుకోండి. వాడు, వాడి కొడుకు తెలంగాణలో పుట్టలేదు కాబట్టి ఇంక రీయింబర్స్ మెంట్ లేదంటే వాడి గతి ఏమిటి? ఇంక భారత దేశాన్ని ఒకటే దేశం అనటం ఎందుకు?
అసలు కెసీఆర్ తండ్రి ఎక్కడ పుట్టాడు? కెసీఆర్ తాత ఎక్కడ పుట్టాడు? ఈతలతిక్కల ప్రశ్నలకు జవాబులు ఏమిటి?
మనకి మొహమ్మదాలీ జిన్నా, బాలా సాహెబ్ థాక్రె, నిజాం నవాబు లేని లోటుని కెసిఆర్ కుటుంబం తీరుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరచి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, కెసీఆర్ చిన్నప్పుడు తోటకూర కాడ దొంగిలిస్తే తల్లి ప్రోత్సాహం పొందిన బుల్లి దొంగ , పెద్దయి గజదొంగగా మారినట్లు, భింద్రన్ వాలే, హిట్లర్ లను దాటిపోయి తెలంగాణ భవిష్యత్ కే ఎసరు తెస్తాడు.
కెసీఆర్ చేస్తున్న పనులు చూసి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు కెసీఆర్ తమకేదో బంగారపు గనులు త్రవ్వి ఇవ్వబోతున్నాడు అనుకుంటే, వారు దగా పడక తప్పదు. ఎలాగంటే, తెలంగాణకి ప్రథమ ముఖ్యమంత్రిగా దళితుడిని ఎన్నిక చేయిస్తానని వేయిసార్లు చెప్పి, ధోకా చేసింది గుర్తుకు తెచ్చుకోవాలి:
విలేఖరుల ప్రశ్న: Are you doing all this to become the CM of the new state? ఇదంతా మీరు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామని చేస్తున్నారా?
కెసీఆర్ జవాబు: This is rubbish. I’ve said it not less than a thousand times that the first Telangana CM will be a Dalit. We have not zeroed in on a name right now, but there are so many leaders. When the occasion comes, we will evolve a consensus on a Dalit CM. The Telangana society is in such a mood that nobody can rule here unless they bring us statehood. It is ultimately a political decision. Let wisdom prevail on the Prime Minister and Sonia Gandhi that they deliver on the promise they made to the people of Telangana.
తెలుగు సారం: ఇది చెత్త. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ఉంటాడని నేను వేయి సార్లకు తక్కువ కాకుండా చెప్పాను. ఇప్పటికిప్పుడు మేము పేరును నిర్ణయించుకునే దశకు రాలేదు. ఆ సమయం వచ్చినపుడు దళిత ముఖ్యమంత్రిపై మేము ఏకాభిప్రాయాన్ని సాధిస్తాము. తెలంగాణ సమాజం ఈరోజు ఏస్థితిలో ఉందంటే, తెలంగాణకి రాష్ట్రాన్ని సాధించకుండా ఇక్కడ పాలన చేయలేని మూడ్ లో ఉన్నది. అది చివరికి ఒక రాజకీయ నిర్ణయము. తాము తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే వివేకం ప్రధానమంత్రి మరియు సోనియా గాంధీలో ఉదయించు గాక.
వేయి సార్లు చెప్పిందానికే, విలేఖరులు అడిగితే చెత్త అన్నవాడు చివరికి ఏమి చేశాడో? తన కుటుంబంలో ముగ్గురు మంత్రులు. కూతురు ఎంపీ.
''మేము భారత దేశంలో అంతర్భాగం, ఇతర రాష్ట్రాల వాళ్ళు తమ రాష్ట్రానికి వస్తున్నట్లే, మేము కూడ ఇతర రాష్ట్రాలకు పొట్టకూటి కొరకు వెళ్ళవలసి ఉంటుంది '' అని తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోకపోతే వారు స్వదేశంలోనే విదేశీయులవుతారు. కెసీఆర్ తెలంగాణ వారెవరూ బయటకు వెళ్ళనక్కరలేదంటాడు, అన్నీ తెలంగాణలో నేనే సమకూరుస్తా నంటాడు, తన వసూళ్ళ సామ్రాజ్యంలో అదికుదరదు, కేసీఆర్ చేయగలిగే దానికి పరిమితులు ఉంటాయి, దానిని కాలం, పారిశ్రామిక వాతావరణం, వాణిజ్య వాతావరణం, నిర్ణయిస్తుంది.
ఉద్యోగాల లభ్యత అనేది ఎన్నో ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. జాగీర్ దారుల పాలనలో ఉద్యోగాలు అరణ్యంలో మోదుగ చెట్లు పుట్టుకొచ్చినట్లు పుట్టుకు రావు. కెసీఆర్ కుటుంబ జమీందారీ కేవలం తెలంగాణలోనే నడుస్తుంది. శ్రామికులు అనేవాళ్ళు, తెలంగాణ, సీమాంధ్ర, బీహారు, ఒరిస్సా, తమిళ్ నాడు, గుజరాత్ ఇలా భేదాలు లేకుండా, దొరికే అవకాశాలను అంది పుచ్చుకోవాలి. కెసీఆర్ కుటుంబ ఫ్యాక్టరీల బయట సెక్యూరిటీ గార్డులు గా తెలంగాణా లోనే గ్యారంటీడ్ జాబ్ పొందే కన్నా, రుచి కరమైన హైదరాబాద్ బిరియానీ చేయటం నేర్చుకొని విజయవాడ రైల్వే స్టేషన్ లేక విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా కాకాహోటల్ పెట్టుకొని ఆత్మ గౌరవంతో జీవించ వచ్చు. కెసిఆర్ కుటుంబ కాళ్ళ దగ్గర బాంచలం దొర, కాల్ మొక్కుతాం అనే కన్నా ఏ హంపీలోనో యాత్రికులకు శిల్పాలను చూపించుకుంటూ, నవ్వుతూ జీవించవచ్చు.
ఉద్యోగికి దూరభూమిలేదు అంటే ఈ ఆత్మ గౌరవమే. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటే ఈ విశాల విశ్వం మనదే అనే అర్ధం.
రాజధానిని హైదరాబాదులో పెట్టారు కాబట్టి సీమాంధ్ర ప్రజలు తప్పని సరి అయ్యి హైదరాబాదు వచ్చారు కానీ, ఇపుడు రారు. ఇపుడు వారు తమ కొత్త రాజధానికి వెళ్తారు. ఇంక తెలంగాణ ప్రజలు 1957 కి ముందున్న పధ్ధతులలోనే దొరలకు, నవాబులకు, కాల్మొక్కుతూ , వాళ్ళిప్పించే కల్లు ముంతలను ఇంటికి తెచ్చుకోవచ్చు. జీతాలకుండచ్చు. పట్నాల్లో చదివే దొరల పిల్లలకి దాస్యం చేయచ్చు. ఎవరికి నచ్చిన విధంగా వారు దాస్యం చేసుకునే స్వేఛ్ఛను ఈరాజ్యాంగం మనకిచ్చింది కదా.
చివరి మాట
ప్రాంతీయవాదం కన్నా, నాస్తికత్వం, మార్క్సిజం మెరుగైన సిధ్ధాంతాలు. అవి మనుషులను పశువుల్లాగా గుంజలకు కట్టిపడేయవు. ఈవిషయాలు ఋజువు కావాలంటే, నాస్తికత్వం, మార్క్సిజం మీద విస్తృతమైన, లోతైన బహిరంగ చర్చలు జరగాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని బోధించాలి. భారత్ లోని ప్రతి పౌరుడు వీటిని అర్ధం చేసుకొని లాభపడాలి. దేశానికి దారి చూపటంలో, తెలంగాణ, శేషాంధ్ర ముందుండాలి. మననుండి బీహార్, ఒరిస్సా, తమిళ్ నాడు మొ|| సర్వ దేశీయ కూలీలు సత్యాన్ని తెలుసుకోవాలి.
265 What awaits Mr. L.K. Advani?
265 శ్రీ ఎల్ కే అద్వానీ గారి భవిష్యత్ ఏమిటి?
