208 వాల్మీకి రామాయణంలోని పుష్పక విమానానికి ఇంధనం ఏమిటి?
topics for discussion, చర్చనీయాంశాలు: రామాయణం, విమానాలు, వాల్మీకి, రోడ్డు రవాణా, ఎయిర్ ట్రావెల్
ఈ విషయాన్ని నా ఇంగ్లీష్ బ్లాగ్ ramayanayb.blogspot.com , వాల్మీకి రామాయణం శ్లోకం తో సహా, పోస్ట్ నంబర్ 60 లో వ్రాశాను.
Book 3, Chapter 64, Verse 46 and 47 3-64-46 3-64-47
Kaanchana urah chadaah ca imee
pis`aaca vadanaaha kharaaha
bhiima ruupaa mahaa kaayaaha
kasya vaa nihataa ran`ee.
Context & English gist: Ravana abducted Sita in his Pushpak Aircraft, when Sita, Rama, and Lakshmana were in the 14th year of their Exile to Forest. A kite named JaTAyu stopped Ravana's aircraft and fought with him. Ravana slew JaTAyu, and took away Sita. In that battle, the donkeys dragging the Ravana's aircraft were killed.This verse describes the donkeys which were killed by JaTAyu: kAncana uraha= they have golden necklaces. piSAca vadanaha= they have ghastly faces.
వాల్మీకి రామాయణం ౩ వ పుస్తకం అంటే అరణ్యకాండ. ౬౪వ సర్గ. ౪౬ మరియు ౪౭ వ శ్లోకాలు.
కాంచన ఉరః ఛదాః చ ఇమే
పిశాచ వదనాః ఖరాః
భీమ రూపా మహా కాయాః
కస్య వా నిహతా రణే.
సందర్భం: రావణుడు సీతను అపహరించుకొని పుష్పక విమానంలో తీసుకు వెళ్ళాడు. ఆవిమానాన్ని జటాయువుఅనే గద్ద అడ్డుకున్నాడు. రావణుడు జటాయువుని చంపి, సీతను తీసుకెళ్ళాడు. ఆసందర్భంగా జరిగిన యుధ్ధంలో రావణుడి పుష్పక విమానానికి కట్టిన గాడిదలు కొన్ని చచ్చిపోయాయి. ఆ గాడిదల వర్ణన ఈశ్లోకాలు.
తెలుగు సారం: ఈ గాడిదలకి బంగారంతో చేయబడిన రొమ్ము కవచ ఫలకాలున్నాయి. ఈ గాడిదలకి దయ్యాల్లాంటి ముఖాలున్నాయి. భయపెట్టే రూపాలున్నాయి. అతి పెద్ద శరీరాలున్నాయి. ఇవి యుధ్ధంలో ఎవరిచేతనో చంపబడ్డాయి. ఈ పరిశీలన చేసింది రామలక్ష్మణులు. వారు అడవిలో సీతకోసం వెతుకుతున్నారు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
మనపూర్వీకులు ఆకాశంలో ఎగిరే విమానాలను తయారు చేసారనీ, పుష్పక విమానం ఎంత మందినైనా ఎక్కించుకునేదనీ, ఏ విమానాశ్రయం, రన్ వేలు లేకుండానే ఎక్కడ బడితే అక్కడ దిగేదని, మరల పైకెగిరేదనీ మన నమ్మకం. వాల్మీకి రామాయణంలో ఈ నమ్మకానికి అనుగుణమైన ప్రస్తావనలు న్నాయి.ఆకాలంలో aviation fuel గగన ఇంధనం ఏమిటి? నీళ్ళా? పెట్రోల్ అయితే కనుగొనబడలేదు.
ఆకాలంలో ఆకాశంలో ఎగిరే విమానాలు తయారు చేయాలని మన పూర్వులు ప్రయత్నిస్తే ప్రయత్నించి ఉండచ్చు. డ్రాయింగులు, డిజైన్లు సిధ్ధం చేసుకుని ఉండచ్చు. ఎంత వరకు సఫలీకృతం అయ్యారు అనటానికి ఆధారాలు లేవు.
వాల్మీకి రామాయణ కాలం (లేక వాల్మీకి రామాయణం రూపుదిద్దుకున్న కాలం) నాటికి పుష్పక విమానం గాడిదల చేత లాగబడిన బండి. దీనికి పై శ్లోకమే సాక్ష్యం. రావణుడు గాడిదల చేత లాగబడిన బండిలో వచ్చి సీతను ఎత్తుకెళ్ళాడు అంటే ఆయన శ్రీలంక నుండి రాలేదని లెక్క. రావణుడి రాజ్యం చిత్రకూటానికి, (పంచవటి చిత్రకూటం సమీపంలోనే ఉందనటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది గోదావరీ తీరంలో నే ఉండి ఉండ వచ్చు, కానీ ఆగోదావరి ఆంధ్రప్రదేశ్ గోదావరి కాదు. ఆగోదావరి చిత్రకూట సమీపంలోని ఒక భూగర్భవాగు లేక చిన్న ఏరు అయిఉండచ్చు. చిత్రకూట్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు సీతాకీ రసోయీ అంటే సీత వంటగదిని చూసి వస్తారు.) పంచవటికి సమీపంలోనే ఉన్నది. అనగా ఉత్తర మధ్య ప్రదేశ్, పశ్చిమోత్తర ఛత్తీస్ గఢ్, ఝార్ ఖండ్ ప్రాంతాల్లోనే ఉన్నది. అందుకే గాడిదల బండి మీద వచ్చి సీతను ఎత్తుకెళ్ళ గలిగాడు.
వాల్మీకి రామాయణంలో పుష్పక విమానాన్ని నిజంగా ఆకాశంలోకి ఎగిరే విమానంగా చిత్రించటానికి నాటి తాటాకుల కట్టలలో మార్పులు చేసిన వాళ్ళు , అన్నిచోట్లా ఆమార్పులను చేయటం మర్చి పోయినట్లుగా కనిపిస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేసి కత్తెరను పొట్టలో మర్చి పోయినట్లుగా, రామాయణానికి ఆపరేషన్ చేసిన పుణ్యాత్ములు ఈశ్లోకాన్ని వదిలేశారు. అది మన కంట పడింది.
ఏదో పార్టీ కార్యకర్తలు నేతలు చెప్పారనో, ఎవరో స్వాములవారు చెప్పారనో, నమ్మకాలు ఏర్పరుచు కోకుండా, నిజమైన విద్యనేర్చుకున్నవారు, సత్యాన్వేషణ దృష్టిని అలవర్చుకుంటే, దేవుడు లేడనే జ్ఞానోదయానికి ఎంతో సమయం పట్టదు.