చర్చనీయాంశాలు: 265, అద్వానీ, నరేంద్రమోడీ, బిజెపి, హిందీ రాష్ట్రాలు, పెండ్యాల, పింగళి, Advani, Joshi, Sushma Swaraj, Narendra Modi
భారత్ లో 2014లో బిజెపి సాధించిన అఖండ విజయంలో అత్యధిక భాగం హిందీ రాష్ట్రాలలోనే అనేది విదితమే. బెంగాల్లోగానీ, తమిళనాడులో గానీ, కేరళలో గానీ, ఆంధ్రప్రదేశ్_తెలంగాణల లో గానీ, ఒరిస్సాలో గానీ, బిజెపి తన ప్రభావాన్ని చూపలేకపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్ సీ పీ లు అధికారంలో ఉన్నా, శివసేన బిజెపిలకు మూలాలు బలంగా ఉండేవి. ఊయల బల్లలో వలే ఒకసారి వారు, ఒకసారి వీరు తమ సత్తాచూపటం జరిగేది. బిజెపి కి బాగా ఈసారి బాగా కలిసి వచ్చిన రాష్ట్రాలు యూపీ బీహార్ లే.
గుజరాత్ లో శ్రీ నరేంద్రమోడీ అక్కడి స్థానిక సీనియర్ బిజేపీ నేతలను (శంకర్ సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్) లను శంకరగిరి మాన్యాలు పట్టించిన విషయం విజ్ఞులకు తెలిసిన విషయమే.
ఇపుడు అదే పధ్ధతిలో భీష్ముడు శ్రీ ఎల్ కే అద్వానీ, ద్రోణుడు శ్రీ మురళీ మనోహర్ జోషీలకు కూడ మంగళం పాడేయటం జరుగుతుందా, వారి భవిష్యత్ ఏమిటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ సందర్భంగా, ఉత్తరభారత్ లో హిందీ పత్రికలలో పాఠకుల అభిప్రాయంపై నేను చేసిన సర్వేలో, ముఖేష్ ఆర్యా అనే పాఠకుడు, 8.6.2013 నాడు, మండీ, గోబిందఘర్, పంజాబ్ నుండి నవభారత్ టైమ్స్ పత్రికలో బిజేపి భీష్ముడు అద్వానీ గారికి ఇచ్చిన సలహా (దీనిని సమర్ధించటం లేక వ్యతిరేకించటం నాపని కాదు) ఉత్తర భారతదేశపు యువతలో నెలకొన్న భావోద్వేగానికి ప్రతీకగా నేను భావించి, దానికి తెలుగు అనువాదాన్ని, నా వ్యక్తిగత టిప్పణి (వ్యాఖ్య), రాయ్ (అభిప్రాయాన్ని) ఇక్కడ ఇస్తున్నాను.
mukesh arya , mandi gobindgarh punjab का कहना है :
08/06/2013 at 08:15 AM
अडवाणी जी, आपको यह समझना चाहिए कि मोदी तो आपके बालक की तरह है, वो आपका शिष्य है और यदि भाजपा को मोदी सत्ता दिला सकते हैं तो ये आपके लिए गर्व की बात है। यदि आप नहीं समझना चाहते तो ये आपका मोदी के लिए विद्वेष ही नहीं, आपके उपर नितीश कुमार जैसे छद्म धर्मनिरपेक्ष नेताओं का प्रभाव और कांग्रेस का मोह माना जायेगा।
फैसला आपको करना है कि भारतीय राजनीती के इतिहास में अपना नाम आप कैसे अक्षरों में लिखवाना चाहते हो। मैं आपका बहुत आदर करता हूँ क्यूंकि भाजपा को यहाँ तक लाने में आपका बहुत योगदान है मगर आज आपने अपने ही आचरण से अपने ऊपर कलंक लगा लिया है और अब इस कलंक को धोने की जरूरत है।
मोदी को मोदी के ही समर्थक भूल जायेंगे अगर आप ईमानदारी से खुलासा कर दें कि वो क्या कारण हैं जिसकी वजह से आप मोदी से नफरत करने लगे।
ये गुपचुप खेल नहीं चलना चाहिए, सार्वजानिक जीवन में हो तो ये जानना जनता का अधिकार है कि आखिर माजरा क्या है आप दोनों के बीच।
लोगों को समझने दीजिये कि इस कलह में आप गलत हैं या मोदी।
कमाल है...
సుమారు తెలుగు సారం: అద్వానీజీ! మీరు అర్ధంచేసుకోవాల్సింది ఏమిటంటే, మోడీ మీకు బాలకుడు వంటి వాడు. అతడు మీ శిష్యుడు. ఒకవేళ మోడీ బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగితే అది మీకు గర్వకారణమవుతుంది. దీనిని మీరు కోరకపోతే మీరు మోడి యొక్క విద్వేషి యని, నితీష్ కుమార్ వంటి లౌకిక వాదుల ప్రభావము, కాంగ్రెస్ వ్యామోహము మీకుందని భావించవలసి వస్తుంది.
మీరు ఫైసలా చేసుకోవాల్సింది ఏమిటంటే భారతీయ రాజనీతి ఇతిహాసంలో మీపేరు ఎలాంటి అక్షరాలతో లిఖించ బడాలా అని (ఇక్కడ భావం మోడీ పక్షంలో మీరుంటే, సువర్ణాక్షరాలని, లేకపోతే ఇనుప అక్షరాలు కాబోలు!!). నేను మిమ్ములను ఏమని చాలా ఆదరిస్తానంటే, భాజపాను ఈ ఉచ్చస్థితికి తెచ్చిన ఖ్యాతి మీదే. కానీ, మీరు , మీ ఆచరణతో , మీపై మీరే కళంకాన్ని ఆపాదించుకున్నారు. ఇపుడు మీరు ఆ కళంకాన్ని తుడిచి వేసుకోవలసిన అవసరం ఉంది.
మీరు మోడీని ఎందుకు ద్వేషించటం మొదలు పెట్టారో నిజాయితీగా బయట పెడితే నరేంద్రమోడీ అభిమానులు మోడీని మరచి పోతారు.
ఈ గప్ చుప్ క్రీడ జరగ కూడదు. సార్వజనిక జీవనంలో, మీకు మోడీకి మధ్య ఆఖరి విషయం ఏముందో, ప్రజలకు తెలుసుకునే అధికారం ఉంది.
ఈ కలహంలో మీది తప్పా, మోడీది తప్పా , అనే విషయాన్ని ప్రజలను తెలుసుకోనివ్వండి.
అద్భుతం, ఆశ్చర్యం ...
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
అద్భుతం, ఆశ్చర్యం ... తరువాత ఆపాఠకుడి కొనసాగింపు వ్యాఖ్యలు దొరకలేదు. ఈపాఠకుడి వ్యాఖ్యలు శ్రీ అద్వానీ గారి దృష్టికి వెళ్ళాయో లేదో తెలియదు. శ్రీ అద్వానీ మహోదయ్ మటుకు, తనకు శ్రీ మోడీకి మధ్య విభేదానికి కారణం చెప్పలేదు. పాదాలకు నమస్కారాలు మటుకు చేయించుకున్నారు.
శ్రీ అద్వానీ అసంతృప్తికి బాహ్య కారణం, ప్రాధమికంగా ఒకటే. అదేమంటే, అప్పటి వరకు, సహజరీతిలో ప్రధాన మంత్రి పదవికి వాజ్ పాయ్ గారు లేనందున అద్వానీయే అభ్యర్ధి. ప్రధాని అభ్యర్ధి ఎవరు అనే విషయాన్ని ప్రకటించే ఆచారం అప్పటి వరకు ఏరాజకీయ పార్టీలోనూ లేదు. ఎన్నికలయ్యాక, వచ్చిన సీట్లను బట్టి, ఆపార్టీ ఆచారాలను బట్టి ఎవరో ఒకరిని ఎన్నుకోటం జరిగేది. కాంగ్రెస్ విషయాన్నే తీసుకుంటే, నెహ్రూ కుటుంబ సభ్యులే ఎన్నికయ్యే ఆచారమున్నా , 1967 ఎన్నికలయ్యాక శ్రీ మొరార్జీ దేశాయి కాంగ్రెస్ లోక్ సభనాయకత్వానికి ఎన్నిక జరగాలని పట్టు పట్టారు. ఎన్నిక జరిగి ఇందిరా గాంధీ గెలిచింది. ఇపుడు కూడ 2014 ఎన్నికలయ్యాక బిజెపి ఎంపీలు తమ నాయకుడిని రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుని ఉంటే మోడీ గెలిచేవాడో, అద్వానీ గెలిచేవాడో, ఇంకెవరన్నా గెలిచే వారో తేలేది. ఇపుడలా జరగలేదు. ముందుగా మోడీని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించటం ద్వారా ఒక అప్రజాస్వామిక సంప్రదాయానికి తెర ఎత్తారు. ఇదే శ్రీ అద్వానీకి కోపం తెప్పించి ఉండచ్చు. ఆవిషయమే ఆయన స్పష్టంగా బహిరంగంగా చెప్పి ఉంటే సరిపోయేది. బహుశా ఆయన ఆవిషయాన్ని మోడీ మొ|| వారికి చెప్పి ఉండచ్చు. మోడీ గ్రూపు దానిని పట్టించు కోకుండా ముందుకు తన ఎజెండాతో వెళ్ళింది. పార్టీలో వివిధ కమిటీలకు రాజీనామా చేసిన శ్రీ అద్వానీ తన రాజీనామాకు కట్టుబడి ఉండి మౌనంగా ఉంటే సరిపోయేది. లోక్ సభఅభ్యర్ధులకు టికెట్లు ఇచ్చేది మోడీ బృందం కాబట్టి, తాను ఏకాకి అయ్యాడు కాబట్టి, శ్రీ అద్వానీ లోక్ సభకు కూడ పోటీ చేయకుండా ఉండ వలసింది. ఇంకా ధైర్యం, ఓపిక ఉంటే, తన సమర్ధకులతో కొత్త పార్టీని స్థాపించి ఉండ వలసింది. అలా చేయకుండా ఆయన పాదాభివందనాలకు లొంగి పోయాడు, ఫలితం అనుభవించాడు.
శ్రీనరేంద్ర మోడీ అద్వానీ గారికి పాదాభివందనం చేసి, వినయం అభినయించి, మొత్తానికి ఆయనను లొంగదీసుకున్నారు. తెర వెనుక ఏమి జరిగిందో కానీ అద్వానీ గారు భోపాల్ నుండి పోటీ చేయటానికి పట్టు పట్టకుండా, గాంధీనగర్ నుండే పోటీ చేశారు. మోడీ దయనో, అద్వానీ గారి స్వశక్తియో మొత్తానికి, శ్రీఅద్వానీజీ లోక్ సభలోకి ప్రవేశించారు. అదృష్టవశాత్తూ భాజపా కూడ అధికారం లోకి వచ్చి శ్రీ మోడీ ప్రధాని అయ్యారు.
గడ్కారీ ప్రకటన హాస్యాస్పదం
శ్రీ గడ్కారీ ఈ క్రింది విషయాలను ఇండియా టీవి నిర్వహించిన ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో చెప్పారుట. (ఈరోజు ఈనాడు 22.06.2014 లో వచ్చిన వార్త ఆధారంగా) నేను వ్రాస్తున్నాను.
భాజపా అగ్రనేత ఎల్ కే. అద్వానీ రాష్ట్రపతి అయ్యేందుకు తగిన స్థాయి అర్హతలు ఉన్న వ్యక్తి.
దేశ ఉప ప్రధానిగా చేసిన వ్యక్తికి లోక్ సభ స్పీకర్ గా అవకాశం కల్పించటం సబబుగా ఉండదు, అనే ఉద్దేశం తోనే ఆయనను ఆ పదవికి పరిగణనలోకి తీసుకోలేదు.
మేమంతా అద్వానీని గౌరవిస్తాము. ఆయన స్థాయికి తగిన పదవి లభించాలని కోరుకుంటున్నాము.
75 ఏళ్ళు మించిన వారిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోరాదని గడ్కారీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా సీనియర్ నేతలైన అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటివారు కేబినెట్ లో స్థానం పొందని విషయం తెలిసిందే.
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అయినా ఇపుడు కథనాయకుడి పాత్రను పోషించలేరు.
ప్రస్తుత పథకాలకూ నిథులు లేవు. చేదు గుళికలే మనిషి అనారోగ్యాన్ని నయం చేస్తాయి.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
రాష్ట్రపతి పదవి ఈమధ్యనే ఫిల్ అప్ అయ్యింది. ఇంకా నాలుగేళ్ళకి గాని ఎన్నికలు జరగవు. శ్రీ అద్వానీజీకి ఇప్పటికే 86 ఏళ్ళు. అప్పటికి 91 ఏళ్ళు వస్తాయి. అలాటప్పుడు ఆయనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని అనుకోటాన్ని ఏమనాలి? పిల్లవాడి ఐస్ క్రీం కొనిపెట్తానని ఊరిస్తూ, తండ్రి కొనకుండా కాలక్షేపం చేసినట్లు శ్రీ అద్వానీ గారి ఇమోషన్స్ తో ఆటలాడుకోటం ఎంతవరకు సబబు?
ఎన్నికలలో జయాపజయాలు అనేవి, గోడ మీద పిల్లుల వంటివి. గోడ మీద నిలబడ్డ పిల్లి ఎటు దూకుతుందో అంచనా వేయటం ఎంత కష్టమో ఎన్నికల ఫలితాలు కూడ అంతే. ఈవిషయాన్ని గుర్తించక గెలిచిన వారు అంతా తమ ఘనతే అనుకుంటూ ఉంటారు. 1984లో శ్రీమోడీ కన్నా, ఘన విజయం సాధించిన శ్రీరాజీవ్ గాంధీ 1989 వచ్చేసరికి మాజీ అయిపోయారు. గుజరాత్ లో శ్రీమోడీ మూడు సార్లు గెలిచినా, నాలుగవ సారి గెలవాలని ఏమీలేదు. బెంగాల్లో బంకూరాలో తొమ్మిది సార్లు విజయం సాధించిన సిపీఎమ్ నేత శ్రీ బాసుదేవ్ ఆచార్యను మూన్ మూన్ సేన్ ఓడించలేదా.
'' కారే రాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే,
వారేరీ సిరిన్ మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై
పేరైనం గలదే... ''
అని పోతన్నగారన్నట్లుగా ఎందరో రాజులు వచ్చారు, పోయారు. ఎందరో నేతలు వస్తారు, పోతారు. గంగ వంటి గొప్ప నదులు ఎన్ని నీళ్ళున్నా, ఎంత పెద్ద వరద వచ్చినా నిలకడగా ప్రవహిస్తాయి. చిన్న వాగులు స్వల్ప వర్షాలకే పెద్దగా ధ్వనులు చేసుకుంటూ, పొంగి పొర్లుతాయి, గంటాగితే చుక్కనీళ్ళు కూడ ఉండవు. కొన్ని విజయాలకే పొంగిపోయి పెద్దలను చులకనగా చూడటం ధీర గుణం కాదు. ఒక దేశ చరిత్రలో ఐదేళ్ళన్నా, 1826 రోజులన్నా, బుద్బుదాల్లాంటివే. ఐదేళ్ళ రాజ్యాధికారానికే పెద్ద కొమ్ములొచ్చినట్లు భావించటం ఉత్తముల స్వభావానికి శోభించదు. ఈసందర్భంగా శ్రీగడ్కారి గారన్నట్లుగా పత్రికలలో వచ్చిన మాటలు గమనార్హం:
''..మంత్రుల అభిప్రాయాలను ప్రధాని వింటారు. కొన్నింటిని అంగీకరిస్తారు. ప్రధానికి ఆయా శాఖలపై స్వీయ అవగాహన ఉంది. ప్రధాని అంటే మంత్రులు భయపడతారనేది నిజం కాదు. ప్రతి విషయంలోనూ లోతుపాతులను ఆయన తెలుసుకుంటారు. అందుకే శాఖల కార్యదర్శులు ఆయనంటే భయపడతారు..''
శ్రీ గడ్కారీ గారి ఈ వివరణ, ఈ వైబీ గాడిదకు అంత అర్ధవంతంగా కనిపించటం లేదు. ముఖ్యంగా ఆఖరి వాక్యం. ఈ భయపడటం ఏమిటి? ఎవరైనా ఎందుకు భయపడాలి. చట్టబధ్ధమైన పాలనలో, రాజ్యాంగబధ్ధమైన పాలనలో, ప్రధాని, మంత్రులు, అధికారులు ఎవరు పనిచేసినా, న్యాయ శాస్త్ర, రాజ్యాంగ సూత్రాల ననుసరించే కదా. అధికారులు తమకి భయపడుతూ, ఎల్లవేళలా విధేయులై ఉండాలని, ప్రధాని, కేంద్ర మంత్రులు కోరుకుంటున్నారా? అలా కోరుకోటంలేదని ఆశిద్దాము. LOYALTY TO PERSONS instead of LOYALTY TO LAW & CONSTITUTION అనేది కాంగ్రెస్ పాలనలో జరిగి ఉండచ్చు. బిజేపీ పాలనలో ఆ అశాస్త్రీయ అధమ పధ్ధతి కి చోటివ్వరని ఆకాంక్షిద్దాము.
75 సంవత్సరాలు దాటిన వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉండదు అనే నిర్ణయాన్ని ఎవరెవరు కలిసి తీసుకున్నారు? కేవలం గడ్కారీ, ప్రధాని మాత్రమే కలిసి తీసుకున్నారా (పైవార్తలో ఏదో లోటు ఉన్నది) లేక ఇంకా ఎవరెవరు కలిసి తీసుకున్నారు? ఈవిషయంలో జాతీయ స్థాయిలో , అఖిల పక్షస్థాయిలో, లేదా కనీసం బిజెపి స్థాయిలో బహిరంగ చర్చ ఏదైనా జరిగి ఎక్కడైనా తీర్మానాలను ఆమోదించారా?
వారు తీసుకున్న ఈకీలక నిర్ణయాన్ని ప్రజలకు ఎన్నికలముందు ఎప్పుడైనా చెప్పారా? మోడీగారు షుమారు 400 ర్యాలీలలో ప్రసంగించారుట కదా, ఒక్క ర్యాలీలో అయినా, ఒక చాయ్ పర్ చర్చా కార్యక్రమంలో అయినా ఈవిషయాన్ని చెప్పలేదేమిటి? కనీసం 75 ఏళ్ళు దాటిన అద్వానీ, జోషీ వంటి సీనియర్లకు ఈవిషయాన్ని ఎన్నికల ముందే చెప్పారా? చెప్తే వారు ఎన్నికలలో పోటీ చేయాలో వద్దో నిర్ణయించుకునే వాళ్ళు కదా!!
పథకాలకు కేంద్రంలో నిధుల కొరత ఉందని గడ్కారీ, మోడీ, జైట్లీ, శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీవెంకయ్యనాయుడు, లకు ముందు తెలుసు కదా. చేదు గుళికలు అవసరమని వారు ర్యాలీలలో, చాయ్ పర్ చర్చా కార్యక్రమాలలో, ఎన్నికలముందే ప్రజలకు ఎందుకు చెప్పలేదు?
కెప్టెన్ గా పని చేసిన వారు తరువాత క్రికెట్, టెన్నిస్, ఫుట్ బాల్, హాకీ మొదలగు క్రీడలలో సాధారణ సభ్యులుగా ఎన్నో ఏళ్ళు ఆడిన ఉదాహరణలు కోకొల్లలు. సునీల్ గవాస్కర్, సచీన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ మొ|| వారందరు అలా వేరొక కెప్టెన్ క్రింద ఆడి వారికి సహకరించి, వారి విజయానికి తోడ్పడిన వాళ్ళే. టీమ్ స్పిరిట్ అనుకున్నా, డబ్బుపై ప్రీతి అనుకున్నా, సర్దుకుపోటం అనే ఆచారం ఉంది. బహుశా శ్రీ అద్వానీ, జోషీలు ఉప ప్రధానులుగానో, సీనియర్ మంత్రులు గానో సర్దుకుపోయే వాళ్ళేమో. విద్యాగంధం తక్కువ కావటమే కాక, దానిని అభివృధ్ధి చేసుకుందాం అనే కాంక్షలేని, మేకప్ తో కాలక్షేపం చేసే టీవీ నటి స్మృతి ఇరానీ 120 కోట్ల మానవ అభివృధ్ధి మంత్రిణిగా ఏవిధంగా అర్హురాలు? పూర్తి గ్రూప్ కంపెనీల వ్యవహారాలలో, అక్రమాల ఆరోపణలను ఎదుర్కున్న శ్రీగడ్కారీ, ఏవిధమైన పూర్తి స్థాయి విచారణలను ఎదుర్కోకుండానే, కీలకమైన కేంద్ర రవాణా మంత్రి పదవికి ఏవిధంగా అర్హులయ్యారో, ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసి విద్యారంగానికి ఎంతో సేవ చేసిన మురళీ మనోహర్ జోషి ఏవిధంగా అనర్హుడు అయ్యాడో అర్ధం కావటం లేదు.
ఇపుడు డిఫెన్స్ శాఖ ఇంకా ఖాళీగానే ఉంది. దానిని శ్రీ అద్వానీకి ఇస్తే ఆయన దానిని నిర్వహించలేడా? లేదా రాజనాధ్ సింగుకి రక్షణ శాఖను ఇచ్చి హోం శాఖను శ్రీ అద్వానీకి ఇవ్వలేరా? ఆయన పాపం గతంలో అభినవ సర్దార్ పటేల్ గాపొగిడించుకున్నవాడే కదా.
దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే అద్వానీ, జోషీలను భ్రష్ఠు పట్టించటం కావాలని చేసిన పనే. అయితే తాతల నాటి బొచ్చె తరతరాలు అని ఒక సామెత ఉంది. తాడి నెక్కువానిని తలదన్నువాళ్ళుంటారు. గుడిని మింగే వాళ్ళుంటే, గుడిని, గుళ్లోలింగాన్ని అన్నిటినీ మింగే వాళ్ళుంటారు. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్నలుంటారు. 1826 రోజులకే కదా ఈరాజ్యం!!
అయితే చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అని ఒక సామెత ఉంది. గుఱ్ఱపు డెక్క మొక్కల్ని వేసి మామిడి కాయలు కాయమంటే కాయవు. అద్వానీ, జోషి వంటి వారు, ఇపుడు కొంత తీరిక దొరుకుతుంది కాబట్టి, తాము ఎలాంటి అనుచరులను ప్రోత్సహించారో, వారు తమకు ఎలాటి పాఠాలను నేర్పారో ఆత్మకథలు వ్రాసుకుని కనీసం మరణానంతరం ప్రచురించమని ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి. నాకయితే జగదేకవీరుడి కథ సినిమాలో ముక్కామల పెద్ద కొడుకు గుర్తుకు వస్తున్నాడు. ఆ నటుడి పేరు నల్లరామ్మూర్తి అనుకుంటాను. వాడు ముక్కామలను, తల్లిని చెరసాల్లో పారేస్తే వారెలానో బయటపడి, ఎన్ టీ ఆర్, బి. సరోజాదేవి, రేలంగిలు ఉన్న రాజ్యానికి చేరుకుంటారు.
ఈనాటి పాట
చిత్రం: జగదేకవీరుని కథ. రచన: పింగళి. సంగీతం: పెండ్యాల.
జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా, అహ ఏమి హాయిలే హలా !! ||2||
ఉన్నది పగలైనా అహ వెన్నెలె కురిసేనె ||2||
అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే ||2||
|| జలకాలాటలలో కలకల పాటలలో ||
తీయని రాగమెదో మది హాయిగ పాడేనె ||2||
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే ||2||
అది వరుని కొరకు పిలుపే
|| జలకాలాటలలో కలకల పాటలలో ||
వైబీరావు గాడిద వ్యాఖ్య
ఈపాట విజయా స్టూడియో వారి ఫౌంటేయిన్ లేక పూల్ లో చిత్రించినది. ఇదే పూల్ ను మనం చాలా సినిమాల్లో , చాల మంది నటీనట మణులు తమ గుడ్డలను తడిపేసుకుంటుండగా చూడచ్చు. మోడీ గారి ప్రధాన మంత్రి కుర్చీ, రాజ్ నాథ్ సింగ్ గారి హోం మంత్రి కుర్చీ, స్మృతీ ఇరానీ గారి విద్యామంత్రి కుర్చీ, గడ్కారీ గారి రవాణా మంత్రి కుర్చీలు కూడ ఇలాంటివే. సినిమాల్లో వేషాలకోసం తంత్రాలు జరిగినట్లుగానే కుర్చీ తంత్రాలు కూడ ఉంటాయి.
ఈనాటి శ్లోకం
భర్తృహరి మహాకవి. నీతిశతకం. సంస్కృతం.
పరిగత పరమార్థాన్ పండితాన్ మా-వమంస్థాః
తృణమివ లఘు లక్ష్మీర్ నైవ తాన్ సంరుణద్ధి ।
అభినవ మద రేఖా శ్యామ గండ స్థలానాం
న భవతి బిసతంతుర్వారణం వారణానామ్ ॥
తెలుగు సారం: (గడ్కారీ రాజా, వెంకయ్యరాజా, జైట్లీ రాజా, నరేంద్రమోడీ రాజా) పరమ తత్వం తెలిసిన పండితులను అవమానించకండి. వాళ్ళకు లక్ష్మి (సంపద) గడ్డిపోచతో సమానం. అభినవ మద రేఖా శ్యామ గండస్థలం కలిగిన, మదించిన ఏనుగును గడ్డిపోచతో బంధించ గలరా?
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
శ్రీ ఎల్ కే అద్వానీ గారు, శ్రీ మురళీమనోహర్ జోషీ గారు పరమ తత్వం తెలిసిన పండితులలాగా ''నిర్మోహి'' జీవితాలు ప్రారంభించాలి. జోషి గారు , కక్కిన కూడు వంటి మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆశ పడకూడదు.
ఉడుముండదే నూరేండ్లును,
పడియుండదె పేర్మి పాము పది నూరేండ్లున్,
మడువున కొక్కెర యుండదె,
కడునిల పురుషార్ధ పరుడు కావలె సుమతీ.
(దీనిని సరిదిద్దుతూ తిరగవ్రాయవలసి యున్నది. ఈలోగా మీ మనోభావాలేమన్నా గాయపడితే కామెంట్లలో వ్రాయండి.)
Saturday, June 21, 2014
264 Have we gained anything by replacing Sonia-manmo raj with modi-jaitley-rajna raj??
264 మనము సోనియా-మన్మో రాజ్ స్థానంలో మోడీ-జైట్లీ-రాజ్నా రాజ్ ను స్థాపించుకొని లాభ పడ్డామా?
చర్చనీయాంశాలు: 264, మన్మోహన్, సోనియా, నరేంద్రమోడీ, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, ధరలు, గ్యాస్, సారానాథ్, బౌధ్ధం
మన్మోహన్ ముఖోటాగా ఏలబడిన, సోనియా రాజ్యం పోయిందని మనం సంబరపడటం ఎంత మేరకు సబబు? వీపు మీదనుండి రెండు బండరాళ్ళను క్రింది దించుకొని ఊపిరి పీల్చుకోటంలో తప్పులేదు.
అయితే మనం అంతే బరువు గల మూడు వెయిట్స్ ను వీపుపైకి ఎక్కించు కున్నాము, అని మర్చిపోతున్నాము.
గణిత శాస్త్రంలో strictly equivalent అనే గుర్తు ≣ఉంటుంది. దీనిని సర్వ సమానత్వం అనలేం కానీ గాఠిగా సమానం అనచ్చు.
≅ approximately equal. అంటే సుమారుగా సమానం అన్నమాట.
సోనియా మన్మోహన్ రాహుల్ త్రయాన్ని, మోడీ జైట్లీ రాజ్ నాథ్ త్రయాన్నీ పోల్చి మనం ≅ approximately equal. అంటే సుమారుగా సమానం అనలేం. ≣ గాఠిగా సమానం అనే అనాలి.
రైలు ఛార్జీలు పెంచటం, గవర్నర్లను బలవంతంగా రాజీనామా చేయించటం, పాతవాళ్ళు చేసినవే మేము చేస్తున్నాం అనటం, స్వదేశంలో పనులను తప్పించుకుని విదేశయాత్రలు చేయటం, మెజారిటీలనో మైనారిటీలనో ఎవరినో ఒకరిని మతప్రాతిపదికగానో, కులప్రాతిపదికగానో, ప్రోత్సహించటం ఇవన్నీ ఇరువురి సమాన ధర్మాలు.
కాబట్టి రాబోయే ఐదేళ్ళ పాలన ఇంక దిగజారిపోతుందా మెరుగవుతుందా? దీనికి జవాబు తేలికే. శాసించే పారిశ్రామిక వేత్తలు ఇరువురికీ ఒకరే కదా. శాసించే షేర్ బ్రోకర్లు, పవర్ బ్రోకర్లు ఇరువురికీ ఒకరే ఇంక మార్పేమిటి?
నవభారత్ టైమ్స్ హిందీ దిన పత్రికలో సీపీఐ నేత అతుల్ అంజాన్ అనే సీపీఐ నేత చెప్పిన విషయాలు అక్షరాలా నిజాలు.
अभी तो सरकार भूटान जाएगी, बांग्लादेश जाएगी, यूएस कांग्रेस को संबोधित करेगी। इराक के बारे में जरा देर से सोचेगी: अतुल अंजान (सीपीआई)
తెలుగు సారం: ఇపుడు సర్కార్ భూటాన్ వెళ్తుంది. బంగ్లాదేశ్ వెళ్తుంది. యు ఎస్ కాంగ్రెస్ (అమెరికా వారి లోక్ సభ-దిగువసభ) ను సంబోధిస్తుంది. ఇరాక్ గురించి కొద్దిగా ఆలస్యంగా ఆలోచిస్తుంది.
ऐसा लग रहा है, मोदी जी और यूपीए में प्रतियोगिता चल रही है कि कौन आम आदमी को ज्यादा परेशान कर सकता है: अतुल अंजान(सीपीआई)
తెలుగు సారం: ఎలా కనిపిస్తున్నదంటే, మోడీజీకి మరియు యుపిఎ కి మధ్య ఎవరు ఎక్కువ ఆమ్ ఆద్మీని పరేశాన్ చేస్తారు అనే విషయంలో ప్రతియోగిత (పోటీ -- కాంపిటీషన్) నడుస్తున్నది. రైలు ఛార్జీలను పెంచటం అయిపోయింది. ఎల్ పిజి సిలిండర్ ను నెలకొక పదిరూపాయల లెక్కన పెంచుతారట. నవభారత్ టైమ్స్ వారి వార్త చదవాలనుకునే వారికి లింకు. http://m.nbt.in/text/details.php?storyid=36983632§ion=top-news. క్లిక్.
ఐదేళ్ళ భాజపా రాజ్యంలో ఐదేళ్ళు అంటే 60 నెలలే కదా, అంటే రూ. 600 మాత్రమే కదా పెంచేది, అని సంతోషించండి. అంటే రూ. 412 ఉండేది రూ. 1012 మాత్రమే కదా అయ్యేది.
పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడి పెట్టకున్నా, కాదేదీ వ్యాపారాని కనర్హం
ఉత్తర ప్రదేశ్ సారానాథ్ లో, బుధ్ధుడు మొదటిసారిగా తన బోధను ప్రారంభించిన ప్రదేశంలో, ఉన్న ఒక మర్రి చెట్టు కొమ్మ ఒకటి పెద్దది విరిగి పడిందట.
దాని పవిత్రతను వ్యాపారంగా మలుచుకున్న భిక్షువులు, పరిసరవాసులు, ఆకొమ్మలను చిన్నచిన్న టుకడాలుగా నరికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే బౌధ్ధ యాత్రికులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారుట.
మహాకవి శ్రీశ్రీ కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా కావేవీ కవితకనర్హం అన్నారు. కావేవీ వ్యాపారానికనర్హం అనికూడ అంటే బాగుండేది.
263 Jaitley Sir: We can't bear world class rail facilities and world class rail fares
263 జైట్లీ మహాత్మా!! మేము ప్రపంచ స్థాయి రైలు సౌకర్యాలను మరియు ప్రపంచ స్థాయి రైలు ఛార్జీలను భరించలేము.
చర్చనీయాంశాలు: రైలు ఛార్జీలు, అరుణ్ జైట్లీ, ప్రపంచీకరణ, బిజెపి, ధన మదం
జైట్లీ సార్!! మేము మామూలు మనుషులము. సాదా సీదా జనాలం. కిలోల కొద్దీ బంగారం ఉన్న వాళ్ళం కాము. మమ్మల్ని ఆం ఆద్మీ లు గానే బ్రతకనివ్వండి. ప్రపంచ స్థాయి రైలు సౌకర్యాలను భరించలేము. ప్రపంచ స్థాయి ఛార్జీలను చెల్లించలేము.
ఈసారి రైలు ఛార్జీలను పెంచితే పెంచారు. 2019 లోగా మరల పెంచబోమని హామీ ఇవ్వండి.
ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఎవరైనా కోరితే, వారికి ఆ సౌకర్యాలను అంద చేయండి, వారి వద్ద ప్రపంచ స్థాయి ఛార్జీలు వసూలు చేసుకోండి. అదే సమయంలో, వారికి ప్రపంచ స్థాయి సౌకర్యాలను డిమాండు చేసే ఆర్ధిక మదం ఎలా వచ్చిందో కనుక్కొని దిద్దుబాటు చర్యలు మీరు తీసుకుంటారని మేము అనుకోలేము. ఎందుకంటే, ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళే ఆర్ధిక మదం ఉన్న వాళ్ళు.
ఎక్స్ ప్రెస్ రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంట్లు
మావి చిన్న కోరికలే. ప్రపంచ స్థాయి కోరికలు కావు. ఎక్స్ ప్రెస్ రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంట్లలో ప్రయాణించేటపుడు 1'.5" x 1'.5' ఒకటిన్నర అడుగులు పొడుగు, ఒకటిన్నర అడుగులు వెడల్పు ఉన్న బల్ల కూర్చోటానికి (కొబ్బరిపీచు లేక స్పాంజి లేక దూది కుషన్ దేవర వారి దయ) మేము నిశ్చిత్ తౌర్ పర్ కోరుకుంటున్నాము.
మా దురదృష్టమేమంటే, రైళ్ళలో ఏడాదికోసారైనా జనరల్ కంపార్టుమెంట్లలో ప్రయాణించే రైల్వే మంత్రులు, సహాయమంత్రులు మాకు దొరకటంలేదు. అందరూ ఛార్టర్ విమానానాల్లోనో, ప్రైవేటు విమానాల్లోనో, హెలీకాప్టర్లలోనో ప్రయాణించే వాళ్ళు కావటంతో ఇక్కడ జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణీకులు ఎలా తన్నుకుంటున్నారో అమ్మహనీయుల కంట పడదు, చెవులకు సోకదు.
ప్రపంచ స్థాయి నిర్వచనం ఏమిటి?
జైట్లీ మహాత్మా!! మీ దృష్టిలో ప్రపంచ స్థాయి అంటే ఏ అమెరికాలోనో, యూరప్ లోనే రైళ్ళలో ఉండే భోగాలు కావచ్చు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా రైళ్ళను మీరు చూసి ఉండక పోవచ్చు కాబట్టి ఆ సొగసులు కాక పోవచ్చు.
మా బోటి హాయ్ పొల్లాయ్ ల దృష్టిలో, ప్రపంచ స్థాయి అంటే ప్రపంచ జనాభాలో ఐదవ వంతు ఉండే భారత దేశం ప్రజల స్థాయే. మీరు భారతీయ జనరల్ కంపు రైలు ప్రయాణీకులకు 2.25 చదరపు అడుగుల భూమిని హామీ ఇచ్చారంటే, ప్రపంచ స్థాయిని పై స్థానానికి పారడిమ్ షిఫ్ట్ గా లేపినట్లే.
2.25 చదరపు అడుగుల భూమిని హామీ ఇవ్వటం ఎలా?
కోరిక ఉంటే కష్టం కాదు. ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకి ప్రస్తుతం ముందు వెనుక, తగిలిస్తున్న రెండేసి జనరల్ బోగీలకు అదనంగా 3 ప్లస్ 3 ఎదురెదురు సీట్లు ఉండే తరహా బోగీలను రెండేసి జోడిస్తే మొత్తం జనరల్ బోగీలు ఎనిమిది అవుతాయి. కొత్తగా జోడించే నాలుగు బోగీలకు కండక్టర్లను పోస్టు చేసి సీట్ల లభ్యత ఉన్నంత వరకే కూర్చోనివ్వాలి. కంప్యూటరైజ్డ్ బుకింగులు కాబట్టి టికెట్లు జారీ అయేటపుడే సీట్ నంబర్లను ముద్రించే సాఫ్టువేర్లను తయారు చేయటం కష్టం కాదు. కంప్యూటర్లు తప్పు చేయటం, అవినీతికి పాల్పడటం చాల అరుదు కాబట్టి, సీట్లు ఉన్నంత వరకే, టికెట్లను జారీ చేస్తాయి.
ఈనాటి పద్యాలు
జనరల్ కంపు రైలు ప్రయాణీకుల మొరలకు అద్దం పట్టేవి
మహాకవి, సహజ పాండిత్యుడు, తెలంగాణ -ఆంధ్ర భేదాలు తెలియని పామరుడు, బమ్మెర పోతనామాత్యుడు
కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్నిదిశలను
కలడు కలండనెడి వాడు కలడో లేడో.
శార్దూల వృత్తం, వ్రాయటం కష్టం, పులిలాగ నడుస్తుంది.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
Subscribe to:
Posts (Atom)
-
Notes: The Hindi page 471 in the picture above, is only for demonstration purpose, to show how Devnagari Ancient Scripts look like. The ve...
-
How did Rayalaseema crowds suddenly wake up for a separate Rayalaseema demand? ఆధార వార్త ఈనాడుకి, కృతజ్ఞతలతో - https://www.eenadu.net/te...
-
This is in continuation of my previous blog post No. 1024 Click to go to Part 1 of Telugu Vairagya Satakam, of Yenugu Lakshmana Kavi , in ...
From Post Nos. 001 to 500
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 |
61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 |
81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 |
91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 |
121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 |
141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | 151 | 152 | 153 | 154 | 155 | 156 | 157 | 158 | 159 | 160 |
161 | 162 | 163 | 164 | 165 | 166 | 167 | 168 | 169 | 170 | 171 | 172 | 173 | 174 | 175 | 176 | 177 | 178 | 179 | 180 |
181 | 182 | 183 | 184 | 185 | 186 | 187 | 188 | 189 | 190 | 191 | 192 | 193 | 194 | 195 | 196 | 197 | 198 | 199 | 200 |
201 | 202 | 203 | 204 | 205 | 206 | 207 | 208 | 209 | 210 | 211 | 212 | 213 | 214 | 215 | 216 | 217 | 218 | 219 | 220 |
221 | 222 | 223 | 224 | 225 | 226 | 227 | 228 | 229 | 230 | 231 | 232 | 233 | 234 | 235 | 236 | 237 | 238 | 239 | 240 |
241 | 242 | 243 | 244 | 245 | 246 | 247 | 248 | 249 | 250 | 251 | 252 | 253 | 254 | 255 | 256 | 257 | 258 | 259 | 260 |
261 | 262 | 263 | 264 | 265 | 266 | 267 | 268 | 269 | 270 | 271 | 272 | 273 | 274 | 275 | 276 | 277 | 278 | 279 | 280 |
281 | 282 | 283 | 284 | 285 | 286 | 287 | 288 | 289 | 290 | 291 | 292 | 293 | 294 | 295 | 296 | 297 | 298 | 299 | 300 |
301 | 302 | 303 | 304 | 305 | 306 | 307 | 308 | 309 | 310 | 311 | 312 | 313 | 314 | 315 | 316 | 317 | 318 | 319 | 320 |
321 | 322 | 323 | 324 | 325 | 326 | 327 | 328 | 329 | 330 | 331 | 332 | 333 | 334 | 335 | 336 | 337 | 338 | 339 | 340 |
341 | 342 | 343 | 344 | 345 | 346 | 347 | 348 | 349 | 350 | 351 | 352 | 353 | 354 | 355 | 356 | 357 | 358 | 359 | 360 |
361 | 362 | 363 | 364 | 365 | 366 | 367 | 368 | 369 | 370 | 371 | 372 | 373 | 374 | 375 | 376 | 377 | 378 | 379 | 380 |
381 | 382 | 383 | 384 | 385 | 386 | 387 | 388 | 389 | 390 | 391 | 392 | 393 | 394 | 395 | 396 | 397 | 398 | 399 | 400 |
401 | 402 | 403 | 404 | 405 | 406 | 407 | 408 | 409 | 410 | 411 | 412 | 413 | 414 | 415 | 416 | 417 | 418 | 419 | 420 |
421 | 422 | 423 | 424 | 425 | 426 | 427 | 428 | 429 | 430 | 431 | 432 | 433 | 434 | 435 | 436 | 437 | 438 | 439 | 440 |
441 | 442 | 443 | 444 | 445 | 446 | 447 | 448 | 449 | 450 | 451 | 452 | 453 | 454 | 455 | 456 | 457 | 458 | 459 | 460 |
461 | 462 | 463 | 464 | 465 | 466 | 467 | 468 | 469 | 470 | 471 | 472 | 473 | 474 | 475 | 476 | 477 | 478 | 479 | 480 |
481 | 482 | 483 | 484 | 485 | 486 | 487 | 488 | 489 | 490 | 491 | 492 | 493 | 494 | 495 | 496 | 497 | 498 | 499 | 500 |
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 |
61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 |
81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 |
91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 |
121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 |
141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | 151 | 152 | 153 | 154 | 155 | 156 | 157 | 158 | 159 | 160 |
161 | 162 | 163 | 164 | 165 | 166 | 167 | 168 | 169 | 170 | 171 | 172 | 173 | 174 | 175 | 176 | 177 | 178 | 179 | 180 |
181 | 182 | 183 | 184 | 185 | 186 | 187 | 188 | 189 | 190 | 191 | 192 | 193 | 194 | 195 | 196 | 197 | 198 | 199 | 200 |
201 | 202 | 203 | 204 | 205 | 206 | 207 | 208 | 209 | 210 | 211 | 212 | 213 | 214 | 215 | 216 | 217 | 218 | 219 | 220 |
221 | 222 | 223 | 224 | 225 | 226 | 227 | 228 | 229 | 230 | 231 | 232 | 233 | 234 | 235 | 236 | 237 | 238 | 239 | 240 |
241 | 242 | 243 | 244 | 245 | 246 | 247 | 248 | 249 | 250 | 251 | 252 | 253 | 254 | 255 | 256 | 257 | 258 | 259 | 260 |
261 | 262 | 263 | 264 | 265 | 266 | 267 | 268 | 269 | 270 | 271 | 272 | 273 | 274 | 275 | 276 | 277 | 278 | 279 | 280 |
281 | 282 | 283 | 284 | 285 | 286 | 287 | 288 | 289 | 290 | 291 | 292 | 293 | 294 | 295 | 296 | 297 | 298 | 299 | 300 |
301 | 302 | 303 | 304 | 305 | 306 | 307 | 308 | 309 | 310 | 311 | 312 | 313 | 314 | 315 | 316 | 317 | 318 | 319 | 320 |
321 | 322 | 323 | 324 | 325 | 326 | 327 | 328 | 329 | 330 | 331 | 332 | 333 | 334 | 335 | 336 | 337 | 338 | 339 | 340 |
341 | 342 | 343 | 344 | 345 | 346 | 347 | 348 | 349 | 350 | 351 | 352 | 353 | 354 | 355 | 356 | 357 | 358 | 359 | 360 |
361 | 362 | 363 | 364 | 365 | 366 | 367 | 368 | 369 | 370 | 371 | 372 | 373 | 374 | 375 | 376 | 377 | 378 | 379 | 380 |
381 | 382 | 383 | 384 | 385 | 386 | 387 | 388 | 389 | 390 | 391 | 392 | 393 | 394 | 395 | 396 | 397 | 398 | 399 | 400 |
401 | 402 | 403 | 404 | 405 | 406 | 407 | 408 | 409 | 410 | 411 | 412 | 413 | 414 | 415 | 416 | 417 | 418 | 419 | 420 |
421 | 422 | 423 | 424 | 425 | 426 | 427 | 428 | 429 | 430 | 431 | 432 | 433 | 434 | 435 | 436 | 437 | 438 | 439 | 440 |
441 | 442 | 443 | 444 | 445 | 446 | 447 | 448 | 449 | 450 | 451 | 452 | 453 | 454 | 455 | 456 | 457 | 458 | 459 | 460 |
461 | 462 | 463 | 464 | 465 | 466 | 467 | 468 | 469 | 470 | 471 | 472 | 473 | 474 | 475 | 476 | 477 | 478 | 479 | 480 |
481 | 482 | 483 | 484 | 485 | 486 | 487 | 488 | 489 | 490 | 491 | 492 | 493 | 494 | 495 | 496 | 497 | 498 | 499 | 500 |
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।
501 to 1000 Post Nos. here.
Post Nos. 1 to 500 are at the top.
501 | 502 | 503 | 504 | 505 | 506 | 507 | 508 | 509 | 510 | 511 | 512 | 513 | 514 | 515 | 516 | 517 | 518 | 519 | 520 |
521 | 522 | 523 | 524 | 525 | 526 | 527 | 528 | 529 | 530 | 531 | 532 | 533 | 534 | 535 | 536 | 537 | 538 | 539 | 540 |
541 | 542 | 543 | 544 | 545 | 546 | 547 | 548 | 549 | 550 | 551 | 552 | 553 | 554 | 555 | 556 | 557 | 558 | 559 | 560 |
561 | 562 | 563 | 564 | 565 | 566 | 567 | 568 | 569 | 570 | 571 | 572 | 573 | 574 | 575 | 576 | 577 | 578 | 579 | 580 |
581 | 582 | 583 | 584 | 585 | 586 | 587 | 588 | 589 | 590 | 591 | 592 | 593 | 594 | 595 | 596 | 597 | 598 | 599 | 600 |
601 | 602 | 603 | 604 | 605 | 606 | 607 | 608 | 609 | 610 | 611 | 612 | 613 | 614 | 615 | 616 | 617 | 618 | 619 | 620 |
621 | 622 | 623 | 624 | 625 | 626 | 627 | 628 | 629 | 630 | 631 | 632 | 633 | 634 | 635 | 636 | 637 | 638 | 639 | 640 |
641 | 642 | 643 | 644 | 645 | 646 | 647 | 648 | 649 | 650 | 651 | 652 | 653 | 654 | 655 | 656 | 657 | 658 | 659 | 660 |
661 | 662 | 663 | 664 | 665 | 666 | 667 | 668 | 669 | 670 | 671 | 672 | 673 | 674 | 675 | 676 | 677 | 678 | 679 | 680 |
681 | 682 | 683 | 684 | 685 | 686 | 687 | 688 | 689 | 690 | 691 | 692 | 693 | 694 | 695 | 696 | 697 | 698 | 699 | 700 |
701 | 702 | 703 | 704 | 705 | 706 | 707 | 708 | 709 | 710 | 711 | 712 | 713 | 714 | 715 | 716 | 717 | 718 | 719 | 720 |
721 | 722 | 723 | 724 | 725 | 726 | 727 | 728 | 729 | 730 | 731 | 732 | 733 | 734 | 735 | 736 | 737 | 738 | 739 | 740 |
741 | 742 | 743 | 744 | 745 | 746 | 747 | 748 | 749 | 750 | 751 | 752 | 753 | 754 | 755 | 756 | 757 | 758 | 759 | 760 |
761 | 762 | 763 | 764 | 765 | 766 | 767 | 768 | 769 | 770 | 771 | 772 | 773 | 774 | 775 | 776 | 777 | 778 | 779 | 780 |
781 | 782 | 783 | 784 | 785 | 786 | 787 | 788 | 789 | 790 | 791 | 792 | 793 | 794 | 795 | 796 | 797 | 798 | 799 | 800 |
801 | 802 | 803 | 804 | 805 | 806 | 807 | 808 | 809 | 810 | 811 | 812 | 813 | 814 | 815 | 816 | 817 | 818 | 819 | 820 |
821 | 822 | 823 | 824 | 825 | 826 | 827 | 828 | 829 | 830 | 831 | 832 | 833 | 834 | 835 | 836 | 837 | 838 | 839 | 840 |
841 | 842 | 843 | 844 | 845 | 846 | 847 | 848 | 849 | 850 | 851 | 852 | 853 | 854 | 855 | 856 | 857 | 858 | 859 | 860 |
861 | 862 | 863 | 864 | 865 | 866 | 867 | 868 | 869 | 870 | 871 | 872 | 873 | 874 | 875 | 876 | 877 | 878 | 879 | 880 |
881 | 882 | 883 | 884 | 885 | 886 | 887 | 888 | 889 | 890 | 891 | 892 | 893 | 894 | 895 | 896 | 897 | 898 | 899 | 900 |
901 | 902 | 903 | 904 | 905 | 906 | 907 | 908 | 909 | 910 | 911 | 912 | 913 | 914 | 915 | 916 | 917 | 918 | 919 | 920 |
921 | 922 | 923 | 924 | 925 | 926 | 927 | 928 | 929 | 930 | 931 | 932 | 933 | 934 | 935 | 936 | 937 | 938 | 939 | 940 |
941 | 942 | 943 | 944 | 945 | 946 | 947 | 948 | 949 | 950 | 951 | 952 | 953 | 954 | 955 | 956 | 957 | 958 | 959 | 960 |
961 | 962 | 963 | 964 | 965 | 966 | 967 | 968 | 969 | 970 | 971 | 972 | 973 | 974 | 975 | 976 | 977 | 978 | 979 | 980 |
981 | 982 | 983 | 984 | 985 | 986 | 987 | 988 | 989 | 990 | 991 | 992 | 993 | 994 | 995 | 996 | 997 | 998 | 999 | 1000 |
501 | 502 | 503 | 504 | 505 | 506 | 507 | 508 | 509 | 510 | 511 | 512 | 513 | 514 | 515 | 516 | 517 | 518 | 519 | 520 |
521 | 522 | 523 | 524 | 525 | 526 | 527 | 528 | 529 | 530 | 531 | 532 | 533 | 534 | 535 | 536 | 537 | 538 | 539 | 540 |
541 | 542 | 543 | 544 | 545 | 546 | 547 | 548 | 549 | 550 | 551 | 552 | 553 | 554 | 555 | 556 | 557 | 558 | 559 | 560 |
561 | 562 | 563 | 564 | 565 | 566 | 567 | 568 | 569 | 570 | 571 | 572 | 573 | 574 | 575 | 576 | 577 | 578 | 579 | 580 |
581 | 582 | 583 | 584 | 585 | 586 | 587 | 588 | 589 | 590 | 591 | 592 | 593 | 594 | 595 | 596 | 597 | 598 | 599 | 600 |
601 | 602 | 603 | 604 | 605 | 606 | 607 | 608 | 609 | 610 | 611 | 612 | 613 | 614 | 615 | 616 | 617 | 618 | 619 | 620 |
621 | 622 | 623 | 624 | 625 | 626 | 627 | 628 | 629 | 630 | 631 | 632 | 633 | 634 | 635 | 636 | 637 | 638 | 639 | 640 |
641 | 642 | 643 | 644 | 645 | 646 | 647 | 648 | 649 | 650 | 651 | 652 | 653 | 654 | 655 | 656 | 657 | 658 | 659 | 660 |
661 | 662 | 663 | 664 | 665 | 666 | 667 | 668 | 669 | 670 | 671 | 672 | 673 | 674 | 675 | 676 | 677 | 678 | 679 | 680 |
681 | 682 | 683 | 684 | 685 | 686 | 687 | 688 | 689 | 690 | 691 | 692 | 693 | 694 | 695 | 696 | 697 | 698 | 699 | 700 |
701 | 702 | 703 | 704 | 705 | 706 | 707 | 708 | 709 | 710 | 711 | 712 | 713 | 714 | 715 | 716 | 717 | 718 | 719 | 720 |
721 | 722 | 723 | 724 | 725 | 726 | 727 | 728 | 729 | 730 | 731 | 732 | 733 | 734 | 735 | 736 | 737 | 738 | 739 | 740 |
741 | 742 | 743 | 744 | 745 | 746 | 747 | 748 | 749 | 750 | 751 | 752 | 753 | 754 | 755 | 756 | 757 | 758 | 759 | 760 |
761 | 762 | 763 | 764 | 765 | 766 | 767 | 768 | 769 | 770 | 771 | 772 | 773 | 774 | 775 | 776 | 777 | 778 | 779 | 780 |
781 | 782 | 783 | 784 | 785 | 786 | 787 | 788 | 789 | 790 | 791 | 792 | 793 | 794 | 795 | 796 | 797 | 798 | 799 | 800 |
801 | 802 | 803 | 804 | 805 | 806 | 807 | 808 | 809 | 810 | 811 | 812 | 813 | 814 | 815 | 816 | 817 | 818 | 819 | 820 |
821 | 822 | 823 | 824 | 825 | 826 | 827 | 828 | 829 | 830 | 831 | 832 | 833 | 834 | 835 | 836 | 837 | 838 | 839 | 840 |
841 | 842 | 843 | 844 | 845 | 846 | 847 | 848 | 849 | 850 | 851 | 852 | 853 | 854 | 855 | 856 | 857 | 858 | 859 | 860 |
861 | 862 | 863 | 864 | 865 | 866 | 867 | 868 | 869 | 870 | 871 | 872 | 873 | 874 | 875 | 876 | 877 | 878 | 879 | 880 |
881 | 882 | 883 | 884 | 885 | 886 | 887 | 888 | 889 | 890 | 891 | 892 | 893 | 894 | 895 | 896 | 897 | 898 | 899 | 900 |
901 | 902 | 903 | 904 | 905 | 906 | 907 | 908 | 909 | 910 | 911 | 912 | 913 | 914 | 915 | 916 | 917 | 918 | 919 | 920 |
921 | 922 | 923 | 924 | 925 | 926 | 927 | 928 | 929 | 930 | 931 | 932 | 933 | 934 | 935 | 936 | 937 | 938 | 939 | 940 |
941 | 942 | 943 | 944 | 945 | 946 | 947 | 948 | 949 | 950 | 951 | 952 | 953 | 954 | 955 | 956 | 957 | 958 | 959 | 960 |
961 | 962 | 963 | 964 | 965 | 966 | 967 | 968 | 969 | 970 | 971 | 972 | 973 | 974 | 975 | 976 | 977 | 978 | 979 | 980 |
981 | 982 | 983 | 984 | 985 | 986 | 987 | 988 | 989 | 990 | 991 | 992 | 993 | 994 | 995 | 996 | 997 | 998 | 999 | 1000 |
From 1001 (In gradual progress)
1001 | 1002 | 1003 | 1004 | 1005 | 1006 | 1007 | 1008 | 1009 |
1010 | |
1011 | 1012 | 1013 | 1014 | 1015 |
1016 | 1017 | 1018 | 1019 | 1020 |
1021 | 1022 | 1023 | 1024 | 1025 |
1026 | 1027 | 1028 | 1029 | 1030 |
| 1031 | | 1032 | | 1033 | | 1034 | | 1035 | | 1036 | 1037 | 1038 | 1039 | 1040 |
| 1041 | 1042 | 1043 | | 1044 | | 1045 |
| 1046 | 1047 | 1048 | | 1049 | | 1050 |
| 1051 | 1052 | 1053 | | 1054 | | 1055 |
| 1056 | 1057 | 1058 | | 1059 | | 1060 |
| 1061 | 1062 | 1063 | | 1064 | | 1065 |
| 1066 | 1067 | 1067 | 1068 | 1069 | 1069 | 1070 |
| 1071 | 1072 | 1073 | 1074 | 1075 | 1076 |
1077 | 1078 | 1079 | 1080 |
| 1081 | 1082 | 1083 | 1084 | 1085 | 1086 |
1087 | 1088 | 1089 | 1090 |
| 1091 | 1092 | 1093 | 1094 | 1095 | 1096 |
1097 | 1098 | 1099 | 1100 |
| 1101 | 1102 | 1103 | 1104 | 1105 | 1106 |
1107 | 1108 | 1109 | 1110 |
1010 | |
1011 | 1012 | 1013 | 1014 | 1015 |
1016 | 1017 | 1018 | 1019 | 1020 |
1021 | 1022 | 1023 | 1024 | 1025 |
1026 | 1027 | 1028 | 1029 | 1030 |
| 1031 | | 1032 | | 1033 | | 1034 | | 1035 | | 1036 | 1037 | 1038 | 1039 | 1040 |
| 1041 | 1042 | 1043 | | 1044 | | 1045 |
| 1046 | 1047 | 1048 | | 1049 | | 1050 |
| 1051 | 1052 | 1053 | | 1054 | | 1055 |
| 1056 | 1057 | 1058 | | 1059 | | 1060 |
| 1061 | 1062 | 1063 | | 1064 | | 1065 |
| 1066 | 1067 | 1067 | 1068 | 1069 | 1069 | 1070 |
| 1071 | 1072 | 1073 | 1074 | 1075 | 1076 |
1077 | 1078 | 1079 | 1080 |
| 1081 | 1082 | 1083 | 1084 | 1085 | 1086 |
1087 | 1088 | 1089 | 1090 |
| 1091 | 1092 | 1093 | 1094 | 1095 | 1096 |
1097 | 1098 | 1099 | 1100 |
| 1101 | 1102 | 1103 | 1104 | 1105 | 1106 |
1107 | 1108 | 1109 | 1110 |